మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

తెలివికల్ల చిన్న కోడిపుంజు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 24, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రేనార్డు అనే నక్క ఆకలితో ఉంది. వాతావరణం వసంతం వలె వుంది నిజమే, కానీ అది డిసెంబరు. ఆ నక్క తన ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాలని అనుకోలేదు. సూర్యోదయానికి ముందే అది లాక్‌ వుడ్‌  వాకిలిలోకి దూరి దగ్గరలోనే ఉన్న కోడిపెట్టను మొరటుగా నోట కరుచుకుని వెళ్ళిపోయింది. ఆ కోడిపుంజు నిద్రావస్థలో ఉండి కనులు మిటకరిస్తూ ఆ నక్కను చూసింది. మరుసటి రోజు ఆ నక్క మరో కోడిపెట్టను పట్టుకుపోయింది. మూడవరోజు ఇంకొకదాన్ని. అక్కడ మిగిలిన కోడిపెట్టలు కోడిపుంజును కోపంగా నువ్వు దీని గురించి ఏదైనా ఎందుకు చేయవు అన్నాయి. ఆ రైతు ఆ స్థలంలో కొన్ని వలలు ఏర్పాటు చేసాడు. కానీ అవి నక్క చిక్కడానికి అంత పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నాల్గవ రాత్రి కోడికి ఇష్టంలేని నక్క రాక కోసం తగిన ఏర్పాటు చేసింది. అది ఒక గుడ్ల గంప కొమ్మ మీద పెట్టి ఎదురు చూస్తుంది. నక్క వచ్చి నోరు తెరవగానే కోడి గంపను దాని మీద పెట్టింది. ఆ గుడ్లు నక్క ముఖం మీద పడి చితికిపోయాయి మరియు ఆ గంప దాని తలమీద పడింది. ఆ నక్క గంప నుండి తల బయటికి తీసుకోకముందే కోడిపుంజు పిచ్చిదానిలా అరవటం మొదలెట్టింది. నన్ను ఇంతముందే లేపటం ఎందుకోసం అని రైతు గులుగుతూ మంచం మీదినుండి లేచిండు. వెంటనే అతను నక్క తన తల గంపనుండి తీసే ప్రయత్నంలో గుడ్ల సొనతో కండ్లు మూసుకుపోయాయి. వెంటనే నక్క చర్మపు ముక్కలు కింద పడ్డాయి. కోడిని యజమాని ఎప్పుడు కూడా కోడికూర వండనని వాగ్దానం చేసాడు. అందువలన అది జీవితాంతం కోళ్ల గూటికి యజమానిగా ఉండిపోయింది.

నక్కను పట్టించిన లాక్‌ వుడ్‌ కోడిపుంజు తను చేసిన పనికి గర్వపడుతూ, ఇకనుండి తను ఎందులోనైనా తన అభిప్రాయం తెలుపవచ్చు అనుకుంది. పెట్టెలకు ఏ ఆహారం ఇవ్వాలో, టీవీలో రైతు ఏ ప్రోగ్రామ్‌ చూడాలో ఏ ప్రోగ్రామ్‌ చూడవద్దో తన అభిప్రాయం తెలిపింది. మొదట్లో లాక్‌ వుడ్‌ కోడిపుంజు సలహా వినాలనుకున్నాడు. ఎందుకంటే కోడిపుంజు ధైర్యం కలది, మంచిది. నక్కను కూడా పట్టించింది కాబట్టి. అది తన పక్కింటి యజమాని కూతురు వూలీతో ప్రేమలో పడింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఆమెను వివాహమాడాలి అనుకున్నాడు, కానీ ఈ వివాహానికి పుంజు ఇష్టపడలేదు. చూడు ఇక్కడ ముసలి కొడుకు, అతను రైతుతో బదులుగా విల్‌ కిన్స్‌ కూతురును ఎందుకు వివాహం చేసుకోవు? ఆమె చాలా అందగత్తె మరియు మంచి గుణవతి మరియు ఆమె కోళ్ళ పెంపకంలో దిట్ట. నా అభిప్రాయం ఏమిటంటే ఆ పక్కింటి అమ్మాయి చాలా చెడు లక్షణాలు కలది అని నీవు తెలుసుకోవాలి. ఆ రైతు అటువంటి వారితో ఉండాలనుకోలేదు. అతను అతను నోరు మూయకుంటే తన మాట మార్చి పుంజును పులుసు పెడతానని భయపెట్టినాడు. పుంజు అందుకు భయపడలేదు. ఇంకా చెప్తూనే ఉంది. ఆమె ఇంటిని శుభ్రంగా వుంచుకోదు మరియు గ్రామంలో తెలివైన అమ్మాయి కూడా కాదు. ఒకవేళ అతడు శాశ్వతంగా వెళ్ళిపోతే, కానీ లాక్‌ వుడ్‌ అందువల్ల పాట్టీ విల్‌ కిన్స్‌ కు బదులుగా వివాహమాడుతానని వాగ్దానం చేశాడు. కావున వివాహం జరిగింది. రైతు మరియు అతని కొత్త భార్య ఎంతో సంతోషంగా తృప్తిగా ఉన్నారు. వారు తెలివిగల పుంజుపై గౌరవంతో ఉన్నారు. అందువల్ల పుంజు గర్వమునకు అంతు లేకుండా పోయింది.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక కృతజ్ఞత లేని రాకుమారుడు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 24, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

గోల్డన్ లాక్ అనే రాకుమారుడికి ఒక బిడ్డీ అనబడే నర్సు ఉన్నది. ఆమె అతడిని ఊయలలో ఊపేది, నిద్ర పుచ్చేందుకు శ్రావ్యమైన పాటలు పాడేది. తన చంకలో ఎత్తుకొనేది. బంగారు తల వెంట్రుకలను దువ్వేది. ఆమె అతనికి మొదటి మాటలు మరియు పాటలు నేర్పింది. తోటలోకి తీసుకొని పోయి ఆహ్లాదకరమైన ఆటలు చూపేది. వారు ఒకరికొకరు అలవాటైనారు. కానీ ఆ యువరాజు  ఎప్పుడైతే యువకుడైనాడో, అతనికి చదువు ప్రొఫెసర్లతోనే నేర్పించాలని అతని తండ్రి నిశ్చయించాడు. బిడ్డీ ఇక అవసరం లేదు, ఆమె ఎక్కడికైనా, ఇష్టమొచ్చిన చోటికి  పోవచ్చు. కానీ రాజభవనంలో ఇక ఆమె అవసరం లేదు. ఆమె మునుపటి వలె యవ్వనంలో లేదు, ఉల్లాసంగా లేదు. ఇది వాస్తవం. కానీ కానీ ఆ యువకునికి ఏ ఇబ్బంది కలిగినా ఆమె హృదయం ద్రవించి పోయేది. అతనికి ఇబ్బంది కలిగినపుడు అతడిని ఓదార్చేది, మంచి విషయాలు చెప్పి సుఖ పెట్టేది.

కానీ ఆ రాకుమారుడు ఆమె దయను త్వరగానే మరచిపోయాడు. అతను వెంటనే పెరగాలని అనుకున్నాడు. ఆమె ఆ ఇంట్లోనే వుండేందుకు తండ్రితో ఒక్కమాట కూడా చెప్పలేదు. వారు ఆమెను బయట చలి, అననుకూలమైన వాతావరణంలోకి పంపేశారు. ఆమె రాచ తోటలు దాటి ముందుకు పోలేక పోయింది. ఆమె అక్కడ బాధతో మెత్తని కొమ్మలు కలిగిన వృక్షముగా (Crooked Willow)మారిపోయింది. వెంటవెంటనే రాకుమారుడు ఏదో తనకు బాగా ఇష్టమైనది కోల్పోయినట్లు అనుకున్నాడు. అతను తన ముదుసలి నర్సును చూసేందుకు బయటకి పరుగెత్తాడు. కానీ ఆమె కనబడలేదు. కానీ అప్పటినుండి తన అన్ని బాధలను ఆ విల్లో చెట్టుకు రహస్యంగా చెప్పేవాడు. అతనికి ఎప్పటికి ప్రపంచంలో తనను అర్థం చేసుకున్నది ఆ వంగిపోయిన ముసలి చెట్టు మాత్రమే నని అనుకునేవాడు.

ఆమె అవసరం తీరాక ఆమెను దయాదాక్షిణ్యం లేకుండా బయటికి పంపడం క్షమించరాని నేరం కదా!

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక విందు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 24, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.

తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.

ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.

నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.

(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ప్రతాపరుద్ర యుగంధర కథలు

by Ammangi Venugopal January 24, 2026
written by Ammangi Venugopal

గ్రహణం

కాకతీయు ప్రధాన గూఢచారి త్రినేత్రుడు ప్రతిభావంతుడే. కాని, తొందర ఎక్కువ. ఒక్కోసారి తన తొందరపాటుకు తాను ఇబ్బందుల్లో పడడమే కాక ఇతరులను కూడ ఇబ్బందుల్లో పడేస్తాడు. శత్రుదేశపు సామంతరాజు తన గూఢచారులను దట్టమైన అటవీ మార్గాల ద్వారా కాకతీయ సామ్రాజ్యంలోకి పంపుతున్నాడు. వారిలో కొందరు మాత్రమే అరకొర సమాచారంతో తిరిగి వస్తున్నారు. మరికొందరు పట్టుబడి బందీలవుతున్నారు. ఇక తక్కినవారు సుభిక్షంగా వున్న కాకతీయ సామ్రాజ్యం విడువలేక అక్కడే ఉండిపోతున్నారు. వీరిలో అవివాహితులు, కాయకష్టం చేసి బతికేవారు ఎక్కువ. ఇట్లాంటివారు అక్కడి అమ్మాయిలనే పెండ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు.

త్రినేత్రుడు శత్రు రాజు లాగా తాను కూడా దట్టమైన అటవీ మార్గం ద్వారా శత్రురాజ్యంలో ప్రవేశించి అక్కడి సైన్య రహస్యాలను తెలుసుకొని తమ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు వెంటనే మహామంత్రి యుగంధరుణ్ణి కలిసి విషయం తెలిపి మారువేషంలో శత్రురాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరాడు. ఎప్పుడూ వందలకొద్ది రాజ్య సమస్యలతో సతమతమవుతూ క్షణం తీరిక లేని యుగంధరుడు

“సరే! హద్దు మీరి ప్రవర్తించకు. జాగ్రత్త” అన్నాడు.

త్రినేత్రునికి ‘సరే!’ అన్నమాట మాత్రమే వినిపించింది. ఆ తర్వాత వాక్యం వినిపించలేదు!

ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి నమ్మిన బంటు పింగళుణ్ణి పిలిపించి చర్చించాడు. ‘కోయల వేషంలో అటవీ మూలికలు, పలుకులు, జుంటి తేనె తీసుకొని అక్కడి ప్రవేశ ద్వారంలో ఉండే కాపలా సైనికులకు ఉచితంగా ఇచ్చేస్తే, సులభంగా నగర ప్రవేశం చేయవచ్చునని’, పింగళుడు అన్నాడు.

ఇద్దరూ సరంజామాతో శత్రురాజ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశ ద్వారం వద్ద తమ విలువైన దినుసులను కాపలా సైనికులకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరుగా – “మందులోయమ్మ మందులూ, అడవి దినుసులూ” అంటూ వీధుల్లో తిరుగసాగారు. అసలు కోయవాళ్ళు అమ్మే ధరకన్నా తక్కువకే అమ్ముతూ మొదటి నాలుగైదు దినాల్లో కొన్ని రాజ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

రాజధానిలోని ప్రసిద్ధ వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఇచ్చే సలహాలను అక్కడి – ప్రధాన గూఢచారి సకలాక్షుడు విని పాటిస్తుంటాడని తెలుసుకొని ఒకరోజు రాత్రి అర్చకుని ఇంటికివెళ్ళి పది బంగారు మాడలు దక్షిణగా సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి-

“ఏదో ఉడుతాభక్తి. దయచేసి స్వీకరించండి. వెంకటేశ్వరుడు కరుణిస్తే ఇంకా సమర్పించు కుంటా”నని చెప్పి నిష్క్రమించాడు.

ఎవడో సాటికులం వాడు కులం కట్టుతప్పి, అటవీ దినుసులు అమ్ముతున్నాడని, అసలు కోయలకు తెలిసింది. నిఘా వేసి త్రినేత్రుణ్ణి పట్టుకున్నారు. అతని మాట తీరే వారికి అనుమానాస్పదంగా ఉంది. అసలతడు కోయకాడని అక్కడున్న గస్తీ సైనికునికి అప్పగించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, అట్లాంటివారిని రహస్యంగా సమీప గూఢచారి అధికారికి అప్పగించాలని వారికి ఆదేశాలున్నాయి. పెద్దగా రచ్చ చేయకుండా ఆ సైనికుడు గూఢచారులకు అప్పగించాడు. చాటు నుండి ఇదంతా చూసిన పింగళుడు తన దగ్గర మిగిలిన సరుకులను ప్రవేశద్వారం దగ్గరున్న గస్తీ సైనికులకు పంచేసి, కాకతీయ రాజ్యం ప్రవేశించాడు. వెంటనే విషయాన్ని యుగంధరుని దృష్టికి తెచ్చాడు.

యుగంధరుడు వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నాడు. త్రినేత్రుని పోలికలు బాగా ఉన్న అతని కవల తమ్ముడు నేత్రపర్వుణ్ణి, అతని భార్యను ప్రధాన గూఢచారి నివాసంలోకి మార్చాడు. ఇప్పుడు నేత్రపర్వుడే ప్రధాన గూఢచారి వేషభాషల్లో రథం మీద చక్రవర్తి కొలువు కూటానికి పోయి వస్తున్నాడు. త్రినేత్రుని భార్యను వెంటనే అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. తాను మెరికల్లాంటి పదిమంది సైనికులను తీసుకొని మారువేషాలలో శత్రుదేశం చేరుకున్నాడు. అంచె వేగుల ద్వారా ఏరోజు వార్త ఆరోజు ప్రతాప రుద్ర చక్రవర్తికి తెలియజేస్తున్నాడు.

శత్రుదేశపు గూఢచారులు త్రినేత్రుణ్ణి రహస్య స్థావరంలో ఉంచి విచారణ సాగిస్తున్నారు. అతణ్ణి అదుపులోకి తీసుకున్న విషయం బయటకు పొక్కనీయలేదు. తనది గుంటూరని ఒకసారి, రాజమహేంద్రవరం అని ఒకసారి, ఒరిస్సా అని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పుతూ వచ్చాడు. వేధింపులు ఎక్కువ అయ్యాయి. దాంతో తనది ఓరుగల్లు అని, కోయవాణ్ణేనని కాని చాలాకాలంగా తెలుగువాళ్ళ మధ్య ఉంటుండటం వల్ల కోయభాష మరిచిపోయానని చెప్పాడు. ఆ విచారణకు సంబంధించిన పరిణామాలన్నీ పింగళుని ద్వారా యుగంధరునికి, యుగంధరుని ద్వారా చక్రవర్తి ప్రతాపునికి తెలుస్తున్నాయి.

ఒకరోజు శత్రు రాజ్య ప్రధాన గూఢచారి సకలాక్షుడు స్వయంగా వచ్చి విచారణ చేపట్టాడు.

“నీకు కాకతీయుల ప్రధాన గూఢచారి తెలుసా?” అని అడిగాడు.

“త్రినేత్రుడు గారు తెలియకేం. ఆయనకు పుట్టతేనె చాలా ఇష్టం. వారికి సరిపడా తేనెను నేనే సరఫరా చేస్తుంటాను” అన్నాడు.

“మరి వారి భార్య సంగతి?”

“ఆమెకు వజ్రాలు పొదిగిన ఆభరణాలంటే యెక్కడ లేని మోజు” అన్నాడు.

ఈ సమాధానాలు నిజమేనని తమ వేగుల ద్వారా రూఢి చేసుకున్నాడు.

కోయవాడి విషయంలో ఏం చెయ్యాలో చెప్పగలిగే సూక్ష్మ బుద్ధి ఉన్నవాడెవడూ అక్కడ లేడు తమ శత్రుదేశంలో ఉంటున్నానని ఒప్పుకున్నాడు కనుక ఉరితీయటమే మంచిదని న్యాయకోవిదులు తెలియజేశారు. రాజూ, మంత్రీ అదే అభిప్రాయానికి వచ్చి సకలాక్షునికే ఉరి బాధ్యతను అప్పగించారు.

వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు తమ తమ్ముడు లక్ష్మీనరసింహా చార్యులను వెంటబెట్టుకొని ప్రధాన గూఢచారి ఇంటికి వచ్చాడు. తనకు పాదాభివందనం చేయగానే మంత్రసహితంగా ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశాడు. ఆ తర్వాత తన సమస్య మనవి చేసుకున్నాడు.

“అయ్యా! మా అమ్మాయికి అనారోగ్యం చేసింది. నన్ను కలువరిస్తున్నదని ఇదిగో ఈ తమ్ముడు వార్త తెచ్చాడు” అంటూ పెద్దపిలక, జంధ్యం, మడి వస్త్రధారణ, నామాలతో తేజోమూర్తిగా కనిపిస్తున్న నడీడువాణ్ణి పరిచయం చేశాడు.

“అయ్యా వీడు మా తమ్ముడు లక్ష్మీనరసింహాచార్యులు. పెద్ద ఘనాపాటి. మా గోదావరి ప్రాంతంలో ఈయన పెట్టిన ముహూర్తానికే కార్యాలు జరుగుతుంటాయి. నేను నెలరోజులు సెలవు మీద వెళ్ళిపోతాను. నా స్థానంలో నా తమ్ముడు ప్రధానార్చకుడిగా ఉంటాడు. అనుమతించండి” అన్నాడు.

“సరే. ఇది చిన్న విషయం మీరు రేపే వెళ్ళిపోవచ్చు. అయితే మాకో సలహా కావాలి. మేం ఒక నేరస్తుణ్ణి ఉరి తీయాలి. ఆ పనికి ఏది అనుకూలమైన రోజో చెప్పండి” అడిగాడు ప్రధాన గూఢచారి.

అప్పుడు ఇద్దరూ వేళ్ళమీద లెక్కించుకొని, ఒక నిర్ణయానికి వచ్చారు.

“నాల్గురోజుల తర్వాత వచ్చే శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండుగంటలకు నరకలోక ద్వారాలు పూర్తి తెరచి వుంటాయి. ఆ సమయంలో ఉరి తీస్తే నేరస్తునికి నరకం. వాడి రాజుకు అరిష్టం ప్రాప్తిస్తాయి” అన్నాడు రామానుజాచార్యులు. దాన్ని కమ్మ మీద రాసిచ్చాడు. ప్రధాన గూఢచారి అంగీకరించాడు. వాళ్ళు సెలవు తీసుకొని వచ్చేశారు.

ఉరితీతకు అన్ని ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. త్రినేత్రుణ్ణి చివరి కోరిక ఏమిటో అడిగారు. అతడు –

“వెంకటేశ్వర స్వామి దైవ ప్రసాదాన్ని తన ఉరికి ముందు అక్కడున్న వాళ్ళంతా స్వీకరించి ఆరగిస్తే, చూసి సంతృప్తితో ఉరికి వేలాడుతా. దైవ కృపతో నాకు నరకం తప్పవచ్చు. ఇదే నా చివరి కోరిక” అన్నాడు. ప్రసాదం విషయమై వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకునికి ఆదేశాలు వెళ్ళాయి.

శనివారం రోజు సంపూర్ణ సూర్యగ్రహణానికి పావుగంట ముందే త్రినేత్రుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి నలుగురు బలిష్ఠులైన సైనికులు విచ్చుకత్తులు ధరించి ఉరితీసే వేదికపైకి తీసుకు వచ్చారు. త్రినేత్రుణ్ణి తలారికి అప్పగించి కిందికి వచ్చి క్రమశిక్షణతో నిలబడ్డారు.

తలారి ఉరితాడును పరీక్షించి చూసుకొని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వెంకటేశ్వరాలయం ప్రస్తుత ప్రధాన అర్చకుడు లక్ష్మీనరసింహాచార్యులు మరో పూజారితో పాటు ప్రసాదం తీసుకువచ్చి కింద తమ అశ్వాల పక్కన నిలబడి ఉన్న న్యాయమూర్తికి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధిపతికి, విచ్చుకత్తుల సైనికులకు మంత్రోక్తంగా ఇచ్చి – 

“ఉరితీతకు సమయం లేదు ప్రసాదం వెంటనే ఆరగించండి” అన్నాడు వారంతా వెంటనే సభక్తికంగా ఆరగించారు. బలి వేదిక మీదికి వెళ్ళి తలారికి ఇచ్చాడు. అతడూ దాన్ని నోట్లో వేసుకొని త్రినేత్రుని వైపు తిరిగి –

“అయ్యా! మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. మనిద్దరి మధ్య పగ, ద్వేషం లేవు. మా మహారాజు గారి ఆజ్ఞ మేరకు మిమ్ములను ఉరి తీస్తున్నాను. దేవుడు క్షమించుగాక” అని అంటుండగా సంపూర్ణ సూర్యగ్రహణం మొదలయింది.

చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. చీకటయిందని భ్రమించి పక్షులు అరుస్తున్నాయి. ఆకాశంలో చుక్కలు కనిపించసాగాయి. వేదిక కింద ఉన్న నలుగురు సైనికులు, న్యాయమూర్తి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆ ప్రసాదం మత్తులో నేలకు ఒరిగిపోయారు. పైన తలారి కూడా ఆ మత్తుకు తట్టుకోలేక ఒరిగిపోయాడు. ప్రధాన అర్చకుని వేషంలో ఉన్న యుగంధరుడు అర్చక వేషం వదలేసి సైనికుని దుస్తులు వేసుకున్నాడు. రెండు నిమిషాలలో వారు అక్కడి వాళ్ల అశ్వాలు అధిరోహించి వాయు వేగంతో తమ రాజ్యం వైపు వాటిని పరుగులు తీయించారు. అదివరకే పింగళుని అటవీ దినుసులు ఆరగించి అక్కడి గస్తీ సైనికులు మత్తులో మునిగిపోయారు.

అరగంట దాటీ దాటగానే ఆ చీకటిలో వీళ్ళంతా శత్రు రాజ్య సరిహద్దులను దాటేశారు. అప్పటికి సంపూర్ణ సూర్యగ్రహణం వీడి పాక్షిక గ్రహణంగా మారింది. సన్నని కిరణాలు భూమిని తాకుతుండగా అందరి మత్తు క్రమంగా వదిలింది.

సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ, మత్తుమందును ప్రయోగించి ప్రతాప యుగంధరులు వేసిన ఎత్తును తెలుసుకొని శత్రు రాజ్యం రాజు, మంత్రి, ప్రధాన గూఢచారి సంభ్రమాశ్చర్యాల మత్తులో మునిగిపోయారు.

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కొలువుకూటం ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఉంది. చక్రవర్తి, మంత్రి ప్రముఖులు ఉరిశిక్షను తప్పించుకొని ప్రాణాలతో తిరిగి వచ్చిన త్రినేత్రుణ్ణి అక్కున చేర్చుకొని అభినందిస్తున్నారు.

ఆ రణగొణ ధ్వనులను చీల్చుతూ-

“ఇంతకూ బంగారుమాడ ఎవరికి బహుకరించాలి” అని అడిగాడు మేఘ గంభీర స్వరంతో చక్రవర్తి, ఆ మాడను ప్రదర్శిస్తూ.

“దాన్ని లక్ష్మీనరసింహాచార్యుల వేషధారి మన మహామంత్రి యుగంధరుల వారికివ్వటం న్యాయం” అన్నాడు త్రినేత్రుడు.

“ఆ అవతారం శత్రురాజ్యంలోనే సమాప్తమయింది. కనుక మనకు పూర్తిగా సహకరించిన వారి అన్నగారు రామానుజాచార్యుల వారికి బహూకరిస్తే బాగుంటుందని నా విన్నపం” అన్నాడు యుగంధరుడు.

“మరి వారు గోదావరి తీరానికి వెళ్ళిపోయారు గదా!” అన్నాడు ఒక సామంతరాజు.

“ఆ గోదావరి తీరం ఇక్కడ కూడా ఉంది. వారిని ప్రవేశ పెట్టండి” అని ఆదేశించాడు ప్రతాప రుద్ర చక్రవర్తి.

సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న రామానుజాచార్యులు వెంకటేశ్వర స్తోత్రం చదువుకుంటూ ప్రవేశించి బంగారు మాడను స్వీకరించి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని చక్రవర్తికి అందజేశాడు. దాన్ని స్వీకరించి –

“ఈ ప్రసాదం ఆ ప్రసాదం కాదు గదా!” అన్న చక్రవర్తి ఛలోక్తితో కొలువుకూటంలో నవ్వులు విరబూశాయి.

అయితే, అక్కడ శత్రు రాజ్యంలో ఇంకా గ్రహణం వీడలేదు.

(కల్పితం)

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మాండలిక ఉప్పెన

by Mucharla Sheshagiri Rao January 24, 2026
written by Mucharla Sheshagiri Rao

యాసంగి ముచ్చట్లు పుస్తక సమీక్ష

 “యాసంగి ముచ్చట్లు” అనే శీర్షిక తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన శబ్ద ప్రయోగం మరియు మొత్తం సంపుటి తెలంగాణ అస్తిత్వానికి కవితోదాహరణము. ఈ పుస్తకం నిండా తెలంగాణ మాండలిక పరిమళము విభిన్న దృక్పథాల, భిన్న కోణాల నుండి వ్యాపించి యాసంగి పేరిట తెలంగాణ అస్తిత్వాన్ని దృశ్యీకరించింది. తెలంగాణ సాధనకై జరిగిన తొలి,మలి,దశల ఉద్యమస్ఫూర్తిని రచయిత్రి డాక్టర్ వాణి దేవి దేవులపల్లి తన సాహితీ వస్తువుగా ఎంచుకొని మొత్తం తెలంగాణ ఉద్యమ సమరంలో నుండి అంకురించిన అభ్యుదయ విప్లవాగ్నులను ఒక సంకలనంగా ప్రచురించడం అత్యంత ప్రశంసనీయం.

ఈ సంపుటి కవులు తెలంగాణ యాస పైన ముఖ్యంగా మాండలికం పట్ల వారి అభిమానాన్ని ప్రతి పేజీలో చాటుకున్నారు. తెలంగాణ కవిత్వంలో ఆత్మగౌరవ చైతన్య స్వరూపం “యాసంగి  ముచ్చట్లు”. తెలంగాణ సాహిత్యం అనేది కేవలం కవిత్వ పరంపర కాదు. అది ఒక సామాజిక చరిత్ర, ఒక ప్రతిఘటన స్వరం, ఒక ఆత్మగౌరవ ఉద్యమం. అటువంటి సాహిత్య ప్రవాహంలో వెలువడిన ముఖ్యమైన కవితా సంపుటి “యాసంగి ముచ్చట్లు”. డా. దేవులపల్లి వాణీదేవి గారి సంపాదకత్వంలో రూపొందిన ఈ సంపుటి, తెలంగాణ ఉద్యమానికి ముందు తరువాత కాలాల్ని అనుసంధానిస్తూ, తెలంగాణ ప్రజల జీవన చైతన్యాన్ని కవిత్వంగా మలిచిన అరుదైన ప్రయత్నం.తెలంగాణ ఉద్యమం ఈ సంపుటి కవిత్వానికి ప్రాణాధారం. “యాసంగి ముచ్చట్లు” సంపుటిలోని కవితలు తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ సంఘటనగా కాకుండా ప్రజల జీవన అనుభవంగా ఆవిష్కరిస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాల వంటి సమస్యల వెనుక ఉన్న మానవ వేదనను ఈ కవితలు హృదయపూర్వకంగా చూపిస్తాయి.
 

దాశరథి గారి “నా తెలంగాణ” వంటి కవితలు ఉద్యమానికి మూల వేదనను ప్రతిబింబిస్తే, ఉద్యమానంతర కవితలు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. ఇలా ఈ సంపుటి ఉద్యమాన్ని కాలప్రవాహంలో చూపగలిగింది. తెలంగాణ యాస భాష మాత్రమే కాదు, సాంస్కృతిక ప్రతిఘటన “యాసంగి ముచ్చట్లు” సంపుటిలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం తెలంగాణ యాసకు ఇచ్చిన ప్రాధాన్యం. ఇక్కడ యాస కేవలం భాషా వైవిధ్యంగా కాదు, ఆధిపత్య భాషలపై ఒక సాహిత్య తిరుగుబాటుగా నిలుస్తుంది. కవులు యాసను అలంకారంగా కాకుండా ఆలోచనా పద్ధతిగా స్వీకరించారు. దీనివల్ల తెలంగాణ ప్రజల మాటలు, పలుకులు, అనుభవాలు సహజంగా కవిత్వంలోకి వచ్చాయి. ఇది “యాసంగి ముచ్చట్లు” సంపుటిని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రధాన బలం. యాసంగి  భూమి నుంచి పుట్టిన ఆత్మగౌరవం ఈ సంపుటిలో కేవలం భౌగోళిక సంకేతం కాదు, అది రైతు చెమటతో తడిసిన భూమి, కూలీ శ్రమతో గట్టిపడిన నేల, అమరవీరుల రక్తంతో పవిత్రమైన తల్లి. అనేక కవితల్లో మట్టి తల్లిగా, సాక్షిగా, సంరక్షకురాలిగా దర్శనమిస్తుంది. ఈ మట్టితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కవితలు భావోద్వేగపూరితంగా ఆవిష్క రించాయి.
 
మచ్చుకు కొన్ని  “ప్రాంతం వాడే దోపిడీ చేస్తే” అన్న కాళోజీ  కవితలో అణచివేతకు నైతిక ప్రతిఘటనను స్పష్టంగా ప్రకటిస్తారు. ఇతర ప్రాంతాల వారు దోపిడీ చేస్తే అది అన్యాయం కానీ, స్వంత ప్రాంతపు పాలకులే దోపిడీ చేస్తే అది ఘోర నేరం అని కవి నిర్భయంగా చెబుతాడు. ఇది ప్రాంతీయ చైతన్యాన్ని నిద్రలేపే కవిత. ప్రధాన భావం దోపిడీ ఎవరు చేసినా తప్పే స్వంతవారే దోపిడీ చేస్తే మరింత బాధాకరం ప్రజల మౌనం కూడా నేరమే. కవితా ప్రత్యేకత,నేరుగా మాట్లాడే శైలి,అలంకారాల్లేని వాక్యాలు,సత్యవచన పలుకుబడుల కవిత్వం.
 
“మట్టి పూల పరిమళం” అరుణంపూడి లక్ష్మిగారి కవితలో కవయిత్రి తెలంగాణ పల్లె జీవనాన్ని సున్నితమైన భావాలతో చిత్రిస్తారు. మట్టి నుంచి పుట్టిన పువ్వుల పరిమళంలా, పల్లె జీవితం సాధారణంగా కనిపించినా అంతర్లీనంగా గొప్ప సౌందర్యం, ఆత్మీయత దాగి ఉందని తెలియజేస్తారు.నిజమైన సౌందర్యం నగరాల్లో కాదు  మట్టిలో దాగి ఉంది అని సందేశం. కాకతీయ వైభవం కవితలో, చెరువుల సంస్కృతి, పల్లె పండుగలు, జానపద సంప్రదాయాలు,ఇవి అన్నీ ఈ సంపుటిలో బలంగా ప్రతిఫలించాయి.

కాకతీయ వైభవం వంటి కవితలు తెలంగాణకు చరిత్ర లేదన్న అపవాదును ఖండిస్తాయి. చరిత్రను గర్వంగా గుర్తుచేస్తూ, సమకాలీన తెలంగాణకు ఆ వారసత్వం అవసరమని సూచిస్తాయి. మహిళా కవిత్వం ఒక నిశ్శబ్ద విప్లవంగా కనిపించింది. ఈ సంపుటిలో మహిళా కవుల కవితలు ముఖ్యమైన భాగం. వారు తెలంగాణ ఉద్యమాన్ని తల్లి, భార్య, కూలీ, రైతు మహిళల దృష్టితో చూశారు. మహిళా అనుభవాలను విలాపంగా కాకుండా చైతన్య స్వరంగా మార్చడం ఈ సంపుటిలోని విశేషం. దీని వల్ల “యాసంగి ముచ్చట్లు”  మరింత సమగ్రంగా రూపుదిద్దుకుంది.

విమర్శనాత్మకంగా సమీక్ష అనంతరం కొన్ని కవితల్లో నినాదాత్మకత ఎక్కువగా కనిపించినా, అది ఉద్యమ సాహిత్య సహజ లక్షణమే. భావ ప్రాధాన్యత వల్ల కొన్ని చోట్ల నిర్మాణ సౌష్టవం prose in poetry లా కనిపించినా సంపుటి ఉద్దేశాన్ని అది తగ్గించలేదు. ఎందుకంటే ఈ కవితలు సాహిత్య అలంకారాల కోసం కాకుండా సామాజిక బాధ్యత కోసం రాయబడ్డాయి. యాసంగి ఒక కవితా సంపుటి మాత్రమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమానికి సాహిత్య రూపం, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, భవిష్యత్ తరాలకు చరిత్రగా నిలిచే పత్రం.

తెలంగాణను మర్చిపోకుండా గుర్తుచేసే, పోరాట స్పూర్తిని నిలబెట్టే సాహిత్య కృషిగా ఈ సంపుటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.తెలంగాణను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చరిత్ర లో భాగంగా “యాసంగి ముచ్చట్లు” వంటి కవిత్వాన్ని కూడా చదవాలి.
 
“యాసంగీ ముచ్చట్లు”  సంపుటిలోని మొత్తం కవిత్వానికి స్పష్టంగా, అంశాల వారీగా సమగ్రంగా విశ్లేషిస్తే, సంపుటి అనేది కేవలం కవితల సమాహారం కాదు.
ఇది తెలంగాణ చరిత్ర,స్మృతి,పోరాటం, ఆత్మ గౌరవం ప్రజల యాస, నేల, జీవన తత్వం, రాష్ట్ర సాధన తర్వాత కూడా కొనసాగాల్సిన ఆత్మగౌరవ చైతన్యం కలిసిన ఒక సాంస్కృతిక పత్రం. తెలంగాణ ఒక భౌగోళిక గుర్తింపు కాదు,అది చైతన్యపు స్థితి, తెలంగాణ ఉద్యమం  చరిత్రగా కాదు, జీవన స్మృతి. ఈ కవితల్లో ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు తేదీలు, నినాదాలు కాదు, రక్తం, కన్నీరు, త్యాగం, నిశ్శబ్ద గౌరవం, ప్రధానంగా కనిపించేది విద్యార్థి, ఉద్యమం, రైతు, ఆకలి, నిరుద్యోగ యువకుడి తిరుగుబాటు, అమరవీరుల మౌనకేక, ఉద్యమాన్ని గతంగా కాక వర్తమాన బాధ్యతగా చూపిన దృష్టి ఇది. ఈ సంపుటిలోని ముఖ్యమైన సాహిత్య బలం తెలంగాణ యాస. యాస  భాష కాదు, ప్రతిఘటన ఇక్కడ యాస అలంకారం కాదు, కవితా ప్రయోగం అంతకంటే కాదు, అది నిఖార్సయిన ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వా సాల వ్యక్తీకరణ.  ఈ సంపుటిలో కవులు యాసను వాడలేదు, యాసలోనే ఆలోచించారు. ఇది ఆధిపత్య భాషపై నిరాకరణ,పల్లె భాషకు గౌరవ పీఠిక, సాంస్కృతిక స్వాతంత్ర్య ప్రకటన. భూమి మాత్రమే కాదు శ్రమ, జ్ఞాపకం, శరీరం,రైతు, కూలీ, పల్లె మహిళ  అందరి చెమట ఈసంపుటిలో  కలిసినట్టు కవితలు చూపిస్తాయి.ఈ సంపుటిలో మహిళా కవుల భాగస్వామ్యం చాలా బలంగా కనిపిస్తుంది.వారి కవితల్లో బాధను విలాపంగా కాదు తిరుగుబాటుగా, ప్రశ్నగా, స్వరంగా, తెలంగాణ ఉద్యమాన్ని స్త్రీ దృష్టితో చూడటం ఈ సంపుటిని మరింత సంపూర్ణం చేస్తుంది. ఈ సంపుటిలో ఉన్న కవితలు భావకవిత్వం,ఉద్యమ కవిత్వం, సాంస్కృతిక కవిత్వం, చారిత్రక స్మరణ సమకాలీన రాజకీయ వ్యాఖ్య అన్ని కలిసి ఒకే దారిలో నడుస్తాయి.
 


కొండపల్లి నిహారిణి గారి “అక్షర దీపం” కవిత ఒక సామాజిక స్పూర్తిని కలిగించే కవిత. అక్షరాల శక్తిని గుర్తు చేస్తూ, ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ఎంత కీలకమో భావగర్భితంగా తెలియజేస్తుంది. ఇది చదివిన పాఠకునిలో ఆలోచనను రేకెత్తించే, బాధ్యతను గుర్తు చేసే కవిత.ఉపమానాలు, రూపకాలు సమర్థంగా ఉపయోగించబడ్డాయి భాష సులభం అయినా భావం లోతైనది సామాజిక చైతన్య కవిత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
 
బాలబోయిన రమాదేవి గారి “గేయాల గొంతులు” కవిత శబ్దం, స్వరం, పాట అనే బాహ్య మాధుర్యం వెనుక దాగి ఉన్న సామాజిక వాస్తవంను ప్రశ్నించే భావగర్భితమైన రచన. ఇది కేవలం పాటల గురించి కాదు మనుషుల గొంతుల్లో వినిపించే నకిలీ మాధుర్యం, మోసపూరిత స్వరాలపై గట్టి వ్యాఖ్య.“గేయాల గొంతులు” ఆధునిక సమాజంలో మాటల మాయను ఎండగట్టే ప్రభావవంతమైన కవిత. ఇది పాఠకుడిని వినేవాడిగా కాక, ఆలోచించే వ్యక్తిగా మారుస్తుంది.
 
డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు రచించిన ‘ఉనికి‘ అనే కవితలోఉపయోగించిన భాషా ప్రయోగం ‘ఒడ్డు లేని నదికి ఉనికి ఎక్కడిది’, ‘అక్షరం భిన్న రూపాల కూడలి కదా’ రచయిత యొక్క సాహిత్య పరిణితి తెలుపుతోంది 
 
‘కర్నాల బంకు’ అనే కవిత రచించిన స్వప్న కృష్ణ గారు ఉపయోగించిన తెలంగాణ మాండలిక శబ్దాలు ‘ఎగిలివారంగానే, మాపటేలికి, అంబటాళ్లకు, పొద్దాక, ఆకిట్ల, తెలంగాణ అస్తిత్వాన్ని కి నిలువెత్తు రూపాలుగా నిలిచాయి. రచయిత తన బాల్యపు జ్ఞాపకాలలో అరుగు ఎంత ఆకర్షించిందో ఎన్ని విషయాలకు సాక్ష్యం అయ్యిందో,వర్తమానంలో కవి ఎంత మిస్ అవుతున్నాడో తన కవితలో అద్భుతంగా వర్ణించారు. 
 
‘తరగనినిధి’ అనే కవితలో రచయిత్రి శారదా హనుమాన్లు గారు భారతీయ సాంప్రదాయ నారి వర్ణనలో ఉపయోగించిన పదచిత్రాలు ‘నిలువెత్తు శ్రమ సౌందర్యదివిటి ,అంగిటిలో రచించిన ఆశుకవిత సంపుటి, దిగుట్లో ఎల్గిలీను దివ్వె, తెలంగాణ తల్లికి ప్రతిరూపాలుగా నిలిచాయి.
 
కవయిత్రి వకుళా వాసు గారు వ్రాసిన ‘అంటుకోని  కుంపటి’ లో ఓ అవ్వ, దినసరి కూలి, తన కాయకష్టముతో రోజంతా శ్రమించి సంపాదించిన కూలి డబ్బులు తాగుబోతు వ్యసనపరుని పాలయినందున, పొయ్యి మండలేదు, అన్నం ఉడకలేదు అని చెప్పటంలో తెలంగాణ సగటు పల్లె కూలి నిత్య రోదన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఒక స్త్రీ పడుతున్న వేదనకు దర్పణంలా, కవయిత్రి సామాజిక బాధ్యతను తెలిపింది. డాక్టర్ కాసర్ల రంగారావు గారి ‘అభివృద్ధి జాగృతి తెలంగాణలో’ అనే కవిత,ఉద్యమానికి ఉన్న లోతు, తీవ్రత, నిజాయితీని తెలిపింది. అలాగే ఐక్యత, నిరంతర, జాగృతి ఉంటేనే నిజమైన బంగారు తెలంగాణ సాధ్యం అని కవి అభిప్రాయం. 
 
‘వసంత స్వప్నం’ అనే కవితలో డాక్టర్ అసనాల శ్రీనివాస్ గారు అభ్యుదయ భావజాలంతో ఒక భావ కవితను తన వ్యక్తిగత అనుభవము, సామాజిక చైతన్యము, తెలంగాణ ఆశయాలు, ఈ మూడు అంశాలత్రయంలో వ్యక్తీకరించారు. తన వసంత స్వప్నంలో మార్పు, విప్లవం, అభ్యుదయం, ప్రగతిశీల వాదాన్ని బలపరుస్తూ ఒక అద్భుతమైన భావావేశాన్ని వెల్లడించారు.
 డుంబై శేష పణి గారు రచించిన ‘తెలంగాణ వైభవంలో’ పండుగల గురించి మరియు తెలంగాణ వైతాళికుల గురించి తెలంగాణకు వన్నెతెచ్చిన ప్రకృతి పూల పరిమళాల గురించి ఒక భావ కవిత్వాన్ని తనదైన సంప్రదాయ శైలిలో వెలువరించారు.
 
దేవనపల్లి వీణా వాణి గారు రాసిన  కవిత “పురోగమి” కవితలోని ప్రధాన ఇతివృత్తం చైతన్యం. సమాజంలో అన్యాయం లేదా అశాంతి అనే చీకటి అలుముకుంటున్నప్పుడు, భయపడి ఇంట్లోనే కూర్చుంటే ఆ చీకటిని ఎవరూ ఆపలేరు. “దీపం వెలిగించడం” అనేది ఇక్కడ ఒక బాధ్యతకు ప్రతీక. మన చుట్టూ జరుగుతున్న తప్పులను చూసి స్పందించకపోవడం కూడా ఒక నేరమేనని కవయిత్రి నొక్కి చెప్పారు. “రోజులు మారుతుంటాయి” అనే పంక్తి ఈ కవితకు వెన్నెముక వంటిది. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, సందిగ్ధాలు ఉన్నా, వాటన్నింటినీ దాటుకుని కొత్త రోజులు వస్తాయని కవయిత్రి భరోసా ఇస్తున్నారు. చీకటిని మింగే సూర్యకిరణం లాగా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, కాలం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదని ఈ కవిత చెబుతుంది. ముసుగు లేని నిజాయితీ అవసరము అని, మనిషి తన లోపల ఒకటి పెట్టుకుని, బయటకు మరొకలా నటించడాన్ని,ద్వంద్వ ప్రవృత్తిని,హిపోక్రిసీనీ ఈ కవిత విమర్శిస్తుంది. మన తప్పుడు ప్రవర్తనను మన అంతరాత్మ అనే అద్దం చూసి ఎగతాళి చేస్తదని అలా బతకడం ఒక మానసిక భారమని హెచ్చరిస్తుంది. అలాగే, వ్యవస్థను నాశనం చేసే శక్తులను గుర్తించి, వాటిని ఎదిరించడమే నిజమైన “పురోగమి” అని వివరిస్తుంది.ఈ కవిత కేవలం ఒక ఫిర్యాదు కాదు, అదొక హెచ్చరిక మరియు ప్రేరణ. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం నేరమని కవిత హెచ్చరిస్తోంది, పాత ఆలోచనలను, అయోమయాన్ని వీడి, కొత్త చూపుతో (New perspective) లోకాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలనీ ఒక ఆశావాదం optimal కోణం ప్రదర్శిస్తుంది. మొత్తానికి పద ప్రయోగంలో సంక్లిష్టత ఉన్నా అద్భుతమయిన వ్యక్తీకరణ ఉంది. ఈ కవిత కవయిత్రి యొక్క సాహితీ పరిణితికి అద్దం పట్టింది.


 డా. వాణిదేవి దేవులపల్లి గారు రచించిన “యాసంగి ముచ్చట్లు”. తెలంగాణ పల్లెల్లో యాసంగి (రెండవ పంట కాలం) సీజన్‌లో కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని, సామాజిక మార్పులను మరియు రైతుల ముఖాల్లోని ఆనందాన్ని ఈ కవిత అద్భుతంగా ఆవిష్కరించింది.కవయిత్రి పల్లెలోకి అడుగుపెట్టగానే “సంపెంగల వాసన” గుప్పుమన్నట్లు చెప్పడం ద్వారా గ్రామీణ పరిమళాన్ని గుర్తుచేశారు. ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొందని, పల్లె తల్లి “పచ్చని చిలకపచ్చ చీర” కట్టుకున్నట్లుగా పొలాలు కళకళలాడుతున్నాయని వర్ణించడం కవితాత్మకంగా ఉంది. కవితలో ఒక ముఖ్యమైన మలుపు “మిషన్ కాకతీయ” ప్రస్తావన. ఎండిపోయిన చెరువులకు పూర్వ వైభవం రావడం, “కన్నీళ్లు కూడా రాల్చని పల్లె బతుకుల్లో పన్నీటి కాల్వలు గట్టించడం” అనే మాటలు తెలంగాణలో జరిగిన నీటి వనరుల పునరుద్ధరణను సూచిస్తున్నాయి. తరాల కరువుతో తల్లడిల్లిన ప్రజల గుండెల్లో ధైర్యం నింపిందని కవయిత్రి భావోద్వేగంగా చెప్పారు. పంటలు బాగా పండటంతో పల్లెల్లో కుల వృత్తులకు మళ్ళీ పని దొరికిందని కవిత పేర్కొంది. పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళల పాటలను, వారి చేతి గాజుల సవ్వడిని కవయిత్రి జానపద శైలిలో వర్ణించారు. “దుక్కి దుక్కి దున్నంగ ఓ రాచగుమ్మడి…” వంటి పాటల ప్రస్తావన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. శ్రమను కూడా ఒక వేడుకగా మార్చుకునే పల్లె పడుచుల ఉత్సాహం ఇక్కడ కనిపిస్తుంది. కవిత చివరలో పల్లె తల్లిని ఒక ముత్తైదువలా వర్ణించారు. కళ్లకు “సంతోషపు కాటుక” పెట్టుకుని, నిండుగా ఉన్న పల్లెను చూసి కవయిత్రి మురిసిపోయారు. ఎన్నాళ్లకో పల్లె ముఖం మీద ఈ నవ్వులు కనిపిస్తున్నాయని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కవిత నిండా అల్లుకున్న పదబంధాలు యాసంగి ముచ్చట్లు, గుండె తడి మత్తడి దున్నితే అలుగు వెల్లుగ బారింది కవితకు అదనపు ఆకర్షణ.
 

డా. దేవులపల్లి వాణీదేవి గారి సంపాదకత్వం ఈ సంపుటికి ‘దిశ‘ ఇచ్చింది. యాదృచ్ఛిక కవితల ఎంపిక క్రమపద్ధతి, భావాత్మక ఏకత్వం,ఒక సాహిత్య ఉద్యమానికి రూపము.  ఇవి అన్నీ సంపాదక బాధ్యతలో ప్రతి బింబించాయి. ఈ కసరత్తులో సంపాదకురాలు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు.విమర్శాత్మకంగా చూసినప్పుడు కొన్ని కవితల్లో భావం బలంగా ఉన్నా, నిర్మాణం సడలింది,కొన్ని చోట్ల నినాద స్వభావం పెరిగింది కానీ ఇది సంపుటి ఉద్దేశానికి లోపం కాదు ఉద్యమ సాహిత్యంలో ఇది సహజ లక్షణం. మొత్తం కవితలలో తెలంగాణ మాండలికం ప్రయోగం జరిగినా అక్కడక్కడ గ్రాంథికం నల్ల వెంట్రుకలలో తెల్ల వెంట్రుకలుగా కనిపించింది. “యాసంగి ముచ్చట్లు” తెలంగాణ ఉద్యమానంతర కవిత్వానికి ఒక డాక్యుమెంట్, భవిష్యత్ తరాలకు ఒక సాంస్కృతిక సాక్ష్యం, ఆధిపత్య భాషా సంస్కృతి మీద ఒక సాహిత్య ప్రతిఘటన,ఈ సంపుటి చదవడం అంటే కవితలు చదవడం కాదు,తెలంగాణను తిరిగి గుర్తుచేసుకోవడం.ఇది మర్చిపోతున్న చరిత్రకు జ్ఞాపకం,అలసిపోతున్న ఆత్మగౌరవానికి మేల్కొలుపు, భవిష్యత్ తెలంగాణకు దిశాసూచి. మొత్తంగా  “యాసంగి ముచ్చట్లు” అనే సంపుటి ఒక “మాండలిక ఉప్పెన”

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మాటల చెట్టు

by Padmasri Chennojwala January 24, 2026
written by Padmasri Chennojwala

వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయ పరచుకుంటూ ముందు కెళ్లిన కవయిత్రి సులోచన గారి భావాల్లోంచి మొలకెత్తిన గింజ నాలుగు పదులకు పైగా కొమ్మలతో మాటల చెట్టై ఎదిగింది. కొమ్మలన్నీ (శాఖలు) కొమ్మ(స్త్రీలు)లై కత్తులు దూస్తూ ఎద లోయల్లోని ఆవేదనలను వెలిబుచ్చిన కవితలు ఎక్కువగా కనిపించాయి. కూతురిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ, మనసు మూలల్లో ఎక్కడో దాగిన అసంతృప్తి కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతే గాకుండా జన చేతనలు, భాషా ఉద్యమాలు, సైనిక వందనాలు వీరి అక్షరాల్లో కనిపిస్తాయి. వీరి సిరా చుక్కల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టాయి, పిల్లనగ్రోవులు అలరించాయి. పుటలు తిరగేస్తే…..

నా లేత హృదయ కాన్వాస్ పై పంతులమ్మ చిత్రం గీసి రంగులద్దినది నీవే
ఎప్పటికీ నా హీరో వి నువ్వే (నాన్న – నేను)//
అంటూ తనను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన తన తండ్రే తాను మెచ్చిన కథానాయకుడని (ప్రతీ ఆడపిల్ల జీవితానికి మొట్టమొదటి హీరో ఆమె కన్నతండ్రే అని మానసిక విశ్లేషకులు తరచుగా చెప్పే మాట)చెబుతారు. ఒప్పుగ నను మలచిన ఒజ్జవు నీవమ్మా//
అంటూ అనురాగమూర్తి ఐన అమ్మకు వందనం సమర్పించుకుంటూనే
సంధ్య పొద్దున నేనేమి ఇవ్వగలన మ్మా నీకు నీ సేవలో తరించెద నమ్మా (ప్రేమ బంధం)//
అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాల్జేసే వారిపై చర్నాకోల ఝుళిపించారు.
నా క్షేమం కోరి స్వేచ్ఛను హరిస్తారు (అందమైన పంజరం) //
ఆడపిల్లను అరటాకుగా కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒక స్త్రీ మానసిక వేదనకు ఎంతగా కారణమవుతోందన్న విషయాన్ని కళ్ళక కట్టారు.

ఉదయాస్తమయాల నడుమ బొంగరంలా తిరిగే ఒక ఇల్లాలి అంతరంగాన్ని నాలుగు చేతుల దేవత నవ్వుల వెనుక నలిగిన ఆశలు,ఆశయాలను(ఆ నవ్వు వెనుక) అంటూ హృద్యంగా వర్ణించారు.

ప్రేమ మొలక(మిథునం)కు వలపుల పరిమళాల నలది దాంపత్య బంధాన్ని నిర్వచించిన తీరు అద్భుతం.

నీట కరిగే రూపం నుండి నీటిని నిలుపుకునే స్థాయిగా ….. జీవితమూ (పరిణామ పరిణతి)ఇంతే //
జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలే మనిషిని పరిపూర్ణుడని చేస్తాయని చెబుతూనే,
నాగరిక ఉప్పెనలో కొట్టుకుపోయిన మట్టి గంధానికి సమస్త సుగంధ ద్రవ్యాల సారం(మట్టి- మనిషి)అంటూ పట్టం కట్టిన తీరు మహోన్నతం.

కుంచె నా చేతిలోనే ఉన్నది
నా చేయి పట్టుకున్నది ఎవరో
రంగులు నావే అద్దుతున్నది నేనే…..
ఒక్కటంటే ఒక్కటి నాకు తృప్తినివ్వలేదు (జీవన చిత్రం)

ఎన్ని విధాలుగా దూసుకెళ్లినా, ఎంత ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించినా మనసు అట్టడుగు పొరల్లో ఘనీభవించి ఉన్న పరాధీనత సెగై స్త్రీ హృదయాన్ని ఎంతగా రగిలిస్తుందో ఆర్తి గా వ్యక్తీకరించారు.

కొరివితోనే మోక్షం అయితే (ప్రశ్నిస్తున్నన్నా)నే పట్టలేనా? పెట్టలేనా!
అంటూ సమాజంలో వేళ్ళు కొనిపోయిన లింగ వివక్షపై అస్త్రాన్ని సంధించారు.

నేలకేసి కొడితే నింగిదాకా ఎగురుతా//
అంటూ
శృతి మించిన అణచివేత తిరుగుబాటుకు పునాది అవుతుందని హెచ్చరించారు.
సమస్యల సుడిగుండంలో చిక్కి విలవిల్లాడే సాటి స్త్రీని (కత్తులు దూస్తున్న కొమ్మలు) అవసరమైతే సంఘటితమై ఛేదించి సాధించాలని చైతన్య పరుస్తున్నారు.

సగంలో వదిలిన రాగాలను శృతి చేసుకుంటూ, కరిగే మంచై, రగిలే నిప్పై, విలువలపై స్వారీ చేస్తూ విశ్వమంతా చుట్టే వజ్ర సంకల్పంతో సాహితీ లోకానికి మరిన్ని సంకలనాలను అందించాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కొక్కరోకో !(WAKEUPCALL)

by Charu Sri January 24, 2026
written by Charu Sri

ఇక పెద్దమ్మ చెప్పిన దానిప్రకారం….ప్రతి పల్లెటూరు ప్రకృతితో మమేకమై.. పశుపక్షాదులను సైతం తమ జీవితాల్లో బాగం చేసుకొని జీవిస్తుంది. అందుకే రోగాలు నొప్పులు పల్లెదరి చేరవు. కాకులు, మేకలు, కోళ్ళు , కుక్కలు ఇత్యాదివి పల్లె ప్రజల జీవితాల్లో భాగం. వేకువ జామున కోడి కూతతో నిద్రలేచిన పల్లె సాయం సంధ్జ్యవేళ ఆవులు, గేదెలు ఇల్లుచేరడంతో ఆ రోజుకు సెలవిచ్చి.. నిద్రాదేవిని ఆశ్రయిస్తుంది. ఇక్కడ నేటి తరం గమనించాల్సింది ఏమిటంటే,..పెందలకడ పడుకొని, పెందలకడ లేవడం అన్నది మనిషి ఆరోగ్యానికి మొదటి సూత్రం అన్న మాట.

అసలువిశాయానికి వస్తే ….కొక్కరోకో ……అన్న కోడికూతతో పల్లె నిద్ర లేస్తుంది. అంటే…కోడి కూతతో పల్లె దినచర్య ప్రారంభమవుతుంది. 70 దశకంలో ఎక్కువగా సజ్జ, జొన్న ఆముద లాంటి పంటలే పండించేవారు. ]అయితే కొందరు రైతులు మాత్రం బావుల దగ్దర వరి సాగు చేసే వారు. కూరగాయలు పండించేవారు. అయితే ఇప్పటిలాగా రసాయనిక ఎరువులు వాడేవారు కాదు.సేంద్రియ ఎరువులే వాడేవారు. అంటే ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఆర్గానిక్ పంటలన్న మాట.

బావుల దగ్గర సాగుచేసే రైతన్నలు కొడికుతతో నిద్రలేచి ..ఎద్దులను తోలుకొని బావిదగ్గరకు బయలు దేరుతారు. ఒక పక్క ఎద్దుల మెడలో కట్టిన గంటలు,గజ్జెల సవ్వడి..మరో పక్క పల్లె అలికిడితో నిద్దుర లేచిన చెట్టు కొమ్మల్లోని పక్షుల కిలకిల రావాలు.. పల్లె తల్లికి వీనుల విందైన సుప్రభాత సంగీతం. అప్పట్లో ఇప్పటిలా ట్రాక్టర్లు ఉండేవికావు. అందుకే రైతులు పశువులపెంపకం వారి జీవనయాత్రలో ఓ భాగంగా ఉండేది. వ్యవసాయం లేని వారు సైతం పాడి కోసం గేదెలను పెంచుకునేవారు. అందుకే పల్లెల్లో పాడికి కొదువ ఉండేది కాదు.

రైతన్నలు బావులదగ్గరకు వెళ్లిన తర్వాత..ఇళ్ళల్లో ఆడవాళ్ళ హడావిడి మొదలవుతుంది. ఇంటి ముందు ఊడ్చి,పేడతో కళ్ళాపి చల్లి..ఏర్ర మన్నుతో అలికి..ముగ్గులు పెట్టడం..నిత్య కృత్యం..ఆ తర్వాత ఇల్లు ఊడ్చి వంటింట్లో పోయ్యిని శుభ్రం చేసి..అలికి ముగ్గులు వేసి..అంట్లు తోమడంతో ఇళ్లల్లో ఆడపడుచుల హడావిడి మొదలవుతుంది. పల్లెల్లో దాదాపు అన్ని ఉమ్మడి కుటుంబాలే. మనం ఎ ఇంటిలోకి తొంగి చూసినా ఉమ్మడి కుటుంబాల మమకారాల మకరందం, నాన్నమ్మ, తాతయ్యలతో మనుమడు, మనుమరాళ్ళ పరిహాసాలు.. ముసలివాళ్ళ చీవాట్లు .. అందులో కనుపించే ప్రేమ ఇట్టే అర్ధం అవుతుంది.

“లచ్చిమి ఇంకెంత సేపు పంతవే…..లే” అంటూ లక్ష్మి వాళ్ళ అమ్మ ..వంటింట్లోంచి..కేకేసింది.
తల్లీ పిలుపు వినగానే నుసులు కుంటు..దుప్పటిలో మళ్లీ ముడుచుకు పడుకుంది కూతురు లక్ష్మి..
“ఒసేయ్.. పోరీ అమ్మపిలుస్తోంది. లేవరాదే .”అంటూ కోడలికి వంత పాడింది లక్ష్మి నాన్నమ్మ.
“పెల్లీడుదకొచ్చిన పిల్ల ఇప్పటిదాకా పంతే గెట్లనే..ఇంటికి దరిద్రం”.అంటూ కంటిన్యూ చేసింది అప్పటికే లేచి ముంగిట్లో కూర్చొని..బొగ్గుతో పల్లు తోము కుంటున్న ముసలమ్మ. చికాకు పుట్టి దుప్పటిని పక్కన వేసి మంచంలో కూర్చుంది లక్ష్మి.

.”ముసల్డాన నీకెందుకు..ముఖం కడుగుతున్నావుగా..వెళ్లి అమ్మపోసే చాయ్ నీళ్ళు తాగి చావక..”అంటూ కసురుకుంటు మంచం దిగింది. లక్ష్మి. “చస్తా లే. చావకుండా నీ సూరు పట్టుకు వెలాడతాన ఎన్ది” అంటూ పెరట్లో గాబు దగ్గరకు వెళ్లి ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది ముసలమ్మ.

“అత్తమ్మా..పొద్దున్నే దాని నోట్లో నోరు ఎందుకు పెడ్తవ్..దానికి నోరెక్కువ..” అత్తకు టీ అందిస్తూ అందీ కోడలు. “ఇది రోజు ఉందేదేగా..కొత్త కాదుగా” అంటూ టీ తాగింది అత్త..

“నానమ్మను అన్నది చాలు గానీ..నువ్వు ముఖం కడుక్కొని రా..వేడినీళ్లు గొంతులో పోసుకుంది” అంటూ కూతురును అరిచింది తల్లి.. తల్లి అరుపుతో ముఖం కడుక్కొని వచ్చి టీ తాగింది లక్ష్మి నాన్నమ్మ పక్కనే కూర్చొని.

“ఏంది నానమ్మ సంకలో దూరినవ్..మల్లేమి లొల్లి లేదుగా “అని ముసి ముసిగా నవ్వుతూ వంటింట్లో వంట పనిలో మునిగి పోయింది తల్లి.
తల్లి మాటల్లోని అంతరార్ధం తెలిసిన లక్ష్మి నాన్నమ్మను గట్టిగ వాటేసుకొని ముసల్ది చాలా మంచిది తెలుసా ? అంటూ తల్లిని ఉడికించింది. నాన్నమ్మను బిగ్గర వాటేసుకున్నట్లు నటిస్తూనే ముసలమ్మా బొడ్లో దోపుకున్న చేక్కుడు సంచిని లాగేసుకొని దూరంగా వెళ్ళింది లక్ష్మి.

“ఓస్ దొంగ ముండా సంకలో దూరి గారాలు పోయింది సంచి కోసమా?.. నీ సాద్యంగూలా” అంటూ కర్ర సాయంత్ఘో లేచి లక్ష్మిని పట్టుకునే ప్రయత్నం చే యబోయింది.

“ఓయ్ ముసల్దానా ఆ మూడుకాల్లేసుకొని నువ్వు లేసిరాకు.. నువ్వు పడి కాలో చెయ్యో పుటుక్కు అన్నదనుకో.. మా అయ్య అదే నీ కొడుకు నన్ను బతక నీయడే ” అని వ్యంగంగా దెప్పి మాట్లాడుతూ నానమ్మ దగ్గరకు వచ్చింది. చేక్కుడు సంచి నకన్నమ్మకు ఇచ్చింది. మళ్ళీ ఆమె పక్కన కూర్చోంది. ” ముసలీ ..మొన్న మీ తమ్ముని దగ్గరకు వెల్లొచ్చావుగా .. ఏమ్పెట్టిండే” అందీ.

“నీ ఏటకారం చాల్లే .. ఏదో వాడికి ఉన్నంతలో వాడు మర్యాద చేసిండు. అక్క చీర కొనుక్కోమని నాలుగు డబ్బులిచ్చుండు.” అంది నాన్నమ్మ.
” నిజమా నీ తమ్ముడు మంచోడేనే..నీకు ఈ వయసులో కూడా చీరా, సారే పెడుతుండు. అంటూ నాన్నమ్మ ఇగోను తట్టి లేపింది లక్ష్మి.

:”అత్తమ్మ అది కావాలనే రెచ్చగొడుతోంది. నువ్వు దానికి డబ్బుసంగతి చెప్పెసావు. నిన్ను ఇంకా అది బతుక నిస్తుందా ” అంది అప్పుడే వంటింట్లోంచి బయటకు వచ్చిన లక్ష్మి వాళ్ళ అమ్మ.

“ఓమ్మా ఏందీ నువ్వేమో సపోర్టు వస్తున్నావ్ .. మీ అన్న నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళడు. నానమ్మ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి చీరకు డబ్బులిచ్చిండు. గొప్ప కదా. అది నాన్నమ్మ చెప్పుకోవద్దా ఏంటి. నీకు లేనీ పుట్టింటి ముచ్చట ముసల్దానికి ఉందని నీకు కడుపు మంట..”అంటూ నాన్నమ్మను గ పొగిడేసింది…వాళ్ళ అమ్మ తమ మధ్య వస్తే తన పాచిక పారాదని! అంటూ
లక్ష్మి వాళ్ళ నాన్నమ్మను వాటేసుకున్న సీన్ చూసిన లక్ష్మి తల్లికి ఓ వైపు నవ్వు వస్తున్నా ఆపుకొని ” వామ్మో నాన్నమ్మ, మనుమరాలి మద్ష్య నేనేన్డుకులే. మీరు మీరు ఏమయినా చేసుకోండి. అత్తమ్మా అది నీ దగ్గర ఉన్న డబ్బులకు పుటమేస్తుంది జాగ్రత్తా” అంటూ అక్కడి నుంచి లోనికి వెళ్ళింది.

తల్లి లోనికి వెళ్ళగానే ” ముస్లీ ముస్లీ ..సారీ నానమ్మా.. మా బంగారు నానమ్మా.. ఇంతకు మీ తమ్ముడు ఎన్ని డబ్బులు ఇచ్చిండే” అంటూ నానమ్మ ఒల్లో పడుకొని గోముగా అడిగింది…
” ఎహే ఆ డబ్బుల గురించి ఇప్పుడెందుకే. అయినా గారాలు పోతున్నవెంది కథ ” అంది నాన్నమ్మ.. ఏమిలేదు నాన్నమ్మ నాకు జడ రిబ్బన్లు ఒక జతే ఉన్నాయి. నువ్వు ఒక్క పదిరూపాయలు ఇస్తే ఇంకో జత కొనుక్కుంటా..” అంది లక్ష్మి ..

” దొంగ ముండా ..మీ అమ్మచెప్పింది నిజమే. నా డబ్బులమీద కన్నేసి.. నా దగ్గర ఒయ్యారాలు పోతున్నవన్న మాట. నాదగ్గర డబ్బులు లేవు ఏమి లేవు.. నా మీదు నుంచి లేవే ముందు” అంటూ మనుమరాలిని తన మీదినుంచి లేపి కూర్చోపెట్టింది. అలా నానమ్మ చేయడం, తిట్టడం మనుమరాలికి మామూలే. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళ తిట్లు ప్రేమగానే ఉంటాయి. వాళ్ళ కోపం పిల్లలకు ఓ సరదా..

” ముసల్దాన ప్రేమగా ఒల్లో పడుకుంటే లేపెసినావ్ కదా .. ఇక మీద నీతో మాట్లాడ. ” అంటూ అలిగినట్లు నటిస్తూ ఇట్లోకి వెళ్ళింది. అలా మనవరాలుచుసిన నాన్నమ్మ మనస్సు అదోలా అయింది. బెట్టు చేసినట్లు కాసేపు తాను నటించింది. కాని మనమరాలితో పోట్లాడకుండా.. మాట్లాడ కుండా ఉండలేదు ముసలమ్మ. ” ఒసేయ్ పోరి ఇక్కడకు రావే” మనవరాలిని పిలిచింది వాళ్ళ నాయనమ్మ. ” ఎందే ఇందాక గెంటేసి మల్లి పిలుస్తున్నావ్ ” అంటూ వచ్చింది లక్ష్మి.

లక్ష్మి రాగానే చేక్కుడు సంచిలోంచి పది రూపాయలు తీసి మనుమరాలికి ఇచ్చింది ముసలమ్మా. ఇదంతా వంటిన్తిలోంచి గమనిస్తున్న లక్ష్మి వాళ్ళ అమ్మ.. ” ఇద్దరు ఇద్దరే ” మనసులో అనుకోయి బయటకు అనేసింది. “అమ్మా నువ్వేమి కుల్లుకోవద్దు. నువ్వేమన్నా మా నాయనమ్మ బంగారం” అంటూ నాన్నమ్మకు ముద్దిచ్చి అక్కడ నుంచి తుర్రుమంది లక్ష్మి.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గళం, కలం… నాగసూరి సాహిత్య సాధనం

by Achyutuni Rajasri January 24, 2026
written by Achyutuni Rajasri
విజయవాడ రోజుల్లో 1998 ప్రాంతం

ఆకాశవాణిలో పత్రికల్లో గళం, కలంతో ప్రసిద్ధిగాంచినవారు డా. నాగసూరి వేణుగోపాల్ గారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సైన్స్ విషయాలు ఆయన చెప్తుంటే యువతకి జోష్ వస్తుంది. వివిధ పేపర్లలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన వ్యాసాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. సవ్యసాచిలా ఆకాశవాణిలో నిబద్ధతతో పని చేసి, రిటైరైనా కూడా ఉత్సాహపూరిత వ్యాసాలతో, ప్రసంగాలతోఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు ఆయన. పాలు నీరులా కలిసిన దంపతులు హంసవర్ధిని వేణుగోపాల్ గార్లు ఒక్క నిముషం సమయం వృధా చేయకుండా కొత్త ప్రదేశాలు చూడటం, సభలకు హాజరుకావటం, సోషల్ వర్క్ తో కాలం గడపటం ముదావహం.

ఇక 2020లో వెలువడిన “వేణునాదం” ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన పుస్తకం. తన బాల్యం మొదలు అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని ఆసక్తికరంగా వివరించారు. పాఠకుల్ని ఒక్క ఊపులో చదివించిన ఆ పుస్తకంతో మనం ఎన్నో విషయాలు తెల్సుకోవచ్చు. ఆయన జీవితం వడ్డించిన విస్తరికాదు. కార్యదీక్ష పట్టుదల ఏకాగ్రతతో ఆయన సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకాలు.

1961లో రాయలసీమ లోని కొనతట్టుపల్లి అనే 40, 50ఇళ్లున్న పల్లెలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. అమ్మ నాన్నలు శ్రీమతి గౌరమ్మ, శ్రీ సంజీవయ్యగార్లు.10మంది సంతానంలో 4 ఆడ, 6గురు మగపిల్లల్ని పెంచి పోషించిన వారిని గూర్చిఇలా రాశారు:

“నేను 8వవాడిని. అమ్మ చెప్పిన సుద్దుబుద్ధులు నాకు వెలుగు దివ్వెలు. ఇతరులు ఇచ్చింది తీసుకోరాదు, అలవోకగా చెప్పిన అమ్మ మాట శిలాశాసనం…. “
” మా నాన్న తన 10వ ఏట తన అన్నతో కల్సి కట్టుబట్టలతో వచ్చారు. కొప్పు ఉండేది నాన్నకి. నా 5వ ఏట దాన్ని తీసేశారు. ఆయన చనిపోయాక 2010నుంచి తెలుగు విశ్వవిద్యాలయం పాపులర్ సైన్స్ లో మా అమ్మ, నాన్నల పేర ప్రతి ఏటా కీర్తి పురస్కారం ఇస్తున్నాం”. నాగసూరి పుట్టపర్తిలో డిగ్రీ; ఎస్.వి. యూనివర్సిటిలో ఎం.ఎస్సీ. ఎం.ఫిల్ చేశారు. ఎం.ఎస్సీ ఫస్టియర్ లో ఫిజిక్స్ క్లాస్ బోర్ కొడ్తే కొండల్ని చూసేవాడినని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంలోనే ఆయన లోని నిష్కపటత్వం అవగతమౌతుంది. ఇలా మనసులోని మాటను, బాధలను మనం ఇతరులతో పంచుకోవటం వల్ల టెన్షన్ తగ్గుతుంది. ఇది నేటి యువత తెలుసుకోవాలి. విద్యార్ధిగా తన అనుభవాలు అధ్యాపకులప్రోత్సాహాన్ని ఇలా వివరించారు: “1971లో నేను 5వక్లాసు చదివేప్పుడు గోవిందరెడ్డి సార్ సోషల్ స్టడీస్ చెప్పేవారు. రోజూ రాజకీయాలు, దేశ ప్రపంచ విషయాలు చెప్పేవారు. అలా పుస్తకం చదివే అలవాటుకి బీజం పడి నేటికీ కొనసాగుతోంది.” ఇలా నేడు ప్రతి బడిలో టీచర్ల ప్రేరణ ఉండాలి.కానీ నేడది కరువైంది కదూ? 1975-76లో అన్నయ్య అంగడికొట్టులో పనిచేస్తూ చదువుకున్నారు. 1948-49 లో ప్రచురితమైన అట్టలూడిన ‘స్వర్ణ భారతి’ పుస్తకం ఆయన లో దాగిన రచయితను బైటకి లాగిందనే చెప్పొచ్చు. 1977-78లో తేటగీతిలో 17 పద్యాలు రాశారు. అదే సం. ‘ఆంధ్రపత్రిక’లో చిన్న కవిత ప్రచురింపబడటం ఓ మలుపు. ఇక 10 వ క్లాస్ లో బాగా ప్రభావితం చేసిన వారు శ్రీ కల్లూరు జానకి రామారావు గారు.

లేపాక్షి పురస్కారం అందజేసిన తర్వాత ముచ్చటిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే, సినిమా నటుడు బాలకృష్ణ (ఎడమవైపున కన్నడ హీరో శివరాజ్ కుమార్ మధ్యన అంబికా కృష్ణ ఉన్నారు)- 2018

నెలకు 20 పైసలు పిల్లల దగ్గర వసూలు చేసి సోషల్ స్టడీస్ క్లబ్ నడిపి రకరకాల తెలుగు వారపత్రికలు, రీడర్స్ డైజెస్ట్, విజ్డమ్ మొదలైన పుస్తకాలు తెప్పించి పిల్లల చేత చదివించేవారు. ఇంటికి తీసుకెళ్లి చదువుకునే వారు. అలా వేణుగోపాల్ గారిలో సాహిత్య పిపాస రచనాసక్తి పొటమరించి రచయిత కావడానికి పునాది వేసింది.

2001-2010లో జర్నలిజంలో ఎం.ఏ., పి.హెచ్.డి చేయటంతో ఇక ఆయన కలం విజృంభించింది. అంతులేని అగాధ సముద్రం వంటి సాహిత్యంలో ఆయన కలం కదం తొక్కింది. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక పఠనంతో పాటు నార్ల, విద్వాన్ విశ్వం, శ్రీపాద గార్లపై పుస్తకాలు రాశారు డా. నాగసూరి.

1968లో ఇంట్లో రేడియో మోగటంతో పొందిన ఆనందం అమూల్యం. ఇక ఆకాశవాణిలో ఉద్యోగం అదీ గోవాలో రావటం ఇంకో మైలురాయి. రొట్టె విరిగి నేతిలో పడింది అన్నట్లు ఆకాశవాణి ఉద్యోగంతో ఆయన కలలు సాకారమై రచయితగా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఎందరో సాహితీమూర్తుల్ని కలుసుకొన్న భాగ్యం అబ్బింది. కలానికి బలం,గళానికి గుర్తింపు, శ్రోతల, పఠితల అభిమానంతో పాటు అవార్డులు, రివార్డులతో దేశమంతటికీ పరిచయమైనారు. గోవా, అనంతపురం, విజయవాడ, విశాఖపట్టణం, మద్రాసు, కడప తిరుపతి, హైద్రాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో ఆయన వాణి బాణి, ఎందరో మహానుభావులతో పరిచయాలు మైలురాళ్లు. రోజుకి 8గంటలపైగా రేడియో ఉద్యోగం, 3 గంటలు రచనలతో కొన్నివేల వ్యాసాలు, 80పైగా పుస్తకాలు వేణుగారి అకుంఠిత దీక్ష ,పట్టుదల కి నిదర్శనం. “గౌరమ్మ నుంచి హంసమ్మ” దాకా సాగుతున్న ఆయన జీవిత ఆశయం ఏమంటే తెలుగు భాష పరివ్యాప్తికి సైన్స్ సామాన్యులకు చేరాలనేది. 1997 నుంచి 2010 దాకా ఆంధ్రభూమి దినపత్రికలో తెలుగులో రాసిన మీడియా టి.వి. ధారావాహికా వ్యాసాలు యూనివర్శిటీ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడ్డాయి.

ఈయనకు వచ్చిన ముఖ్య పురస్కారాలు :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగుభాషా పురస్కారం,
తాపీధర్మారావు,
నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాలు,
అధికార భాషాసంఘం అవార్డ్,

పాపులర్ సైన్స్ వ్యాసప్రచురణకు
డా.పరుచూరి రాజారాం గౌరవం,
జమ్మి శకుంతల అవార్డు మొదలైనవి.

ఇక పదవీవిరమణ చేసిన తర్వాత
మల్లవరపు జాన్ సాహితీ పురస్కారం,
జానమద్ది సాహితీ సేవా పురస్కారం,
పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల సాహితీ పురస్కారం,
కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం వచ్చాయి.
2025 నవంబర్ లో
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుంచి జ్ఞానజ్యోతి పురస్కారం రాగా,
డిసెంబర్ మూడోవారంలో రామానుజన్ స్మారక గణిత అవార్డు ప్రదానమయ్యింది.

‘గాంధీ తాత చెట్టు’ సినిమా దర్శకురాలు మల్లాది పద్మావతితో గాంధీజీ పరిశోధకులు డా. నాగసూరి

‘ముద్ర’ పేరుతో ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో 2012-’13 కాలంలో తన బాల్యదశ విశేషాలతో జీవిత యాత్రను, స్వానుభవాలను ‘వేణునాదం’లా ఎదురుగా నిలబడి చెప్తున్నట్లు ఆయన కలం చేసిన విన్యాసం రచయిత ప్రతిభకు మచ్చుతునక. ఆయనకు భుజంతట్టినవారు శ్రీ కాళీపట్నం రామారావుగారు. అంతే విభిన్న విషయాలపై ఆయన కలం విన్యాసం పాఠకుల్ని అలరిస్తుంది. ఇప్పటిదాకా 80కి పైగా గ్రంథాలు వెలువరించారు. ఇంకా శతాధికం దాటాలని ఆశిస్తున్నాను.

పర్యావరణ కార్యక్రమాల రూపకల్పనలో ఆకాశవాణి తరుఫున ఆసియా పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ మనిలా (ఫిలిప్పైన్స్)లో నిర్వహించిన సదస్సు- 2010లో పాల్గొనడం మరువలేని అనుభవం. వృత్తిలో సంతృప్తిపొందిన భాగ్యశాలి వేణుగారు. విజ్ఞాన శాస్త్రం ప్లస్ మానవతావాదం ఆయన మతం. ఈయన రాసిన వ్యాసాలను బడి పాఠ్యపుస్తకాలలో చేర్చితే సైన్స్ పై అవగాహన విద్యార్థులకు కలుగుతుంది. సరళమైన భాష, హాయైన శైలిలో సూటిగా, స్పష్టంగా రాసే, చదివించే నేర్పున్న రచయిత డా. వేణుగోపాల్ గారి కలం నిండు నూరేండ్లు సాహిత్య సేవ చేయాలని కోరుకుందాం.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్న పత్రికలే ఆధారం- శ్రీరంగ స్వామి

by రంగరాజు పద్మజ January 9, 2026
written by రంగరాజు పద్మజ

విస్మృత కవి- పండిత- రచయితల శోధకులు యువకవుల ప్రోత్సాహకులు శ్రీరంగ స్వామి గారితో ముఖాముఖి

వరంగల్ లో కవులే లేరు, రచయితలే లేరు, కథలసలే లేవు, కథలున్నా ఉద్యమ సంబంధ కథలు తప్ప సమాజదర్పణ కథలులేవనే ఒక అపవాదు వచ్చేసరికి అది వినివనీ తాను స్వయంగా కవి, తండ్రి రామానుజస్వామి గారు కూడా శతకకవైన వీరికి ఆమాట రుచించక…ఆ అపవాదు తొలగించుకోవాలని ఊరూరా తిరిగి , మరుగున పడిన కవుల, రచయితలను వెలుగులోనికి తెచ్చిన సాహిత్యాభిమాని, ఆ సాహిత్య సేకరణలకోసం నిరంతరం శ్రమించిన సహృదయ సాహితీ శ్రామికులు శ్రీ తిరుకోవలూరు శ్రీరంగస్వామి గారు. అది చెప్పినంత తేలికైన విషయం కాదు! ఆ శ్రమేమిటో? దాని ఫలితమేమిటో తెలుసుకోవడానికి వారిని పలుకరించి, వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!

పద్మజ:- నమస్కారమండి శ్రీరంగ స్వామి గారూ! మీ నేపథ్యం నిజం చెప్పండి!

టి. శ్రీరంగస్వామి:– నమస్కారం పద్మజ గారు!
నేను 16 -7 -1950 రోజున పర్లపల్లి, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లాలో, తెలుగు పంచాంగం ప్రకారం విరోధి- శ్రావణ శుద్ధ పాడ్యమి, రోజున జన్మించాను. కానీ వరంగల్ లోనే పెరిగాను.
మా తల్లిదండ్రులు శ్రీ టీ. రామానుజ స్వామి- శ్రీమతి. తాయమ్మ .మాది దిగువ మధ్య తరగతి శ్రీ వైష్ణవ కుటుంబం.

పద్మజ :– మీ విద్యాభ్యాసము, మీ వృత్తి, ప్రవృత్తి గురించి వివరించండి!

శ్రీరంగ :– నేను ఒకటో తరగతి నుండి హెచ్ ఎస్ సి ; పి యు సి అన్నీ వరంగల్ లోనే చదివాను. తరువాత బీకాం, తర్వాత ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే ఎంఏ ఎక్స్టర్నల్ రాశాను. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల వారి పర్యవేక్షణలో విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు అనే అంశంతో పిహెచ్డి కూడా ప్రైవేట్ గానే చేశాను.
1987 బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాను. అంతకు ముందు ప్రైవేట్ కంపెనీలో పని చేశాను. రిటైర్ అయ్యేవరకు అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఆఫీసు సూపరిండెంట్ గా రిటైర్ అయ్యాను. అంబేద్కర్ యూనివర్సిటీలోనూ, కాకతీయ యూనివర్సిటీలోనూ కౌన్సిలర్ గా అంటే లెక్చరర్ గా, ఆర్ ఓ ఆర్ లో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశాను.

శ్రీరంగ స్వామితో పృచ్ఛకురాలు రంగరాజు పద్మజ

పద్మజ :– శ్రీలేఖ సాహితీ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఎందుకు కలిగింది? ఎప్పుడు స్థాపించారు? దానికి ప్రేరణ ఏమిటి?

శ్రీరంగ :— నేను 1967 లో యువభారతి సభ్యుడిగా చేరాను. సికింద్రాబాద్ లో ఉన్న ఆ సంస్థలో సభ్యుడిగా చాలా ఉత్సాహంగా పాల్గొనే వాడిని. అందులో 79 లో ఉషోదయం అని ఒక కవితా సంకలనం తీశారు. ఆ సంకలనానికి రచనల సేకరణ కోసం రచయితలనెందరినో కలవడం, ఆ పుస్తకం రావడం నాకు ప్రేరణ నిచ్చింది. దాంతో హైదరాబాదు నుండి వరంగల్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే ఇక్కడ శ్రీలేఖ సాహితి సంస్థ ను స్థాపించాను. యువ కవులను ప్రోత్సహించాలని, వారి రచనలను ముద్రించాలని నా లక్ష్యం. ఎందుకంటే అప్పుడు వరంగల్లో ఒక్క మిత్ర మండలి సంస్థ తప్ప మరే సంస్థలు లేవు. సాహిత్యాన్ని ప్రోత్సహించేవారు లేక తెలుగు భాష సన్నగిల్లిందని ఆలోచనతో… దాని పరిధి పెంచాలని స్థాపించాను. కొన్ని బాలారిష్టాలు ఎదురైనాయి. విజయవాడ సాంస్కృతి సమాఖ్య శాఖ ఇక్కడికి రావడంతో…. కొంచెం కార్యక్రమాలు తక్కువైనాయి. కానీ అక్కడక్కడ సమావేశాలు నిర్వహిస్తూ, 84 నుండి పుస్తక ప్రచురణలు ప్రారంభించాము.
వరంగల్ చైతన్య సాహితికి నేను కార్యదర్శిగా (80) ఉన్నప్పుడు చైతన్య కవితా సంకలనం కూడా యువభారతి వారి వలెనే పరస్పర సహకారంతో వెలువరించాము. అది మా మొదటి పుస్తకం. దానికి వేరే వాళ్ళు కూడా కృషి చేశారు. పూర్తి అన్ని పనులు నేనే చూసుకున్నాను.
తర్వాత శ్రీలేఖ సాహితిలో ఏవో సమావేశాలు తప్ప ఎక్కువ సాహితీ సేవలు జరగలేదు. 1984లో మా నాన్నగారి శ్రీరామా వందనము అనే శతకం అచ్చు వేసాము. అప్పుడే సంస్కృత సమాఖ్య ద్వారా కొన్ని పనులు జరిగాయి. రాష్ట్రస్థాయి మహాసభలు రెండు రోజులు ఏర్పాటు చేశాము. ఇవి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో, తర్వాత రెండు నెలలకు ఒకసారి సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసాము. జిల్లా గ్రంధాలయ సంస్థలో సెక్రెటరీగారు మాకు అన్ని విధాల సహకరించే వారు. అలాగే మిత్రుడు కృష్ణారెడ్డి మయూరి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఆయన ఆహ్వాన పత్రికలు ఉచితంగా అచ్చు వేయించి ఇచ్చేవారు. అలా కార్యక్రమాలు చక్కగా నడిచాయి. దాని తర్వాత విజయవాడ బ్రాంచ్ వారు కొన్ని కార్యక్రమాలు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి , దాని నుండి వైదొలగి
వరంగల్లు సాహితీ సమితి స్థాపించాము. దానికి నమలికొండ బాలకిషన్ రావు గారు అధ్యక్షులు, నేను కార్యదర్శిని. దాదాపు మేమిద్దరిమే కృషి చేసాము. సంస్కృతి సమాఖ్య తో పాటు దాన్ని నిర్వహించాము. మేము ఏ కార్యక్రమం చేసినా యువ రచయితలకే ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళం. వారి రచనలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, వారితో ప్రసంగాలు చేయించే వాళ్ళం. వారి కవితలు సంకలనాలుగా తెచ్చాము. అందుకే వరంగల్లో రచయితలకు మా సంస్థ అండగా ఉంటుందని పేరు వచ్చింది. ఈ సంస్థలను నడిపించడానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ అన్నిటిని ఎదుర్కొన్నాము! తర్వాత సాహితీ సమితి, శ్రీలేఖ రెండింటిద్వారా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాము. దాని ద్వారా ఆరు పుస్తకాలను వెలువరించాము. శ్రీలేఖ ద్వారా కూడా ఎన్నో పుస్తకాలు వెలువరించాము. నేను ఎం.ఏలో చేరడంతో కొంతకాలం సంస్థలలో సమయం కేటాయించలేక పోయాను. సాహితీ సమితి కార్యక్రమాలు కొద్దిగా తగ్గాయి. దాంతో ఆ సంస్థ మూత పడింది. తర్వాత యువరచయితల కోసం ఏ కార్యక్రమాలనైనా శ్రీలేఖ సాహితీ సంస్థ నుండే జరుగుతున్నాయి.
ప్రభవ, విభవ, ఇలా తెలుగు సంవత్సరాల పేరుతో కవితా సంకల నాలు ప్రారంభించాము. 79లో ఉషోదయం అనే కవితా సంకలనం వేసాము.
అలా 29 సంకలనాలు వేసాము.
2002లో శ్రీలేఖ సాహితీ సమితి రజితోత్సవాల సందర్భంగా పరస్పర సహకారంతో కథా సంకలనాలు వేయడం ప్రారంభించాము. లబ్ధ ప్రతిష్టుల రచనల కన్నా యువకులకే ప్రాధాన్యత నిస్తూ ఎనిమిది సంకలనాలు వేశాము. అలా 10 వ్యాస సంకలనాలు వేశాము. అలా 150 పుస్తకాలు ఈ సంస్థ ద్వారా అచ్చు వేయించాము.
శ్రీలేఖ సాహితీ సంస్థ ద్వారా అనేక సాహితీ సదస్సులు నిర్వహించాము. పోతన భాగవతముపై ఉపన్యాసాలు నిర్వహించి, వాటిని పుస్తకం గా కూడా వెలువరించాము.
ప్రాచీన వాఙ్మయంలో ప్రవేశం ఉన్న వారి చేతనే వ్యాసాలు రాయించి, దాంతో పాటు కొంతమంది మా కార్యవర్గ సభ్యులను, యువతను కూడా ప్రోత్సహించి వారి చేత రాయించి అలా పది సంకలనాలు వేశాము.
రామాయణం మీద రెండు, భాగవత వ్యాసాలు రెండు, మధుర భక్తి అన్నమయ్య మీద రాయించాము. ప్రతి విశ్వవిద్యాలయంలో వాటికి గుర్తింపు వచ్చాయి. శ్రీలేఖ సంస్థ నుండి పరిణితి చెందిన వ్యాస సంకలనాలు వస్తాయని పేరు వచ్చింది. తరువాత ఆ వ్యాసకర్తలు దాదాపు యూనివర్సిటీలో పని చేసిన వారు, కొంతమంది పండితులే! వారికి అంశాన్ని ఇచ్చి రాయించాము.
వంశిమోహనమ్(శ్రీకృష్ణ సర్వస్వం), నేను కృష్ణుని మీద 50 కోణాల్లో రాయించాలని అనుకున్నాము. మొదలు పెట్టాము కాని 30 మాత్రమే వచ్చాయి. అప్పటికే చాలా ఆలస్యమైంది. 35 కోణాల్లో కృష్ణుని వివరించగలిగాము.
మాకు తోచిన సాహితీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. వరంగల్ జిల్లా రచయితల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి, వరంగల్ సాహిత్యం మీద ఆరు పుస్తకాలు వెలువరించాము.
1- వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ సూచిక;
2- వరంగల్ సాహితీ తరంగాలు;
3- వరంగల్ సాహితీమూర్తులు ;
4- ఏకశిలా వైతాళికులు

అడపా దడపా మనకు ముద్రించడానికి వచ్చిన పుస్తకాల్లో వరంగల్ సాహిత్యాన్ని ప్రతిబింబించే వ్యాసాలు ముద్రించాము. అంతేకాదు వారి రచనలను సాహిత్య అకాడమీకి సిఫారసు చేసాము.

మిత్రులను ప్రోత్సహించి వారి పుస్తకాలను కూడా మన సంస్థ ద్వారా వెలువరించాము. వాళ్ళ పుస్తకాలకు ముందు మాటలు రాయడమే కానీ సంస్థ తరఫున ద్రవ్య రూపకంగా సహాయం చేయలేదు. వాళ్లే ముద్రించుకున్నారు. శ్రీలేఖ సాహితి బ్యానర్ మీద ముద్రించుకున్నారు. భద్రాచలం దగ్గర సత్యనారాయణపురం నుండి ఒక తను, గుంటూరు రచయిత , ఒంగోలు రచయిత, ఇలా ఎన్నో ప్రాంతాలనుండి వాళ్ళు శ్రీలేఖ సాహితీ సంస్థ మీది అభిమానంతో వేసుకున్నారు.
కథా సంకలనం వేసినప్పుడు ఒక తండ్రి తన కొడుకు రాసిన కథను ఎలాగైనా ప్రచురించాలని సంకలనంలో వేసి వాడిని ప్రోత్సహించమని అడిగితే ఆ కథను ఎడిటింగ్ చేసి ఆ సంకలనంలో చేర్చాము. అలాగే ఖమ్మంలో మారుమూలన ఉన్న ఒక కిరాణా కొట్టు నడుపుకునే అతను నా కథను మీ సంకలనంలో వేయండి అని అడిగితే దాన్ని కూడా సవరించి వేశాను. ఇలా రచయితలను ప్రోత్సహించే దిశగానే మా కృషి సాగింది.

ప్రతి ఉగాదికి శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి తప్పకుండా కవితా సంకలనం వస్తుందని అందరికీ తెలుసు! తర్వాత కార్యవర్గ సభ్యుల కోసమే ప్రత్యేక సంకలనాలు వేశాము. తర్వాత ఒక అంశమిచ్చి కవితలు రాయించి, ముద్రించాము. అలాగే కరుణ రసం మీద ఒక కథా సంకలనం తీసాము. వరంగల్ జిల్లా కథా సర్వస్వం అని 108 కథలు వేసాము. అది 800 పేజీలయ్యేసరికి 1,70,000 రూపాయలు అయింది. అమ్మవారి అనుగ్రహంతో అది కూడా వెలువడింది. ఇంకా 70 మంది కథకుల కథలు ఆ కాలంలో చేర్చాల్సి ఉండే! కానీ సమయానికి వారు పంపించకపోయేసరికి అందులో ముద్రించలేదు. దీంతో వరంగల్లో 200 మంది కథారచయితలు ఉన్నారని తేలింది. 70 మంది కథారచయితలు వారి కథలు పంపకున్నా వారి పేర్లు ఒక జాబితా తయారు చేసి, ముద్రించాముఅదే సంకలనంలో… గ్రంథాలయ వారోత్సవాలలో రెండు మూడు రోజులు మా సంస్థ తరఫున కార్యక్రమాలు చేసాము. ఇందిరా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం చేసేవాళ్లం. కవయిత్రులతో కవి సమ్మేళనాలు నిర్వహించాము. ఒక సంవత్సరం ఏం చేసామంటే కాకతీయ భారతి శీర్షికన వరంగల్ ప్రాంత యువ కవులతో కవితలు రాయించి ఒక పుస్తకం వేసాము. అందులో కవితలు అందని కవయిత్రుల పేర్లు కూడా నమోదు చేశాము. ఎందుకంటే వరంగల్ కవయిత్రులను నమోదు చేయాలనే ఉద్దేశంతో… కాకతీయ భారతీ అనే పేరు అందుకే పెట్టాము.
రెండు రోజుల సభలు లేదా వార్షికోత్సవాలు చేసినప్పుడు కథల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాము. కవితల కోసం మరొక ప్రత్యేక సమావేశం నిర్వహించాము. సాహిత్య సమావేశాలు ప్రత్యేకం…. ఇలా నాలుగు సెషన్లుగా నిర్వహించాము.
అష్టావధాన సప్తాహాలు 1996లో ఒకటి 2002లో ఒకటి నిర్వహించాము. రోజుకో అష్టావధాన సభను ఏర్పాటు చేశాము.
2006లో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఏర్పాటు చేసాం (శతాధిక కవి సమ్మేళనం) అందులో 130 మంది కవులు పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కవి సమ్మేళనం ప్రారంభిస్తే రాత్రి 9 గంటల వరకు సమావేశాలు సాగినాయి. ఈ సభల్లో ఇతర కవుల పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఏ సమావేశానికా సమావేశానికి వేదిక మీద వక్తలను ఆహ్వానించి చేసాముశతప్ప ప్రతీ సభకూ నేనే అధ్యక్షుడిగా ఉండాలని ఏనాడు అనుకోలేదు!
మాకు తోచినంత సాహితీ సేవ చేస్తున్నాము. 2008 తర్వాత కవితా సంకలనాలు, కథా సంకలనాలు ఆపాము. ఎందుకంటే నేను పదవి నుండి విరమణ పొందాను! ఇక ఆర్థిక భారం మోయలేనని విరమించుకున్నాను. అంతేకాదు సంకలనం కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. కానీ వ్యాస సంకలనాలు మాత్రం చాలానే పాఠకులకు అందించాము.
వరంగల్ కవులను ఇతర ప్రాంతాలకు ఆహ్వానిస్తే వారిని అక్కడికి తీసుకొని వెళ్లడం, వారికి అవకాశాలు కూడా ఇచ్చాము.
సంపత్ కుమార్ గారు మరణించినప్పుడు ఒక ప్రత్యేక సంచిక కనుమరుగైన చంద్ర శిఖరము అనే పేరుతో వెలువరించాము. వారి 13వ రోజు కార్యక్రమంలో కవులకు అందించాము.
తర్వాత ఆశావాద ప్రకాశరావు గారికి పద్మభూషణ అవార్డు వచ్చిన సందర్భంగా పద్మభూషణుడు ఆశావాది ప్రకాశరావు అనే చిన్న బుక్లెట్ వేసాము. ఇలా ఆయా సందర్భాలను బట్టి ప్రత్యేక పుస్తకాలు కూడా వెలువరించాము. ఇలా మా వంతు సాహితీ సేవలు చేస్తున్నాము.
నేను పీహెచ్డీ చేసినప్పుడు నాకు పద్యం రాయడం రాదు! కనుక విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం మీద పరిశోధన చేస్తే పద్యం రాయడం రాదు అంటే ఎలా? అని ఆయన సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారని ప్రశ్న వస్తుంది కదా! అందుకే కొంత కృషి చేశాను .
నా దృష్టి ఎంతసేపు వరంగల్ కవుల; రచయితల సాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకురావాలన్న తపనే ఎక్కువగా ఉండేది. అందుకే వరంగల్ పత్రికల మీద చాలా కృషి చేశాను. గ్రంథాలయ ఉద్యమాల మీద కృషి చేశాను. వరంగల్ లో పరిశోధన చేసి పట్టా పుచ్చుకోవాలంటే మాత్రం శ్రీలేఖ సాహితీ సంస్థ పుస్తకాలే ఆధారమవుతాయి.
ఈ కథా సంకలనాలలోని కథలను తీసుకుంటే 80 దశకంలో వరంగల్లో కవులే లేరు రచయితలే లేరు కథలే లేవు అన్న ఒక అపవాదు తొలగించుకోవాలని మూల మూలల తిరిగి వారి రచన ప్రతిభను గుర్తించి 400 మంది కవులను, రచయితలను పరిచయం చేశాను.( ప్రతాపరుద్రుని కాలం నుండి సమకాలీన రచయితల వరకు) అది పెద్ద శ్రమతో కూడిన పని! ఎడిట్ చేయడము మిగతా పనులన్నీ నేనే చేసేవాడిని. ప్రసారిక పత్రిక వెనుక నా కృషి ఎందరో గుర్తించారు ఆ పత్రికను మేము నడిపినప్పుడు అందులో వచ్చిన వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు గుర్తింపును తెచ్చి పెట్టింది ఆ స్థాయికి పత్రికను నడిపాము.

పద్మజ:– మీరు రచనల వివరాలు మరియు మీ శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి వెలువడిన పుస్తకాల వివరాలు తెలుపుతారా?

శ్రీరంగ :– 1-మధుర; 2- శిఖరం ; 3-మానస సంచరరే ; 4- నిరంతరం ; 5- సరేయోవా నుండి ఏకశిలకు (అనుసృజన) (బోస్నియా హెర్జగోవినా దేశంలోని సరేయోవా కవయిత్రి అజాసా జహీరోవిచ్ ఆంగ్ల కవితల అనుసృజన) 6- నీల మోహనాష్టకము; (వచన పద్యాలు) వచన ప్రక్రియలో తొలి అష్టకము, ఎనిమిది పంక్తులతో ఒకటి; ఎనిమిది పద్యాలు; ప్రస్తావన; ఉపసంహరము;( నాలుగేసి పంక్తులలో); 7-సమజ్ఞ; 8-డిసెంబర్ 11- పరిశోధన.

ఇక శ్రీలేఖ సంస్థ నుండి వచ్చిన రచనలు:–
1- వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ జీవిత సూచిక.
2- కోవెల సుప్రసన్నాచార్యుల వాఙ్మయ జీవిత సూచిక.
3- దేవులపల్లి రామానుజరావు ఒక రేఖ చిత్రం.
4- విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు.
5- వరంగల్ జిల్లా కథా సర్వస్వం.
6- మన కాంతిపుంజాలు (స్ఫూర్తి మూర్తుల జీవన రేఖలు)
వ్యాస -సంపుటాలు:-
1- విపంచి.
2- సాహితీ గవాక్షం
3- శ్రీ వ్యాసం.
4-సమూ.
5- మంచి మాట.
6- విశ్వనాథ రామకృష్ణ.
7- పొనుక.
8-విష్ణుపాద
9- పలుకు జెలి.
10- కావ్యాలోకనం (విహారి శ్రీపద చిత్ర రామాయణం.)
11- వెలుగుల గుత్తి.

కథా సంపుటాలు;—
1-సజీవ చిత్రాలు.
2- షుగర్లెస్ కాఫీ.
3- మా కిట్టమ్మ పెద్దాయి.

సుమారు 80 పుస్తకాలకు ముందుమాటలు;
సంపాదకత్వాలు-

వ్యాస సంకలనాలు:– 1-
1. నెమలికొండ బాలకిషన్ రావు కవితా దర్పణం;
2- ఏకశిలా వైతాళికులు;
3- కాలం వెంట నడిచి వస్తున్న…( న బారా
అభినందన సంచిక)
4- వరంగల్లు సాహితీ మూర్తులు;
5- తెలంగాణ సాహిత్య రూపాలు;
6- నిగమాంత సార సంగ్రహము (తాళపత్ర
గ్రంథము) పరిష్కరణ;
7- భాగవత దర్శనము ( జాతీయ సదస్సు
ప్రసంగాల సంకలనం)
8- అన్నమయ్య పద వైభవం ( జాతీయ సదస్సు (ప్రసంగాల సంకలనం.)
9- స్వయంభావకుడు ( పల్లేరు వీరాస్వామి అభినందన సంచిక )
10- రామాయణ వైభవం ;
11- సాహిత్యంలో మధురభక్తి;
12- వంశిమోహనమ్ శ్రీకృష్ణ సర్వస్వం
ఫిబ్రవరి వరకు శ్రీలేఖ సంస్థ నుండి150 పుస్తకాలు వెలువడ్డాయి.

పద్మజ :- మీ రచనల మీద ఎవరైనా పరిశోధనలు చేశారా?

శ్రీరంగ :— 2017లో మధురై యూనివర్సిటీలో మాధవి అనే విద్యార్థిని నా సాహిత్యం మీద ఎంఫిల్ చేసింది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఒక పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం వచ్చింది. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే శ్రీలేఖ సాహితీ ముద్రించిన కథా సంకలనాల మీద పిహెచ్డి సిద్ధాంత గ్రంథం వెలువడింది. ఇవే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సురేష్ నా జీవితం– సాహిత్యం మీద శ్రీ నిత్యానందరావుగారి దగ్గర పరిశోధన చేస్తున్నాడు.
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో విజయలక్ష్మి అనే అమ్మాయి కథా సంకలనాల మీద పీహెచ్డీ చేసింది. తిరుపతి యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు ఉన్నారు. అంతే కాదు నేను పరిశోధన చేస్తానని ముందుకు వచ్చిన కొంతమంది విద్యార్థులకు నేను వారి అంశం కోసం ఎంతో చేయూతనిచ్చాను. కామారెడ్డి నుండి ఒక అమ్మాయి వరంగల్ సాహిత్య పత్రికల సేవ అనే అంశం మీద పరిశోధన చేయాలనుకుని నా సలహా సంప్రదింపులను కోరింది దానికి వరంగల్ జిల్లా పత్రికారంగం అని నేను రాసిన వ్యాసం ఆమెకు చాలా ఉపయోగపడింది, అప్పటి పత్రికల గురించి నేను చెప్పితే ఆమె మరికొన్ని పత్రికల గురించి తెలుసుకొని వంద పత్రికల మీద పరిశోధన గ్రంథం రాసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది.
శతక సాహిత్యం మీద పరిశోధనా పత్రం కోసం ఒక విద్యార్థి వస్తే 400 శతకాలను నేను ఇచ్చాను. ఆయన 100 శతకాలతో వరంగల్ శతక సాహిత్యం మీద పరిశోధన చేశాడు. పరిశోధన కొరకు ఒక విద్యార్థి వస్తే ఆయన కోసం తగిన సహకారం అందించాను.
1980లో బాలకిషన్ రావు నేను కలిసి ప్రసారిక అనే ఒక పత్రికను స్థాపించాలనుకున్నాము. నేను పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాను కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ఇతర పనులు చేయొద్దని ఒక నిబంధన ఉండేది. అందుకే బాలకిషన్ రావును సంపాదకుడిగా నియమించి, పత్రికను ప్రారంభించాను. పని అంతా అతనే చూసుకునే వాడు. నేను గౌరవ సంపాదకుడిగా ఉండి పత్రికను ఎడిట్ చేయడం, మిగతా పనులన్నీ నేను చేసేవాడిని. అలా 40 సంవత్సరాల పాటు నడిపించాము. ప్రసారిక పత్రిక వెనుక నా కృషి ఎందరో గుర్తించారు. ఆ పత్రికలో వచ్చిన వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ స్థాయికి పత్రికను నడిపాము.

పద్మజ :— పత్రికల మీద మీ అభిప్రాయం ఏమిటి?

శ్రీరంగ:— పత్రికలు లేనిది రచయితలు; కవులు; ఇతర కళాకారులు ఉండరు. వారి గుర్తింపును పత్రికల ద్వారానే తెచ్చుకుంటారు. పత్రికల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చును. సామాన్య పాఠకులకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటు రచయితకు వెన్నుదన్నుగా ఉంటూనే, ఇటు పాఠకులను విజ్ఞానవంతులుగా చేస్తాయి పత్రికలు. ఒకవేళ మన రచనలు వేయకున్నా ఆ యా పత్రికలు మనకు శత్రువులు కారు!
వార్తయందు జగము వర్ధిల్లుచున్నది అని పంచమ వేదం చెప్పినట్టు పత్రికల వల్ల దేశకాల పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, సాహిత్య పత్రికలతో ఎంతో లాభపడేవారు ఉన్నారు. ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్న పత్రికలే మనకు ఆధారం.
శ్రీమతి కొండపల్లి నీహారిణి ఎంతో శ్రమ పడుతున్నది. పత్రికల ద్వారా ఎందరినో పరిచయం చేస్తున్నది. వారి మాటల్లో ఎన్నో విషయాలు పాఠకులకు తెలుస్తున్నాయి. ఈ విషయంలో ఆమెను ఎంత అభినందించినా తక్కువే!
పత్రిక స్థాయిని బట్టి అందులోని అంశాలను నవీకరించాలి! కొన్ని పత్రికలు కేవలం వ్యాపారాత్మకంగానే నడుస్తాయి. కొన్ని వార్తలకే ప్రాధాన్యతనిస్తాయి. కొన్ని సాహిత్యానికి ప్రాధాన్యత నిస్తాయి.
ఉదా॥ ఈనాడు పత్రిక ఒక శాతం సాహితి పాఠకుల కోసం ఎందుకు శ్రమించాలని సాహిత్య అంశాలను ప్రచురించదు. తెలుగు వెలుగు అనే ప్రత్యేకంగా సాహిత్యనికే కేటాయించారు. వేరే పత్రికలలో ప్రతి ఆదివారం ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తాయి. అది వారి వారి అభిరుచిని బట్టి నడుపుతారు. ప్రస్తుతం సాహిత్య పత్రికలకు కొరతైతే ఉంది. పత్రికలు ఉండడం వల్ల కవుల ఉనికి భద్రంగా ఉంటుంది. ఇప్పుడైతే అనేక మాధ్యమాలున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం పత్రికలే ఆధారం కదా? ఐనా ఎన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాలున్నా సాహితీ పంపిణీ జరుగుతుందేమో కానీ పత్రిక పట్టుకుని చదివిన సంతృప్తి కలగదు!

పద్మజగా నాలో నేను … వరంగల్లు సాహిత్య- జీవితంలో నిలిచిన టి. శ్రీరంగ స్వామి గారు ఎన్నో ఒడిదొడుకుల నెదుర్కొని, అక్షరాన్ని బతికించుకోవలే తపనతో బహుముఖీన సాహితీసేవలందిస్తున్న సాహిత్యాభిమానుల సేవలు ఎనలేనివి.
తెలంగాణ సాహితీ ప్రక్రియలు వసివాడి పోకూడదనే సదుద్ద్యేశ్యంతో సమాజంలో మరుగున పడిన మాణిక్యాల వెలుగులు మరోసారి విరజిమ్మచేసారు. లేకపోతే తాళ పత్రగ్రంథాలన్నీ ఎక్కడో పాతాళానికి పడిపోయాయి… వాటిని పైకి తెచ్చిన ఘనత?దక్కించుకున్నారు.
ఎప్పుడైనా సాహిత్య చింతన ఉన్నవారు తనకోసం-సమాజం కోసం ఆలోచిస్తారు కదా? దానికోసం పాటుపడిన శ్రీరంగస్వామి అభినందనీయులు…
మయూఖ ద్వైమాసిక పత్రిక ద్వారా వారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ…
అలుపెరుగని సాహితీ కృషీవలుడు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలనీ, మరింత మంది యువకవులను రాణింపులోనికి తెస్తూ సారస్వత పూజ చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ …
పరిపృచ్ఛ చేసే అవకాశం కల్పించిన మయూఖ సంపాదకురాలైన శ్రీమతి కొండపల్లి నీహారిణి గారికి మనఃపూర్వకమైన ధన్యవాదములతో…

January 9, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

నవంబర్ మయూఖ విషయసూచిక

by mayuukha November 30, 2025
written by mayuukha

1. భూతం ముత్యాలు గారి ఇంటర్వ్యూ- by వేముల ఎల్లయ్య

2. జ్ఞానగుళిక -1 పలకల నుంచి పలుకుల వైపు    By నరేశ్ చారి

3. జ్ఞానగుళిక -2 ఏకధార                       by నరేశ్ చారి

4. అనువాద సాహిత్యం –             ఒక బంగారు చేపకథ       by ఒద్దిరాజు మురళీధర రావు

5. ఇక్కడ లేనప్పుడు కవిత                                by తండ హరీష్

6. సిద్ధార్థుని కథ….                                             by డా. అరుణ పరంధాములు

7. ఆటవెలది పద్యం –                                          by మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల

8. కార్తీక పౌర్ణమి విశిష్టత –                                   by మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల

9. The cruise – ఓ దృశ్యప్రయాణం                       by ఇంద్రాణి నెల్లుట్ల

10. అధునాతన సనాతన సింగాణం… భేరి సునీతా రామ్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ by రంగరాజు పద్మజ

11. డా. లింగం నేని మహేష్ కుమార్ డాన్సర్       – అచ్యుతుని రాజ్యశ్రీ

12.  సూక్ష్మ నిర్మాణాల యువ కళాకారుడు         షేక్ హజి

13. వందేమాతర చరిత్ర                                       by రూప

14. గాయని సుశీలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు           by రూప

15. కాటుక కంటినీరు                                          by విజయ కందాళ

16. రెబ్బాప్రగడ రామబ్రహ్మం గారి భక్తిపాటలు       by అచ్యుతుని రాజశ్రీ

18. ప్రమాదం అంచుల్లో సంపాదకీయం

19. జీవన మాధుర్యం – ధారావాహికం – లక్ష్మమదన్
20. కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు- నరేందర్ నందినేని
21. వ్యక్తిత్వానికి దోహదపడే వ్యాసాలు రావాలి – డాక్టర్ చిమ్మపూడి శ్రీరామమూర్తితో ముఖాముఖిలో 22. పడమటి కొండమీది రవి – ప్రగాఢ భావ కవి – రమేశ్ నల్గొండ
23. అస్తమించని ఓ ఊరిదుఃఖం ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ – పుస్తక సమీక్ష – ఎన్. లహరి
24. గాయపడిన గుండెకు కవితా ఉపశమనం – పుస్తక సమీక్ష – ఎన్ లహరి
25. చాయి గిన్నె కష్టాలు – కథ- లక్ష్మీమదన్
26. తెలుగు జాతీయాల సొగసు – చంద్రకళ దీకొండ
27. భార్యభర్తల బంధం – కవిత – డాక్టర్ అరుణ పరంధాములు
28. నామమహిమ – తాతా కామేశ్వరి

ఇంకా మరికొన్ని

November 30, 2025 67 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us