మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

నమ్మకం

by Nellutla Madhava Srinivas May 31, 2026
written by Nellutla Madhava Srinivas

ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి వ్యక్తి భగవంతుడు ఏదైనా చేయగలడు అని అంటాడు. రెండవ వ్యక్తి ఏదైనా చేయగలడు అని అంత గట్టిగా చెప్తున్నావు ఏంటి నీకు ఆయన మీద అంత నమ్మకం అని అడుగుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక చిన్న కథ చెప్తా విను తర్వాత నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది అని కథ చెప్పటం మొదలు పెడతాడు.
ఒక ఊళ్లో ఒక చెప్పులు కుట్టుకునే వాడు ఉంటాడు. అతడు తన పని తాను చేస్తూ కూడా ఆ శివ నామస్మరణ అనుక్షణం చేస్తూ ఉంటాడు. అదే ఊర్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ధనవంతుడవటం చేత ఎన్నో రకాల పూజలు, దానధర్మాలు చేస్తూ అందర్నీ పలకరిస్తూ సరదాగా మాట్లాడుతూ అందరూ తనను పొగుడుతూ ఉంటే సంతోష పడిపోతూ ఉంటాడు. అటుగా వెళుతూ ఈ ఇద్దరిని చూసిన నారద మహర్షి ఆ శివుడి దగ్గరికి వెళ్లి ప్రణామములు తెలియజేసి నాకు ఒక సందేహం శివయ్య. అది నువ్వైతేనే తీర్చగలవు అని అంటాడు. ఏంటో చెప్పు అని ఆ శివుడు అడగగా….. ఆ నారద మహర్షి శివుడితో నువ్వు చూస్తున్నావు కదా కింద ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పు ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ శివుడు చెప్పులు కుట్టే అతనికి అని చెప్తాడు. అదెలా ఆ ఇంకో వ్యక్తి కూడా అనేక రకాల పూజలు దానధర్మాలు చేస్తాడు కదా మరియు చెప్పులు కుట్టుకునే వ్యక్తి అవేమీ చేయకపోగా నీ నామస్మరణతో కాలక్షేపం చేస్తున్నాడు కదా అంటాడు. అయితే ఒక పని చెయ్యి నేను ఒక మాట చెప్తాను దానిని తూ.చా తప్పకుండా వారితో చెప్పు ఎవరు ఏం సమాధానం చెప్తారో దానిని బట్టి ఎవరికి పుణ్యం ఇవ్వాలో నిర్ణయిద్దాం అని అంటాడు. నారద మహర్షి సరే అని శివుడు చెవిలో చెప్పిన విషయాన్ని మారువేషంలో ముందుగా సంపన్నుడి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తాడు. ఓయ్ పెద్దమనిషి నేను ఆ శివయ్యను చూశాను తెలుసా అని చెప్తాడు. ఓ!!! అవునా. శివయ్య ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు వెటకారంగా. శివయ్య సూది బెజ్జం లో నుండి ఏనుగును దూరుస్తున్నాడు అని సమాధానం చెప్తాడు మారువేషంలో ఉన్న నారద మహర్షి. చాలు చాలు లేవయ్యా సూది బెజ్జం లో నుండి ఏనుగును దూర్చడమేంటి వెటకారంగా ఉందా అని కసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాస్త ముందుకెళ్లి ఇదే విషయాన్ని చెప్పులు కుట్టుకునే వాడితో చెప్తాడు. చెప్పులు కుట్టుకునే వాడు చాలా సంతోషంగా అవునా!!! అయినా నా శివయ్య ఏదైనా చేయగలడు అని అనుకుంటూ తన పనిలో తాను నిమగ్నమై శివనామ స్మరణ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నారద మహర్షి నీకు నేను చెప్పిన విషయాన్ని విన్న తర్వాత కోపంగానీ ఆశ్చర్యం కానీ కలగలేదా అని అడుగుతాడు నారద మహర్షి. లేదయ్యా ఆ రెండు కలగటానికి ఆయన మనలాగా మామూలు మనిషి కాదు కదా!!!! అంటూ పక్కనే చెట్టు మీద నుండి రాలి పడిన మర్రి పండును ఒక దాన్ని తీసి మారువేషo లోఉన్న నారదమహర్షికి చూపిస్తూ ఇంత చిన్న పండు లో నుండి ఇంత పెద్ద వృక్షాన్ని సృజించగలిగిన నా తండ్రి సూది బెజ్జ ం లోనుండి ఏనుగును తీయలేడా??? ఇంత చిన్న విషయానికి ఆశ్చర్యం ఎందుకు???? ఆయన ఏదైనా చేయగలడు. మనకు కావాల్సిందల్లా ఆయన మీద నమ్మకం మాత్రమే అని తన పని తాను చేసుకుంటాడు. ఈ సమాధానం విన్న నారద మహర్షి శివుడి దగ్గరికి వెళ్లి నిజమే స్వామి మీరు చెప్పింది అని ప్రణామాలు చేసి వెళ్ళిపోతాడు.
మనం కూడా చాలాసార్లు మనకు దైవం మీద నమ్మకం లేకపోయినా అలవాయితీగానో అలవాటుగానో ఇష్టం లేకపోయినా ఆడంబరాలకు పోయి పొగడ్తలకు లొంగిపోయి చాలా పనులు చేస్తుంటాం. కానీ ఆ పరమేశ్వరుడికి కావలసింది తన పైన నమ్మకం పెట్టుకోవటం, భగవంతుడు మీద ప్రీతి కలిగి ఉండటం . దేవుడి మీద భారం వేసి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చటమే ఆయన పని. తనపైన నమ్మకం పెట్టుకున్న వారిని అనుక్షణం కాపాడటం భగవంతుడు ప్రధమ కర్తవ్యం గా భావిస్తాడు. అందుకే మనం ఏ పని చేసినా అంతా మనదే గొప్ప అని గొప్పలకు పోకుండా ఆ భగవంతుని తలుచుకొని చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తాం. అప్పుడప్పుడు చిన్నచిన్న ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి.ఇక ఎదురయ్యే ఆటంకాల గురించి అంటారా అవి మన కర్మఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే.

సర్వేజనా సుఖినోభవంతు

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కష్టపడితేనే ఫలితం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, May 31, 2026
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురం లో శరభయ్య అనే  ఒక రైతు ఉండేవాడు.  అతడు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు .  అతనికి రవి అనే ఒక కొడుకు ఉండేవాడు.  అతన్ని చదివించి గొప్ప వానిగా చేయాలని శరభయ్య  ఆశ. 
        రవి మొదట చదువు మీద ఆసక్తి చూపినా  అటు తర్వాత మిత్రులవల్ల అతనికి చదువు మీద ఆసక్తి సన్నగిల్లింది.   అతడు పదవ తరగతి పూర్తి చేసిన పిదప అతనిని శరభయ్య డబ్బు కట్టి ఒక పేరు మోసిన కళాశాలలో చేర్పించాడు .  కానీ రవి చదువు మీద శ్రద్ధ చూపకుండా ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకోసాగాడు.  శరభయ్య కు ఆ కళాశాల వారు  రవి చదవడం లేదని మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయని కబురు అందించారు.   ఈ విషయం విని శరభయ్య చాలా బాధపడ్డాడు . 
         ఒకసారి దసరా సెలవులకు రవి ఇంటికి వచ్చాడు.  శరభయ్య  తన వెంట రవిని వ్యవసాయ పనికి తీసుకొని వెళ్ళాడు.   అక్కడ అతన్ని తనతో పాటు పని చేయమన్నాడు .  కానీ రవికి ఆ పని ఎంత కష్టమో తెలిసి వచ్చింది. అయినా తండ్రి మాట కాదనలేక అతడు చెప్పిన పనల్లా చేసాడు. 
        అలా వారం రోజులు గడిచాయి .  రవికి ఈ వ్యవసాయం కన్నా తాను చదువుకోవడమే ఉత్తమంగా అనిపించింది.   చదువు మీద తనకు కూడా ఆసక్తి ఉంది.  కానీ అనవసరంగా  తాను ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకొని చదువును నిర్లక్ష్యం చేస్తున్నానని అతనికి అనిపించింది. తండ్రి కష్టం చూసిన తర్వాత తన పద్దతిని మార్చుకోవాలని రవి భావించాడు.  
           శరభయ్య కుమారునిలో వచ్చిన  మార్పును గమనించాడు.   అతడు రవితో “ఒరేయ్ ! మేము అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాం .  పంట ఒకసారి వస్తున్నది. మరోసారి రావడం లేదు.   చివరికి ఎప్పుడైనా దేవుడు ఆదుకోకపోతాడా అని వ్యవసాయం  వృత్తిగా భావించి జీవిస్తున్నాం .  నలుగురికి కడుపు నింపుతున్నామన్న సంతృప్తి మాలో ఉంది.  నీవు మందమతివి కూడా కావు.  మరి నీకు  వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగితే అదే చెయ్యి.  అదేం తక్కువ కాదు.    రేపు భార్యాపిల్లలను పోషించాలంటే  నీవు ఏదో ఒక పని చేయాలి కదా !”అని అన్నాడు. 
       అది విన్న రవి ” నాన్నా!  నాకు వ్యవసాయం చేయడం  కన్నా చదవడమే ఉత్తమంగా అనిపిస్తున్నది .  కష్టపడనిది ఏదీ సాధించలేమని నాకు అర్థమైంది .  అందుకే రేపటినుండి కష్టపడి చదివి ఈ వ్యవసాయంలో పరిశోధనలు చేసి కొత్త కొత్త పద్ధతులు కనిపెడతాను” అని అన్నాడు.   ఆ మాటలకు తండ్రి ఎంతో సంతోషించాడు. 
        ఆ తర్వాత కళాశాలకు వెళ్లిన రవి బాగా చదివి మంచి మార్కులతో  ఉత్తీర్ణత సాధించాడు.  తర్వాత అతను  వ్యవసాయ శాస్త్రాన్ని చదివి కొత్త కొత్త పద్ధతులు వ్యవసాయంలో తెలుసుకొని రైతులకు దిగుబడి ఎక్కువ వచ్చే మార్గాన్ని  తెలుసుకున్నాడు.  ఆ తర్వాత తన తండ్రితో పాటు ఇతర రైతులకు వ్యవసాయం లోని కొత్త కొత్త పద్దతులను తెలిపాడు. చదువు అంటే ఆసక్తి లేని  తన మిత్రులకు రవి  వ్యవసాయం చేయమని ప్రోత్సహించాడు.    తన కొడుకు ప్రయోజకుడు అయినందుకు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు.  ఆ తర్వాత కొన్ని రోజులలోనే అతను ఒక మంచి కొలువును కూడా సంపాదించాడు.  అందుకే పిల్లలూ! ఎందులో నైనా  కష్టపడనిదే ఫలితం రాదని గ్రహించాలి. 

    May 31, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    కాకతీయులు – పద్మనాయకులు (వెలమలు)

    by డా॥ గండ్ర లక్ష్మణరావు May 31, 2026
    written by డా॥ గండ్ర లక్ష్మణరావు

    భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధమైన అధ్యాయం కాకతీయ సామ్రాజ్యం. క్రీ.శ.1150 నుండి క్రీ.శ.1323 వరకు కాకతీయులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి పాలన తూర్పున కంచివరకు, దక్షిణాన కళింగం వరకు ,పడమర గోదావరి(పొలాస), కోటగిరి, కర్ణాటకలో బీదర్  వరకు విస్తరించి ఉంది. ఆయా రాజుల కాలాలలో కొన్ని స్వతంత్రించి, కొన్ని సామంతులుగా అధీనమై కన్పడినా సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 200 సంవత్సరాలు కాకతీయులు పాలించారు. గ్రామాలు మొదలుకొని పట్టణాలు, రాజధాని దాకా పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేశారు. వ్యవసాయం, వ్యాపారం, వ్యవసాయసంబంధ వృత్తులను కాపాడడం తో పాటు సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్ప కళలను పోషించారు. కోరిన పొరుగు రాజులకు సహాయంగా నిలబడ్డారు. చెరువులు తవ్వించారు. వేయిస్తంభాల, పాకాల రామప్ప వంటి గొప్ప కళాఖండాలను నిర్మింపజేశారు. ఓరుగల్లులో కోటలను  నిర్మించారు. గొప్ప యుద్ధనైపుణ్యం, రాజనీతి చాతుర్యం, పరిపాలనా ప్రాభవం కలిగి అనేక మార్లు ఉత్తర భారతదేశం నుండి తురుష్కుల దండయాత్రలను ఎదుర్కొన్నారు. స్వయంగా రాజముద్రలుండేవి. నాణెములు మొదలైనవి ఉండేవి.

                       సుదీర్ఘమయిన, సుప్రసిద్ధమైన కాకతీయుల పాలనలో అత్యంత ప్రధానమైన పాత్రను నిర్వహించినవారు నాయంకరులు. వీరికి నాయకులు అనికూడా పేరు. ఈ నాయకులు కాకతీయ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడంలో, అనేక దండయాత్రలలో విజయం సాధించి పెట్టడంలో ప్రధానమైన పాత్రలను నిర్వహించారు. ధైర్యసాహసాలకు, విశ్వాసపాత్రతకు వీరు మారుపేరుగా నిలబడ్డారు. వీరి శౌర్యధైర్యాలను , విశ్వసనీయతను గమనించిన కాకతీయ ప్రభువులు రుద్రదేవుడు మొదలుకొని గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన రాజులందరు ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చి ప్రశంసించారు.

                        రేచర్ల బేతిరెడ్డి లేదా బేతాళనాయకుడు ప్రథముడుగా కనిపిస్తాడు.  రేచడు అనే మాలవాడు చేసిన త్యాగానికి గుర్తుగా రేచర్ల అని వంశానికి పేరుపెట్టుకున్నట్లుగా వెలుగోటి వంశావళి అనే కావ్యం ద్వారా తెలుస్తున్నది. రేచర్ల బేతాళనాయకుని  ధైర్యసాహసాలను గురించి తెలుసుకొని గణపతి దేవుడు రాజధానికి పిలిపించి ఉన్నతోద్యోగం ఇచ్చిఆదరించాడు

                       చెవ్విరెడ్డిని చూడ చేకొని పిలిపించి / యాదరంబొదవంగ నతని జూచి

                       అసహాయ శూరుడౌ నని యాత్మ దలపోసి / చెన్నుమీరగ లక్ష సీమ నిచ్ౘ్ె

                       డాలు డమారంబు తాళిచేపట్లును / గజహయంబుల నిచ్ౘ్ె ఘనత తోడ

                       హెచ్ౘ్ుగా నాతని మెచ్ౘ్ి పిల్లల మఱ్ఱి / బేతాళ రావని పేరొసంగ

                       అదియు మొదలుగ జనులెల్ల నబినుతింప

                       రమణతోడుత విలసిల్లె రావు పేరు

                       వాసికెక్కిన రేచర్ల శాసనుండు

                       దనరె పిల్లలమఱ్ఱి బేతాళుడనగ  ( వెలుగోటి వారి వంశావళి )

             అప్పటి నుండి ఆతని వారసులు కూడా కాకతీయ రాజుల వద్ద అనేక రకాల పదవులు నిర్వహించి రాజ్యసుస్థిరతకు రాజుల రక్షణకు కారకులయ్యారు.

              గణపతి దేవుని తండ్రి మొదటి ప్రతాపరుద్రుడు అనుమకొండకు చుట్టుపట్లగల మండలాదీశ్వరులను జయించి అప్పటి తన విజయమును తన తండ్రి రెండవప్రోలరాజు జయముల నుల్లేఖించుచు తాను తనపేర నిర్మించిన రుద్రేశ్వరాలయమున శాసనము( శా.శ.1084 చిత్రభాను సం.మాఘ శు త్రయోదశి, శనివారం) ను వేయించిన శాసనం ప్రకారం తన సైన్యమునందు సేనాపతుల ధైర్యసాహసకార్యముల వినుతించుచు ఉన్నత పదవులందు పద్మనాయకులు కలరని, తన తండ్రి సేనాని రేచర్ల కామయ తనకు బాసటగా నిలచినాడని పేర్కొన్నారు.” ( పద్మనాయక చరిత్ర , కోటగిరి వేంకట నరసింహ సత్యనారాయణరావు . పుట 75). దీనిని బట్టి గణపతిదేవునికన్న అప్పుడు బేతాళరావు అనే పేరు రేచర్ల అని రేచడి కారణంగా వచ్చిన పేరు గణపతిదేవుని కాలమందే కాక ముందే ఉన్న జరిగిన సంఘటన  అయి ఉండాలి. ముందునుంచి రేచర్ల వారు కాకతీయులతో కలిసి ఉన్నారని తెలుస్తున్నది. 

                       రేచర్ల బేతాళరావు కుమారులు ముగ్గురు. దామా, ప్రసాదిత్యుడు, రుద్ర. వీరు ముగ్గురు వీరాదివీరులై కాకతీయ రాజుల వద్ద గొప్ప పదవులను నిర్వహించారు.   గణపతి దేవుని తదనంతరం రుద్రమ దేవి రాజసింహాసనం అదిష్టించవలసి వచ్చింది. కాని స్త్రీలు రాజ్యపాలనకు యోగ్యులు కారనే నెపంతోను, రాజకుటుంబాలలోని అంతఃకలహాలకారణంగాను, సామంతుల వ్యతిరేకత కారణంగాను ఆమెను సింహాసనం అదిష్టించకుండా అవరోధాలు ఏర్పడ్డాయి. అందులో రేచర్ల బేతిరెడ్డికి ముగ్గురు కుమారులు. దామా, ప్రసాదాదిత్య, రుద్ర. వీరిలో ప్రసాదాదిత్యుడు రుద్రమదేవి సింహాసనానికి వచ్చిన కాలనికి వీరుడుగా రూపొంది ఉన్నాడు. ఆనాటి పరిస్థితులను గమనించి ప్రసాదాదిత్య ఈ అలజడులకు కారణమైన సామంతులను, అంతఃపుర కలహాలకు కారణమైన వారిని తన నైపుణ్యంతోను, శూరత్వంతోను కొందరిని బుజ్ౙగించి, కొందరిని ఒప్పించి , కొందరిని బెదరించి రుద్రమ దేవికి ఆటంకం రాకుండా చూశాడు. రుద్రమదేవి సింహాసనం అదిష్టించడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు ప్రసాదాదిత్యుడు. అందుకే అతనికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాజ్యపితామహాంక వంటి బిరుదులు రుద్రమదేవి ప్రదానం చేసి సత్కరించింది.అంతే కాదు విజయ సూచకంగా అతని కాలికి విజయఘంట వలె అందె వేసి గౌరవించింది.“ ఆ ప్రసాదాదిత్యుండు కాకతి గణపతి దేవరాయలు చనిన, నతని కొమరిత రుద్రము దేవని బట్టము గట్టి కాకిత రాజ్యస్థాపనాచార్య బిరుదును, రాయపితాంక మహా బిరుదును పొంది డెబ్బడి యేడ్గురు నాయంకరుల దానొనర మించి భైరవ ప్రసాదలబ్ధంబగు పచ్చధరియించి నెగడె”  – వెలుగోటి వారి వంశావళి.

               ప్రసాదాదిత్యుని కారణంగానే రుద్రమ దేవి పాలనలో 77 గురు నాయంకరులను  రాజ్య రక్షకులుగా ఏర్పాటుచేసింది. నాయంకరులు అనేది నాయకుడు వంటిది. ఆయా ప్రాంతాలకు నాయకులుగా నియమించడం కావచ్చును. మరొక అబిప్రాయం ప్రకారం కాకతీయ కోటకు 77 బురుజులుండేవని ఒక్కొక్క బురుజునకు ఒకరు చొప్పున 77 గురు రక్షకులను నియమించింది. అయితే ఈ 77 గురు పద్మనాయకులే. పద్మనాయకులకు వెలమ అనే పేరుకూడా స్థిరపడింది. వెలమనాయకులు అని కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే వెలి మల నుండి ( వింధ్యపర్వతం అవతలి నుండి వచ్చిన వారు) అనే అర్థంలో ఈ పదం వచ్చిందని, వెలుగోటి వారు అనే వంశం పేరుతో వెలమ అని ఏర్పడి ఉండవచ్చుననీ, అబిప్రాయాలున్నాయి. పద్మనాయకులు, వెలమలు పర్యాయ పదాలుగానే అప్పుడు ఇప్పుడు వ్యవహారంలో ఉంది.

                       77గురు నాయంకరులు కెోట రక్షకులైనా, రాజ్యరక్షకులుగానే తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ నాయంకర వ్యవస్థను ప్రతాపరుద్రుడు క్రీ.శ.1279 ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు ప్రతాప చరిత్ర వల్ల తెలుస్తున్నది.సిద్ధేశ్వర చరిత్రకు పీఠిక రచించిన ఖండవల్లి బాలేందుశేఖరం గారు ఇచ్చిన వివరాలు,

    పద్మనాయకులు 77, ఒక్కొక్క నాయకునకు సైన్యం 1500, ఉత్తమాశ్వములు 100, ఏనుగులు 10 , రాజ్యభవన సంరక్షణకు సుశిక్షితులైన సైనికులు 9000, మొత్తము అశ్వములు 24000,ఏనుగులు  2500 ఈ సేనావాహినులకు డెబ్బదియేడుగురు పద్మనాయకుల నాయకుల గావించినట్లు సిద్ధేశ్వర చరిత్ర, వచన సోమరాజీయము మొదలగు గ్రంథములందు చెప్పినారు ”. రుద్రమ దేవి కాలంలో కోట రక్షకులుగా ఉన్న నాయకులు ప్రతాపరుద్రుని కాలంలో నాయక వ్యవస్థ ను నిర్వహించి ఉండవచ్ౘ్ునని ఊహించవచ్చును. ప్రసాదాదిత్యుని అన్న దామ నాయకుడు, తమ్ముడు రుద్రనాయకుడు కూడా వీరి పాలనలో యుద్ధాలలో పాల్గొన్నారు.

                       గణపతి దేవుని తండ్రి మహాదేవుడు మరణించినపుడు గణపతి దేవుడు చిన్నవాడని, అంతఃకలహాలు చెలరేగి గణపతిదేవుని రాజును కాకుండా  చేసే ప్రయత్నాలు జరిగాయని అయితే రేచర్ల రుద్రుని రాజనీతిజ్ఞత , మల్యాల చౌండ సేనాపతి సహాయంతో గణపతి దేవుని కాకతీయ సింహాసనం అదిష్టింపజేసిందని, అందుకు గణపతి దేవుడు అతనికి మాండలిక హోదానిచ్చి తగిన రాజచిహ్నాలు, జతకౌడీలు మొదలైనవి ఇచ్చి గౌరవించాడని  తెలుస్తున్నది. అంతేకాదు రేచర్ల రుద్రుడే చాళుక్యరాజులలో ఒకరైన నాగతిరాజును భ’ద్రాచలం ప్రాంతానికి తరిమివేసి ఆ భాగాన్ని కాకతీయ సామ్రాజ్యం లో కలిపివేశాడని అతనికి కాకతి రాజ్య సమర్థ, కాకతీయ రాజ్య భార ధౌరేయ అనే బిరుదులున్నాయని రుద్రసేనాని మంత్రి అయిన రాజనాయకుడు వేయించిన ద్రాక్షరామ, ఉప్పరపల్లి శాసనాలు పేర్కొన్నాయి . ( కాకతీయులు.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి ). అయితే ఈ రుద్రుడు చెవ్విరెడ్డి కుమారుడైన రుద్రుడా? లేక రేచర్ల రెడ్డి రుద్రుడా అనే విషయంలో కొంత అస్పష్టత ఉంది. పరబ్రహ్మ శాస్త్రి గారి విశ్లేషణ ప్రకారం రేచర్ల  రెడ్డి వంశీయులు, రేచర్ల వెలమ వంశీయులు ఉన్నారని చూపారు. రేచర్ల అన్న పేరు వంశనామంగా బేతాళనాయకునికే ( చెవ్విరెడ్డి) అతని దగ్గర పనిచేసే రేచడు అనే అతడు తనకు భూమిలో దొరికిన నవలక్ష ధనరాశిని పొందడానికి  స్వయంగా బలిదానం చేశాడని, ఆకారణంగానే చెవ్విరెడ్డి వంశం పేరు అతనికి కృతజ్ఞతగా రేచర్ల అని పెట్టుకున్నారని వెలుగోటి వారి వంశావళి స్పష్టంగా తెలుపుతున్నది. రేచర్ల వంశనామంతో రెడ్డి కులస్తులు కాక చెవ్విరెడ్డికి రెడ్డి అని ఉన్నట్లుగా రావు బిరుదు రాకముందు రెడ్డి అనే వ్యవహారం ఉండి ఉండవచ్చునని భావిస్తే రేచర్ల వంశంలో వెలమ, రెడ్డి అనే వారిద్దరు ఉండరు. అయితే పరబ్రహ్మశాస్త్రిగారు రెండు వంశ వృక్షాలు కూడా చూపించారు. రేచర్ల వారిలో రెండు కుటుంబాలు క్రమంగా పెరిగి రెండు వంశవృక్షాలు కావచ్చును. రావు బిరుదు అందరూ ఒకసారి వాడుకొని ఉండకపోవచ్చు. అంతమాత్రాన రేచర్ల వారు రెడ్లు వెలమలు అని వేరు వేరు లేరు. ఇప్పటికీ వెలమ వారే రేచర్ల గోత్రంతో సుప్రసిద్ధులుగా ఉన్నారు. ఇది మరింతగా పరిశోదించవలసిన అంశం.

                                 “ వా లని బెఱకిన పరభూ

                                   పాలస్త్రీభూషణములు పాసి పడును నీ

                                   వా లావనితల తొడవుల

                                   కీలా? రేచర్ల రుద్ర కీర్తి సముద్రా!” -వె.వం.19 వ పద్యం

    శత్రువుల భార్యల భూషణములు తొలగించువాడనగా వారి భ’ర్తలను వధించువాడని అర్థంలో రేచర్ల రుద్రుని వీరత్వాన్ని గురించి పొగిడిన పద్యం ఇది. ఈ రుద్రుడు ప్రసాదాదిత్యుని సోదరునిగురించియే ఉన్నది.

              ప్రసాదాదిత్యుని అన్న దామ కుమారులు వెన్నమనాయుడు, సబ్బినాయుడు. 14 వ శతాబ్దం మొదటి పాదంలో వీరు చాలా ప్రశస్తిని పొందినారు. మహమ్మదీయులు జరిపిన దాడుల సందర్భంగా వెన్నమనాయుడు ఎదురొడ్డి మట్టి కరిపించాడు. ఢిల్లీ సుల్లానులు ఖిల్జీ, తుగ్లక్‌లు కాకతీయులపై ఎన్నో మార్లు దండయాత్రలు జరిపించారు. చరిత్ర ప్రకారం ఐదుసార్లు జరిపిన వివరాలు మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిసారి పూర్తిగా విఫలం చెంది వెనుతిరిగినారు. మాలిక్ ఫక్రుద్దీన్ జునా, మరియు మాలిక్ జకరా, అనే వారి నాయకత్వంలో సైన్యాన్ని కాకతీయుల పైకి పంపించాడు. ² అల్లాఉద్దీన్ ఖిల్జీ. క్రీ.శ.1303 లో జరిగినట్లు చరిత్రకారుల అంచనా. ఇందులో వెన్నమనాయుడు వారిని ఎదిరించి పోరాడినా విజయం సాదించలేదనే అబిప్రాయం ఉంది. అప్పుడు ప్రకృతి అనుకూలించలేదు. వర్షాలు కురవడం యుద్ధానికి భంగం ఏర్పడింది. అయినా శత్రువులు కాకతీయ సామ్రాజ్యంలోకి అడగుపెట్టకుండానే వెనుదిరిగిపోయారు. ఇది విజయంగానే భావించాలి.

                       వెన్నమనాయుడితో పాటు పద్మనాయకులలో పైశాల వంశీయుడైన పోతుగంటి మైలి ( మల్లి ) ఉప్పరిపల్లి వద్ద మాలిక్ కాఫర్ జరిపిన దండయాత్రలో బీకర పోరాటం చేసి వారిని తరిమికొట్టినాడు. ఉప్పరపల్లి కరీంనగర్ జిల్లాలో ఉంది. మాలిక్‌కాఫర్ సైన్యం ఇక్కడిదాకా చొరబడింది. అయినా విజయం సాదించలేదు మాలిక్‌కాఫర్. ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని వశం చేసుకోలేదు. క్రీ.శ.1309లో మాలిక్‌కాఫర్ తిరిగి దండయాత్ర చేశాడు. ఈ సారి ప్రతాపరుద్ర చక్రవర్తి పదే పదే దాడుల వల్ల విసిగిపోయి కావచ్చు ,ఢిల్లీ సుల్తానులతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అది ఆయన మరణాంతం వరకు కొనసాగింది. అయితే ఒక సారి ఢిల్లీ సుల్తాన్ సమక్షంలో పోతుగంటి మైలికి, తెలుంగు బిజ్ౙలుడు అనే అతనికి ద్వంద్వయుద్ధం ఏర్పాటు చేశారు. అక్కడ కాకతీయుల 77గురు నాయకులు కూడా ఉన్నారని ఈ ద్వంద్వయుద్ధంలో పోతుగంటి మైలి విజయం సాదించి 77గురు నాయకులతో తిరిగి వచ్ౘ్ాడని తెలుస్తున్నది. డిల్లీ సుల్తానుకు కప్పము చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగి ఉంటుందని చరిత్రకారుల అబిప్రాయం.ఈ పోతుగంటి మైలికి ‘ వైరి గజబీమ, తెలుగుబిజ్ౙలు మణిమూపుర తలాట రాయా” అనే బిరుదులతో కాకతీయ రాజులు సత్కరించారు.

                       వెన్నమనాయకునికి ఎఱదాచ, సబ్బినాయనికి నలదాచ కుమారులు. ఇందులో  ఎఱదాచ ప్రతాపరుద్రుని ఆదేశంతో కంచి సమీపంలో పాండ్యులతో తలపడి కంచిని కాకతీయుల వశమయేటట్టు చేశాడు. పాండ్యరాజుల 9 లక్షల సైన్యాన్ని ఎదిరించి, వీరపాండ్య, విక్రమపాండ్య, పరాక్రమ పాండ్య, సుందరపాండ్య, కులశేఖర పాండ్య అనే అయిదుగురిని ఓడించినాడు. ఈ విజయాలపట్ల సంతసించిన ప్రతాపరుద్రుడు ఎఱదాచను అమితంగా గౌరవించి ‘ పాండ్యదళ విƒ’వ’ పాండ్య గజకేసరి; అనే బిరుదులతో సత్కరించాడు. కంచిలో అంతకుముందునుంచి ఉన్న పాండ్యులు చాలాకాలం గణపతి మహారాజుకు సామంతులుగా కప్పం చెల్లించేవారు. కాని క్రమేణా స్వతంత్రించారు. నెల్లూరు (విక్రమసింహపురి) చోళులకు వీరికి తరచు యుద్ధాలు జరుగుతుండేవి. బహుశ వీరినుండి కాపాడడానికే మహాకవి తిక్కన గణపతి మహారాజుదగ్గరకు రాయబారానికి వచ్ౘ్ి ఉంటాడు. తదనంతర కాలంలో ప్రతాపరుద్రుడు నెల్లూరుకు అదిపతిగా పరిపాలన కొనసాగిస్తున్న ముప్పిడినాయకుని కంచిపాండ్యులపైకి పంపించాడు. కంచి ని వశం చేసుకోవడానికి ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్న తిరుగుబాటు నాయకులలో ఒకరైన కోటతిక్క అనే అతడు , కొద్దిరోజులు మాత్రమే తనకు తాను రాజుగా ప్రకటించుకున్న కేరళ రాజు  రవివర్మ లు పాండ్యుల దాడులలో ఓడిపోతూనే ఉన్నారు. ముప్పిడి నాయకుడు తోడుగా పద్మనాయకుల సైన్యంతో దాడి చేసి కోటతిక్కను తరిమికొట్టారు. క్రీశ.1322 నాటి ద్రాక్షారామంలో దొరికన  ప్రచురితం కాని ఒక శాసనం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఈ శాసనాన్ని ముప్పిడి నాయకుని కుమారుడు పెద్ద రుద్ర వేయించినట్లుగా ఉంది.

                       చిత్తూరు జిల్లా నారాయణ వనంలో హోయసల భ’ల్లాణుడు అనేవాడు, పాండ్యులపై తిరుగుబాటు చేసే కోటతిక్క ఒక్కటై నారు. పాండ్యులు కూడా కాకతీయులను తరిమివేయడం కోసం మారురూపాలలో సైన్యాన్ని ప్రవేశపెట్టింది. కాని ఈ విషయాలను పసిగట్టిన కాకతీయులు ముప్పిడినాయకునికి ఆదేశాలు ఇచ్ౘ్ారు. ఆయన ఎఱదాచను ససైన్యంగా పంపించారు. పాండ్యులు పంపిన మారురూపంలో ఉన్న సైన్యాన్ని , హోయసల భల్లాణుడి, కోటతిక్కను అందరినీ ఓడించాడు. పాండ్యులకు చెందిన గజదళాలను కైవసం చేసుకున్నాడు. ముప్పిడినాయకుడు, ఎఱదాచలు కంచిపట్టణానికి కాకతీయుల ప్రతినిదిని పాలకునిగా నియమించి ఓరుగల్లుకు చేరుకున్నారు.

                       ఎఱదాచకు ముగ్గురు కొడుకులు.సింగమ, వెన్న, ఏచ. వీరు కూడా కాకతీయులకాలంలోను తదనంతరం కూడా 14 వ శతాబ్దంలో గొప్పవీరులుగా ప్రఖ్యాతి గడించారు.మహమ్మదీయులు కాకతీయులపైకి దండయాత్రలను జరపడం మానలేదు. క్రీ.శ.1321లో మహమ్మద్ బిన్ తుగ్లక్ పక్షాన ఉలూఖ్ ఖాన్ ముందుగా తమ ఏలుబడిలోని కొన్ని ప్రాంతాలను కొల్లగొట్టిన గోసంగీయులను తరిమి తదనంతరం కాకతీయుల ఏలుబడిలోకి వచ్చినారు. అక్కడ ఎఱదాచానాయకుడి కుమారుడు ఏచ అనే అతను అడ్డగించాడు. ఆయనను ఎన్నోమార్లు మహమ్మదీయులు వేధించారు. కొలచెలమ వద్ద ఏచ నాయకుడు ఉలూఖ్ ఖాన్ సైన్యాన్ని ఎదిరించాడు. విజయం సాధించాడు.

                       క్రీ.శ.1323లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పెద్దసైన్యంతో ఓరుగల్లుపై దండయాత్రచేసి ప్రతాపరుద్రుని బందీగా తీసుకొని పోయాడు. క్రమంగా కాకతీయ సామ్రాజ్యంలో చిన్న చిన్న అంతఃకలహాలు బయలు దేరాయి. వాటిని అణచివేసే ప్రయత్నం సింగమనాయకుడు చేశాడు. అంతవరకు కృతకృత్యుడయ్యాడు. అయితే మహమ్మదీయులు పాలకులుగా నియమింపబడటం దానిని సహించని హిందువులు తిరుగుబాటు చేయడం, కాపయనాయకుడు ముసల్మానుల నెదిరించడం వంటి సంఘటనలు జరిగినా కాకతీయ సామ్రాజ్యం పటిష్టం చేయడం జరుగలేదు. ఫలితంగా సింగమనాయకుడు రాచకొండ రాజ్యస్థాపనకు పూనుకొనవలసి వచ్చింది. అంతకు ముందు సింగమ మత్స ముఖ్యులతో పోరాటం చేసి జీలుగుల వద్ద మత్స కొమ్మ ను మగతుల వద్ద రుద్రను తరిమి వేశాడు. ఇటువంటి సందర్భాలనేకం చూసిన ప్రతాపరుద్రుడు అతనికి అనేక బిరుదులు సత్కారాలు వరాలు ఇచ్చాడు. ఆసీతి వరాల సింగమనాయకుడు అనికూడా పిలిచేవారు.

                       సింగమనాయకుడు తప్పని స్థితిలో రాచకొండ రాజ్యమును స్థాపించాడు. ఈ స్థితిలోనే శత్రువులు జల్లపల్లికి తన బావ చింతలపట్ల సింగమనాయకుని బందించినారని తెలిసి వారిపై దండయాత్రకు బయలు దేరాడు. సింగమనాయని కుమారులు అనపోతానాయకుడు, మాదానాయకులు అప్పటికే చేజర్ల వద్ద జరుగుతున్న ఒక యుద్దంలో ఒకరు మొగళ్ళూరు వద్ద జరుగుతున్న యుద్దంలో మరొకరు ఉన్నారు. జల్లపల్లి వద్ద పైశాల వంశ గన్నమనాయకుడు కోటనుండి శత్రువులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. జల్లపల్లికి సింగమనీడు తన కుమారుల సహాయం తీసుకొనని పరిస్థితులలో సైన్యాన్ని పంపించి తాను కృష్ణాతీరంలో గుడారం లో సైన్యంతో పాటు ఉన్న సందర్భంలో శ్రీశైలానికి చెందిన తంబళ్ళ కృష్ణాజీ బొమ్మ జియ్యరు అను అతని చేత రాయబారం పంపించే నెపంతో గుడారం లోపలికి పంపించి మాట్లాడుతుండగా వెనుక చాటుగా కత్తితో సింగమనాయకుడిని పొడిచి వేశాడు. ఈ వార్త వెంటనే తమ కుమారులకు చారుల ద్వారా తెలిసింది. అక్కడ ఉన్న నాయకులు, ఇతర సామంత రాజులందరూ చేరి ఆ వీరునికి పాదరక్షలు విడిచి వందనాలు సమర్పించారు. చివరి దశలో చేరుకున్న కొడుకులకు శత్రువులను నిర్జించె హితబోధ చేశాడు సింగమనాయకుడు. తండ్రి శరీరాన్ని జల్లపల్లి క్షేత్రంలో ఆసనంపై ఉంచి అప్పటికే అక్కడ ఉన్న నాగన్ననాయకుడితో కలిసి తమ వెంట ఉన్న సైన్యమే కాక నాయకులపై అబిమానం గల ప్రజలెందరో వీరోత్సాహంతో జల్లపల్లికి చేరుకొని యుద్ధంలో పాల్గొన్నారు. విజయమో వీర స్వర్గమే అని ప్రజలందరూ రావడం అనపోతానాయకునికి ఊహించని బలమే అయింది. ఆనాడు జల్లపల్లి వద్ద చేరిన శత్రురాజులు, క్షత్రియులు, రెడ్లు , కళింగ ప్రాంతపు రాజులు అప్పటికి వెలమలకు కాకతీయులు ప్రాధాన్యతనివ్వడం నచ్చని ఎందరో అంతర్గత శత్రువులు అదను చూసుకొని ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే అనపోతానాయకుడు ఈ యుద్ధంలో వీరసింహం వలె విజృంబించాడు.ఈ యుద్దంలో క్షత్రియులకు రాజ్యకాంక్ష ప్రద¥నం కాగా వెలమలకు ఆత్మాబిమానం ప్రద¥నంగా యుద్ధం జరిగింది.  దొరికిన శత్రువులనందరినీ వదించాడు.వెలమ వీరులకు దొరికిన శత్రువులను చిత్రహింసలు పెట్టి చంపివేశారు. కొన్ని తలలను గానుగలాడించారట, కొన్ని తలలను శూలాలకు గుచ్చి పైకెత్తి వీరహుంకారాలు చేశారు.పూర్తిగా విజయాన్ని సాధించి క్షత్రియుల తలలతో రక్తంతో అన్నం కుడిపి భూతపిశాచాలకు కుడుపుగా పెట్టి తండ్రికి వారి రక్తంతో తర్పణలు విడిచారట. ఈ జల్లపల్లి యుద్ధంలోనే ‘ రణము కుడుపు’ చేశారు.శాలివాహన శకం 1273 ( క్రీ.శ.1361) శార్వరి నామ సంవత్సర కార్తీక శు. దశమి నాడు అనపోతానేడు రణము కుడిపెను’ అని చరిత్ర చెపుతున్నది.  మెగలూరు, ఇనుగుర్తి, జల్లపల్లి, మొదలైన ఎన్నో యుద్ధాలు వీరికి విజయాలను కలిగించాయి.క్రీ.శ.1369 ప్రాంతంలో ఓరుగల్లు, భువనగిరి కూడా అతని కైవసంలోకి వచ్సాయి. ఆంధస్రురత్రాణ, అనమనగంటి పురవరాదీశ్వర, మొదలైన బిరుదులు పోందాడు.  తండ్రిగారి ఆలోచన ప్రకారం అనపోతానాయడు రాచకొండ రాజ్యాన్ని సుస్థిరం చేసి ఎంతో వైభ’వంగా పాలించాడు.రాజ్యాన్ని రెండు భాగాలు చేసి రాజకొండ దుర్గం కేంద్రంగా ఉత్తరప్రాంతానికి అనపోతానాయకుడు, దేవరకొండ దుర్గాన్ని తానే నిర్మించి రాజద¥నిగా దక్షిణ ప్రాంతానికి తమ్ముడు మాదానాయకుని రాజుగా చేసి  పరిపాలించారు. వీరిరువురు ఒకే వృక్షానికి శాఖలవలె పరస్పరం తోడుగా ఉంటూ రెండు రాజ్యాలైనా ఒకే రాజ్యం మాదిరిగా పరిపాలించి వెలమలకు అశేషమైన కీర్తిని సమకూర్ౘ్ారు. వీరి తరువాత రెండవ సింగమ, రెండవ అనపోత, రావుమాదÎవ, మూడవ సింగమ వరుసగా రాజ్యాలను పాలించారు.

                       కళింగులపై గెలిచిన సందర్భంగా( క్రీ.శ.1367 ) విజయాన్ని సాదించి సోమకుల పరశురామ బిరుదాన్ని పొందాడు.  రెడ్డిరాజులతోను, బహమనీ రాజులతోను యుద్ధాలు చేశారు. కొన్ని సందర్భాలలో బహమనీయులతో సందికి ఒప్పుకున్నారు. క్రమంగా రాచకొండ, దేవరకొండ సామ్రాజ్యాలు అంతరించాయి.

                       అనపోతానాయకుని పెద్ద కుమారుడు రెండవ సింగమనాయకుడు కళ్యాణ దుర్గాన్ని జయించాడని విశ్వేశ్వరుని చమత్కార చంద్రిక వల్ల తెలుస్తున్నది. పెదవేగి బెండపూడి మొదలైన దుర్గాలను కూడా ఇతడు జయించాడు.

                       క్రీ.శ.1399 -1421 వరకు పాలించిన రెండవ అనపోతానాయకుడు అద్దంకి కొండవీడు రెడ్డి రాజులతో తరచు యుద్ధాలు చేశాడు. పెదకోమటి వేమారెడ్డిని ఓడించి వదించాడు. తమ్ముడు మాదానీడు 1421- 30 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే బహమనీయులు బలపడ్డారు. రాజ్యాదికారం సన్నగిల్లింది. ఈతని భార్య నాగాంబిక క్రీ.శ.1429 లో నాగారం వద్ద నాగసముద్రమనే గొప్ప చెరువును తవ్వించి శాసనం వేయించింది.

              రెండవ అనపోతానాయకుని కుమారుడు మూడవ సింగమనాయకుడు క్రీ.శ.1430- 75 వరకు పాలించాడు. 

    ఈతని కాలంలోనే చివరి దశలో రాజ్యం బహమనీయుల వశమైంది. అయితే కళింగ హంవీరుడనే అతని కారణంగా మరల బహమనీయులు తదితరులతో జరిగిన యుద్ధాల వల్ల రాచకొండ కొంతకాల మరల పద్మనాయకుల అదీనంలోకి వచ్ౘ్ింది. కాని విజయనగరరాజులు కూడా విజృంబించడం వల్ల వీరి పాలన ముగిసింది.

    తరతరాలుగా వెలమలు వీరత్వానికి సాహసానికి త్యాగానికి ప్రతినిధులుగా ప్రతీకలుగా నిలిచారు.

                       పద్మనాయకులు ఎంత వీరులో అంతగొప్ప కళాకారులు. సంగీత, సాహిత్య, నృత్యశాస్త్రములందు పాండిత్యములు గలవారు. స్వయంగా అనేక కృతులు వెలార్ౘ్ినవారు. కవిపండితులను పోషించినవారు. దైవ భక్తులు ఆలయాలు నిర్మింపచేశారు. చెరువులు తవ్వించారు. శిల్పాలు చెక్కించారు. అనేక రంగాలలో వారికి గల ప్రజ్ఞాపాటవాలే ప్రజలు ఆదరించడానికి కారణమయ్యాయి.

                       శ్రీశైలం వద్ద కృష్ణానదికి సోపానములు కట్టించారు. రాచకొండలో అనేక ఆలయాలు నిర్మించారు.

    మొదటి అనపోతానాయకుడు స్వయంగా అబిరామ రాఘవం అనే నాటకం రచించాడు.

    పశుపతి నాగనాథుడు సంస్కృతంలో ‘ మదన విలాసం’ అనే భాణమును, తెలుగులో విష్ణుపురాణమును రచించిన కవి మొదటి అనపోతానాయని ఆస్థానంలో ఉన్నవాడే. పద్మనాయక చరిత్రకు ప్రధాన ఆధారం వంటిదైన ‘ అయ్యనవోలు శాసనం ’ రచించింది కూడా ఈతడే.

    రెండవ సింగభూపాలునికి సర్వజ్ఞ బిరుదముండేది. ‘ సర్వజ్ఞనామదÍయము, శర్వునకే రావుసింగభూపాలునకే, ఉర్వింజెల్లును, తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే’ అనే పద్యం శ్రీనాథుని చాటువుగా ప్రసిద్ధిపొందింది. రసార్ణవ సుధాకరం, సంగీత రత్నాకరం, రత్న పాంచాలిక, కందర్ప సంభ’వం అనే సంస్కృత గ్రంథాలను రచించాడు. చమత్కార చంద్రిక , వీరభ’ద్ర విజయం అనే డిండిమం రచించిన కవి విశ్వేశ్వరుడు ఇతని ఆస్థానంలో ఉన్నారు. బొమ్మకంటి అప్పయాచార్యుడు అమరకోశానికి వ్యాఖ్యాన రూపం అమర పారిజాతము రచించిన కవి కూడా ఈతని ఆస్థానంలోని వాడే. మరొక కవి హరిహరుడు అనర్ఘ రాఘవం రచించారు.

    రావు మాధవనాయకుడు ‘ రాఘవీయం ’ పేరుతో క్రీ.శ.1427లో ఒక రామాయణ వ్యాఖ్యానాన్ని రచించి శ్రీరామున కంకితమిచ్చినాడు.

                       శాకల్యమల్లభట్టు, శాకల్య అయ్యలార్యుడు, వేదాంతదేశికుడు, మల్లినాథ సూరి, కొలిచెలమ పెద్దిభ’ట్టు, బమ్మెర పోతన మొదలైన వారు మూడవ సింగమనాయకుని ఆస్థానాన్ని అలంకరించినవారే. పోతన భోగినీ దండకం ఈయన ఆస్థానంలో నాట్యాన్ని చూసి రచించాడు. సర్వజ్ఞసింగభూపాలుడు అనే బిరుదం ఇతనికి కూడా ఉంది. పోతన ఆక్షేపించిన కర్ణాట కిరాత కీచకులు అనే పదంలో పద్మనాయక రాజులైన సింగమనాయకులకు వర్తించదు. వీరు కర్ణాట నాయకులు కారు. స్వయంగా కవిపండితులైనందున కవిని హింసించే లక్షణం లేదు. పైగా పోతన భాగవతాన్ని పాతిపెట్టిన విషయం తెలుసుకొని

                       అనవిని సింగభూపతియ యప్పుడు భూమిని పాతిపెట్ట జే

                       సిన కృతి బెల్లగించి కవశేఖరులెల్ల పఠింపజేసి, చి

                       క్కిన కృతి భాగమున్ నిలిపి కేవల మప్రతి దృశ్యమైన దా

                       నిని తనుగొల్చె సత్కవులు నింపగజేసె దయారసంబుగన్…..అని ఆయన ఖిలభాగములు పూర్తిచేయించినారు.

                       శ్రీనాథమహాకవి “ ఎటుల మెప్పింతువో నన్ను నింకనీవు,

                                          రావు సింగమహీపాలు దీవిశాలు

                                          నిండుకొలువున నెలకొని యుండినీవు

                                          సకల సద్గుణ నికురుంబ శారదాంబ” అని ఆయన సభామధ్యంలో ఉన్న సరస్వతిని ప్రార్థించినాడు. భువనవిజయాన్ని స్థాపించిన శ్రీకృష్ణదేవరాయల కంటే ముందుగా సభామధ్యంలో సరస్వతిని స్థాపించిన ఘతన సింగభూపాలునిదే. సింగభూపాలుడు సాహితీకళాయుద్ధరంగాలలో శ్రీకృష్ణదేవరాయలకు ఆదర్శం కూడా కావచ్చును.

                       పద్మనాయకుల కాలం నాటి శాసనాలు, కట్టడాలు, శిల్పాలు, రచనలు, శాస్త్రగ్రంథాలు, ఎన్నో శోదించడానికి అవకాశం ఉన్నాయి. తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పద్మనాయకుల ముద్ర చారిత్రకమైనది. చెరగనిది. దాని చాయలు ఇప్పటికీ ఈ కులస్థులలో ఉండడం గమనిస్తున్నాం. వీరిది ఆనువంశికమైన ధర్మవీరము.

                                 అకలంకంబై శౌర్యధైర్యమయి శౌర్యంచద్దయాదైన్యమై

                                 కకుభావేల్లిత కీర్తి పూర్తియయి రంగద్వైరి పాళీ భయా

                                 నకమై విద్యకు దావలంబయి వదాన్యస్ఫీతమై పద్మనా

                                 యక వంశంబు ధరిత్రి పెంపెసగు వెల్మాఖ్యాతకంబై కడున్….( చంద్రహాస విలాసము)

    ఆధార గ్రంథాలు.

    కాకతీయులు – పి.వి. పరబ్రహ్మ శాస్త్రి

    వెలుగోటి వారి వంశావళి, మద్రాసు విశ్వవిద్యాలయ ప్రచురితం, 1939

    వెలుగోటి వారి వంశావళి ఆంగ్ల పీఠిక – నేలటూరి వేంకటరమణయ్య

    పద్మనాయక చరిత్ర -కోట వెంకట నరసింహ సత్యనారాయణ రావు ( బుచ్చినాయన)

    రాచకొండను కాపాడుకుందాం -క్షేత్రపర్యటన నివేదిక వ్యాసాలు, –

    ద్యావనపల్లి సత్యనారాయణ, సంగనభట్ల నరసయ్య, తంగెడ కిషన్‌రావుగారు

    క్రీడాబిరామము చాటువులు

    May 31, 2026 3 comments
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    కొత్తకొణాలు ఆవిష్కరించిన విమర్శకుడు

    by Ammangi Venugopal May 31, 2026
    written by Ammangi Venugopal

    ఘట్టమర్రాజుగారు వరిష్ఠ సాహిత్యవేత్త. నిరంతర గ్రంధపఠనం వారి ప్రత్యేకత. నిన్న మొన్నటి రచయితల్లో సాహిత్య స్నేహాలు కలిగివున్నవారు. తెలుగు, హిందీ కన్నడ భాషా సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసినవారు. సాహిత్య విమర్శ వారికి బాగా ఇష్టమైన ప్రక్రియ. రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారి లాగా సమీక్షా వ్యాసాన్ని విమర్శనావ్యాసంగా మలచినవారిలో వీరొక్కరు. వారి రచనలన్నీ ప్రచురిస్తే ఐదారు సంపుటాలు అవుతాయి. కాని వారు 2021-24 మధ్యకాలంలో ఒక మాస పత్రిక కోసం రాస్తూ వచ్చిన గ్రంధ సమీక్షలుగా పేర్కొనబడ్డ సాహిత్య విమర్శనా వ్యాసాలను పుస్తకంగా వెలువరించటానికి పూనుకున్నారు. ఇది ‘గ్రంధాంతరంగం’ పేరుతో ప్రచురింపబడటం ముదావహం. కేవలం వారి వ్యాసాలతో కూడిన గ్రంధమొకటి వెలవడటం ఇదే ప్రథమం.
    విమర్శకులు ముందుగా సాహిత్య జిజ్ఞాసువులై ఉండాలి. వయసుకు అతీతమైన పఠనోత్సాహం అప్పడే సాధ్యమవుతుంది. ఎనభై సంవత్సరాల ఘట్టమర్రాజు గారు ఇప్పటికీ ఏ కొత్త పుస్తకం వచ్చినా ఆసక్తితో చదువుతారు. ఆ పుస్తకం పట్ల తన సాహిత్య అనుభవం దృష్ట్యా ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ అభిప్రాయాన్ని వ్యాసరూపంలో ప్రకటిస్తారు. పరంపరాగతంగా వస్తున్న సాహిత్య చరిత్ర గ్రంధాల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువ. ఆయా కవులు, రచయితల మూలరచనలు చాలావరకు చదివినవారు కావటం వల్ల ఆయా సాహిత్య చరిత్రకారుల వాదవివాదాల పట్ల కూడా వారికి ఆసక్తి ఎక్కువే. వీరిలో కొందరితో ఘట్టమర్రాజు గారికి వ్యక్తిగత పరిచయాలు, స్నేహాలు ఉన్నాయి.
    ఘట్టమర్రాజుగారి విమర్శలో పూర్వాపరాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగటం ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, భోగరాజు నారాయణమూర్తి గారు 1920లో ప్రచురించిన తమ ‘ఆంధ్ర కవిత్వ చరిత్రమట’లో ‘కంచిలోని ఒక జైనమఠంలో తెలుగు జైన శతకమొకటి’ ఉందని సూచించారు. వంద సంవత్సరాలు దాటిగా ‘ఏ పరిశోధకుడి దృష్టి అయినా ఈ చీకటి కొట్టు వైపు ప్రసరించిందా?’ అని ప్రశ్నిస్తున్నారు ఘట్టమర్రాజు గారు. సాహిత్య త్రవ్వకం పని నిరంతరం సాగుతుండాలని, అప్పడే కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని వారి అభిప్రాయం.
    ఏ సాహిత్యకారుడు ఏ కొత్త సత్యాన్ని వెలుగులోకి తేస్తాడా? అని నిర్నిద్ర దృష్టితో ఎదురుచూడటం వారి స్వభావం. ‘కవిత్వవేది’ కళ్ళూరి వేంకట నారాయణరావు గారు 1928లో రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహమట’లో సంఘ చరిత్ర, వాఙ్మయ చరిత్ర, కావ్య విమర్శ, యుగలక్షణ సమన్వయము – అన్న అంశాలవారీగా తెలుగు సాహిత్యాన్ని పరిశీలించారు. 1928కి ముందు సాహిత్య చరిత్రలు రాసినవారెవ్వరూ సాహిత్యాన్ని ఈ దృష్టితో చూడలేదంటున్నారు ఘట్టమర్రాజుగారు. చరిత్ర సంస్కృతుల జ్ఞానం ఉన్న చరిత్రకారుడు మాత్రమే ఇట్లా విశ్లేషించగలడని వారి అభిప్రాయం.
    ‘స్వారోచిష మనుచరిత్ర టీకా తాత్పర్య వ్యాఖ్య’ అన్న వ్యాసం పెద్దన కవితాశక్తి గొప్పదనాన్ని, బ్రౌన్ దొర సామాన్య పాఠక దృష్టిలోని నవ్యతను, జూలూరి అప్పయ్య టీకా రచనలోని సరళ సంక్షిప్త వివరణను ప్రశంసించే వ్యాసమిది. అప్పయ్యగారి టీక అచ్చయిన 171 సంవత్సరాల తర్వాత డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డిగారు తాత్పర్యాలను, విశేష వ్యాఖ్యలను సమకూర్చి కొత్త ప్రచురణను 2022లో పాఠకులకు అందుబాటులోకి తేచ్చారు. ఈ సందర్భంలో ‘అటజనికాంచె…’ అన్న పెద్దన సుప్రసిద్ధ పద్యానికి అప్పయ్యగారి టీకతో పాటు ప్రభాకర రెడ్డిగారు తాత్పర్యాన్ని, విశేష వ్యాఖ్యను ఉదాహరించి నేటి పాఠకులకు నాటి షడ్రుచులను చూపించిన ఘట్టమిది. ఇది ఒక రకంగా తరాల మధ్య వంతెనను నిర్మించడమే.


    ఎం.ఎ. (ఆనర్స్) పట్టాకోసం పాటిబంద మాధవశర్మగారు సమర్పించిన లఘు సిద్ధాంత గ్రంధం ‘ఆధునికాంధ్ర భావకవిత్వం’ ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారి పూనికవల్ల తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012లో ప్రచురించారు. మాధవశర్మగారు పత్రికా సంపాదకులే కాక స్వయంగా కవి. ‘భావకవిత్వమందు వికసోన్ముఖమై యున్న ఉత్తమ లక్షణములను దిగ్మాత్రముగ ప్రదర్శించుట ఈ కావ్యముద్దిష్టము. ఈ కవితపై ని~ది కేవలమ తొలిపలుకు’అని అనటంలోని వినయ సౌశీల్యాన్ని సమీక్షకులు ప్రశంసిస్తున్నారు.
    భావకవిలో జీవితాంతం వెంటాడే ‘అనిర్వాచ్యమైన అనుభూతి’ని గురించి పేర్కొనటమంటే భావ కవిత్వ ఆత్మను సంభావించినట్లే. భావకవులు ‘విశిష్ట కవులు’ని, అప్రాప్తమైన ప్రేమను ఆరాధించటమే భావకవుల ఆశయమని మాధవశర్మగారంటారు. ‘కవి ఎట్టి భావస్థితి యందు కావ్యమును భావించెనో, అట్టి భావస్థితిని పొందగల కొందరు పరిఢితులకు కొని సమయములందే ఇవి రుచించగలవు’ అని అనటాన్ని సమీక్షకులు సమర్థిస్తున్నారు. ll కొని పద్యగేయ కవితల్లోని ‘ఛందోశిల్పవైవిధ్యం, భాషా వైలక్షణ్యాల గురించి ఎక్కువగా వివరించారే కాని కవితా అగ్ని పుష్పాల జ్వాలల్ని విశ్లేషించే అవసరమైన ప్రయత్నం చేయలేకపోయారు’అని ఘట్టమర్రాజుగారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ll ‘అగ్నిపుష్పాల జ్వాలల’ వంటి కవితల విశ్లేషణ భావకవిత్వ పరిధిలోకి రాదని మాధవశర్మగారు భావించి ఉంటారు.
    ‘బ్రౌణ్య మిశ్ర భాషా నిఘంటువు’ (1854)ను సమీక్షించటం అందరితో అయ్యే పని కాదు. ఇందుకు ఘట్టమర్రాజు వంటి బహుభాషావేత్తలు మాత్రమే సరిపోతారు. ఇందులో అరబీ, పార్శీ, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, మరాఠీ, బెంగాలీ, ఒరియా, ఫ్రెంచి, టిబెట్ పదాలకు ఆంగ్లంలోను, తెలుగులోని అర్థాలు ఇవ్వబడ్డాయి. మొత్తం ఆరోపాలు 2286, ‘అస్తావేస్తమట’ అన్న మాటకు బ్రౌన్ దొర ఆంగ్లంలో ఫూలిష్‌నెస్, మాడ్‌నెస్ అన్న అర్థాలను, తెలుగులో చాదస్తమట అన్న అర్థాన్నిచ్చారు. అయితే ఘట్టమర్రాజుగారు ‘అస్తవ్యస్త’ అన్న సంస్కృత పదం దాని మూలం కావచ్చునని తమ ఉపజ్ఞతో సూచించారు. ఇది సరిగ్గా సరిపోయింది.
    దేవులపల్లి రామానుజరావు గారి ‘యాభై సంవత్సరాల జ్ఞాపకాలు’ ఆత్మకథను విశ్లేషిస్తూ 22 సంవత్సరాల పాటు సాహిత్య అకాడెమీకి చేసిన సేవలను ప్రశంసించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తును సాహిత్య వికాసానికి, విద్యావ్యాప్తికి వేదికగా మార్చిన మహానుభావులలో ప్రధాన స్థానం రావుగారిది. ‘రామానుజరావు జాతీయ, ఆంధ్ర, తెలంగాణ పునరుజ్జీవనోద్యమాల్లో తానొక సామాన్య కార్యకర్తగా ప్రముఖ నాయకుల అనుచరునిగా పాత్ర వహించినట్లు చిత్రించుకున్న వినయముద్ర వ్యక్తమవుతుంది’ అంటున్నారు. ఇది వారి సూక్ష్మదృష్టికి తార్కాణం. నిజానికి తెలంగాణ సాహితీమూర్తులెవ్వరిలోను తమ వ్యక్తిత్వాలను ఘనంగా ప్రచారం చేసుకునే తత్వం లేదు.
    ఘట్టమర్రాజుగారికి అన్నమయ్య అంటే ఏడుకొండలంత అభిమానం. ప్రతి వ్యాసంలో ఆ వాగ్గేయకారుని కవిత్వాన్ని సందర్భోచితంగా ఉదాహరిస్తారు. ఈ గ్రంధాంతరంగంలో మరెన్నో విలువైన వ్యాసాలున్నాయి. వారి ఇతర వ్యాసాలను కూడా ప్రచురించి లోకార్పణ చేస్తే బాగుంటుంది. రచయితల రచనలే శాశ్వతంగా మిగులుతాయి. ఇది సాహిత్య సత్యం.

    May 31, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    ఇంద్రధనుస్సు

    క్విజ్ పోటీ-

    by nellutla Indrani May 30, 2026
    written by nellutla Indrani

    నిర్వహణ-
    ⁠నెల్లుట్ల ఇందాణి
    మయూఖ ద్వైమాసిక పత్రికలో జనరల్ నాలెడ్జ్ క్విజ్ ను ప్రారంభించాము. మీరేమి చేయాలో నెల్లుట్ల ఇంద్రాణి చెప్తున్నారు చదవండి- ఎడిటర్

    Hi everyone ! Good morning from “Mayukha and Tharuni.My name is Indrani Nellutla.
    Here I am shooting 20 General Knowledge questions for brain storming.If you know correct answers for 15 questions ” You are good”. More than 15 ” Clap your hands “.

    I am also Providing Correct answers below, “But ……. but…”. don’t look at the answers 🙈. ( Now) 😄

    చూసారా… మీ జవాబు లు 15 సరైనవైతే మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీ తెలివికి , మీ జ్ఞాపక శక్తి కి మీరే నిర్ణాయకులు. ఇదే మనకు ఉత్సాహాన్నిస్తుంది. ఇవిగో ప్రశ్నలు…

    1. Which country is known as “Rising sun” ?
      A. United States of America. B. China. China.D. Japan.
    2. Who is the first black president of South Africa?
      A. Nelson Mandela . B .Musaveni . C. Paul Kagame . D. Barak Obama.
    3. Which is the longest river in Europe?
      A. Godavari. B. Volaga. C. Amezan. D . Nile.
    4. 4.In Which Year United Nations was established?
      A. 1940 . B. 1950 . C. 1945 . D . 1960 .
    5. .Which line separates India and Pakistan?
      A. Red Cliff line. B. Ma Mohan line . C . Equater .D . Tropc of cancer.
    6. Where is Great Barrier Reef located . ?
      A. United States. B. Europe. C. Australai. D. Africa. ?
    7. Who wrote ” The Tale of Two Cities” .?
      A. Charles Dickens .B.G.Shaw .C. Clerk Hemes . D. William Shakespeare.
    8. .What is the National bird of New Zealand .?
      A. Bald eagle .B . Peacock. C. Elephant. 4. Kiwi.
    9. Which mountain separates Europe and Asia ?
      A . Urals . B. Pamir .C. Cascade. D . Andes.
    10. Who is one of the ” Kavithryam” from the below poets ?
      A . Kalidasa. B. Nannaya . C. Bhanu . D. Kanva.
    11. Name the first Indian Sattilite ?
      A. Aryabhatta B. Shankara C. Banabatta D. Bhaskara ?
    12. Who is the first recipient of Gyanpit award ?
      A. Vishwanatha Satyanarana B . Dr. C. Narayan Raddy . C. Dasarathi . D. Arudra.
    13. Which strait separates Iran and Soudi Arabia ?
      A. Hormuz. B . Panama . C. Suez. D. Bay of Bengal.
    14. Which painting of Ravi varma sold approx. 17.9. Million dollars ?
      A. Lord Rama .B. Lord Shiva. C . Lord Indra. D. Lord Krishna.
    15. The study of the kidney is called ?
      A. Cardailogy . B . Nephrology. C. Apthamology. D. Anthropology.
    16. Who is the Lyricist of ” Geet Gata Chal O Sathi Gun Gunatha Chal” ?
      A. Ravindra Jain B. Mahmmad Rafi . C. Gulzar. D . Kishore Kumar.
    17. Who is the founder of ” Amezan” ?
      A.Satya Nadella.B. Bill Gates. C. Jeff Bezos . D. Rishi.
    18. Who invented telphone ? A. Madam Currie .
      Thomas Edison. C. Enlisteen . D. Alexander Graham Bell.
    19. Which fruit is good source of vitamin. C .?
      A. Spinach . B. Orange . C. Potatoes .D. eggs .
    20. Good Year is trade name of ?
      A .Cars .B. Tires . C. Bikes. D. Racing Cars . ———-

      Correct Answers ———.
      1. D. ( Japan. The land of rising sun. The rising sun represents hope, renewal and energy for the Japanese people).

      2. A. Nelson Mandela ( from 1994 to 1999.).

      3.B. Volga ( stretching approximately 3,530 to 3,690 k.m ).

      4. C .1945 ( Biggest funder is United States America ).

      5. A. Red Cliff line ( Established on August 17, 1947 ).

      6. C. Australia ( it spans over 2,3000 k.m ).

      7. A. Charles Dickens ( He wrote about London and Paris).

      8. D. Kiwi ( Flightless bird).

      9. A.Ural mountains ( Running 2,500 k.m. North to South through Western Russia).

      10. B. Nannaya ( He translated Adi Parva ,Sabha Parva and a portion of Aranya Parva ).

      11. A. Aryabhatta ( launched on April 19 , 1975 ).

      12. A. Viswanatha Satyanarana.( For Ramayana Kalpavruksham in 1970 ).

      13. A. Hormuz ( Approximate length 90 to 104 miles ).

      14. D. Lord Krishna ( The Art work was purchased by Dr. Cyrus Poonwala ).

      15. B . Nephrology ( A specialist in this field known as Nephrologist .).

      16. A. Ravindra Jain ( He redefined Bollywood music despite being born blind .).

      17. C. Jeff Bezos ( He is a American Business man ).

      18. D. Alexander Graham Bell ( He invented the devise on March 7 , 1876.).

      19. B. Oranges ( a single orange can meet daily requirement ).

      20 .B. Tires ( Founded in 1898 , is a company that produces tires for passenger cars , trucks and racing Cars ). _**_.

      ఈ 20 ప్రశ్న లకు సరైన జవాబులు ఎన్ని వచ్చాయో మీరే చెక్ చేసుకోండి.. మిమ్మల్ని మీరే అభినందించుకోండి.. ఇది నిజమైన బలం ! – ఎడిటర్
    May 30, 2026 1 comment
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    పేరంటాలు

    by Vijaya Kandala May 30, 2026
    written by Vijaya Kandala

    పెళ్లి ,వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో  మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి  పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.

    అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం  వచ్చింది.    దీనికి విపరీతంగా కాలక్రమంలో పసుపు,కుంకుమతో  భర్త శవంతో బాటే చితినెక్కిన స్త్రీని పేరంటాలని పిలవడం మొదలైంది.ఈ పధ్దతి ముగిసి చాలాకాలమైంది .కానీ మన చరిత్రలోని మెరుపులతో బాటు మరకలను  కూడా తెలుసుకోవాలి గదా.

    క్లుప్తంగా  సంప్రదాయ పరిచయమే ఈ చిరువ్యాసం.ఈ  ప్రక్రియను సహగమనం లేదా సతి లేదా సాగుమానం అంటారు. అలా చేసిన స్త్రీని సతి లేదా పేరంటాలు అని  అంటారు.

     సహగమనమంటే తోడుగా వెళ్ళడమని అసలర్థం.కానీ అలవాటులో తోడుగా మరణించుట అనే అర్థం వచ్చి చేరింది. పరమ శివుని నింద వినజాలక పార్వతీ  దేవి అగ్నికి ఆహుతైన కథ మనందరికీ తెలిసిందే.ఆ సతీదేవి కథనే దీనికి స్ఫూర్తి అని కొందరి భావన.పతి చితిలో సతి అగ్నికి ఆహుతవడమని జనంలో సాదారణ అర్థం. వివిధ కులాలో,ప్రాంతాలలో విభిన్న రీతులుండేవి.

    భర్త శవంతోబాటు స్త్రీని సజీవంగా గోతిలో పూడ్చిపెట్టడం చూసానని ప్రసిధ్ధ విదేశీ యాత్రికుడు న్యూనిజ్ రాసాడు.అబాగినులైన స్త్రీలపై మత్తుమందు ప్రయోగించేవారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలింది.విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటివి అనేకం చూసామని నాటి విదేశీ యాత్రికులు  బార్బొసా, సీజర్ ఫ్రెడరిక్  వర్ణించారు.

                  కారణాలను మనం ఊహించుకోవడమే.భర్త పట్ల తీవ్రమైన ప్రేమ,కీర్తికాంక్ష ,దేవతగా పూజింపబడతాననే భావన, సంఘంలో లభించే గౌరవాభిమానాలు – ఇందులో ఏదో ఒకటి గానీ,అన్నీ కలిసిగానీ కారణాలు కావచ్చు.కొన్ని స్మృతులలో  సహగమనం చేసిన స్త్రీకి స్వర్గం లభిస్తుందని చెప్పటం వల్లకూడా కొన్ని జరిగి ఉండవచ్చు.

                    సంతానంలేని స్త్రీ జీవించిఉంటే ఆ వ్యక్తి ఆస్తిని ఆనుభవించే అవకాశముండదని వారసులు దీన్ని ప్రోత్సహించే వారని  కొందరి అభిప్రాయం.ఇలా సహగమనం ( సాగుమానం ) చేసిన స్త్రీవల్ల పుట్టింటి వారికి,అత్తింటివారికి 3 తరాల వరకు పుణ్యలోకాలు కలుగుతాయనే నమ్మకంతో  ఇరువైపుల బంధువులు (  ముఖ్యంగా స్త్రీలు ) ప్రోత్సహించేవారని మరి కొందరంటారు.

    దుర్భర వైధవ్య బాథలు అనుభవించడంకంటె సహగమనం చేస్తే,ఒక్కసారే కష్టాలు గట్టెక్కుతాయని ఆలోచించేవారని  కొంతమంది విశ్వాసం.కారణమేదైనా బలిపశువు స్త్రీయే.

                   ఈ సంప్రదాయం  మరో రూపంలో రసపుత్రులలో  ప్రబలంగా ఉండేది.భర్త ఉన్నా శత్రువుల వల్ల మానహానికి అవకాశముందని తెలిసిన రాజవంశపు స్త్రీలందరూ మూకుమ్మడిగా అగ్ని ప్రవేశం చేసేవారు.ప్రాణాని కంటే మానానికెక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయాన్ని జోహార్ అనేవారు.

                 19 వ శ.వచ్చేసరికి ఈ పధ్ధతి విపరీత దశకు వచ్చేసింది.ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో 1818లో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఇండియాలో మొత్తం 839 సహగమనాలు జరిగితే ,అందులో కేవలం బెంగాల్ లోనే 544 జరిగాయి. తరవాతి స్థాయిలో వారణాసి,బరైలీ,బీహార్ ప్రాంతాల్లోజరిగాయి.

    ఉమ్మడి మద్రాస్ రాష్టం లో గంజాం,విశాఖ,రాజమండ్రి ,గుంటూరు, నెల్లూరు ,చిత్తూరు,కడపల్లో జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

     నాడు స్త్రీ పునర్వివాహ ప్రసక్తి లేదు.జీవితమంతా అశుభానికి ప్రతీకగా ,అవమానాలు ,కష్టాలు భరిస్తూ గడపడం కంటె భర్తతోపాటు మరణించి పూజలందుకోవడం మేలని తలచేవారేమో.అయితే ఆనందంతో ఆ మోదించే వారూ ఉన్నారని చరిత్ర చెప్తోంది.స్వఛ్చందంగానే చేస్తున్నామని చూడవచ్చిన వారితో  చెప్పడం తనకు తెలుసని బార్బోసా రాశాడు.

     ఇలా బొమ్మగౌడ అనే అతని భార్య సంతోషంగా సహగమనం చేస్నట్లు షిమోగా జిల్లాలో దొరికిన ఒకశాసనం వల్ల తెలుస్తోంది. 1743 లో కాసింబజార్ లోని రామ్ చెంద్ పండిట్ మరణిస్తే అతని భార్య17 సంవత్సరాల వయస్సులో సహగమనానికి సిద్దపడితే నగరంలోని వర్తకులందరూ ఆ ప్రయత్నం నుండి మరలించడానికి  అనేక రకాలుగా ప్రయత్నించారట.ఆమె ఫౌజ్ దార్ అనుమతితో సహగమనం చేసిందట.

    ఇందోర్ పరిపాలకురాలైన రాణి అహల్యాబాయి కూతురు ముక్తాబాయి సహగమనం చేసింది.తల్లి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. ఆ తల్లి  ఆ  ప్రదేశంలోకూతురికొకగుడి కట్టించింది.

                 ఇంత ఘోరాన్ని ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదా అని ఆశ్చర్యపోకండి. చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి.అంతకు రెండురెట్లు వ్యతిరేకతలూ ఎదురయ్యాయి. మధ్యయుగాల్లో  అక్బర్,సిక్కు గురువులు ,పీష్వాలు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు.

    1780 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ చేసిన ప్రయత్నాలు హిందూ వ్యతిరేకత వల్ల ముందుకు సాగలేదు.కొంతకాలానికి రాజారామ్మోహన్ రాయ్ వంటివారు దీనికి వ్యతిరేకంగా ఒకఉద్యమమే లేవదీసారు,ఈ సందర్భంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ చొరవ తీసుకుని అన్ని వర్గాల వారి అభిప్రాయాలను  సేకరించాడు. హిందువుల వ్యతిరేకతను లెక్కజేయకుండా 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా  లెక్కిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసాడు.

    మన ఆంధ్ర ప్రాంతంలో దీనికి సాగుమానం,చిచ్చురుకుట ,గుండాన బడుట  అని రకరకాలుగా పిలుస్తారు.చరిత్ర ఆధారాలను చూస్తే 12 వ శ . నుండీ జరిగినట్లు తెలుస్తుంది.గత 800 సంవత్సరాలుగా చాలానే జరిగాయి.ప్రసిధ్ది పొందిన పేర్లు చాలానే వినిపిస్తాయి.వత్సవాయి సీతమ్మ (  1761 ) , వాసిరెడ్డి అచ్చమ్మ  ( 1763 )బాలసన్యాసమ్మ లిస్టు  పెద్దదే ఉంది .వీరంతా పేరంటాలు అనే పేరిట నేటికీ పూజలందుకుంటున్నారు.వీరి మహిమలను గూర్చి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వాస్తవాలు,విశ్వాసాలు పాలునీళ్లలా కలిసిపోయాయి.

                 ఈ ఆధునిక కాలంలో ఇలాంటివాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు.అనుమతించరు.కానీ ప్రాచీన సంస్కృతీ అధ్యయనంలో భాగంగా వీటిని గురించి రేఖామాత్రంగా నైనా తెలుసుకోవాలి.వారి చారిత్రక,సాంఘిక,ఆర్థిక దృక్పథాలనుఅవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.

    ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెరుపులతోబాటు మరకలూ ఉంటాయి.వీటినీ ఒకనాడు ఎంతో పవిత్ర బాధ్యతగా గౌరవించే వారని తెలిస్తే చాలు.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Uncategorized

    మాఅలస్కాప్రయాణం

    by Rangaraju Shyamsundar May 30, 2026
    written by Rangaraju Shyamsundar

    కలలుకంటూనే, వాటినిగురించిఆలోచిస్తూఉంటేఅవిసంకల్పాలుగామారిఎప్పుడోఒకప్పుడునెరవేరుతాయిఅంటాడుఅబ్దుల్కలాం. అలాఆలోచించడంవల్లెనాకలకూడానెరవేరింది. ఎక్కువగానేషనల్జియోగ్రాఫిక్ఛానల్చూసేనాకుఅలస్కాలోనిగ్లేసియర్వరకుక్రూస్లోవెళ్లినపరిశోధకులువారికళ్ళముందేగ్లేసియర్లోనికొండప్రాంతంవిరిగిసముద్రంలోపడటందానిదాటికిసముద్రంలోనిఉవ్వెత్తునలేచినఅలలుక్రూయిజ్షిప్దూరంగానెట్టివేయడంచూశాను. జీవితంముగింపుదశలోనైనానిజంగాఇలాంటిదృశ్యాలనుదూరంగానైనాచూడగలనాఅనేనాకోరికఅతిత్వరలోతీరేఅదృష్టంనన్నువరిస్తుందనినాకుమారుడు- కూతురునా 70 వసంవత్సరపుజన్మదినవేడుకలుఅలస్కాలోజరుపుకుందాంఅనిఫోన్చేసిఆహ్వానించేవరకుఅనుకోలేదు.

    ఎప్పుడోజియోగ్రఫీచానల్లోచూసినదృశ్యాలునిజంగాచూడబోతున్నందుకునాలోఒకవైపుఆనందంఇంకోవైపుఆందోళనకలగజేసాయి. ఆందోళనమామూలుచలికేతట్టుకోలేనినేనుఅలస్కాలోనిఅతిశీతలంగాఉండివాతావరణంఒక్కోమారు-20°నుండి-40°వరకుమంచుగడ్డకట్టేచలిప్రాంతాల్లోసంచరించడం-మళ్ళీపూర్తిఆరోగ్యంగాఇండియాతిరిగిరావడం. ఒకవైపుకలనిజంచేసుకోవడం – రెండోవైపుఆరోగ్యంఈరెండునామనసునుకుదిపేస్తున్నవిపరీతఆలోచనలునన్నుఆవరించాయి.

    అమెరికావెళ్ళగానేమాపిల్లలుఅలస్కాట్రిప్కోసంటిక్కెట్లుకొనుగోలుచేయడం, అలస్కాలోవిహరించడానికిసరిపోయేదుస్తులుకొనుగోలుకోసంషాపింగ్చేసి, థర్మల్స్, జర్కిన్స్, జాకెట్స్, బూట్స్,   గ్లౌజెస్వగైరా, వగైరాలన్నికొనిప్యాక్చేసుకోవడంచకచకాజరిగిపోయాయి. సరిగ్గాప్రయాణానికికొద్దిరోజులముందుఅలస్కాప్రయాణంగురించిఎక్కువగాఆలోచించడంమూలానఅలస్కారూపురేఖలు, గడ్డకట్టినమంచు, మంచులోకదులుతున్నపెంగ్విన్లు, తిమింగళాలుకలలోకిరావడం, ఆచలికినేనువణికిపోతున్నదృశ్యాలుకలలోమెదలసాగాయి.  ఆకలలవత్తిడికిఒకానొకసమయంలోఈవయసులోఇంతరిస్క్ప్రయాణంఅవసరమాఅనికూడాఅనిపించింది.  కానీఈవిషయాలుపిల్లలతోచర్చిస్తేప్రయాణంఎక్కడక్యాన్సల్చేస్తారేమోఅనేభయంకూడావెన్నాడింది. 

    అన్నిభయాలనుదూరంపెడుతూసాహసకృత్యాలకుసంబంధించినయూట్యూబ్వీడియోలనుచూస్తూఒక్కసారినాలడక్యాత్ర, మానససరోవరయాత్ర, మాయూరప్యాత్రఅనుభవాలుగుర్తుచేసుకుంటూ,అలస్కావిహారయాత్రనుఆస్వాదించడానికికోసంటిప్స్రాసుకుంటూప్రయాణతేదికోసంఎదురుచూస్తున్నాం. మేంవెళ్లాల్సినప్రయాణపుతేదీఆగస్టు 15 రానేవచ్చింది. యాదృచ్ఛికంగాట్రంప్-

    పుతిన్శిఖరాగ్రసమావేశాలుఅదేరోజునమేముఅలస్కాప్రయాణాల్లోమొట్టమొదలుచేరుకోవలసినప్రదేశంఆంకరేజ్లోజరగనుండడంతోఆంకరేజ్పదంఎక్కువగాప్రాచుర్యంమైంది.  అన్నిసర్దుకునిచికాగోనుండిఅలస్కాలోనిఆంకరేజ్అనేప్రాంతానికిప్రయాణమయ్యాం.  చికాగోనుండిఆంకరేజ్కి 7 గంటలవిమానప్రయాణం,లోకల్ఫ్లైట్కాబట్టిరెండుగంటలముందేవిమానాశ్రయానికిచేరుకున్నాంమధ్యాహ్నంరెండుగంటలకల్లా. చికాగోకుఅలస్కాకుమూడుగంటలసమయంతేడావల్లఆంకరేజీచేరుకునేసరికిసాయంత్రం 7 గంటలయింది.  అనుకున్నవిధంగానేఆంకరేజ్లోదిగగానేముందుగాపలకరించిందిఅలస్కాలోనిచల్లనివాతావరణం.జాగ్రత్తలుతీసుకుంటూనేవిమానాశ్రయంలోనేరెంటల్కారుబుక్చేసుకునినేరుగాహోటల్గదికివెళ్లిడిన్నర్ముగించుకొనిరూమ్కివెళ్ళేసరికిరాత్రి 12 అయ్యింది.

    అలస్కాకిఉన్నఇంకోపేరుల్యాండ్ఆఫ్మిడ్నైట్సన్అనిగడియారంలో 12 గంటలసమయంచూపిస్తున్నా, అప్పుడేచీకటిపడుతున్నట్టుగాఉంది.  ప్రొద్దున్నేలేచిఇంకాప్రయాణంచేయాల్సిఉన్నకారణంగాను, అలసిపోవడంవల్లనూతొందర్లోనేనిద్రలోకిజారుకున్నాం. ఆమరుసటిరోజుఉదయమేఆంకరేజ్నుండి 202 కిలోమీటర్లదూరంలోఉన్నసెవార్డ్గ్రామానికిప్రయాణంమొదలుపెట్టాం. దారిపొడవునావిశాలమైనరోడ్లు.రోడ్డుకుకుడివైపు, ఆప్రాంతంలోదక్షిణపుసముద్రంగాపిలువబడేపసిఫిక్మహాసముద్రంఎడమవైపు-ఎత్తైనకొండలు,కొండలుత్రవ్వివేసినరోడ్లు, కొండలపైఅక్కడక్కడకొండఅంచుల్లోనిలబడిమావైపేచూస్తునట్లుఅనిపించేకొండల్లోతిరగాడేగొఱ్ఱెలు -ప్రకృతిఎంతోఆహ్లాదకరంగాఉంది. ప్రపంచదేశాల్లోనివిస్తీర్ణంలోనాలుగోదేశంఅయినఅమెరికాలోప్రయాణంచేసేదిఎక్కువగంటలుకానీచూడాల్సినప్రదేశాల్లోగడిపేసమయంచాలాతక్కువ.  ప్రయాణంలోనేఎక్కువసమయంగడిచిపోతుంది.మధ్యలోఅందమైనప్రాంతాల్లోఆగుతూ, నల్లనిపర్వతాలపైమంచుదుప్పటికప్పుకునట్లుగామంచుతోనిండిఉన్నపర్వతాలనుచూస్తూ, సముద్రంలోసర్ఫింగ్చేస్తున్నఔత్సాహికక్రీడాకారులనుచూస్తూసాగిందిమాప్రయాణం. అలామధ్యాహ్నంమూడుగంటలప్రాంతంలోవిట్టియర్అనేప్రాంతానికిచేరుకున్నాం. ఈవిట్టియర్అనేప్రాంతంసముద్రానికి – కొండలకుమధ్యఉన్నఒకచిన్నగ్రామం. ఈప్రాంతంచేరుకోవాలంటేఒకేఒక్కసొరంగమార్గం 2.5 కిలోమీటర్లదూరంఉంటుంది.1943 సంవత్సరంలోఅమెరికాజపాన్యుద్ధసమయంలోఒకరహస్యమైనరక్షితనౌకాశ్రయంకోసందీన్నినిర్మించడంజరిగింది. ఈ 2.5 కిలోమీటర్లటన్నెల్ద్వారాప్రయాణానికినిర్ణీతసమయాలుఉంటాయి..ఈటన్నెల్గుండారోడ్డురైలుసౌకర్యంరెండూఉన్నాయి.ఈగ్రామంలోనివసించేజనాభాకేవలం 200 మంది

    మాత్రమే. ఇక్కడికియాత్రికులేఎక్కువగావస్తుంటారు. ఈపట్టణంలోరెండేరెండుబహుళఅంతస్తులుకలిగినభవనాలుఉన్నాయి. బెగిచ్టవర్స్ఒకటైతేఇంకొకటిభక్నర్బిల్డింగ్. బెగిచ్టవర్స్లోమొత్తంనివాసగృహాలుకార్యాలయాలుఉంటేఇంకోటిభక్నర్బిల్డింగ్.ఇదియుద్ధకాలంలోఅమెరికాసైన్యానికిప్రధానకార్యాలయంగాఉండిఅప్పటిచరిత్రకునిలువెత్తుసాక్ష్యంగాఉంది.  ఈరెండుభవనాలసముదాయాలనుచూస్తూకొండలపైనుండిజాలువారేజలపాతాలనుచూస్తూ, ఆజలపాతాలు- నీరుచేరుతున్నపసిఫిక్సముద్రప్రాంతానికిచేరుకున్నాం. అంతులేనిసముద్రం, సముద్రంమధ్యలోగుట్టలు, ఆగుట్టలపైమంచు, సముద్రంలోఔత్సాహికులుచేసేనీటిపైతేలియాడేక్రీడలుకయాకింగ్, సర్ఫింగ్చూస్తూసముద్రంలోఎగిరిపడేసాల్మన్చేపలవిన్యాసాలనుచూస్తూఆప్రాంతంలోమూడుగంటలువిహరించాం. ఆరుగంటలసమయంలోమాప్రయాణంమళ్లీప్రారంభమైంది. అక్కడినుండి 4 గంటలుప్రయాణించిసేవార్డ్అనేప్రాంతానికిచేరుకొనిరాత్రి 10 గంటలసమయంలోఆసేవార్డ్ప్రాంతంలోనిఅతిధిగృహంలోకివెళ్లిసేదతీరాం.

    ఆమరుసటిరోజుమాఅతిధిగృహంనుండిసముద్రతీరప్రాంతంలోనిసేవార్డ్పోర్ట్కిబయలుదేరాం.  సముద్రతీరంనుండే8 గంటలుసముద్రంలోప్రయాణించడానికిక్రూయిజ్ఇక్కడనుండేప్రారంభమవుతుంది. ఈఅలస్కారాష్ట్రంచాలాకాలంరష్యాఆధీనంలోఉండేది. 1867లోఅమెరికాఈప్రాంతాన్నికొనుగోలుచేశాక 49వఅమెరికాసంయుక్తరాష్ట్రంగాఅవతరించింది. అలస్కానుఅమెరికాకొనుగోలుచేశాకకొన్నివేలమందిప్రజలురష్యాకువెళ్ళిపోగామిగిలిపోయినవాళ్ళుఇదేప్రాంతంలోస్థిరపడ్డారు. 1895 ప్రాంతంలోఅలస్కాలోనికొన్నిప్రాంతాల్లోవిపరీతంగాబంగారుగనులుఉన్నాయనేప్రచారంప్రారంభంఅవడంతోచాలామందిఈప్రాంతాల్లోనిబంగారంవెతుకులాటకోసంవచ్చిఆప్రాంతాల్లోస్థిరపడ్డారు.  జూన్, జూలై, ఆగస్టునెలల్లోమాత్రంఎక్కువగాయాత్రికులువస్తుంటారు.  ఆగస్టుచివరివారంనుండిఈప్రాంతంలోచలిపెరుగుతూఉంటుంది. కొన్నిప్రాంతాల్లో -20నుండి-40 డిగ్రీలవరకువాతావరణపరిస్థితులుమారిపోతూయాత్రికులకువాతావరణంఅననుకూలంగామారుతూఉంటుంది.

    చలికాలంలోనూఈప్రాంతానికివిశేషంగావచ్చేయాత్రికులూఉంటారు. ఈప్రాంతాన్నికొనుగోలుచేసినసమయంలోనిఅధికారివిలియంహెచ్సేవార్డ్గౌరవార్ధంఈపట్టణానికిసేవార్డ్గానామకరణంచేశారు. గల్ఫ్ఆఫ్అలస్కాగాపేరుగాంచినఈపసిఫిక్మహాసముద్రంలోఅలలనుచీల్చుకుంటూమాక్రూయిజ్గ్లేసియర్యాత్రప్రారంభమైంది. క్రూయిజ్సముద్రంలోనికొండప్రాంతంవైపుగాదూసుకెళ్లింది. సముద్రంలోనిచిన్నచిన్నద్వీపాలపైసూర్యకిరణాలకోసంవిశ్రాంతితీసుకుంటున్నసముద్రసింహాలను

    చూపుతూఆపరిసరప్రాంతాల్లోమాపడవఆగింది. అందరూఒక్కసారిగాకెమెరాల్లోనూ, సెల్ఫోన్లలోనూసముద్రసింహాలఫొటోలుచిత్రీకరించడంకోసంపోటీపడ్డారు. ఫోటోలువీడియోలచిత్రీకరణకోసంఆగినపడవకొంతసమయంతర్వాతఇంకాముందుకుసాగింది. కొంతదూరంవెళ్ళాకఒక్కసారిగాగాల్లోఎగురుతున్నపఫిన్పక్షులుగుంపులు, గుంపులుగామాపడవపైనఎగరడంతోఅందరూఫోటోలుతీసుకోవడంతోపడవఆవరణభాగమంతాయాత్రికులతోపూర్తిగానిండిపోయింది. సముద్రఅలలకుఅరిగిపోయినసముద్రపుఒడ్డురాళ్ళప్రాంతమంతాచిత్రవిచిత్రమైనఆకృతులతోవినూత్నంగాఅగిపించింది.

    ఇంకాముందుకుసాగుతున్నమాపడవఒక్కసారిగాఆగిపోయింది. సమీపప్రాంతంలోనేతిమింగళాలుకనుచూపుదూరంలోతేలియాడ్తున్నదృశ్యం, పడవలోనిటూరిస్ట్గైడ్ప్రకటనతోయాత్రికుల్లోఒక్కసారిగాఆత్రుతపెరిగిపోయిపడవలోపలడెక్లోకూర్చున్నయాత్రికులుఅందరూఒక్కసారిగాపడవబయటఆవరణలోకివచ్చితిమింగళాలనుఫోటోలుతీసుకోవడంలోను, వీడియోలనుచిత్రీకరించడంలోనుపోటీపడ్డారు.సముద్రంమట్టంగాలిపీల్చుకునేందుకుపైకిఎగరడం, సముద్రంలోమళ్ళీమునగడంలాంటితిమింగళాలవిన్యాసాలుచూస్తూ, ఇంకాకొంతసమయానికిచాలాదూరంలోతిమింగళాలుతేలుతూసముద్రంలోకనిపించడంతోఈవిన్యాసాల్లోపడవముందువైపుఇరువైపులాయాత్రికులకేరింతలతోప్రయాణంఆధ్యంతంసంతోషంతోగడిచిపోయింది.  సుమారుగా45000 కిలోలనుండి1,81,000కిలోలబరువుఉండేతిమింగళాలుగంటకు25 నుండి50 కిలోమీటర్లవేగంతోనీటిలోప్రయాణిస్తాయట. ఇవన్నీచూస్తున్ననాకునేషనల్జియోగ్రఫీఛానల్లోచూసినజ్ఞాపకాలుగుర్తుకువచ్చాయి. నేనుచాలామార్లునేషనల్జియోగ్రఫీఛానల్లోవీక్షించినమంచుగడ్డలుగ్లె్సియర్నుండివిడిపోయిసముద్రంలోపడిపోతున్నప్రాంతందరిదాపుల్లోకిమేంఅతిసమీపంలోఉన్నట్లుగాఅనిపించింది.సముద్రంలోతెలియాడ్తున్నమంచుముక్కలనుదాటుతూపడవఇంకాముందుకుప్రయాణించింది.మాకుకొంతదూరంలోపెద్దగ్లేసియర్నుండివిడివడినపెద్దపెద్దమంచుగుట్టలుసముద్రంలోపడిపోతున్నదృశ్యంసాక్షాత్కరించింది. ఇంకో 30 నిమిషాలుప్రయాణించిగ్లెషియర్ప్రాంతంలోచాలాసేపుఅలానేమంచుగుట్టలుగుట్టలుగావిరిగిపడేదృశ్యాలనుచూస్తూఅక్కడేగడిపాం.

    వాతావరణంలోపెరిగిపోతున్నకాలుష్యం, గ్లోబల్వార్మింగ్కారణంగామంచుపర్వతాలుకరిగిపోవడం, సముద్రమట్టాలుపెరిగికొన్నికొన్నిద్వీపకల్పాలు, చిన్నచిన్నప్రాంతాలుసముద్రంలోమునిగిపోయే

    విషయాలనుమనంవార్తల్లోవింటుంటాం, చదువుతాం,కానీపర్యావరణపరిరక్షణవిషయంలోఆచరణయోగ్యమైనకార్యక్రమాలకుపౌరులుగామనందూరంగాఉంటాం. దేశాధినేతలుసరేసరే.  మేంఆగ్లేషియర్ప్రాంతంలోతిరిగాడిందికేవలంఒకగంటమాత్రమేఅయినాతీవ్రమైనవేడికిగుట్టలుగుట్టలుగాసముద్రంలోపడిపోతున్నమంచుపెళ్ళలుచూసిమానసికంగాఆందోళన, బాధరెండుకలిగాయిపర్యావరణప్రేమికుడిగా, ఉద్యమకారుడుగాఉన్ననాకు. కొంతసమయంఅదేప్రాంతంలోతిరుగాడినమాపడవమమ్మల్నితిరిగిసేవార్డ్తీరప్రాంతంలోకికొన్నిగంటల్లోతీసుకువచ్చింది. ఎంతోకాలంగాప్రత్యక్షంగాచూడాలనుకున్నకోరికనెరవేరిందికానీ, గ్లోబల్వార్మింగ్కారణంగామనకుప్రకృతిఇచ్చినవనరులనుమనంమనముందుతరాలకుపూర్తిగాఇవ్వలేకపోతామేమోఅన్నబాధమనసులోమెదులుతుంటే. సేవార్డ్ప్రాంతంలోనిడౌన్టౌన్ప్రాంతంచేరుకొనికొంతసేపువిహరించిరాత్రి11 గంటలప్రాంతంలోమారూమ్కివెళ్ళాం.

    ఆమరుసటిరోజుఉదయంసేవార్డ్నుండి50 కిలోమీటర్లదూరంలోనిఆరులక్షలఎకరాల్లోవిస్తరించిఉన్నకెనయ్జోర్డ్స్నేషనల్పార్కులోవిస్తరించిఉన్నపార్క్పరిసరాలుమరియుగ్లేసియర్చూడ్డానికివెళ్ళాం. పదివేలసంవత్సరాలక్రితంనుండిఉన్నఈగ్లేసియర్వాతావరణపరిస్థితులకారణంగా, ప్రపంచవ్యాప్తంగావస్తున్నభౌగోళికమార్పులు, గ్లోబల్వార్మింగ్కారణంగాఆగ్లె్సియర్అంతరించిపోతుండడంచూశాకఎంతోబాధగాఅనిపించింది. దాదాపు4000 అడుగులఎత్తైనఈఎగ్జిట్గ్లేసియర్గత250 సంవత్సరాలుగాపర్యావరణంలోవస్తున్నమార్పులకారణంగాదాదాపు50 శాతంఅంతరించిపోయింది. మేంమాకార్పార్కింగ్వద్దనుండిగ్లేసియర్ప్రాంతంవైపుచేరేసమయంలోఆప్రాంతంలోపర్యావరణపరిస్థితులనుఅధ్యయనంచేస్తున్నశాస్త్రజ్ఞులుప్రాంతాలవారీగాఏ, ఏసంవత్సరంలోఎంతభాగంగ్లేసియర్అంతరించిపోయిందోతెలిపేవిధంగానిర్థిష్టంగాబోర్డ్స్పెట్టడంచూసిఎంతోకలవరానికిగురయ్యా. ప్రపంచవ్యాప్తంగాఎంతోమందిపర్యావరణఉద్యమకారులుఎంతగాఉద్యమాలుచేస్తున్నా, పర్యావరణవిధ్వంసంఇంకాకొనసాగుతూనేఉంది. నాలుగువేలఅడుగులఎత్తైనప్రాంతంలోఉన్నగ్లేసియర్చూడటానికిమేముడొంకదారుల్లోఅతిప్రయాసతోప్రయాణించాం. ఎత్తైనప్రదేశాలుఎక్కుతూదిగుతూ. ముందుగాగ్లేసియర్కరగడంవల్లవిస్తరించిఉన్నమైదానప్రాంతంమీదుగావెళ్లాలనుకున్నాం.  కానీగ్లేసియర్కరగడంవల్లవస్తున్ననీటిప్రవాహవేగానికివీలుకాకపోవడంతోఆమార్గంద్వారాకాకుండాపైకిఎక్కడానికిగుట్టలమధ్యనుండిఏర్పడిఉన్నమరోకష్టమైనమార్గాన్నిఎంచుకొనిముందుకుసాగాం.

    దాదాపు500 అడుగులవెడల్పు2000 అడుగులఎత్తులోఉన్నగ్లేసియర్లోదాదాపుసగభాగంపూర్తిగావట్టిపోయికేవలంసగభాగంమాత్రమేమంచుతోకప్పబడిఉంది. సూర్యరశ్మివేడికికరిగిపోయినగ్లేసియర్తాలూకునీరుక్రిందకుపారుతూకనిపించింది. చుట్టూచెట్లు-గుట్టలతోకనిపిస్తున్నఈప్రాంతంలోనేఎలుగుబంట్లుకూడాసంచరిస్తున్నాయనితెలుసుకొనిచూడాలనేకుతూహలంఉన్నాఅవిచూస్తే, మేంఅందమైనలోకాన్నిఇంకాచూడలేమేమోఅన్నభయం, అవికనిపిస్తేవచ్చేఅనర్ధాలను, ప్రమాదాలనుఊహించుకొనిఅక్కడినుండితిరిగివెనకకుబయలుదేరాం. దారిలోమధ్యాహ్నభోజనంముగించుకొనిసేవార్డ్నుండిమౌంట్మెకన్లీవైపుగాసాగిందిమాప్రయాణం.

    సేవార్డ్నుండిమౌంట్మెకన్లీపర్వతందాదాపు576 కిలోమీటర్లు. డేనాలిగాఉన్నపేరును2015 లోమౌంట్మెకన్లీగామార్చారు. దీన్నిట్రంప్వచ్చాకమళ్లీ2025 లోడెనాలిగామార్చారు. సముద్రమట్టానికి20310 అడుగులఎత్తైనపర్వతశిఖరాగ్రంఈప్రాంతంలోఉంది. ప్రపంచంలోనేదీన్నిఅతిఎత్తైనమంచుశిఖరంగాకూడాపేర్కొంటారు.

    మధ్యాహ్నంభోజనంతర్వాతసేవార్డ్నుండిమౌంట్మెకన్లీరావడానికిదాదాపు8 గంటలప్రయాణంచేయవలసివచ్చింది. సేవార్డ్ప్రాంతంనుండితిరిగివస్తుదారిలోనిఅలస్కావైల్డ్లైఫ్కన్సర్వేషన్సెంటర్లోకివెళ్ళాం.  200 ఎకరాలవిస్తీర్ణంలోఏర్పాటుచేయబడ్డఈకన్సర్వేషన్సెంటర్లోగాయపడి, అనాధలై-రక్షించబడినవివిధజంతువులకుదాతలుఇచ్చేవిరాళాలతోఆశ్రయంకల్పిస్తున్నారు.

    అలస్కాప్రపంచంలోనేఅత్యధికంగాజంతువులుఉన్నప్రాంతానికిప్రసిద్ధి. ఈప్రాంతంవిస్తీర్ణంలోఅటవీప్రాంతాలు, సముద్రప్రాంతాలు, కొండప్రాంతాలు, గ్లేసియర్స్ప్రాంతాలుఒకదాన్నిమించిఇంకొకటిపోటీపర్యాటకులనుఅలరిస్తూఉంటాయి. అటవీప్రాంతంగుండాసాగేప్రయాణాలుఎక్కువగాఉండటంతోఈప్రాంతంలోయాదృచ్ఛికంగాజరిగేప్రమాదాలుకూడాఎక్కువే.  ఈప్రమాదాల్లోగాయపడినజంతువులనురక్షించబడినజంతువులనుఈకన్సర్వేషన్సెంటర్లోచేరుస్తుంటారు. ఎంట్రీఫీజ్35 డాలర్లుగాఉన్నఈకన్సర్వేషన్సెంటర్లోమనండబ్బురూపేణాఇచ్చేఎంట్రీఫీజ్కూడాజంతువులసౌకర్యాలకోసంవినియోగిస్తుంటారు. ఈకన్సర్వేషన్సెంటర్లోనిజంతువులన్నీఎంతోఆరోగ్యంగాఅటవీవాతావరణంలోనివసిస్తునట్లుగానేదృఢంగాఉన్నాయి. వివిధఎంక్లోజర్లలోఉన్నబోల్డ్ఈగల్, బ్లాక్బేర్,  బ్రౌన్బేర్,  కోయేటిస్, డీర్, ఎల్క్,  ఫాక్సస్,  గ్రేట్హార్నర్, ఔల్, లైన్స్, మూస్, ముస్కాస్, ముళ్ళపంది, రెయిన్డీర్, వోల్వ్స్‌, వుడ్బేసిన్జంతువులను, పక్షులనుచూసితదుపరిప్రయాణంకొనసాగించాం. దారి

    పొడవునాఈప్రాంతంచూడ్డానికివస్తున్నయాత్రికులుతప్పపెద్దగాసంచారంలేదు.  చాలాప్రాంతాల్లోఇంటర్నెట్సౌకర్యంకూడాలేదు. కేవలండౌన్లోడ్చేసుకున్నరూట్మ్యాప్లద్వారామాత్రమేఈప్రదేశంచూడ్డానికిప్రయాణంచేయాల్సిఉంటుంది. దారిపొడుగునాప్రయాణంచేస్తున్నామధ్యలోశాఖాహారభోజనానికిచాలావెతుక్కోవాల్సివచ్చింది. దారిలోచాలాప్రాంతాల్లోప్రకృతివైపరీత్యాలవల్లకాలిపోయినచెట్లుకొన్నివందలఎకరాల్లోకనిపించాయి. రెండుమూడుచోట్లవర్షాలకుకృంగిపోయినరోడ్లువాటిరిపేర్లకోసందారిమళ్లించినరహదారిద్వారాప్రయాణిస్తూరాత్రి11 గంటలసమయంలోమౌంట్మెకన్లీప్రాంతంలోమేంబుక్చేసుకున్నఅతిథిగృహానికిచేరుకున్నాం. అత్యంతవిశాలంగాఉన్నఈఅతిథిగృహాల్లోమాకుకేటాయించినరూమ్కివెళ్లడానికికొంతసమయంపట్టింది. చలిఎక్కువగాఉన్నందునవార్మ్అప్కోసంఆపరిసరప్రాంతంలోనిచలిమంటవేడిలోగడిపిరాత్రిభోజనంముగించుకొనిరూమ్కివెళ్ళాం. రోజంతావిపరీతంగాతిరగడంవల్లఅలసిపోయినిద్రలోకిజారుకున్నాం.

    ఆమరుసటిరోజుఉదయంమౌంట్మెకన్లీఅతిథిగృహంనుండి40 కిలోమీటర్లదూరంలోఉన్నతలకీత్నాఅనేప్రాంతానికిబయలుదేరాం. ఆరోజువాతావరణపరిస్థితుల్లోఅనూహ్యంగామార్పులువచ్చిఆకాశమంతామేఘావృతమైఉండివిపరీతమైనవర్షంవచ్చేపరిస్థితులు, వాతావరణంకూడాపూర్తిగాచల్లగామారిపోయింది. అలస్కాలాంటిప్రాంతాల్లోవాతావరణపరిస్థితులుఏర్పడిఎప్పుడూఒకేలాఉండవు. కొంచెంసేపట్లోనేవర్షం, ఆపిదపమరికొంచెంసేపట్లోఎండరావడంమాములే.కానీవర్షపువాతావరణంకొనసాగుతూనేఉందితలకీత్నావెళ్లేసమయానికివర్షంకొంచెంపెరుగుతూకొంచెంతగ్గుతూఉంది.

    ఆరోజుటిమాప్రణాళికప్రకారండేనాలిలోనిఅతిఎతైనపర్వతశిఖరం, గ్లేసియర్స్చిన్నవిమానంలోచూసుకునిఆపరిసరప్రాంతంలోనిడేనాలినేషనల్పార్క్అంతాకారులోనేతిరగాలి. కానీవాతావరణపరిస్థితులుఅనుకూలించకపోవడంతోఎతైనశిఖరంతోకూడినగ్లేసియర్స్చూసేవిమానప్రయాణంతప్పనిపరిస్థితుల్లోరద్దుచేసుకున్నాం. వాతావరణంలోఎలాంటిమార్పులులేకపోవడం, ఉదృతంగావర్షంవచ్చేఛాయలుకనిపించడంతోడేనాలినేషనల్పార్క్వెళ్లాలనేఆలోచనకూడామానుకున్నాం. తలకీత్నపరిసరప్రాంతంలోఉన్నఅతిపురాతనకట్టడాలనుచూస్తూ,వస్తువులప్రదర్శనశాలలోసమయంగడుపుతూ, ఆగ్రామంసమీపంలోనినదితీరంలోమంచుకరుగుతూఉదృతంగాప్రవహిస్తున్ననదినిగమనిస్తూచాలాసమయంగడిపాం. ప్రయాణంలోఒకరోజుఇలాపూర్తిగావృధాఅయింది. సాయంత్రంవరకువాతావరణంలో

    ఎలాంటిమార్పుకనిపించకపోవడంతోమళ్ళీతిరిగిమౌంట్మేకన్లీలాడ్జికివెళ్లిపోయిఆపరిసరప్రాంతంలోనిఅటవీప్రాంతంలోపర్యటించిరూమ్కివెళ్లిసేదతీరాం.

    ఆమరుసటిరోజుఉదయంమళ్ళీమౌంట్మేకన్లీలాడ్జినుండితలకీత్నవెళ్లిఅక్కడినుండిచిన్నవిమానంలోడేనాలినేషనల్పార్క్లోనేకాకుండాప్రపంచంలోనేగ్లేసియర్స్తోకూడుకోనివున్నఅతిఎతైనశిఖరంఅయినడేనాలిపర్వతప్రాంతం, ఆపరిసరప్రాంతాల్లోనిగ్లేసియర్స్చూడ్డానికివెళ్ళాం. ఆకాశంలోనిమేఘాల్లోవిహారిస్తూ, ఆపరిసరప్రాంతాల్లోనిమంచుపర్వతాలనుపోలివున్నగ్లేసియర్స్, గ్లేసియర్స్నుండిఎండవేడికికరిగిప్రవహిస్తున్నమంచునీరులోయల్లోకిపారుతూసర్పాకృతిలోఉన్ననదులను, నదుల్లోకలుస్తున్నపిల్లకాలువలను, ఆప్రాంతంఅంతాదట్టంగాఉన్నదేవదారుచెట్లతోఉన్నఅడవులనువీక్షిస్తూఒకగంటసేపుప్రయాణించిసముద్రమట్టానికి 20390 అడుగులఎతైనశిఖరంసమీపంలోనిగ్లె్సియర్లోవిమానంనుండిదిగాం. ఆగ్లె్సియర్అంతాపూర్తిగామంచుతోకప్పబడినట్టుగాఉంది. మంచులోదిగాకమాలోఆనందంఅంబరమంతఅయ్యింది. జీవితంలోగ్లేసియర్స్తోకూడుకున్నఅలస్కాచూడాలనుకున్నకలనెరవేరింది. ఆమంచులోనేచాలాసేపువిహరించిఫ్లైట్అటెండెంట్సూచనతోమళ్ళీఫ్లైట్ఎక్కితిరిగితల్కీత్నప్రాంతంచేరుకొనిమౌంట్మేకన్లీలోనిమాఅతిధిగృహనికివెళ్లిపోయాం.

    లాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపేరుగాంచినముఖ్యప్రదేశాల్లోఒకటైనఅలస్కాయాత్రపూర్తిఅయింది. ఇంకాలాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపిలువబడేనార్వేమరియుఫిన్లాండ్ప్రాంతాలుకూడాచూడాలనికోరికబకెట్లిస్ట్లోరాసుకునిఈప్రాంతాలుకూడాఅవకాశాన్నిబట్టివెళ్లాలానేనిర్ణయంతోవాటికోసంప్రణాళికలుకూడాఆలోచించడంప్రారంభించా.   

    అలస్కాలోవిహరించిన 7రోజులుపూర్తిగాప్రకృతిలోమమేకమైజీవించడం, ఉదృతంగాప్రవహిస్తున్నజలాలగలగలలు, గాలులగుసగుసలు, పక్షులకిలకీలారావాలు, ఆకాశంలోరంగులుమార్చుకుంటున్నమేఘాలు, సముద్రంలోనివసించికనువిందుచేసేసముద్రసింహాలు, చేపలుతిమింగళాలవిన్యాసాలు, ఎతైనగుట్టలపైతిరుగాడేమౌంటైన్గొఱ్ఱెలు, నేషనల్పార్కులోదూరంగాతిరుగుతున్నబ్లాక్బేర్లు, పూర్తిగామంచురూపంలోఉండేతెల్లనినక్కలు, సాల్మన్చేపలుతినిరంగుమారిముదురుగోధుమరంగులోకనిపిస్తున్నఎలుగుబంటులుఈప్రాంతంలోమేంచూసినఅరుదైన, అందమైనఅపురూపమైన

    జ్ఞాపకాలనుపదిలంగాభద్రపరచుకొనిఆమరుసటిరోజుమళ్ళీఇంకో 8 గంటలుప్రయాణించివిమానంలోచికాగోచేరుకున్నాం.

    7780698038

    Rssr1955@gmail.com

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    మనోరంజకం ( కథ)

    by Shyama Dasi May 30, 2026
    written by Shyama Dasi

    “ఏమోయ్! ఎక్కడా ? ఫోన్లో అమ్మాయి మాట్లాడుతున్నది. త్వరగారా! “
    నారాయణరావు అరుపుకు, ‘వారం అయింది అమ్మాయి ఫోన్ చేసి ఎందుకు చేయలేదో మరి‘
    అనుకుంటూ అదే ఆలోచనలో కాఫీ కలుపుతూ ఉన్న సునీత,భర్త పిలుపుతో
    “ఆ! వచ్చే, వచ్చే” తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది.
    “ఇదిగో, మాట్లాడు ” అంటూ, నారాయణ రావు ఫోన్ భార్యకు అందించాడు.
    “ఆ! శ్రీలు ఎలా ఉన్నారు? “
    “అంతా బాగానే ఉన్నామమ్మా, కొత్త ఉద్యోగం కొంచెం పని ఎక్కువగానే ఉంటున్నది, నేను ఫ్రీ అయిన టైంలో మీకు అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేస్తే కంగారు పడతారని చేయలేదు అలా వారం గడిచిపోయిందమ్మా “
    ‘’ అలా కాదు శ్రీలు ఏ టైం అయినా పర్వాలేదు ఒక్కసారి పలకరించావంటే స్థిమితంగా ఉంటాము సరేనా తల్లీ!”
    “అలాగే అమ్మా, ఈ సమ్మర్ లో ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నామమ్మా …. డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వివరంగా చెప్తాను. “
    “అవునా, చాలా సంతోషం శ్రీలు.ఎండలు ముదరకముందే వచ్చేందుకు చూడండి. అలాగే నీకేం కావాలో కూడా ముందుగానే చెప్పు వచ్చినప్పటినుండి పరుగులే మీకు. పాప ఎలా ఉంది. అల్లుడు గారు బాగున్నారు కదా, అత్తమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? మనవాళ్లంతా క్షేమమే కదా! “
    “అందరం బాగున్నామమ్మా. ఈయన వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నారు. పాప బాగుంది. త్వరలో చూస్తారు కదా.
    మనవాళ్ళందరిని కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాయనమ్మ తాతయ్య ఎలా ఉన్నారు?”
    “తాతయ్య పరవాలేదు శ్రీలు. నాయనమ్మ ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెడుతున్నది. ఆ గది దగ్గరకే వెళుతున్నాను పలకరించుకో చాలా సంతోషపడతారు”
    మామగారికి ఫోన్ ఇచ్చి సగంలో వదిలేసిన కాఫీపని చూసేందుకు సునీత వంటగది వైపు కదిలింది.
    “మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరo హాల్లో కూర్చున్నపుడు. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందోనని నన్ను కనిపెట్టుకొనుoటూ, ఎక్కడికి కదలలేకున్నారు మీరు. పిల్లదాన్ని చూసి రెండేళ్లు దాటింది, ఫోనులో మాట్లాడుతున్నా, వీడియోలో చూస్తున్న, దగ్గరకు చేర్చుకోవాలన్న తపన తీరడం లేదు. దాని బిడ్డకు కూడా ఏ అచ్చట ముచ్చట తీర్చలేక పోతున్నాము.”
    అంటూ అత్తయ్య బాధపడుతుంటే,
    “అమ్మా!ఊరుకో, ఆ వెలితి తీర్చేందుకే నీ మనవరాలు వస్తున్నానని చెప్పింది కదా, నీ ఆయాసం అంతా ‘వూష్ కాకి ‘ అయిపోయి, చక చకా లేచి తిరుగుతావు చూడు.”
    అంటూ మావారు ఉడికించారు. మావయ్య నవ్వుతూ చూస్తున్నారు.
    శ్రీ లాస్య మా ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెరిగింది. అపురూప లావణ్యం అందమైన మనసున్న తనంటే మా బంధు వర్గానికి అంతా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. అనుకోకుండా వచ్చిన సంబంధం, అందరికీ నచ్చినప్పటికీ, అమెరికా అనేసరికి, అంత దూరమా అని ఆగిపోయాము. కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి,
    “అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు కూడా చక్కగా కుదిరింది. అమ్మాయిని గురించి మీరు దిగులు పడకండి. మా ఇద్దరు పిల్లలు వసుధ, కృష్ణ చైతన్య ఇద్దరూ అట్లాంటాలో ఉంటారు. మీకు తెలుసు మా అమ్మాయికి పెళ్లయి ఇద్దరు పిల్లలు. మేము వారికిఐదారు గంటల ప్రయాణ దూరంలో సిన్సినాటిలో స్థిరపడ్డాము. తరచూ కలుస్తుంటాము. మా బంధు బలగమంతా కూడా అమెరికాలోనే ఉన్నారు.”
    అంటూ మాకు నచ్చచెప్పి శుభస్య శీఘ్రం అనిపించారు. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా, తప్పదు కదా అలవాటు పడ్డాము. ఏడాదికి ఒకసారి తను రావడమో మేం వెళ్లడమో జరుగుతుండటం, శ్రీలు డెలివరీ సమయంలో అక్కడే ఆరు నెలలు ఉన్నాము . పాపకిప్పుడు ఐదేళ్లు. మా అత్తయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత రెండేళ్లుగా మేము వెళ్లలేకపోయాము, ఉద్యోగాల మార్పులు,’ వీసా’ ప్రాబ్లమ్స్ తో శ్రీలు వాళ్ళు కూడా రాలేకపోయారు. ప్రొద్దున మాట్లాడినప్పటినుండి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత పడుతున్నాము.

    తీరా శ్రీలు వాళ్ళు వస్తున్న రోజు దగ్గర పడుతున్న కొద్ది మనోబలం కంటే మించింది లేదు అన్నట్లు మంచంపై నుండి కాలుకింద పెట్టేందుకు ఆయాస పడుతూ ఇబ్బంది పడుతున్న మా అత్తయ్య, మావారు అన్నట్లుగానే ఉత్సాహంగా ఆ పని ఈ పని అందుకుంటూ హడావిడి పడసాగారు.
    “సునీతా, ఎలాగూ శ్రీలు వాళ్ళు శ్రీరామనవమికి ఇక్కడే ఉంటారు కనుక, మనవాళ్లందరినీ ఇక్కడికే రమ్మని చెబుదాము. అందరం ఒకచోట కలిసినట్లు ఉంటుంది. పైగా శ్రీలు వాళ్లు కూడా ఎండలకు తిరిగే పని తప్పుతుంది ఏమంటావు? “
    అన్నాడు నారాయణరావు. ఈ ఆలోచన బాగుందనిపించింది అందరికీ. అలాగే చేద్దాం అనుకున్నాము. మా పుట్టిల్లు, మా ఆడపడుచులు అందరివి,మాఊరుకి యాభై కిలోమీటర్ల దూరాల్లో ఊర్లే. అదీ కాక,మాఊర్లో ప్రసిద్ధి పొందిన రామాలయం, శివాలయాలు ఉన్నాయి. శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు కనుక చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు కూడా ఇక్కడకు చేరుతారు.

    పండక్కు వారం ముందుగా శ్రీలు, మా అల్లుడుగారు కృష్ణచైతన్య, పాప వచ్చారు. శ్రీలును దగ్గరకు తీసుకుని అత్తయ్య ఆపుకోలేక ఏడ్చేశారు . నా కళ్ళల్లో తడి గుండెల్లో భారాన్ని తగ్గించింది. మావారి పరిస్థితి,మామయ్య స్థితి కూడాఅంతే. అల్లుడు గారిని సాదరంగా పలకరించుకుని దగ్గరకు తీసుకున్నారు. పాప పేరు శ్రీనిధి అమ్మానాన్నల అందమంతా పుణికి పుచ్చుకొని కుందనపు బొమ్మలా ఉంది. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నది దాంతో జేజవ్వ తాతయ్యల మురిపాలకు పొద్దు చాలడం లేదు, కథలు చెప్పమంటూ పాపవారిని వదలడం లేదు కూడా .

    మరో రెండు రోజులకు బంధువులందరూ కూడా వచ్చేశారు. వాళ్ళ ఇళ్ళకు పిలిచి భోజనం పెట్టి పంపలేదు అన్న కొరత అందరిలో ఉన్నా, వచ్చిన మూడు వారాలకు అందులో ఎండలకు ఇబ్బంది పడతారని అందరూ ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. తన వయసు పిల్లలతో నిధి కూడా బాగా కలిసిపోయి ఆడుకుంటున్నది.
    అల్లుడుగారు కూడా కొత్త పాత లేకుండా మొదటి నుండి అందరితో కలిసి పోయారు. శ్రీలు అత్తగారు మాకు, బంధువులందరికీ కూడా పేరుపేరునా బహుమతులు పంపించారు.

    శ్రీరామనవమి పండుగ సంబరాలకు దేవాలయాల ముందు,ఇళ్ల ముందు తాటాకు చలువ పందిళ్లు వేసి, మామిడి తోరణాలు కట్టి ఊరును ముస్తాబు చేస్తారు. రంగులు రాట్నాలు, రకరకాల అంగళ్ళు, సందడి చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు పీచు మిఠాయితో చేతికి వాచీలు, ఉంగరాలు పెట్టించుకుని అవి(నాక్కుంటూ) రుచిచూస్తూ తిరగడం, రకరకాల ఆట బొమ్మలు, గాలి బుడగలుకొనడం సరదాలు. అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టి పెద్దపెద్ద కుండలలో తాగే నీరు,మజ్జిగ, పానకం సిద్ధం చేస్తారు. వేడిని తగ్గించే పానకం, వడపప్పు ఈ పండుగ ముఖ్య ప్రసాదాలు. పొద్దున్నే అందరo స్నానపానాదులు, పూజా కార్యక్రమాలు, ముగించుకుని దేవాలయానికి బయలుదేరాము. కన్నుల పండువగా జరిగిన సీతారామ కళ్యాణం చూసి తరించి కల్యాణ అక్షింతలు తలపై చల్లుకొని,కొన్ని అక్షింతలు శ్రీలు వాళ్ళతోఅమెరికా పంపేoదుకు తీసుకొని ఇంటికి చేరాము.

    ఆరోజు రాత్రి ఆరు బయట చల్లగాలికి మధ్య మధ్యలో విసన కర్రలతో విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు, రోజంతా పండుగ సందడిని గమనిస్తూ ఉన్న నిధి,జేజి తాతయ్య ఒడిలో కూర్చుని ,

    “తాతయ్యా! శ్రీరామనవమి అంటే ఏంటి ” అని అడిగింది.
    “రాముడు పుట్టినరోజు తల్లీ” అంటూ పెద్ద వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పే పండుగ విశేషాలు వినాలని అందరం మాటలు ఆపి కుతూహలంగా కూర్చున్నాము.
    నిధి తలనిమురుతూ నీలాగ’ రామ ‘అనే పేరును కూడా పలుకలేని అడవిలో పక్షులను జంతువులను చంపుకుని తింటూ బ్రతికే ఒక బోయవానికి, నారాయణ నామాన్ని పలుకుతూ నారదముని కనిపించి, ఇలా ప్రాణులను చంపడం పాపమని చెప్పి’ మరా ‘ మరా’ అని పలికించి నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేవరకు ఇలాగే పలుకుతూ ఉండాలని చెప్పి వెళ్ళాడట. ఆ బోయవాడు ముని చెప్పినట్లు మరా, మరా అని చెబుతూ అక్కడే కూర్చుండిపోయాడు అంట. అదే రామ రామ అనే శబ్దంగా వినిపిస్తూ, ఆ బోయవాడు వాల్మీకి మహర్షిగా మారిపోయి మనందరికీ శ్రీరామ కథను చెప్పాడు తల్లి. రాముడు నీలాగా చాలామంచివాడు, ఎంతో బుద్ధిమంతుడు, అందరి పట్ల దయతో ఉండేవాడని చెబుతూ, రామచంద్రుని జననం, సీతా కళ్యాణం, వనవాసం, రామ భక్తుడైన హనుమంతుని గురించి,రావణ సంహారం, రామ పట్టాభిషేకం, లవకుశల జననం, అవతార సమాప్తి. ఒక్కొక్క ఘట్టాన్ని, వింటూ అందరం రామ కథలో, లీ నమైపోయాము. అందరి కళ్ల వెంట కన్నీళ్లు కారుతున్నాయి.
    రాముడు లేడా!వెక్కి వెక్కి ఏడుస్తున్న నిధిని, సముదాయిస్తూ, రాముడు ఎక్కడికి వెళ్లిపోలేదు తల్లి మనతోనే ఉన్నా డు. రామ అని పలికితే హనుమంతుడు కూడా మన పక్కనే ఉంటాడు. అలా అయితే తాతయ్యా!రాముడిని పిలుస్తూ హనుమంతుని నా పక్కనే ఉంచుకుంటాను. అని చెబుతుంటే దాని బుద్ధి సూక్ష్మతకు, విశ్వాసానికి అందరం క్షణం సేపు నివ్వెర పోయాము.

    తాతయ్య అందరి వైపు చూస్తూ, పదిపాకలున్న పల్లైనా రామాలయం తప్పక ఉంటుందన్నది మనమెరిగిన విషయమే కదా! సాయంత్రాలు తప్పనిసరిగా పిల్లలతో కలసి ,ఊరి వారందరూ అక్కడ చేరి రామ భజన చేస్తారు.
    ఏ మహిమలు చూపని మనుజావతారం రామావతారం. రాజు గా ప్రజల పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల విధేయత, భార్యాభర్తల అనుబంధం, సోదరులపట్ల అనురాగం, ఆశ్రమ వాసుల పట్ల రక్షణ, స్నేహ ధర్మం, శరణన్న శత్రువునైన క్షమించగలిగే ఔదార్యం. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు. తాను నడిచి చూపి,మన జీవితాలకు ఆదర్శంగా నిలిచాడు. అందరి నాలుకలపై పలుకు తేనెలు కురిపించే రామనామం మన బతుకునావను ఆత్మస్థైర్యంతో నడిపే శక్తినిస్తూ ఒడ్డుకు చేరుస్తుంది.
    శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంకర్కాటక లగ్నం లో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు. శ్రీరాముని జన్మదినంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా నవమినాడే జరిగిందని ఆ రోజే కళ్యాణం కూడా జరుపుతారు, వనవాసానంతరం పట్టాభిషిక్తుడు అయ్యిందికూడా నవమినాడే అని చెప్తారు. రామ పట్టాభిషేకం పటoలేని, ఇల్లుఉండదు. పూజామందిరమూ ఉండదు. ముఖ్యంగా పెళ్లిళ్లలో,సీతా సమేతుడై, సింహాసనం పై కూర్చుని, సోదరులను, హనుమంతుని, సకల దేవతలను కూడిన శ్రీరామచంద్రుని తప్పక పూజిస్తాము.
    శ్రీరామనవమి పండుగ మన తెలుగు లోగిళ్ళలో వసంతోత్సవం పేరిట తొమ్మిది రోజులు చాలా వైభవంగా జరుపుకుంటాము. మార్చి అంటే ఎండలు మొదలవుతాయి కాబట్టి వడపప్పు, మిరియాలు వేసిన బెల్లo పానకం, ప్రసాదంగా పంచి పెడతారు. వడపప్పు పానకం చలువనిచ్చి సేద తీరుస్తాయి. విసెన కర్రలు కూడా పంచుతారు. దేవాలయాల్లో ముఖ్యంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. గత ఏడాది మనమంతా భద్రాచలం వెళ్లి కళ్యాణం చూసి వచ్చాము కదా అంటూ తాతయ్యగుర్తు చేస్తూ, శ్రీరామ రామరామేతి
    రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం
    రామనామ వరాననే అని మూడుసార్లు పలికించి కళ్యాణ అక్షతలు అందరిపై చల్లాడు.

      ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు.శ్రీలు వాళ్ళు ఊరికి వెళ్లే రోజు వచ్చింది. అందరి మనసులు భారంగా ఉన్నాయి అయినా, అక్కడ వాళ్లు దేనికి కొరత పడకూడదని, పచ్చళ్ళు, ఊరగాయలు, పొడులు,చిరు తిండ్లు. అన్నీ హాలంతా పరుచుకున్నాయి., ఇంకా బంధువులు ఇచ్చిన గిఫ్టులు, శ్రీలు అత్త,ఆడపడుచుల కొరకు మేం పంపుతున్న ప్రత్యేక బహుమతులు. ఇవన్నీచూస్తూ చైతన్య మేము తీసుకెళ్లేందుకేనా, విమానం సరిపోతుందా! అంటూ నవ్వుతుంటే! చూసేందుకు అలా అనిపిస్తుంది కానీ, తలా కాసింత పంచుకుంటే పూర్తిగా సరిపోవు కూడా అంటూ మా అత్తయ్య తనే స్వయంగా సర్దుతూ చెబుతుంటే, ఆమెను నొప్పించకూడదని మీరన్నది నిజమే అమ్మమ్మ, తనూ సూట్ కేసులు సర్దేందుకు కూర్చున్నాడు కృష్ణ చైతన్య. శ్రీలు వస్తానని ఫోన్లో చెప్పిన రోజు నుండి ఇప్పటివరకు మా అత్తయ్యేనా అని అబ్బురపరుస్తూ మందులకు మించిన శక్తి మనసుకు ఉందేమో అనిపిస్తున్నది.
      ఈసారి పాప కూడా బాగా చేరిక అయ్యి విడవలేకున్నాము. అయినా పసిది బెంగ పడుతుందని నిబ్బరంగామళ్లీ వాళ్లు రాబోయే రోజు కొరకు ఎదురు చూస్తూ అందరం మామూలుగా మసలాము. మనోరంజకమైన మన పండుగ పరమార్థం తెలుసుకున్న మనుమరాలు మరో దేశం వెళ్ళింది

      May 30, 2026 0 comment
      0 FacebookTwitterPinterestEmail
      కథలు

      ప్రేమ ఖరీదు.

      by Thatikola Padmavathi May 30, 2026
      written by Thatikola Padmavathi

      మాధవరావుకి ఇద్దరు ఆడపిల్లలే. ఉన్నంతలోనే పెద్ద కూతురు ఆరాధ్యకు డిగ్రీ వరకు చదువు చెప్పించాడు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
      “ఆరాధ్యకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఇంకా పై చదువులు చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అప్పటివరకు పెళ్లి చేసుకోను అన్నది.
      “నీకు ఇంకా పై చదువులు చెప్పిస్తే నీకన్నా ఆపై ఎక్కువగా చదువుకున్న వాడిని తీసుకురావాలి. నీ చెల్లెలు శాంతి ఇంటర్లో ఉన్నది. దానికి కూడా డిగ్రీ పూర్తి చేయించాలి.
      “నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అక్కడికి మా బాధ్యత సగం తీరిపోయినట్లు ఉంటుంది అన్నారు మాధవరావు.
      “నాకు ఇష్టం లేకుండా మీరు సంబంధాలేవి చూడకండి. నేను చేసుకోనని గట్టిగా చెప్పేసింది ఆరాధ్య.
      “పెళ్లి చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు. ఉద్యోగం కూడా చేయొచ్చు. పెళ్లికి దీనికి ముడి పెట్టవద్దన్న ఆరాధ్య వినలేదు.
      “దాని కర్మ మనమేం చేస్తామని ఊరుకున్నారు. ఆరాధ్య ఎంబీఏ లో చేరింది. డిగ్రీలో పరిచయమైన విశ్వం ఆరాధ్యను ప్రేమిస్తున్నాడు. ఉద్యోగాలు వచ్చాక ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అందుకే ఆరాధ్య పెళ్లికి అడ్డు చెప్పింది.
      “నాలుగేళ్లు వాళ్ళ ప్రేమను గోప్యంగా దాచి పెట్టారు. ఆరాధ్య చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగంలో చేరింది.
      “ఆరు నెలలు గడిచిన విశ్వానికి ఉద్యోగం దొరకలేదు.
      “విశ్వం పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇప్పుడు కాదంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నది ఆరాధ్య.
      “ఒకరోజు నిలదీసి అడిగేసరికి ఉద్యోగం లేని వాడికి ఇంటి అల్లుడుగా మా వాళ్ళు ఒప్పుకోరు అంది.
      “మీ వాళ్ళు ఒప్పుకోరా! నీకే ఇష్టం లేదా! నువ్వు ఇదివరకులా నాతో ఫ్రీగా మాట్లాడటం లేదు. ఒకప్పుడు కాస్త సమయం దొరికితే చాలు సినిమాలకి షికారులకి తిరిగేవాళ్ళం. నీకు ఉద్యోగం వచ్చాక మనిద్దరి మధ్య ఎడబాటు పెరిగింది. నీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పమన్నాడు విశ్వం.
      “నిజంగానే ఈమధ్య విశ్వం మీద ఆరాధ్యకు ప్రేమ తగ్గిపోయింది. తనకోసం మంచి మంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆస్తి అంతస్తులో విశ్వం కంటే గొప్ప వాళ్లే వస్తున్నారు.
      “ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మనిద్దరి కులాలు ఒకటి కావు. వాళ్లని ఎదిరించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నది.
      “ఆరాధ్య మనసులో ఉన్న మాటలు బయటపెట్టేసరికి విశ్వంకు కోపం వచ్చింది.
      “నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆరేళ్ల నుంచి నా చుట్టూ తిరిగి నాతో స్నేహం చేశావు. సినిమాలు షికార్లకు తిప్పి డబ్బు ఖర్చు పెట్టించావు. పుట్టినరోజు, పార్టీ లంటూ రెస్టారెంట్లకి తిప్పావు. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నావా! నీకు నా మీద ఉన్న ప్రేమంతా ఏమైపోయింది. నువ్వు కాదన్నా నేను వదిలేది లేదు. అనుకున్నట్లు మన పెళ్లి జరిగిపోవాల్సిందే అన్నాడు.
      “విశ్వం గట్టిగా అడిగేసరికి ఆరాధ్య అహం దెబ్బతిన్నది.
      “ఏంటి? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని రూలేమన్నా ఉన్నదా! అప్పటి పరిస్థితులు వేరు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ కలగడం లేదు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. జరిగిందంతా మర్చిపోయి నువ్వు కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. అంతేకానీ నా పెళ్ళికి, నా సుఖానికి అడ్డు రావద్దు. కాదు కూడదని ఏమైనా ప్రయత్నం చేశావనుకో! నేనేం చేస్తానో అంటూ విశ్వాన్ని లెక్కచేయకుండా వెళ్లిపోయింది ఆరాధ్య.
      “ఎంత పొగరు! చూస్తా! ఎలా సుఖపడుతుందో నన్ను కాదని పెళ్లి చేసుకున్నా కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తానంటూ శపధం చేశాడు.
      “విశ్వం మాటలు పట్టించుకోలేదు ఆరాధ్య. అనుకున్నట్లుగానే ఆరాధ్య ఉద్యోగంలో చేరగానే గొప్ప గొప్ప పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తనకంటే ఆస్తిపరుడు, ఎక్కువ జీతం సంపాదించే శేఖరంని చూసి ఇష్టపడింది. నిజంగా చెప్పాలంటే ఇది కూడా ప్రేమ వివాహమనే చెప్పాలి. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు. ఒక ముహూర్తాన ఇద్దరూ ఒకటయ్యారు.
      “మొదటి రాత్రి గదిలోకి వెళ్లి ఎదురుచూస్తున్నాడు శేఖరం. తెల్ల చీరలో అందంగా ముస్తాబై పాల గ్లాసు చేత పట్టుకొని సిగ్గుపడుతూ గదిలోకి అడుగు పెట్టింది ఆరాధ్య.
      “ఆమె చేతిలోని గ్లాసుని పక్కనపెట్టి రెండు భుజాలు పట్టుకొని మెల్లగా మంచం వైపు అడుగులు వేస్తూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు.
      సిగ్గుతో రెండు చేతులతో ముఖం కప్పుకుంది.
      “ఇదంతా సిగ్గేనా? ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు? ఆమె ముఖాన్ని చేతుల నుంచి తొలగించాడు.
      “ఈరోజు మన మొదటి రాత్రి”, మనసులు తనువులు పంచుకునే వేళ. మన మనసులు ఎటువంటి అరమరికలు ఉండకూడదు. మనసు విప్పి ఉన్న దున్నట్లు నిజం చెబితే మనిద్దరి మధ్య అపార్థాలకు తావుండదు. ఏమంటావు అన్నాడు శేఖరం.
      “మీరు చెప్పింది నిజమే! మీరు కూడా నా నుంచి ఎటువంటి నిజాలు దాయకూడ దన్నది ఆరాధ్య.
      “ఓకే! లేడీస్ ఫస్ట్ అన్నారు. ముందు నువ్వే చెప్పాలి అన్నాడు.
      “ఎందుకైనా మంచిది. ముందు చెబితే సరిపోతుంది. తర్వాత తెలిసినా ప్రమాదం ఉండదనుకొని ఆరాధ్య విశ్వంతో నడిపిన ప్రేమాయణం మొత్తం చెప్పేసింది.
      “నాకు లాగానే నీకు కూడా లవ్ ఎఫైర్ ఉందన్నమాట”
      “అంటే మీ వెంట కూడా అమ్మాయిలు వెంటపడేవారా?
      “ఏం! ఎందుకు పడరు. అందుట్లో నేను అందగాడిని! నావైపు ఆశగా చూసేవాళ్ళు వున్నారు.
      “మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా! మీరే ప్రేమించారా?
      “నేనైతే ఎవరిని ప్రేమించలేదు. ఒక అమ్మాయి మాత్రం నా వెంటపడి ప్రేమించింది. ఇప్పటికీ నా మనసులోనే ఉందనుకో!
      “మీ మనసులో ఆ అమ్మాయి నుంచు కొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆ పిల్లనే చేసుకోకపోయారా! అంటూ చిరు కోపం నటించింది.
      “ఈ బుంగమూతిలో నువ్వెంత అందంగా ఉన్నావో! చెప్పనా?
      “నా అందం సంగతి సరే! ముందు అమ్మాయి సంగతి చెప్పండి. మీ మనసు నుంచి ఆ అమ్మాయిని తీసేస్తేనే ఈరోజు మనం మొదటి రాత్రి జరుగుతుంది. లేకపోతే మీరక్కడ నేనిక్కడ అంటూ దూరం జరిగింది.
      “పిచ్చి పిల్లా! భర్త పరాయి స్త్రీని మనసులో దాచుకుంటే సహించలేని దానివి. నా మనసులో నువ్వు తప్ప రెండో వారికి స్థానం లేదు. నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను. అర్ధేచ కామేచ, మోక్షేచ, నాతిచరామి అంటూ నిన్ను పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నువ్వే నా భార్యవి. నువ్వే నా ప్రేయసివి కూడా. మాటలతోనే నిద్రపుచ్చుతావా! ముద్దు ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు శేఖరం.
      “వాళ్ళ వైవాహిక జీవితం ఆనంద సాగరంలో మునిగితేలుతున్నది.
      “జీవితం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆరాధ్య ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
      “ఉన్నట్లుండి ఆరాధ్య జీవితంలోకి అనుకోని తుఫాను వచ్చి పడింది.
      “అర్ధరాత్రి 12 గంటలకి గాఢ నిద్రలో ఉన్నారు ఆరాధ్య ఆమె భర్త శేఖరం. ఫోన్ రింగ్ అయినా శబ్దం ఇద్దరికీ వినబడలేదు. రెండోసారి రింగ్ అయ్యేసరికి ఆరాధ్య కళ్ళు తెరిచి చూసింది. భర్త ఆదమరచి నిద్రపోతున్నాడు. మెల్లగా లేచి వెళ్లి కాల్ చూసింది. అంతే ఒక్కసారి ఆమె గుండె ఝల్లుమంది.
      “ఇతనా! ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు కాల్ చేసినట్లు. తిరిగి కాల్ చేయాలంటే భయం వేసింది. భర్తకి మెలకువ రాలేదు. అదే ఫోన్ మళ్ళీ రింగ్ అయింది.
      “లిఫ్ట్ చేయక తప్పలేదు. తన గొంతు తనకే వినబడనంతగా మెల్లగా ఎవరూ అన్నది.
      “నేనెవరో గుర్తుపట్టలేదా! గుర్తుపట్టిన ఎవరో తెలియనట్టు నటిస్తున్నావా! నేను నీ ప్రేమ పిపాసిని. నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను. నిన్ను నీడల్లే వెంటాడుతూనే ఉంటాను. ఎందుకంటే నీ మీద ప్రేమ అంత గొప్పది!
      “ఇంతకీ నీకేం కావాలి? నాకు పెళ్లయిన విషయం నీకు తెలుసు అనుకుంటాను. ఎప్పుడో మర్చిపోయిన నిన్ను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకెప్పుడూ ఫోన్ చేయకు అంటూ కట్ చేసింది.
      “ఏ.సి రూము అయినా ముఖమంత చెమటలు పడుతున్నాయి. శేఖరం లేవలేదు. బతికిపోయాననుకుని గుండెల మీద చెయ్యి వేసుకుంది. మంచం మీద పడుకున్నదన్న మాటే గాని నిద్ర పట్టడం లేదు. శేఖరం చూడలేదు చూసి ఉంటే ఏం జరిగేది?
      తన ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలుసు. అప్పటి పాత నెంబరు మార్చేసింది. అయినా ఫోన్ నెంబర్ తెలుసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకు చేసినట్టు. “బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడా! మళ్లీ చేసినప్పుడు చూసుకోవచ్చులే అని తనకు తానే ధైర్యం చెప్పుకోంది”.
      “తెల్లవారి లేచాక యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ పోతున్నది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించింది. భర్తకి బాక్స్ సర్దితను సర్దుకుంది. భార్యాభర్తలిద్దరు ఎవరి ఆఫీసులకు వాళ్ళు చేరుకున్నారు.
      ఆఫీసుకు వెళ్లిందన్న మాటే గాని వర్క్ చేయ బుద్ధి కాలేదు. మనసంతా చికాకుగా ఉంది. దానికి తోడు తలనొప్పి ఎక్కువైంది. సెలవు చెప్పి ఇంటికి వచ్చేసింది. ఎంత మర్చిపోదాం అనుకున్నా మనసులో భయం చోటుచేసుకుంది.
      “అది మొదలు ప్రతిరోజూ అర్ధరాత్రి పూట ఫోన్ రావడం ఆరాధ్య భయం భయంగా లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఆరోజు రాత్రి పది మిస్సిడ్ కాల్స్ వచ్చాయి. ఆరాధ్య గాఢ నిద్రలో మునిగి ఉంది.
      “కాల్ రాగానే శేఖరం లేచి లిఫ్ట్ చేశాడు. హలో నేను అడిగింది ఏం చేసావు? 10 లక్షలు ఇస్తానంటే ఓకే.! నా దగ్గర ఉన్న నీ వీడియోలు డిలీట్ చేస్తాను. అంత డబ్బు ఇవ్వలేకపోతే చెప్పు మీ ఆయన ఊర్లో లేనప్పుడు అప్పుడప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వెళ్తుంటాను. నాకు ఏదైనా పర్వాలేదు. నీకు ఏది ఇష్టమో చెప్పు. ఇంకా వెయిట్ చేయడం నావల్ల కాదంటున్నాడు.
      “హలో! మిస్టర్! నువ్వు చెప్పిన దాంట్లో నీకు ఏది ఇష్టమో చెప్పు ఆలోచిస్తాను అన్నారు శేఖరం.
      “ఓ! మీరే నా ఆరాధ్య భర్త. నా రెండు డిమాండ్స్ మీరు విన్నారు కదా. మీ ఆవిడ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. చూపించమంటారా అన్నాడు.
      “చూడు విశ్వం. నీ పేరు నీ కథంతా నాకు తెలుసు. ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతూ ప్రేమని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకునే వాడివి. ఆరాధ్య నాకు అంతా చెప్పింది. నీ దగ్గర వీడియోలు ఉన్నాయని నాకు తెలుసు. నీకు భార్య పిల్లలు ఉండే ఉంటారు. వాళ్లకోసం నువ్వేమైనా చేయగలవు. నేను కూడా అందుకు సిద్ధమే!
      “అయితే ఒక విషయం మనం డీల్ కుదుర్చుకునే ముందు నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు శేఖరం.
      “విశ్వం ఏమిటో చెప్పమన్నాడు.
      “ఆరాధ్య నువ్వు ప్రేమించుకున్నారని విషయం మా పెళ్ళికి ముందే అన్ని విషయాలు దాచకుండా నాకు చెప్పింది. ప్రేమించడం, ప్రేమించబడటం అనేవి వ్యక్తిత్వాన్ని బట్టి నచ్చుతాయి. బాధ్యతారహితంగా ప్రవర్తించే వాడిని ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటుంది. ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలి కానీ ద్వేషంతో వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూడకూడదు.
      “ప్రేమించబడిన వాళ్లు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ప్రేమంటే ఏమిటో తెలుసా? ప్రేమ విలువలతో కూడుకున్నది. దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, లైలా మజ్నుల ప్రేమ కథలు వినలేదా? పెద్దవాళ్లు అంగీకరించలేదని వాళ్ళ ప్రేమను త్యాగం చేసుకున్నారు. చివరికి చావుకు కూడా సిద్ధపడ్డారు. ప్రేమ కోసం కట్టుబాట్లలను పెంచుకొని పగ, ప్రతీకారాలు రగిలించుకోకుండా వాళ్ల ప్రేమకు సమాధులు కట్టుకున్నారు. పవిత్రమైన ప్రేమని ఆరాధించారు. ప్రేమించిన స్త్రీ కోసం వీడియోలు అడ్డం పెట్టుకుని ఏం సాధిస్తావు? పెళ్లయినాస్త్రీ జీవితాన్ని నాశనం చేసి అపవిత్రం చేస్తావా? లేకపోతే ప్రేమని డబ్బుతో కొనుక్కుంటావా?
      “ఆరాధ్య భర్తగా చెప్తున్నాను. కాదు కూడదని నీ డిమాండ్లకు లొంగి రాలేదని ప్రమాదం తలపెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ సహించను. చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుంది. ఒకసారి నీ భార్య పిల్లల్ని దృష్టిలో పెట్టుకో! మనసు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు శేఖరం.
      నీ ఆర్థిక అవసరాలకు ఏమైనా సాయం కావాలంటే అడుగు చేస్తానన్నాడు.
      “నాలుగు రోజుల తర్వాత పగటిపూట కాల్ చేశాడు విశ్వం. రాత్రివేళ కుదరదని పగలు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి వీడికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందేనను కొన్నది ఆరాధ్య.
      “ఫోన్ లిఫ్ట్ చేయగానే సారీ ఆరాధ్య! నువ్వు చెప్పాలనుకున్న గుణపాఠం మీ వారు చెప్పారు. నా కళ్ళు తెరిపించారు. నువ్వెక్కడున్నా నీ సుఖమే కోరుకుంటాను. నా నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నీ భర్త పిల్లలతో సుఖంగా ఉండమంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వం.
      “పక్కనే ఉండి అంతా విన్న శేఖరం అదంతా నేను చూసుకున్నాను. నీకేం భయం లేదంటూ ప్రేమగా భార్యని హృదయానికి హత్తుకున్నాడు.
      “ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో కోరుకుంటే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఆచితూచి అడుగులు వేయాలి అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు.

      May 30, 2026 0 comment
      0 FacebookTwitterPinterestEmail
      Uncategorized

      కాలభైరవాష్టమి ప్రాధాన్యత – విశ్వ నియమాల దృష్టి

      by dr. Lakkraju Nirmala May 30, 2026
      written by dr. Lakkraju Nirmala

      కాలాన్ని నియంత్రించే శక్తి కాలభైరవుడు. అశ్టమి తిథి ఆయనకు అత్యంత అనుకూలమైన శక్తి తరంగాలు ప్రసరించే సమయం. ఈ రెండూ కలిసినప్పుడు మనిషి జీవితంలో సమయం, కర్మ, శక్తి, భయం, అడ్డంకులు అన్నీ ప్రబలంగా మారుతాయి. ఈ రోజు విశ్వ నియమాలు అసాధారణంగా పనిచేస్తాయి.

      లా ఆఫ్ డివైన్ ఆనెస్స్ (ఐక్యత నియమం)
      కాలభైరవుడు కాలమనే విశ్వ శక్తి.
      అతనిని ఆరాధించడం అంటే మనలో ఉన్న కాల–ప్రజ్ఞను మేల్కొలపడం,
      మన శరీర రితువులతో (బయోలాజికల్ క్లాక్),
      మనసుతో, ఆత్మతో విశ్వప్రవాహం ఒకటిగా పనిచేసేలా చేయడం.
      అర్థం:
      ఈ రోజున చేసిన ధ్యానం మన అంతర్గత శక్తిని కాల ప్రవాహంతో కలుపుతుంది.
      తప్పిపోయిన సమయాన్ని తిరిగి సరి చేసుకునే అవగాహన వస్తుంది.

      1. లా ఆఫ్ వైబ్రేషన్ (కంపన నియమం)
        భైరవుడు అధిక తీవ్రత గల రక్షణాత్మక వైబ్రేషన్.
        అష్టమి తిథి చంద్రశక్తులు కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి పైకి లేవడం జరుగుతుంది.
        ఎందుకు ప్రభావం ఎక్కువ?
        ఈ రోజున భైరవ మంత్రం, భైరవ యంత్రం, ధ్యానం చేసినప్పుడు
        వైబ్రేషన్ శరీరంలోని
        మూలాధార
        స్వాధిష్ఠాన
        మనీపూర
        చక్రాలలోని భయాలు, అనిశ్చితి, గత కర్మ బంధాలు విడిచి పోతాయి.
      2. లా ఆఫ్ కార్మా (కర్మ నియమం)
        కాలభైరవుడు కాలాన్ని మాత్రమే కాదు, కర్మ ప్రవాహాన్ని కూడా నియంత్రించేవాడు.
        ఈ రోజున
        చేయబడిన శుద్ధి (repentance)
        చేసిన పూజ
        ఇచ్చిన దానం
        చేసిన సేవ
        కర్మఫలాన్ని సాధారణ దినాల కంటే వేగంగా ఇస్తుంది.
        అందుకే ఈ రోజున
        పాపాలు క్షమించబడతాయి,
        మనసు తేలిక అవుతుంది,
        కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
      3. లా ఆఫ్ అట్రాక్షన్ (ఆకర్షణ నియమం)
        ఈ రోజున మనస్సు భయంలేని స్థితికి చేరుతుంది.
        భయం తొలగితే ఆకర్షణ శక్తి పది రెట్లు పెరుగుతుంది.
        కాబట్టి ఈ రోజున:
        కోరికలు
        ధృడ సంకల్పాలు
        లక్ష్యాలు
        రక్షణ ప్రార్థనలు
        విశ్వానికి స్పష్టంగా చేరతాయి.
      4. లా ఆఫ్ యాక్షన్ (కార్య నియమం)
        భైరవుడు చర్య యొక్క దేవత.
        అంటే ఈ రోజున మనం మొదలు పెట్టిన పని
        ధైర్యం, స్పీడ్, నిర్ణయం అనే శక్తులతో నిండిపోతుంది.
        కాబట్టి ఈ రోజున:
        కొత్త వ్యాపారం
        కొత్త నిర్ణయం
        కొత్త సాధన
        కొత్త జీవన విధానం
        ప్రారంభించటం శుభం.
      5. లా ఆఫ్ కరెస్పాండెన్స్ (లోపలి – బయట సంబంధం)
        కాలభైరవాష్టమి రోజున లోపల ఉన్న భయాలు ప్రశాంతం అవుతాయి.
        లోపలి భయాలు తగ్గితే బయట జీవితం కూడా సరిగా నిలబడుతుంది.
        లోపల శాంతి = బయట రక్షణ
      6. షడ్చక్రాల దృష్టిలో ప్రాధాన్యత
        కాలభైరవుడు ప్రధానంగా మూలాధార చక్రం యొక్క అధిపతి.
        ఈ రోజున అయన శక్తి ప్రభావం పడేది:
      • మూలాధారము – భయం తొలగిస్తుంది
      • స్వాధిష్ఠానము – స్థిరత్వం ఇస్తుంది
      • మనీపూరము – ధైర్యం & నిర్ణయ శక్తి ఇస్తుంది
        ఈ రోజు ధ్యానం చేసినవారికి
        మానసిక దౌర్బల్యం తొలగి
        ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
      1. పంచభూతాల దృష్టిలో
        కాలభైరవుడు
        అగ్ని తత్త్వాన్ని శుద్ధి చేస్తాడు
        గాలి తత్త్వాన్ని సమసమానంగా చేస్తాడు
        భూమి తత్త్వాన్ని స్థిరపరుస్తాడు
        అంటే శరీరంలో
        వేడి
        ఒత్తిడి
        అలసట
        భయం
        తగ్గుతాయి.
      2. ఈ రోజున లభించే ఫలితాలు
        విశ్వ నియమాల ప్రకారం:
        గత కర్మాల శుద్ధి
        భయం, అడ్డంకుల తొలగింపు
        కోరికలు వేగంగా నెరవేరటం
        ఆర్థిక రక్షణ
        కుటుంబ రక్షణ
        చెడు శక్తుల నుండి విముక్తి
        మనసు–శరీరం సమతుల్యం
        ధైర్యం, స్పష్టత, నిర్ణయం
      3. ఆచరణ పద్ధతి (సరళమైనది)
      4. 8 దీపాలు వెలిగించండి (అష్టమి శక్తి)
      5. “ఓం కాళ భైరవాయ నమః” 108సార్లు చెప్పండి
      6. నువ్వుల నూనె దీపం వేయండి
      7. ఒక మంచి పని చేయండి (దానం, సేవ)
      8. రాత్రి ధ్యానం – 8 నిమిషాలు
        సారాంశం
        కాలభైరవాష్టమి అనేది ఒక ఇంటి పండుగ కాదు,
        ఒక దేవాలయ పూజ కాదు,
        ఇది కాలం – కర్మ – భయం – రక్షణ అన్న నాలుగు విశ్వ నియమాలు ఒకే స్థలం, ఒకే రోజున పనిచేసే సమయంలో నిర్మించిన విశ్వ శక్తి.
        ఈ శక్తిని గ్రహించినవారి జీవితం
        వేగంగా మారుతుంది,
        శుభ పథం లోకి వెళుతుంది,
        అడ్డంకులు చదరంగం లాంటి వేగంతో తొలగిపోతాయి.
      May 30, 2026 0 comment
      0 FacebookTwitterPinterestEmail
      Newer Posts
      Older Posts

      Recent Posts

      • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
      • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
      • ఎన్నికలు- యువతరం
      • మార్పు కోసం నా అక్షరాలు
      • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

      @2021 - All Right Reserved to Mayuukha The Magazine


      Back To Top
      మయూఖ
      • హోమ్
      • కవితలు
      • కథలు
      • ధారావాహిక నవల
      • వ్యాసాలు
      • బాల‌సాహిత్యం
      • ఇంద్రధనుస్సు
      • ఇంట‌ర్వ్యూలు
      • పుస్త‌క స‌మీక్ష‌
      • అనువాద సాహిత్యం
      • About Us