మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

కరణ్ బజాజ్

by Taniparti NarayanaRao September 29, 2024
written by Taniparti NarayanaRao

అనగనగా ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నవలా రచయితయ్యాడు, అమ్మ పోయిన బాధలో యోగిగా మారాడు, అకస్మాత్తుగా సన్యాసం వీడి పారిశ్రామికవేత్తగా అవతరించాడు. ఓ స్టార్టప్ ని ప్రారంభించిన పద్దెనిమిదినెలల్లోనే దానికి 2240 కోట్ల రూపాయల విలువ కల్పించి… అనూహ్యంగా అమ్మేశాడు! అదికూడా జూమ్ మీటింగ్ లోనే, కొనేవారిని ముఖాముఖి కలవకుండా. ప్రస్తుతం అతని వయస్సు 42. చిన్న వయసులోనే ఇన్ని అవతారాలెత్తిన ఆ యువ యోగి-కమ్ -పారిశ్రామికవేత్త కరణ్ బజాజ్ ! చిత్రమైన అతని కెరీర్ ప్రయాణమే భారతీయ స్టార్టప్ రంగంలో గత ఏడాది హాట్ టాపిక్ . ఆ ప్రస్థానం గురించి కరణ్ మాటల్లోనే.

న్యూయార్క్ నగరంలో అదో పెద్ద రెస్టరంట్ . అక్కడ మా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ జరుగుతోంది. ఆ రాత్రి కడుపునిండా తిన్నాను… పీకల్దాకా తాగాను. ఫ్రెండ్స్ తో ఉబుసుపోక కబుర్లేవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత చేస్తున్నా నా మనసులో బాధ తగ్గడంలేదు. పొగిలి పొగిలి వస్తున్న దుఃఖం ఆగట్లేదు. అప్పటికి అమ్మ చనిపోయి ఆరునెలలవుతోంది. క్యాన్సర్ తో బాధపడుతూ… మృత్యువుతో నిస్సహాయంగా పోరాడుతూ… నా కళ్లెదుటే చనిపోయింది. అమ్మ కోసం నెలన్నరపాటు సెలవుపైన ఇండియా వచ్చిన నేను ఆ బాధలన్నీ అతిదగ్గరగా చూశాను. మృత్యువు తనని నా నుంచి ఇలా దూరం చేయడం తట్టుకోలేకపోయాను. అప్పటిదాకా నేను చాలా పరిణతి ఉన్నవాడిననీ, తార్కిక బుద్ధి ఉన్నవాడిననీ… అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అమ్మ మరణం నన్ను చిన్నపిల్లాడిలా… బేలగా మార్చింది. ఆ దుఃఖం ఓ వైపున ఉంటే మరో వైపు నాలో ఎన్నో ప్రశ్నలు. ‘అసలేమిటీ జీవితం… పుట్టుకేమిటీ? చావడమేంటీ? పెళ్ళీ పిల్లలూ సంసారం… వీటి గమ్యమేంటీ!’ ఇలా ఎన్నో తాత్విక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఈ బాధలూ, ప్రశ్నల నుంచి బయటపడదామనే ఆ రోజు పార్టీకి వచ్చాను. ఇక్కడ వేదన పెరుగుతోందే కానీ తగ్గలేదు. నా ఫ్రెండ్ కెరీతో ఇవన్నీ చెప్పుకుని ఏడ్చేశాను. తను ఓ ఐడియా చెప్పింది. ‘ఓ పని చేద్దాం కరణ్ … ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం. అవి మన బాధని ఎంత వరకు తగ్గిస్తాయో చూద్దాం… తగ్గేంత వరకూ తిరుగుతూనే ఉందాం!’ అంది. నాకూ ప్రయాణాలంటే ఇష్టమే కాబట్టి ఆ తర్వాతి వారమే అమెరికా నుంచి బయటపడ్డాం. మమ్మల్ని బాహ్యప్రపంచంతో బంధించే సెల్ ఫోన్ , నెట్ , బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ వదిలేసి ప్రయాణం కట్టాం. అప్పటిదాకా… ఓ సగటు భారతీయుడు అమెరికాలో కోరుకునే విలాసాలన్నీ అనుభవిస్తూ వచ్చినవాణ్ణి నేను. అమెరికాలోని క్రాఫ్ట్ ఫుడ్స్ అనే సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కులోని ఓ పెద్ద లగ్జరీ ఫ్లాట్ లో నివాసం. అన్నింటినీ వద్దనుకుని కేవలం ఓ జతబట్టలు సర్దుకుని నేనూ కెరీ బయలుదేరాం. స్కాట్లాండ్ లోని బౌద్ధ కేంద్రానికి ఫ్లైట్ లో వెళ్లాం కానీ… ఆ తర్వాత మేం చేసిన ప్రతి ప్రయాణం రోడ్డుపైనే. ఇంచుమించు కాలినడకనే… అదీ ఇండియాదాకా! ఆ యాత్ర నన్ను యోగిని చేసింది. ఆ స్థితి నుంచి పారిశ్రామికవేత్తగా ఎందుకయ్యానో వివరించే ముందు… నా గురించి ఇంకాస్త చెప్పాలి మీకు…

బెస్ట్ సీఈఓగా గుర్తింపొచ్చినా..

మా నాన్న ఆర్మీ ఆఫీసర్ . ఆయనకి ఎన్నో బదిలీల తర్వాత మేం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో స్థిరపడ్డాం. అక్కడి ఆర్మీ స్కూల్ లో చదువుకున్నాను. ఎంత బాగా చదువుతూ ఉన్నా సరే, నా మనసంతా ఎదురుగా ఉన్న హిమాలయాలపైనే ఉండేది… వాటిని ఎప్పుడు అధిరోహించాలా అని మనసు ఉవ్విళ్లూరేది. ప్లస్ టూ తర్వాత బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో చేరాను. ఆ తర్వాత మేనేజ్ మెంట్ పైన ఆసక్తి పుట్టి బెంగళూరు ఐఐఎంలో సీటు సాధించాను. అక్కడ ఎంబీఏ ముగించగానే ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) సంస్థలో మార్కెటింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లలోనే ఆ సంస్థ తయారుచేస్తున్న ఏరియల్ వాషింగ్ పౌడర్ కి బ్రాండ్ మేనేజర్ గా అమెరికాకి వచ్చాను. ఏరియల్ తో నేను సాధించిన విజయానికి గుర్తుగా అమెరికాకి చెందిన యాడ్ -ఏజ్ సంస్థ 2007లో ‘టాప్ మార్కెటీర్ 40 అండర్ 40’ జాబితాలో నన్ను చేర్చింది. కానీ ఆ విజయాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించలేకపోయాను. టీనేజీ నుంచి నాలో ఏదో మూల ఉన్న ‘రచయితని కావాలనే కల’ నన్ను వెంటాడింది.

రచయితని కావాలంటే కొద్దిగానైనా ప్రపంచాన్ని చూడాలి కదా అనిపించింది! దాంతో ఆరునెలలు సెలవుపైన మొదట దక్షిణ అమెరికా దేశాలైన పెరూ, చిలీ, అమెజాన్ ప్రాంతాలనీ, తూర్పు యూరప్ దేశాలనీ, మంగోలియానీ చూశాను. ఈ ప్రయాణంలో నేను చూసిన అసాధారణ వ్యక్తులకే నా ఊహల్నీ జోడించి ‘కీప్ ఆఫ్ ది గ్రాస్ ’ అనే నవల రాశాను. ‘నేనూ రచయితనైపోయానోచ్ …’ అంటూ ఆనందంతో అమెరికా వస్తే అక్కడ ఆర్థిక సంక్షోభం విలయ తాండవం చేస్తోంది! దాంతో నా ఉద్యోగం పోయింది. అప్పటికి నా వయసు ముప్పై ఏళ్లు. నాతోటివాళ్లంతా పెళ్లై కార్లూ, ఆస్తులని కొనుక్కుంటూ ఉంటే నేను మాత్రం ఉన్న డబ్బంతా పర్యటనలోనే ఖర్చుచేసేసి… అమెరికాలోని మా అక్కవాళ్లింట్లో తలదాచుకున్నాను. దాంతో కుటుంబం, బంధువులే కాదు స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ హేళనల మధ్య నాకు ధైర్యం నూరిపోసింది అమ్మే. తనిచ్చిన ధైర్యంతో ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ బోస్టన్ కన్సల్టన్సీ గ్రూప్ (బీసీజీ)లో చేరాను. అందులో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను. ఈలోపు 2010లో నా మొదటి ఇంగ్లిష్ నవల ఇండియాలో అచ్చయి సూపర్ హిట్టయింది! అప్పట్లో పేరున్న రచయితల పుస్తకాలే ఐదువేల కాపీలు పోవడం గగనమైతే… నా మొదటి పుస్తకం ఏడాదిలోనే 70 వేల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. అది నా జీవితాన్ని మార్చింది. ఈలోపు నా మొదటి పుస్తకం ముద్రించిన సంస్థవాళ్లు రెండో నవల రాయమన్నారు. రాద్దామని కూర్చుంటే… ఏ కొత్త ఆలోచనలూ రాలేదు. మొదటి నవలతోనే నా సరుకంతా అయిపోయిందనిపించింది. దాంతో, నవల రాయడం కోసమే బ్యాగ్ సర్దుకుని ప్రయాణాలు మొదలుపెట్టాను. ఈసారి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆ అనుభవంతో మరో పర్యటక నవల ‘జానీ గాన్ డౌన్ ’ రాశాను. అది లక్ష కాపీలు దాటింది. దాన్ని సినిమాగా తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు కాపీ రైట్స్ తీసుకున్నారు! ఆ తర్వాత క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా మారాను. ఈ విజయాలన్నీ ఆనందిస్తుండగానే అమ్మ మరణం… ఓ సునామీలా నన్ను ముంచెత్తింది. ఆ ఊపిరాడని పరిస్థితిలోనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టాను.

అదే ధర్మం అని తెలిసింది.

కెరీతో నా ప్రయాణంలో కొన్ని దేశాల్లో ప్లాట్ ఫామ్ పైన పడుకున్నాం. కొన్నిసార్లైతే ఆగకుండా 50 కిలోమీటర్లూ ప్రయాణించాం. అలా ఇండియా వచ్చి మదురైలోని శివానంద ఆశ్రమంలో చేరాం. రెండు నెలలపాటు అతికఠినమైన శిక్షణ ఇచ్చారక్కడ. ఉదయం ఐదున్నరకే లేచి మంచుగడ్డని తలపించే చన్నీళ్లలో స్నానం చేయడం, కటిక నేలమీద పడుకోవడం, రోజూ యోగా, ధ్యానం మా జీవిత దృక్పథాన్నే మార్చింది. ఆ తర్వాత రుషికేష్ లోని శివానంద ఆశ్రమానికి వెళ్లాం. అక్కడే నేను సన్యాసిగా మారాను. ఏడాది తర్వాతే నాలో చైతన్యం మొదలైంది. మన భారతీయ చింతన ప్రకారం… ప్రతి జీవికీ తాను మాత్రమే నెరవేర్చగల కర్తవ్యం ఒకటి ఉంటుంది. దాన్ని స్వధర్మం అంటారు. నేను ఓ యోగిగా హిమాలయాల్లో ఉండగలిగినా… నా స్వధర్మం పెద్ద సంస్థల్ని సృష్టించడమేనని అర్థమైంది. దాంతో సన్యాసానికి స్వస్తి పలికాను. అమెరికా వచ్చి కెరీని పెళ్ళి చేసుకున్నాను. ఆధ్యాత్మిక జీవనం మనస్సునీ, శరీరాన్నీ శక్తిమంతం చేయడమే కాదు… ప్రాపంచిక వ్యవహారాల్ని తామరాకుమీద నీటిబొట్టులా చూసేలా చేసింది. కోపతాపాలకి దూరం చేసింది. కాకపోతే, ఇంత పరిణతి తర్వాతా ఓటమి నాకు ఎదురవుతూనే వచ్చింది…

వరుస అపజయాలు.

భారతదేశంలో యోగిగా నా ఆధ్యాత్మిక అనుభవాలతో ‘ది సీకర్ ’ అనే నవల రాశాను. దాదాపు 62 పుస్తక ప్రచురణ సంస్థలు దాన్ని తిప్పికొట్టాయి! చివరికి పెంగ్విన్ సంస్థవాళ్లు అచ్చేసినా… ఆశించినంతగా అమ్ముడు పోలేదు. ఆ తర్వాత ఓ స్టార్టప్ లో పెట్టుబడులు పెడితే అందులోనూ నష్టం వచ్చింది. ఆ తర్వాత డిస్కవరీ ఛానెల్ ఇండియా సంస్థకి వైస్ ప్రెసిడెంట్ ని అయ్యాను. ఆ సంస్థ కోసం కొత్తగా హిందీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ మొదలుపెట్టాను. మరెన్నో చేయాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు. నా ఉద్యోగం కాస్తా నెలకోసారి వెళ్లి ప్రధానమంత్రినీ, మంత్రుల్నీ కలవడంతోనే సరిపోయేది. అది నాకు సరిపడక రాజీనామా చేశాను. అంత మంచి హోదాకి రాజీనామా చేశానని తెలిసి నా భార్యవైపు వాళ్లు నన్ను పిచ్చోడిలా చూడటం మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లల తండ్రిగా నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏ అత్తామామలు భరిస్తారు చెప్పండి! కానీ ఒకప్పుడు మా అమ్మ చేస్తున్నట్టు ఇప్పుడు మా ఆవిడ నన్ను వెనకేసుకొచ్చింది. ‘అతనో క్రియేటర్ … తను ఇలాగే ఉండగలడు!’ అని తనవాళ్లతో వాదించింది. తనకి నాపై ఉన్న ఆ నమ్మకమే నా ‘వైట్ హ్యాట్ జూనియర్ ’ సంస్థకి పునాది!

శిక్షకులందరూ మహిళలే.

పిల్లలకి కంప్యూటర్ కోడింగ్ ని ఓ ఆటలా నేర్పించే సంస్థ నాది. ఆన్ లైన్ లో ఇలాంటి శిక్షణ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వడం లేదని తెలిసి దీన్ని మొదలుపెట్టాను. కేవలం మహిళల్ని మాత్రమే టీచర్లుగా తీసుకున్నాను. ఇందుకూ… మా అమ్మ జీవితమే కారణం. అమ్మ అప్పట్లోనే పీజీ చేసినా నాన్న బదిలీల కారణంగా తనకంటూ కెరీర్ లేకుండా పోయింది. తనలోని ఆ బాధని నేను చిన్నప్పటి నుంచీ చూస్తూ వచ్చాను. అందుకే, నేను కోడింగ్ కోచ్ లుగా మహిళలు మాత్రమే ఉండాలనుకున్నాను! ఏ కాస్త ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చినా వాళ్లు అద్భుతాలు చేస్తారనే నమ్మకం నాలో బలంగా ఉండేది. మావాళ్లు దాన్ని నిజం చేశారు!

ఆ అద్భుతాలు ఇవి.

కేవలం పదిమంది ఉద్యోగులతో నా సంస్థని 2018 అక్టోబర్ లో ప్రారంభించాను. మొదటి ఏడునెలలు పెద్దగా లేదుకానీ ఆ తర్వాత పిల్లలూ, తల్లిదండ్రుల నుంచి మేం ఆశించిన స్పందన మొదలైంది. దాంతో టీచర్ల సంఖ్యని నాలుగు వందలకి పెంచాం. అక్కడి నుంచి మరో నాలుగు నెలల్లో నాలుగువేలకి చేర్చాం. అమెరికాలోనూ ఈ సేవలు అందించడం ప్రారంభించాం. రెవెన్యూ పది కోట్ల నుంచి వందకోట్ల మైలురాయిని అందుకుంది. రోజువారి క్లాసుల సంఖ్య పాతికవేలకి చేరింది. దాంతో బైజూస్ మా సంస్థని కొంటామంటూ ముందుకొచ్చింది. సుమారు రూ.2,240 కోట్లు… నగదుగా ఇస్తానంది! కేవలం ఏడాదిన్నర వయసే ఉన్న సంస్థకి ఇంత డిమాండు రావడం ఓ రికార్డు. నాకూ బైజూస్ ద్వారా నా ఆలోచనలు మరింత ఎక్కువమందికి చేరడం మంచిది అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. సంస్థని అమ్మినా సీఈఓగా నిర్వహణ బాధ్యతలన్నీ నేనే చూస్తున్నాను. మా టీచర్ల సంఖ్యని లక్షమందికి చేర్చడం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం ప్రస్తుతం నా లక్ష్యాలు. ఇవి పూర్తయ్యాక ఎప్పట్లాగే మరో సరికొత్త రంగంవైపు వెళ్లాలనుంది..!

మా ఆవిడ కెరీ చాలా గ్రేట్.

మా ఆవిడ కెరీ, నేనూ, మా ఇద్దరు పాపలు నీలా, రూమీ అందరం ముంబయిలోనే ఉంటున్నాం. మా ఆవిడ పిల్లల పోషకాహార నిపుణురాలు. తను లేకపోతే నా విజయాలే లేవని చెప్పడం అరిగిపోయిన రికార్డ్ లోని వాక్యంగా అనిపించొచ్చుకానీ… అది వందకు వెయ్యిశాతం నిజం. తనకే నా మీద నమ్మకం లేకుంటే ఇన్ని అపజయాల తర్వాత నిలదొక్కుకునేవాణ్ణి కాదు. బైజూస్ డీల్ తో సంస్థ ప్రొమోటర్ గా వెయ్యి కోట్లు వచ్చినా… ఒకప్పటి మా సన్యాస జీవితమే అలవాటై మేం సొంత ఆస్తులేవీ కొనలేదు. మాకు సొంతిల్లూ, కారూ లేవు. ఇప్పటికీ వీలున్నంత తక్కువ ఖర్చుతోనే నెట్టుకువస్తున్నాం. మా పిల్లలకీ ఈ ‘స్వచ్చంద పేదరికాన్ని’ నేర్పిస్తున్నాం!

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

పాఠశాల అనే విశాల భావం మొదట ఎవరు తెలుసుకున్నారు?

by ఒద్దిరాజు మురళీధరంరావు September 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

⁠గ్యాస్ కోయిన్ కు ఐదుగురు పిల్లలు. అతని భార్య అంటుండేది…” వీళ్లు ఆశ్చర్యం కలిగించే ఒక రకమైన మొసలి లాంటి జంతువులు” అని. ఆమె చెప్పేది వాస్తవమే.( కథల్లో ఆశ్చర్యానికి ఈ మొసలి పేరు వాడుతుంటారు).
ఈ ఐదుగురు పిల్లలు
ఉదయం నుండి చాలా రాత్రి వరకు బయట కీచులాడుతూ, కొట్లాడుతూ, బొడుపులు గాయాలు చేసుకొని తల్లికి చూపించేందుకు ఒకరి తరువాత ఒకరు ఏడ్చుకుంటూ ఇల్లు చేరుతుంటారు. ఈ విషయం గురించి తల్లి చేతులు జాడించుకుంటూ ,” తనకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ దురుసు పిల్లలు త్వరలోనే నా తల నరాలు చిట్లిపోవడంలో సందేహం లేదు ” అని అనేది.
ఆమె అన్నదంతా వాస్తవమే అని ఆమె భర్త అంగీకరించాడు. ఆ అంగీకారం ఆమెకు మనసుకు ఎప్పటికన్నా ఎక్కువ బాధ కలిగించింది.
” అలా కూర్చొని తల ఊపకుండా బయటికి వెళ్లి ఏదైనా ఉపాయం చెయ్యి” అంది చికాకుగా.
ఇంట్లో పిల్లల అల్లరి, భార్య గులుగుడు భరించలేక భర్త ఏదైనా చేయాలనుకుని బయటికి వెళ్ళాడు.
ఆరోజు ఆయన అనుకోకుండా ఒక మిత్రుని కలుస్తాడు. పాపం ఆ మిత్రునికి పిల్లలు లేరు, ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగ వేటలో తిరుగుతున్నాడు. అతన్ని చూడగానే గ్యాస్ కోయిన్ మనసుకు ఒక ఆలోచన తట్టింది.
“ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కట్టించి గ్రామస్తుల పిల్లలందరిని కనీసం సగం రోజైనా దాంట్లో కూర్చోబెట్టి తన మిత్రుడిని అక్కడ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? పిల్లలు విసుగు చెందకుండా నా మిత్రుడు వాళ్లకు ఏదో బోధించవచ్చు. మధ్య మధ్యన చదివించడం, రాయించడం , సంగీతం బోధించడం చేయవచ్చు. అది పిల్లలకు చాలా ఉపయోగకరం అవుతుంది కూడా ! ” అనుకున్నాడు. ఆ తీరుగా అదే ప్రథమ పాఠశాల గా మొదలైంది. ఆ టౌన్ పిల్లలకు అతనే ప్రథమ ఉపాధ్యాయుడు అయినాడు. అందరికీ పిల్లలతో సమస్య లేకుండ అయింది. కానీ గ్యాస్నోయన్ ఐదుగురు చిచ్చర పిడుగులను అదుపులో ఉంచడంతో ఆ ఉపాధ్యాయుని తల త్వరలోనే నెరిసిపోయింది.
ఈ విధంగా మొదటి పాఠశాల అనే విశాల భావం గ్యాస్ కోయిన్ తెలుసుకున్నాడు. ( How Mr.Gascoyne invited school?
Internet కొత్త విషయాలను ఆవిష్కరిస్తుంది.)

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వేదం

by K K Tayaru September 29, 2024
written by K K Tayaru

90% శాతం మంది భారతీయులకు ఆ పదం గాని, అసలు అవి ఏమిటో ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు” శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి”.

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే.

అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరు పొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన – ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు.

వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధి పొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంత కాలం ఆమెకు మూడు వందల రూపాయల వంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అది కూడా ఆగిపోయింది!

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమ వాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది.

అది మన జ్ఞానసంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.

గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి.

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ, స్క్రాప్ అంతా మనదేశంలో.

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు. మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము. మన దేశ ఔన్నత్యం ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఓ మేక పిల్ల ఓ తోడేలు

by ఒద్దిరాజు మురళీధరంరావు September 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరి చివర్లో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నెల్ అనే మేక తన కూతురు నెల్లితో ఉంటుండేది.
ప్రతిరోజు నెల్ క్యాబేజీ కొనడానికని దుకాణానికి వెళుతూ ఉండేది. ఆమె బయటికి పోయినప్పుడు నెల్లీ తో ” నువ్వు నేను వచ్చి తలుపు కొడితే తప్ప ఎవ్వరికీ తలుపు తీయవద్దు నెల్లీ” అని చెప్పేది.
నెల్లి తలుపు బోల్ట్ పెట్టేసి తల్లి తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేది.
ఒకరోజు తోడేలు వచ్చి ” తలుపు తెరువు నా ముద్దుల మేకపిల్ల నేను నీ తల్లి నెల్ ను” అన్నది.కాని, నెల్లికి ఆ గొంతు కొద్దిగా వేరుగా అనిపించి తలుపు తెరవలేదు.
మర్నాడు కూడా తోడేలు అలాగే మళ్ళీ వచ్చింది. ఈసారి కీచు గొంతుతో దాదాపు మేక గొంతు లాగానే మాట్లాడుతూ
” పాపా! తలుపు తెరువు .ఇది నేనే! నేను ఇంటికి క్యాబేజీ తెచ్చాను.” అన్నది. నెల్లీ బోల్ట్ తీసి తలుపు తెరిచింది. వెంటనే ఒక నల్ల తోడేలు పంజా తలుపు నెట్టి లోపలికి రాబోయింది.
” నువ్వు నా తల్లివి కాదు”అని అరిచి నెల్లీ తలుపును గట్టిగా మూసేసింది. అలా అప్పుడైతే ప్రమాదం తప్పించుకుంది.
నెల్ ఇంటికి రాగానే ఆ చిన్న పాప నెల్లి జరిగిందంతా తల్లితో చెప్పింది.
‘ కొద్దిగా ఆగు పాడు బుద్ధి ముసలి తోడేలా’ అని తల్లి మనసులో అనుకున్నది తల్లి నెల్.
మర్నాడు ఆమె ఇంటి దగ్గరే ఉండి, ఎదురు చూస్తూ ఉన్నది.
ఒక మధురమైన గొంతు ” లోనికి రానివ్వండి” అని అన్నది.
ఎప్పుడైతే మేక పిల్ల తలుపు కొద్దిగా తెరిచిందో తోడేలు తన పిండి పడిన రెండు పంజాలు పాపను మోసం చేద్దామని లోపలికి చాపింది కానీ అది లోపలికి పోయే ప్రయత్నం చేయకముందే తల్లిమేక ఒక దుడ్డు కర్ర చేతిలో పట్టుకొని ఎట్లా కొట్టిందంటే…..
మేక పిల్లను తినేసి తన ఆకలి తీర్చుకుందామనుకున్న సంగతే తోడేలు మరిచిపోయింది, పరుగులెత్తింది.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఆపదలో సాయం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, September 29, 2024
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

   సుందరవనం అనే అడవిలో ఒక బుజ్జి కుందేలు ఆహారం కొరకై బయలుదేరింది.   అది పెద్దపులి గాండ్రింపు విని  భయంతో పరుగెత్తి  పొరపాటున  ఒక పెద్ద గోతిలో పడింది.  ఆ పెద్దపులి అక్కడికి రానే లేదు. అది ఎటో వెళ్లి పోయింది.  అయినా ఆ బుజ్జి కుందేలు ప్రాణభయంతో    ” కాపాడండి! కాపాడండి!” అని గట్టిగా అరచింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జిత్తులమారి  నక్క దానిని చూసి కూడా చూడనట్టు నటించి దానిని ఎవరు కాపాడుతారో అని అక్కడనే వేచి ఉంది.  
          అప్పుడే ఆ కుందేలు పిల్ల అరపులు విని  అక్కడికి పరుగున వచ్చిన ఏనుగు అది చూసి   ఆ బుజ్జి కుందేలును తన తొండంతో లాగి  ఆ గోతి నుండి కాపాడింది.   తర్వాత అది ఆ నక్కతో ” ఓ నక్కా! ఈ  పిల్ల కుందేలు ఆపదలో ఉంటే నీవు  కాపాడకుండా ఎటో చూస్తున్నావు. ఇది నీకు తగునా!   అది కాపాడమని అంటే వినరానట్టు ఉంటావా !”అని అంది. అప్పుడు నక్క ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి  వెళ్ళిపోయింది.
         కొన్ని రోజులకు ఒక బుజ్జి నక్క కూడా  దూరంగా ఒక చిరుతపులి అరపు విని భయంతో పరుగెత్తి  ఇదే చోటకు వచ్చి అదే గోతిలో పొరపాటున పడింది. అది కూడా తనను  కాపాడమని  గట్టిగా అరిచింది.   దూరం నుండి ఇది చూసిన ఒక పెద్ద కుందేలు పరుగున వచ్చి ఆ బుజ్జి నక్కను ఒక కర్రను అందించి దాని  సాయంతో కాపాడింది .  వెంటనే దాని తల్లి  పెద్దనక్క పరుగున అక్కడికి వచ్చింది.  అప్పుడే అక్కడికి వచ్చిన ఇదివరకటి ఏనుగు ఇది చూసి  ” ఓ కుందేలా! నీవు ఈ బుజ్జి నక్క ప్రాణాలు కాపాడి దానికి   చాలా మేలు చేశావు.  ఈ నక్కనే గతంలో నీ బిడ్డను కాపాడలేదు. అయినా అది మనసులో పెట్టుకోకుండా ఒక తల్లి మనసును అర్థం చేసుకున్నావు.   అపకారికి ఉపకారమంటే ఇదే  “అని అంది.  అప్పుడు కుందేలు ” ఓ గజమా! ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడడం మన ధర్మం. అందులో అది చిన్న పిల్ల.  పొరపాటున ఆ గోతిలో పడింది.  మరేదైనా క్రూర మృగం చూస్తే దీని ప్రాణాలు దక్కవు.  అందువల్లనే నేను దానిని కాపాడాను.  అది సాయం చేయలేదని నేను కాపాడకుంటే  ఒకవేళ దాని ప్రాణం పోతే  తిరిగి వస్తుందా! అందుకే ఈ చిన్న మేలు చేశాను” అని అంది.
      అప్పుడు నక్క తాను గతంలో  కుందేలు బిడ్డకు చేసిన అపకారం గురించి చెప్పి కన్నీళ్లు కార్చింది.   తన బిడ్డను బ్రతికించినందుకు ఆ కుందేలుకు తన ధన్యవాదాలు తెలిపింది. ఆ  కుందేలు ఆ నక్క కన్నీళ్లను తుడిచింది.  తర్వాత    ఆ నక్క పశ్చాత్తాపపడి  మరోసారి ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు. ఆ కుందేలుతో అది  చాలా   స్నేహపూర్వకంగా మెలగింది.    అందుకే అపకారికి ఉపకారం చేస్తే  స్నేహం పెంపొందుతుంది. 

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అచ్చంగా అచ్చులే

by Vijaya Kandala September 29, 2024
written by Vijaya Kandala

తెలుగు భాషకు అపారమైన పదసంపద ఉంది . మనలో చాలామందికి  తెలుగులో మాట్లాడడం ,రాయడం నామోషీ . తాము వాడే  కాసిన్ని మాటలు తా మనుకుంటున్న  అర్థాన్ని ఇస్తున్నాయా  అని తెలుసుకోవడం అవమానం. తెలిసిన పెద్దవారినీ ,నిఘంటువులనూ  సంప్రదించడము అనవసరమనే  విశ్వాసం . ఇవన్నిటికి  తోడు మనం మాట్లాడేది కల్తీ లేని తెలుగనీ అభిప్రాయం.

ఇలా నడుస్తున్న రోజులలో వచ్చిన కరొన ప్రపంచాన్ని ఓ కుదుపు కుది పింది .

దాంతో వ్యక్తుల ఆలోచన ధో రణిలో  కొంత మార్పు వచ్చింది . మన చా రిత్రక  , సాంస్కృతిక మూలాలను గురించి తెలుసుకోవాలనే  ఆలోచన మొదలైంది . మాతృ భాష చదవడం   సరిగ్గా రాకున్న విని ఆనందించడం ,కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం అనేకవిధాలుగా విస్తరిస్తున్నది . ఇది శుభ పరిణామం .

ఈ నేపధ్యంలో తెలుగు భాషాభిమానిగా నాకు తోచిన రీతిలో తరచుగా వాడే  పదాలలో కొన్నింటిని ఎంచుకొని ,వాటి వెనకున్న ఆసక్తికర అంశాలను క్లుప్తంగా తెలియచెప్పాలని ప్రయత్నించా  .

 ఒక ముఖ్య గమనిక . ఈ మాటల మూటలు  నిత్య జీవితంలో మాటలను ప్రయోగించేటప్పుడు  ,కాస్త  తెలుసుకోవాలనే ఉత్సాహవంతులకోసమే గాని ,పండితులకు , కవులకు ,  రచయితలకోసం  ఉద్దేశించినది కాదని మనవి .

   ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు భాష పట్ల ఆసక్తి పెరుగుతుందని ,పెరగాలని  చిన్న ఆశ.

ఎక్కడినుంచి మొదలెట్టాలి అనేదే పెద్ద ప్రశ్న . మాటలమూట  లు అనుకున్నాం గనుక అక్షరం నుండి మొదలెడతా  .

 అక్షరం అనే మాటను అక్కరం ,అచ్చరం అని కూడా అంటారు .  ఇది సంస్కృత పదం . క్షరం కానిది –నశించనిది అని అర్థం . భాష అనేది ధ్వనులుగా మొదలై లిపి ఏర్పడి ,తాటాకులు ,భూర్జపత్రాలు ,రాగిరేకులు ,శిలలపై  ప్రయాణం సాగించి ,కాగితాలు వరకూ సాగి, ఆ  తర్వాత అనేక విధాలుగా విస్తరించింది. ఈ రకంగా భాష , సాహిత్యం కలకాలం నిలిచి ఉంటుందని ,నశించనవి అనే అర్థంలో అక్షరాలన్నారు . కొందరి అభిప్రాయంలో అ నుండి క్ష వరకున్న వర్ణమాలలోని ఆద్యంతా లను చేర్చి , అక్షరమైందని అన్నారు .

  సంఖ్య లో వెల్లడించిన సమాచారం కన్నా ,అక్షరాలలో రాసిందే ప్రామా ణీకమనే  మన న్యాయ వ్య వ హారాల్లో నూ , బ్యాంక్ లా వా దేవీల్లోనూ   నమ్ముతారు . అందుకే దస్తావేజుల్లో  , బ్యాంక్ పత్రాల్లోనూ అక్షరా లా ఇంత అనీ  మళ్ళీ రాస్తారు .అంకెలను దిద్దినంత సులభంగా అక్షరాలను దిద్దలేము కదా . అదీ  సంగతి.

అంతేకాదు . ఆయన మాట అక్షరాలా జరిగి  తీ రాల్సిందే   అన్నప్పుడు తప్పకుండా ,మార్పు లేకుండా అనే అర్థాలు అక్షరాలా కు వర్తిస్తాయి . ఇదండీ  అక్షరాలా అక్షరాల కథ .

  అత్తెసరు

  నిఘంటువుల ప్రకారం చూస్తే ఇది అత్తు +ఎసరు అనే రెండు పదాలతో ఏర్పడ్డ సమాసం . వంటకు సంబంధించి ముఖ్యంగా బియ్యం అన్నంగా మారే  ప్రక్రియ లో వాడే మాట . ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయిగానీ ,ఒకప్పడు విడిగా వండి ,గంజి వార్చడం ఒక పద్ధతి . మరో విధానంలో నీళ్ళను మరిగించి ,తగిన పాళ్ళలో  కడిగిన బియ్యం వేసి ,ఉడికించడం . ఎన్ని నీళ్ళకు ఎంత బియ్యం అనేది అనుభవసారం . దీంట్లో అన్నం వార్చే పని ఉండదు . అయితే అన్నం బిరుసు గాను,పలుకుగాను ఉండకూడదు . అలా ఉంటే నీళ్ళు తగ్గినట్లు లేదా గిన్నె సరి పడిందిగా లేనట్లు . అన్నం మృదువుగా ఉండాలి . ఎక్కువగా ఉడికి ముద్దలా కారాదు .  అత్తెసరు  అంటే నీరు ,బియ్యం కలిసి అన్నం మాత్రమే మిగలడం అన్నమాట . దీ నికి సారూప్యంగా  అత్తెసరు మార్కులు అని వాడతారు . అంటే  బొటాబోటీగా  సరిపోయేటట్లుగా ,పెద్ద విశేషంగా చెప్పనక్కర్లేని అని  అర్థం.

 ఆటవిడుపు

ఈ రోజుల్లో చదువుల్ని ఆటపాట ల రూపంలో  నేర్పించాలనే పద్ధతికి  ఆదరణ పె రిగింది  . అదివారాలు , పండుగలు , వేడుకలప్పుడు  పరీక్షల తరువాత సెలవులు ఉంటూనే ఉంటాయి . మరి వెనకటి రోజుల సంగతి ఏంటి ?అని ఆలోచిస్తే వారికీ మరో  విధంగా సెలవులు ఉండేవి  .అలా అడుకోవడానికి కేటాయించే సమయమే ఆటవిడుపులు . ఒకప్పుడు ఆశ్రమాలకు , గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు . అ చదువంతా చెట్ల కిందనే జరిగేది . అందువల్ల ముసురు పట్టినా ,ఆశ్రమానికి ప్రముఖులు ,గురువులు వచ్చినా సెలవులే .దాంతో బాటు పౌర్ణమి  దానికి ముందు రోజు ,అమావాస్య ,దానికి ముందు రోజు ఇలా నాలుగు రోజులూ  అనధ్యయనపు దినాలు .అయితే , ఆ  రోజుల్లో దినమంత  ఆటల్లో  వృధా చేయకుండా ,కొంత చదువు , కొంత వినోదం కలిసొచ్చేలా కొన్ని కంట స్థ పద్యాలనిచ్చి నేర్చుకొమ్మనే వారు . ఇలా సాధారణంగా సుమతీ ,వేమన , కృష్ణ ,దాశరధి శతక పద్యాల నిచ్చి నేర్చుకునేలా  చేసేవారు . క్రమంగా అసలర్ధం   మరుగున పడిపోయింది . విశ్రాంతి ,పనిలేకపోవడం ,పని చేయకపోవడం అనే కొత్త అర్ధాలు స్తిరపడిపోయాయి .

ఇంగితం

         ఇంగితం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం . ఒకప్పుడయితే నుదురు చిట్లించడం ,బొమముడి అనే అర్థంలో కూడా వాడేవారు . ఈ పదాన్ని విశేషణంగా తీ సుకుంటే చలించిన ,కదిలిన అనే అర్థాలు ఏర్పడుతాయి . నామవాచకంగా తీసుకుంటే కదలిక , చలనం ,మనోభావం ,అభిప్రాయం  అనే అర్థాలు వస్తాయి .

ఇంగితజ్ఞు డు  అంటే ఇతరుల అభిప్రాయం తెలుసుకోగలిగినవాడని  భావం . అయితే  ఇంగిత  జ్ఞానం   అనే మాటకే వాడు కెక్కువ ఇంగితం  లేదంటే ఎవరితో  ఎలా మాట్లాడాలో తెలియని వాడ న్నమాట . పాత  అర్థాల  స్థానంలో కొత్త అ ర్థా లొచ్చేశాయి . 

ఈసడించు

ఇది క్రియా  పదం . డి క్షనరీల్లో వెతికేతే ,రోతపడు , కోపించు ,నిరసించు ఇలా ఎన్నో అర్థాలు .  నేటి కాలంలో తగ్గించి , తీసివేసి ,తక్కువ చేసి మాట్లాడు అనే అర్థాలు మిగిలా యి . ఈసడించారు ,ఈసడించి మాట్లాడారు . అనేవే నేటి ప్రయోగాలు .

ఉడుం పట్టు

ఉడుం అనేది బల్లి జాతికి చెందిన ప్రాణి . పాతకాలంలో అంటే రాజరికపు రోజుల్లో సైనికులు దీన్ని పెంచి , తర్ఫీదు నిచ్చి యుద్ధాలలో ,ముట్టడులలో  ఉపయోగించేవారు ఉడుం నడుముకు మోకుకట్టి ,బలంగా కోట గోడలమీదికి విసిరేవారు . దాని నాలుకకు తేనె రాసేవారు . ఏ పాటి పట్టు దొరికినా  అది గోడను కరిచి పట్టుకుంటుంది . ఎంత బలంగా అంటే వేలాడే మోకును పట్టుకుని సై నికులు పైకి పాకి కోట గోడ పైభాగానికి  చేరి ,లోపల్నుంచి తలుపులు తెరిచేవారు . బయటి నుండి  సైన్యం లోనికి చేరి, రాజనగరును ముట్టడించి స్వాధీనం చేసుకునేవారు .

ఇప్పుడు అలాంటి అవసరాలు లేకున్నా పట్టినపట్టు వీడని ,వదలని మొండి పట్టును సూ చించడానికి ఉడుం పట్టు అనే మాటను వాడు తున్నాం  .

ఊదరపెట్టు

               అదే పనిగా నస పెట్టు , పొగ బెట్టు అనే అర్థం లో వాడుతాము . ఎలుకల వంటి వాటిని బయటికి వెళ్ళ గొట్టడానికి పొగబెట్టడాన్ని ఉదరబెట్టడం అంటారు . చుట్టలను , సిగరెట్లను ఒకదానికొకటి ఆ నించి నిప్పు అంటించడాన్ని ఊదరబెట్టడమంటారు . అగ్గిపెట్టలు అందుబాటులోకి వచ్చాక దీ నీ  అవసరం తీ రిపోయింది  . మామిడి వంటి కాయలను త్వరగా పళ్ళుగా మార్చడానికి పెట్టే పొగను ఊదర అంటారు . ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉండ డాన్ని  ఈ రోజుల్లో ఊదరపెట్టుగా అంటున్నాం

ఋ జువు

          ఋ కారాన్ని పలకడం , రాయడం ఎప్పుడో మానేసాము . అయితే వినిపించే కొద్ది మాటల్లో ఎక్కువగా వినిపించే మాట ఋ జువు . సంస్కృతం లో ఈ పదానికి సత్యం , సూటి అనే అర్థాలున్నాయి . నిదర్శనం అనే అర్థం లో తెలుగులో ఉపయోగిస్తున్నాం . ఈ అర్థంలో వాడే ఈ మాట పర్షియన్ నుంచి హిందీ ద్వారా తెలుగులోకి ప్రవేశించింది .

ఎద్దు

సరే దీని గురించి తెలియనిదేవరికి ? కాబట్టి దీనికి సంభందించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం . ఎద్దు అనగానే నాకు స్పెయిన్ దేశం గుర్తొస్తుంది . అక్కడ ఎద్దుల్ని రెచ్చగొట్టి ,వాటితో పొడిపించుకుంటూ ,తొక్కించుకుంటూ ఆడే ,ఆడించే    Bull Fighting ఆటను   జనాలు వెర్రెత్తినట్లు ఆ డుతారు .  ఎ ద్దులమీద కుక్కల్ని ఉసిగొల్పి ,బుల్ రింగ్ లో ఆడించే ఆట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది .

పూర్వం వేటాడడానికి  ఎద్దుల్ని ఎరగా చూపించి , సింహల్ని , పులులని వేటాడేవారు . దుక్కిటె ద్దుని హాలికం అని ,బండికి కట్టే ఎద్దుని అన ద్యాహమ్ అనీ  అంటారు . సాధు ఎద్దుని గంగిరెద్దు అంటారు .

నంద్యాల , నందిగామ , మహానంది వంటి గ్రామాలు మనకు ఎద్దులకూ ఉన్న  అనుభందాన్ని గుర్తు చేస్తాయి .

ఏ బ్రాసి

ఈ మాటను రోత మనిషి , అమాయకుడు , చేతగానివాడు మొదలైన అర్థాల్లో ఉపయోగిస్తారు . అసహ్యమైన వ్యక్తి అనే అర్థంలో సంస్కృతంలో ఏభ్య రాశి అనే పదం ఉంది . ఈ మాట నుంచి ఏర్పడ్డ తెలుగు పద్యం ఏబ్రాసి . ఏబ్రాసి వెధవ ,ఏబ్రాసిగాడు అనే వ్యవహారం

ఐ రావతం

ఐ రావతం అంటే భా రీ కాయంతో  తెల్లటి మేని ఛాయ తో ,మెరి సి పోయే ఏనుగు . ఇది క్షీర సాగర మధనంలో  పుట్టింది . ఇo ద్రు నికి వాహనం . దీ న్ని మేఘాల ఏనుగు ,సూర్యుని సోదరుడు అని కూడా పిలుస్తారు . మాతంగ లీల అనే గ్రంధం ప్రకారం బ్రహ్మ వరంతో 8 మగ 8 ఆడ ఏనుగులు పుట్టాయి . మగ ఏనుగులకు ప్రతినిధి ఐ రావతం .

         జైన ,బౌద్ధ మతాలలో కూడా ఐ రావతం ప్రస్తావన ఉంది . థా య్ లాండ్ ,లావోస్ వంటి దేశాలలో దీన్ని ఆరాధిస్తారు . అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాలమీద మూడు తొండములతో ఉండే ఐ రావతం బొమ్మ చిత్రించబడి ఉంటుంది

 ఒంటికంటి  రామలింగం

  ఓ అనగానే నాకు ఒంటికంటి రామలింగం గుర్తొస్తాడు   . ఆయనెవరు ? అని ఆడక్కండి . నాకూ  తెలీదు . ఇంకోలా చెప్పాలంటే ఎవరైనా కావచ్చు . ఎందుకంటే ఇక్కడ రామలింగం అనే  మాట పేరులా  కాక ఒక గుణా నికి ,స్వభావానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం . ఒంటి  కన్ను అంటే ఒక కన్నున్న వాడని గాక ఇతరుల సుఖశాంతులను చూసి ఓర్వలేని వాడని అర్థం .అసూయపరుడిని ఒంటికంటి రామలింగం అని సంభో ధిస్తూంటారు

ఓంకారం

  ఓ అనగానే ఓంకా రం  మెదులుతుంది మదిలో . ఇది అకార ,ఉకార ,మకారాల  సమ్మేళనం . సృష్టిలో మొదట వినబడ్డ శబ్దం ఓమ్ . దీన్ని పదేపదే జపించడం వల్ల శరీరంలో ప్రాణవాయువు శా తం పెరుగుతుంది .కంఠ నాళంలోని అడ్డంకులను తొలగిస్తుంది . స్పష్టమైన ఉచ్చారణకు  తోడ్పడుతుంది . సనాతన హిందూ ధర్మంలో ఓంకారా నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . పరమశివుని నాద రూపమే ఓంకారం . వేద సారం ఓంకారం. ఓమ్ అనేది ఏకాక్షర మంత్రం . ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు .

 నిత్యం సాధన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది .. మానసిక అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది. దీన్ని జపించే సమయంలో వచ్చే ప్రకంపనలు మన నాడీ వ్యవస్థ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయి . ఏకాగ్రత మెరుగుపడుతుంది .

ఔచిత్యం

నీవు చెప్పిన మాట ఔచిత్యం గా లేదు. పెద్ద మనుషులున్నప్పుడు ఔచిత్యంగా  మాట్లా డా లని తెలీదూ అంటూ ఔచిత్యం ప్రదర్శిస్తూ ఉంటాం . కానీ నిఘంటువులలో ఉచితత్వం , యోగ్యత ,సత్యమనే అర్థాలే ఉన్నాయి . తగినవిధంగా ,యుక్తంగా ,యోగ్యతగా అనే అర్థాల్లోనే వాడుతున్నాం . సందర్భానికి తగినట్లు మాట్లాడుట ,ప్రవర్తించుట అనే సందర్భంగా ప్రస్తుతం వాడుతున్నాం .

  అం –అః

0 ( అః వీటిని వ్యాకరణ పరిభాషలో ఉభయాక్షరాలు అంటారు . ప్రస్తుతం బండి ఱ ను , అరసున్న ను వాడుకలోంచీ పక్కకు జరిపేసాము   . మిగిలిన  రెంటికీ విడిగా ప్రయోగం లేదు . 

అంబరం అంటే ఆకాశం సాధారణ అర్థం . అయితే దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలవాడు అని అర్థం చెప్పుకుంటాం . ఇక్కడ అంబరంఅంటే వస్త్రం . నిఘంటువుల్లో దీనికి దూది , అనుస్వారం అనే అర్థాలను ఇచ్చారు .

అంతఃపురం

విసర్గ కు సంస్కృతంలో  బోలెడన్ని ఉదాహరణలు దొరుకుతాయి . తెలుగులో విసర్గ అనగానే టక్కున గుర్తొచ్చే  పదము   అంతఃపురం . రాజుగారికి సంభంధించిన స్త్రీలు ఉండే ప్రాంతం అని అర్థం . రాణివాసం అని కూడా అనవచ్చు గానీ మనకు అంతఃపురమే నచ్చుతుంది ..

ఇ దండీ  అచ్చంగా అచ్చులే  చిరు  వ్యాసం.    కేవలం వ్యాకరణ పరిభాషలో కాకుండా కాసింత ఉప్పు , పులుపు ,కారం  కలిపి గుచ్చెత్తి , వండి వార్చిన వంటకం .

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తో(రణం )

by Vijaya Kandala September 29, 2024
written by Vijaya Kandala

మన ఇళ్లల్లో   వేడుక ,పండుగ ,పర్వం, శుభకార్యం ఏదైనా  తోరణాలు కట్టడంతోనే మొదలవుతాయి . తోరణాలు పంది ళ్ళతో ఇంటికి కొత్త అందం వచ్చి చేరుతుంది . సంబరాలను వెంట తీసుకొని వచ్చేవే తోరణాలు.  అంతెందుకు  వీధిలో అలా నడిచి వెళ్తున్నప్పుడు  ,ఏ  గుమ్మానికో మామిడాకుల తోరణం కనిపిస్తే చాలు, వీరి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది అనుకుంటారు దారి ని పోయేవారు . అది తోరణ మహా త్యం. ఇందులో ఇంకొక విశేషం ఉంది .మన అలవాటులో తోరణం అంటే మామిడాకులదే.

అసలు తోరణాలు ఎందుకు ?వాటికి మామిడాకులే ఎందుకు? అని ఆలోచిస్తున్నారు కదూ ! నేను అలానే అనుకున్నా సుమండీ .  అనుకోవడంతో ఊరుకోలేదు .జవాబు కోసం ప్రయత్నించా. ఆ వివరాలు క్లుప్తంగా  మీకోసం .

ఒకప్పుడు తోరణాలు అంటే ముఖద్వారానికి మామిడాకులను ఓ పు రి కొ సతో బంధించడమే. ఇప్పుడు కాలం మారింది.  వస్తువులో , విధానాల్లో  ,వైవిధ్యం చోటు చేసుకున్నది. రంగురంగులతోరణాలు రాజ్యమేలుతున్నాయి .పండగల సీజన్ మొదలైంది గా యూట్యూబ్ లో వేలెట్టండి .ఇంకేముంది వందలాది ఉపాయాలు .వేలాది లైకులు . మూడు పువ్వులు ఆరు కాయలుగా విభిన్నతకు అర్థం చెప్పే  కంటెంట్లు  .

ప్రసిద్ధ ప్రాచీన దేవాలయాల గురించి ఓ మంచి మాట చెప్తుంటారు పెద్దలు .నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటే ఆ .దేవాలయంలో సంవత్సరం పొడుగునా స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుందన్నమాట .ముహూర్తాలు సరైనవి దొరక్కపోయినా ,కుటుంబ పరమైన సమస్యలు ఎదురైనా ,చాలామంది పుణ్యక్షేత్రానికి వెళ్లి పెళ్లి చేస్తారు.  స్వామివారి కల్యాణం జరిగినందువలన అక్కడ విడిగా వధూవరుల  జాతకం ఆధారంగా ముహూర్తాలు పెట్టకున్న, పెట్టిన దానిలో ఏవైనా దోషాలు ఉన్నా, స్వామి అనుగ్రహంతో తొలగిపోతాయన్నమాట.

సరే ఇప్పుడు మనకు బాగా తెలిసిన మామిడి తోరణాల దగ్గరికి రండి .

జ్యోతిశ్శాస్త్రం  లో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా చెప్తారు.  అందుకే వేడుక ఏదైనా మావిడాకులని వాడుతారు .  చెట్లు ,మొక్కలను  పూజించడం మన సంస్కృతిలో ఒక  భాగం  .దీనికి గొప్ప ఉదాహరణ కార్తీకం లో ఉసిరి చెట్టును, క్షీరాబ్ది ద్వాదశి కి తులసి పూజను చేయడం ఇంకా మిగిలి ఉన్న సంప్రదాయం.

మామిడి చెట్టు, దాని  భాగాలు  అనేక విధాలుగా  మన సంస్కృతిలో  భాగం . ఒకప్పుడు తోట ఉంది అంటే చాలు మామిడి తోటనా అని మొదటి ప్రశ్న ,మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి ?అనేది రెండవ ప్రశ్నగా అడిగేవారు. మామిడి చెట్లు ఆర్థిక వనరులకు చిహ్నం ఒకప్పుడు . మామిడి చెట్టు ఆకులు, లేత చిగుళ్ళు ,పళ్ళు, కాయలు, బెరడు అన్ని ఆయుర్వేదంలో , గృహవైద్యంలో ఉపయోగకారులు .మామిడి ఆకులను తోరణాలుగా మాత్రమే కాక, కలశం లోను వాడుతా రు .అవి దొరక్కపోతేనే తమలపాకులను ఉపయోగిస్తారు .

మామిడాకుల తోరణాల వెనకున్న నమ్మకాలను గురించి కాస్త చెప్పుకుందాం.

మామిడాకులను తోరణాలుగా వేలాడదీయడం వల్ల, ఇంటికి చెడు దృష్టి నుండి రక్షణ, సానుకూల శక్తికి ఆహ్వానం అనేది ఓ ముఖ్యమైన నమ్మకం. ఈ తోరణాల వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి తో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితులఉ  వాచ .

 ఈ ఆకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది . తోరణాలు ఎక్కువమంది గుమికుడినప్పుడు ,ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి  .ప్రధాన ద్వారం పైన కట్టినప్పుడు ఆ ఇంట్లోని  వాస్తు దోషం పోతుందని ఒక విశ్వాసం  . వెనకటి రోజుల్లో  గ్రామాల్లో బావిలోకి దిగి, శుభ్రం చేయవలసిన సమయంలో ,ఎక్కువ ఆకులు ఉన్న మామిడి కొమ్మను బావిలోకి  చుట్టూ కొంత సేపు తిప్పమని చెప్పే వారు . దాంతో బావిలోని విషవాయువులు తొలగిపోతాయట .ఇది నిరూపించబడింది కూడా .

మామిడి ఆకులలో ఒక ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది అందువలన తోరణాల పరిసరాలు సువాసన , తాజాదనంతో నిండి ఉంటాయి.

  మామిడి ,జువ్వి , రావి , మర్రి , ఉత్తరేణి ఈఐదు చెట్ల  ఆకులను పంచ పల్లవాలంటారు .వీటిని శుభకార్యాల్లో వాడుతారు .అయితే తోరణం లో నిలిచేది మాత్రం మావిడే . యజ్ఞయాగాదుల లో  మామిడి ఆకులను వాడి  ధ్వజారోహణం చేయడం సంప్రదాయం .ధ్వజారోహణం అంటే దేవతలకు ఆహ్వానంపంపడమే.   మావిడాకులు అంటే దేవతలకు ఇష్టమేనన్న మాట .

శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని , అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని పెద్దవారంటారు .

 ఇంకో ముఖ్య విషయం ఇక్కడ తప్పక చెప్పుకోవాలి . మన వైపు పెద్ద పండుగలు  ,ఉత్సవాలు ఎక్కువగా సంవత్సరంలోని రెండో భాగంలోనే వస్తాయి .దీనికి మామిడి తోరణానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? మామిడి పూత సాధారణంగా శీతాకాలం చివరలో మొదలవుతుంది . వేసవిలో కాత మొదలవుతుంది. కత్తిరింపు మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుందని మీకందరికీ తెలుసు కదా! అయినా ఈ విషయం తెలుసుకోవడానికి వృక్షశాస్త్రజ్ఞుని వరకు వెళ్ళనక్కరలేదు . ఏ తోటమాలి అయినా చెప్తాడు .పండుగలప్పుడు మామిడి తోరణాలను కట్టడానికి ఇదొక మంచి కారణం .

ఈ కారణాలన్నింటినీ  విస్తృతంగా అధ్యయనం చేయకున్నా సంప్రదాయ పద్ధతుల ఆధారంగా తరతరాలుగా జనం ఆచరిస్తున్నారు . విశ్వసిస్తున్నారు కూడా.

తోరణాల గురించి ఇన్ని మాటలు చెప్పుకుని ఆగిపోతే అది అసంపూర్తి అవుతుంది  .తోరణం అనగానే మామిడి ఆకుల తర్వాత గుర్తొచ్చేవి కాకతీయ శిలా తోరణాలు . అందమైన ఈ తోరణాలు మన శిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు  .వీటిని తోరణ ద్వారాలు ,తోరణాస్తంభాలు, కీర్తితో రణాలు ,హంస ద్వారాలు ఇలా రకరకాలుగా చరిత్రలో పేర్కొన్నారు.   ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రధాన కార్యక్రమాల్లో దాదాపుగా కనిపించే నమూనా స్వాగత దారాలు ఇక్కడివే .

వరంగల్ కోటలో ఈ కీర్తి తోరణాలు నాలుగు ఉన్నాయి .  నాలుగూ  వేర్వేరు రాజుల కాలంలో నిర్మించబడినా  ఆ తేడాలను మన చూపులు పట్టుకోలేవు.  వీటిపై అధోముఖ పద్మాలు, హంసలు అందంగా  అమిరాయి  . కోటలోని అపార సంపదను , శత్రువులు దోచినా ఈ అమూల్య సంపద మనకు దక్కింది .చూసేవారికి రాచహోదాను ,  ఆత్మవిశ్వాసాన్ని నేటికీ అందిస్తున్నాయి . ఇవి  యుద్ధాల్లో సాధించిన  గెలుపును తెలిపే విజయ చిహ్నాలు అని చరిత్రకారుల వివరణ  .మన బోటి సామాన్యులకు తోరణం  అంటే నెగిటివ్ ఎనర్జీతో , చెడు దృష్టితో , చెడుగాలితో రణమే . పోరాటమే  .దాన్ని ఎదుర్కోవడానికి తోరణాలను కడదాము .  ఆ సువాసనలను  ,ప్రాణ శక్తిని మనసారా  జీవితాల్లోకి ఆహ్వానిద్దాం .

 ఇదండీ  తోరణాల కథ

 

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సభ్యసమాజం- ఆమె

by Taniparti NarayanaRao September 29, 2024
written by Taniparti NarayanaRao

‘అక్కా! నీ రూప లావ

గరిమకు

నీలాకాశాన వెలిగే నిండు చంద్రుని

అందచందాలు సరిరావేమాత్రం!’

అక్క ఉదయాన్నే స్నానసంధ్యలు ముగించుకుని వరండాలో కూర్చుని ఏదో విషయమై దీర్ఘాలోచనలో మునిగి ఉన్నది. తన దినచర్య అక్కడ నుంచే ఆరంభమవుతుందని తెలిసివచ్చింది నాకు.

‘అక్కా! నీ ప్రశాంత గంభీర వదనం మాటున

అంతరంగ గర్భగృహంబున అణగారిన ఆవేదనలెన్నో!

తెలియరాని నా చిరుహృదయానికి

అర్థంకాని ఆందోళనఏలో!’

“అక్కా!” నా పిలుపుకు తేరుకుని నన్ను దగ్గరకు తీసుకున్నదామె. ఆప్యాయంగా నా తల నిమిరి “ఏమిటి చంద్రా!” అని నా కళ్లలోకి చూసింది. “ఏమిటి తమ్ముడూ!” అని మరోసారి అడిగింది. నా ముఖం, చూపు కిందకే దించి ఉన్నవి. చిన్నగా నవ్వి నన్ను తన సన్నిధి నుండి విడుదల చేసింది.

అక్క ఇంట్లో నా మొదటి ఉదయం అనుభవమది.

నాకప్పుడు ఎనిమిదేళ్ల ప్రాయం. నన్ను తీసుకుని మా అమ్మ వాళ్ల అక్క (తోబుట్టువు కాదు) ఊరికి వెళ్లింది. వాళ్లది చాలా పెద్ద ఇల్లు. రెండస్తుల మేడ. సున్నం, ఇటుకలు కలపతో నిర్మాణమైనది. మా చిన్న ఇంటితో పోల్చుకుంటే చాలా అద్భుతంగా తోచిందది. ఆ ఇంట్లో వారందరూ, అన్నలూ, వదినలూ చాలా పెద్దవారు. మొదట్లో కొంచెం బెరుకుగా ఉన్నా వారం రోజుల్లో నేనా ఇంట్లో ఒక భాగమయిపోయిన. చిన్నగా, నాజూకుగా, ముద్దుగా ఉండేవాణ్ణి. వారంతా నన్ను అపురూపంగా చూసుకునే వారు. వారి ప్రేమకు ముగ్ధుడనయ్యేవాణ్ణి. ఆ ఇంటి పరిసరాలు ఆనందదాయకంగా ఉండేవి. అటవీ ప్రాంతం, పెద్దపెద్ద వృక్షాలు, పొదలు, లతలు, వాటిమధ్య పొలాలు, చేలు ఎక్కడ ఉండేవో కనపడేవే కావు.

నా ఆనందానికి అవధులులేవు. అట్లా ఉండగా ఒకరోజు ఉదయం పదకొండు గంటలు. పెద్దమ్మ వాకిట్లో ఆగిన ఓ కచ్చడంలోంచి ఒక స్త్రీమూర్తి దిగి వచ్చి వరండా మెట్లెక్కింది. ఆశ్చర్యం! ఆమె ఒక మనిషిలా లేదు. దేవతా స్త్రీలాగా ఉన్నది. తెల్లని వస్త్రాలు. దేహమూ అదేరంగు, మెరుపులాంటి ముఖవర్చస్సు. పెద్దమ్మ ఎదురు పడగానే చిరునగవుతో నమస్కరించింది. అక్కడే నిల్చున్న నేను తదేకంగా తననే చూస్తున్నాను. నా వంక ప్రశ్నార్థకంగా చూసిందామె. ‘లక్ష్మి చిన్నాయి (చిన్నమ్మ) కొడుకు చంద్రసేన్’, ‘అక్క’ అంటూ తిరిగి నావంక చూసింది పెద్దమ్మ. నేను వంగి అక్కపాదాలు స్పృశించి నమస్కరించిన. ఎవరి పాదాలకైనా ప్రణమిల్లటం నా బాల్యంలో అదే ప్రథమం.

రెండు రోజుల తర్వాత అక్క తిరుగుప్రయాణం. వెళ్తూవెళ్తూ పెద్దమ్మకు చెప్పి వారంరోజులకోసం నన్ను తమ ఊరికి తీసుకెళ్లింది. అక్క ఇల్లు పెద్ద అందమైన భవంతి. భవంతినానుకొని పొడుగూతా ఉన్న అరుగు. ఆ అరుగుమీద కూర్చొని ఎదురుగా ఫర్లాంగు దూరాన గలాగలా పారుతున్న జలాలు, ఆ పరిసరాలను చూస్తుంటే ఆహ్లాదకరంగా సమయం గడిచిపోతుంది. అక్క ఊరు గోదావరికి దక్షిణాన, తీరానికి సమీపంలోనే ఉన్నది. ఇక్కడా కొంత దూరం వరకు అటవీక్షేత్రం వ్యాపించి ఉన్నది. పెద్దమ్మ ఊరు గోదావరి ఉత్తర తీరాన ఉండి, అక్కడి నుంచి విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం దండకారణ్యంలో సంలీనమవుతున్నది. ఈ రెండు ఊళ్లమధ్య ఉన్న దూరం నాలుగు క్రోసులు (8మైళ్లు). మా ఊరు గోదావరి నదీ దక్షిణ తీరానికి 20 క్రోసుల దూరంలో ఉన్నది. నదీ జలాలు, అటవీ ప్రాంతాల పట్ల నాకున్న మక్కువవలన పెద్దమ్మ ఊరు, అక్క ఊరు రెండూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వారంరోజులు అక్క దగ్గర ఎట్లా గడిచిపోయినయో తెలియలేదు. ఒకరోజు తనతోపాటు నదీతీరాన ఉన్న మామిడితోటకు వెళ్లినం. అక్క పాలేర్లు, పనివాళ్లతో మాట్లాడుతూ పనులు పురమాయిస్తుంటే నేను తోటంతా కలియతిరిగిన. ఒకనాడు వరి పొలాల వద్దకు, మరోనాడు ఇంకో చోటికి అక్కతోపాటు నేనూ వెళ్ళేవాణ్ణి. ఆ చిన్న కచ్చడంలో ప్రయాణం భలేసరదాగా ఉండేది. ఆ బండికి కట్టే ఎద్దులు వేరు. వాటిని ఇతర పనులకు వాడరు.

అక్క ఇంట్లో ఒక పెద్ద వయసు స్త్రీ ఉండేది. ఆమె గొల్లనో, గోండు స్త్రీయో! అందరూ ఆమెను ‘గొండమ్మా’ అని పిలిచే వారు. నేనూ అలాగే పిలిచేవాణ్ణి. రుచికరమైన వంటలు వండి పెట్టడంలో ఆమె దిట్ట. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె సృష్టించిన షడ్రుచులను ఆవారం- పదిరోజుల్లో ఎంతగా ఆస్వాదించానో! ప్రతిరోజూ మధ్యాహ్నం తాగడానికి తాజా మామిడికాయలతో షర్బత్ తయారు చేసి ఇచ్చేది. అప్పుడప్పుడు పాయసం వండి పెట్టేది. పెద్దమ్మ ఇంటికి పంపిస్తూ అక్క నన్ను దగ్గరకు తీసుకుని వీడ్కోలు చెప్పేటప్పుడు ఆమె కళ్లు సజలమవటం గమనించిన. గొండమ్మ ముఖంలోనూ అదే ఆర్ద్రహృదయం ప్రతిఫలించింది. “కవిత్వం రాస్తూ చదువును అశ్రద్ధ చేయకు చంద్రా!” హితవు పలికి అక్క నన్ను సాదరంగా పంపింది.

అక్కపట్ల నా మనస్సులో స్థిరపడ్డ ప్రేమాభిమానాల ప్రభావం వల్లనేమో ఆ తర్వాత వరుసగా నాలుగేండ్లు సెలవులు రాగానే అక్క ఊరిలో వాలిపోయేవాణ్ణి. నన్ను చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయేది. తప్పనిసరిగా రెండు రోజులు పెద్దమ్మ దగ్గరకూడా ఆగేవాణ్ణి. ఎప్పటివలెనే ఆ ఇంట్లో వారందరూ నన్ను ప్రేమతో ఆదరించేవారు. అక్కతో చనువు దినదిన ప్రవర్ధమానమవుతున్నది. అక్క ఉదయం ఎప్పుడులేస్తుంది, తెల్లవారక ముందే జరిగే ఆమె దినచర్య ఏమిటో గమనించాలని నాలో కుతూహలం చెలరేగింది. ఒకరోజు రాత్రంతా నిదురపోలేదు. స్నానం ముగించుకుని నాలుగున్నర గంటల సమయంలో అక్క ఒక గదిలోకి ప్రవేశించింది. ముందు రెండు దీపాలు వెలిగించింది. ప్రమిదల్లో కొంచెం నూనె వేసి వత్తులను ఎగదోసింది. కొన్ని పూలు ఎదురుగా ఉన్న విగ్రహాల ముందుంచి దండం పెట్టింది. ఒక చిన్న కర్రపీట మీద కూర్చుని ఒక పుస్తకం నుండి మనస్సులోనే ఏదో పఠిస్తూన్నది. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. తలుపుచాటున నిలబడి నేనిదంతా గమనిస్తున్నాను. సుమారు అరగంట తర్వాత పుస్తకం మూసి పక్కనపెట్టి “లోపలికి రా చంద్రా!” అన్నదామె. నాకు చాలా భయమేసింది. లోపలికి వెళ్ళగానే ఒక పీట చూపించి కూర్చోమన్నది అక్క. ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా కళ్లు మూసుకున్నది. దాదాపుగా గంట సమయం నిశ్చలంగా ఉండిపోయింది. ఆ దృశ్యం పుస్తకాల్లో నేను చదివిన ధ్యానముద్రలో ఉన్న ఋషులు, మునులు, తపస్వినులను తలపింపజేసింది. అప్పుడు ఆమె లేచి “వెళ్తాం పద చంద్రా!” అన్నది. నేను లేచి ఆమె పాదాలను స్పృశించి సాష్టాంగ నమస్కారం చేసి ఆమెను అనుసరించిన. అప్పటి నుండి నా మనస్సులో అక్కపట్ల ప్రేమాభిమానాలేగాక, ప్రగాఢమైన భక్తి భావమేర్పడింది.

ఎనిమిదవ క్లాసు నుండి పియుసి పరీక్షలయ్యేదాకా నేను అక్క ఊరికి వెళ్లలేకపోయిన కారణాలనేకం. సెలవుల్లో కూడా బిజీగా ఉండేవాణ్ణి. నాలుగేళ్లు తనను చూడకుండా గడిచిపోయినయా! అనే భావన స్ఫురించగానే మనస్సు చివుక్కుమన్నది. వెంటనే బయలుదేరి సరాసరి వాళ్ల ఊరికే చేరుకున్నా! కాని ఆమె అక్కడలేదు. నాలుగు క్రోసులు నడిచి పెద్దమ్మ ఊరికి వెళ్లిన. అక్క పాదాలకు ప్రణమిల్లి ఒక నిముషం అట్లాగే ఉండిపోయిన. “చంద్రా!” అంటూ నన్ను లేపి కళ్లు తుడిచి నా నుదుటిమీద ముద్దుపెట్టింది. ఆమె నయనాలూ సజలమయినవి. పెద్దమ్మ విస్తుపోయి చూస్తున్నది. ఆమె పాదాలకూ నమస్కరించి నిలబడ్డ. “కూర్చో చంద్రా!” అని ఓ కుర్చీమీద నన్ను కూర్చుండబెట్టి తానూ కూర్చున్నది. లాలనగా నా చేతిని నిమురుతూ చాలా సేపు పరధ్యానంగా ఉండిపోయింది. పెద్దమ్మ అప్పటికే లోపలికెళ్ళిపోయింది. అక్క పెట్టిన ఆ ముద్దు నా జీవితంలో ఓ మధురానుభూతి అయి, చిరస్థాయిగా నిలిచిపోయింది. పరిపూర్ణ ఆప్యాయతానురాగాలతో ఎవరైనా నాకు పెట్టిన మొదటి ముద్దు అదే. రెండు రోజుల తర్వాత అక్కా, నేనూ వాళ్ల ఊరికి వెళ్లినం. వారంరోజులు హాయిగా గడిచిపోయినవి.

ఒకసాయంకాలం. అక్క బాగా అలసిపోయి ఉన్నది. తొందరగా భోజనాలు ముగించుకున్నాం. అక్క విశ్రాంతి తీసుకుంటున్నది. గొండమ్మ ఆమె కాళ్లు ఒత్తుతున్నది. సంకోచిస్తూనే అక్క గది ఎదుట నిలబడి “అక్కా!” అని పిలిచిన. “రా చంద్రా!” అని తలగడ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమన్నది. నా నిశ్శబ్దం గమనించి, “చంద్రా! ఏదో చెప్పాలనుకుంటున్నవు. ఫరవాలేదు చెప్పు” అన్నది. అప్పటికీ నేను నోరువిప్పలేదు. “గొండమ్మ ఉంటే ఫర్వాలేదు. నాకు ఆమె పరాయిది కాదు. నిస్సంకోచంగా చెప్పు” అని భరోసా ఇచ్చింది అక్క.

“అక్కా! నీకో కథ చెప్తా, వింటావా?” “కథనా?” “ఔను.”

“చదువుతున్నవా, కథలే రాస్తున్నవా?” “లేదక్కా! ఇది నిజమైన కథే!” “ఔనా? అయితే చెప్పు”.

“మా పొరుగూర్లో ఒక పెద్దమ్మ (అమ్మకు స్వంతక్క) ఉంటుంది. నాకు ఊహతెలిసినప్పటి నుండి ఆ ఊరికి తరచుగా వెళ్తున్న శీతాకాలపు సెలవుల్లో అయితే తప్పనిసరిగా పెద్దమ్మ ఇంటితో పాటు అక్కడ ఇంకో మూడు నాలుగిండ్లు ఉంటవి. ఊరికి కొంచెం దూరంగా. చుట్టూ పొలాలు, మొక్కజొన్న చేండ్లు, మిరపతోటలూ, వాటికి నీళ్లు పారించడానికి మోటలు కొడ్తూ రైతులు. ఆ పరిసరాలంటే నాకు బాగా ఇష్టం. అక్కడ నన్ను నేను మరచిపోతా!” అక్కడ ఇంకో విశేషమున్నది. అందుకే నేనెప్పుడూ అక్కడికి పోవడానికి ఇష్టపడేవాణ్ణి.”

అక్క ధ్యాసను పరిశీలించడానికి కొద్దిసేపు చెప్పటమాపిన.

“ఏమిటి చంద్రా అది?”

“అక్కడ ఉన్న ఒక అక్క వరుసకు అక్కే, వాళ్ళు పెద్దమ్మకు పాలివాళ్లే. నాకు తెలిసినప్పటి నుంచీ తను అక్కడే ఉన్నది. అక్కచాలా అందగత్తె. రూపురేఖలు, రంగు అన్నీ అచ్చంగా నువ్వే! ఎప్పుడూ తెల్లని మెరిసిపోయే దుస్తుల్లోనే ఉండేది. ఎందుకట్లా ఉండేదో తర్వాత తెలిసివచ్చింది నాకు. చిన్నతనంలో పెళ్లయింది. కొద్దికాలంలోనే భర్త చనిపోయినడు. అప్పటి నుండి అక్క తల్లిగారింటనే ఉంటూన్నది. పెద్దమ్మా, పెద్దనాన్న అన్నలు, వదినలూ అందరికీ ఆమె పట్ల గారాబమే. వాళ్లందరూ మంచివారు. మర్యాదస్తులు. వాళ్ల వ్యవసాయము కూడా పెద్దదే. పెద్ద ఇల్లు. దానికి చాలా పెద్దవాకిలి. మా పెద్దమ్మ ఇల్లు వాళ్లకు మరీ దగ్గరగా ఉంటుంది. నా మాట వినపడితే చాలు, అక్క పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను వాళ్లింటికి తీసుకెళ్లి కూర్చోబెట్టేది. వెంటనే ఏదో ఒకటి తినడానికి తెచ్చేది. కాదు అనేటందుకు లేదు. తినవలసినదే. నేనంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇల్లంతా కలియతిరిగేవాణ్ణి.

“నేను నాలుగేండ్లు ఇక్కడికి రాలేదు కదా! కాని అక్కడికి ఆ ఊరికి మాత్రం వెళ్ళేవాణ్ణి. దగ్గరేకదా! చలికాలపు సెలవుల్లో సంక్రాంతి సందర్భంలో వెళ్ళేవాణ్ణి. ఈ సంవత్సరం ఎప్పటివలెనే జనవరి నెలలో వెళ్ళిన. అంతకుముందుటిసారి అక్కను చూసి ఒక సంవత్సరం గడిచిపోయింది. అందుకే వెంటనే ఆమెను చూద్దామని వాళ్ళింటికి పరుగెత్తిన. ఎక్కడా అక్కజాడ లేదు. ఎవరూ నాతో మాట్లాడలేదు. అక్క అల్లరితో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు మూగబోయింది. చిన్నబుచ్చుకుని పెద్దమ్మ ఇంటికి తిరిగివచ్చిన. తనూ ఏమీ చెప్పలేదు. నాలో బాధా, భయమూ, దుఃఖమూ భరించలేకుండా పోయినవి. అక్కడికి కొంచెం దూరంలో ఉండే ఒక అత్త ఇంటికి వెళ్లిన.

‘అది ఎక్కడికిపోయిందో ఎవరికీ సరిగా తెలువదు. కానీ, ఓ పుకారుపుట్టింది. కత్తులూ, చాకులూ, వంటింటి సామాన్లు ఊరూర తిరిగి అమ్ముకునే ఒక అబ్బాయితో వెళ్లిపోయిందని. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఊళ్లో అందరూ మీ పెద్దమ్మ కుటుంబాన్ని మాత్రం వెలివేసిండ్రు. ఒకప్పుడు మంచి పేరు, మర్యాదలు గల కుటుంబం’ అని ఆ అత్తనిట్టూర్చింది. నాకు ఏడ్చినంత పనయింది. కాని అత్తముందర కష్టంమీద నిభాయించుకున్న. అత్త చెప్పిందాన్ని బట్టి అక్క బాల వితంతువు, ఆమెకు సంసార సుఖమేమిటో తెలియదు. అత్త దగ్గర సెలవు తీసుకుని బరువెక్కిన హృదయంతో పెద్దమ్మ ఇంటికి తిరిగి వచ్చిన. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. ఆ సాయంత్రమే మా వూరికి వెళ్ళిపోయిన. క్రమంగా దుఃఖం, బాధా తగ్గి నా హృదయంలో అక్కపట్ల గాఢమైన సానుభూతి చోటుచేసుకొన్నది. ఆమెపట్ల ఆదరభావం ఇంకా ఎక్కువయింది, క్లుప్తంగా ఇది ఆ కథ అక్కా!” అని కళ్లు మూసుకొన్న. నా హృదయం ఆవేదనతో నిండిపోయింది.

అక్క మృదువుగా నాకుడిచేతిని నిమురుతున్నది. “బాధపడకు చంద్రా!” “అక్కా! చిన్నక్క చేసినపని తప్పా?” అక్క సమాధానం చెప్పలేదు. “అక్కా! నువ్వు ఏదో ఒకటి చెప్పేదాకా నా మనస్సు కుదుటపడదు”. ఆమె దీర్ఘాలోచనలో పడిపోయింది. తర్వాత “ఒకరి జీవితానుభవాలు, వాళ్ల నిర్ణయాలు, వాళ్ళబతుకులమీద తీర్పులు చెప్పటానికి మనమెవరం?” అన్నది. ఆ సమాధానంతో నేను తృప్తిపడలేదు. అప్పుడు నేనన్నాను, “చిన్నక్క మీద నాకు ఏ ఆక్షేపణా లేదు, కాని ఈ లోకులు ఆమె కుటుంబం పట్ల ప్రవర్తించే తీరు సహింపరానిది. వారి పరిస్థితిని తలచుకుంటే బాధగా ఉంటుంది.”

“తమ్ముడూ! నువ్వు సున్నిత మనస్కుడవు. కానీ ఇలాంటి లోకంలోనే నువు జీవిస్తున్నానని గ్రహించు!” అక్క నుండి వచ్చిన ఈ సమాధానమూ, లేదా సందేశము నన్ను సంతృప్తిపరచలేదు.

ఆ రాత్రి చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. చివరకు ‘చిన్నక్క నా ఆదర్శం. ఆమె ఈ యుగ స్త్రీ. జీవితాన్ని ప్రేమిస్తుంది. సాహసి, యథాలాపంగా ఓటమిని అంగీకరించదు. ఈ పెద్దక్క నా ఆరాధ్యదైవం. ఆమె జీవితాన్ని ఒక ద్రష్టగానే దర్శిస్తుంది. ఆమె పూర్వయుగాల స్త్రీ. ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడమే ఆమె నైజం. ఇద్దరూ ప్రేమైక జీవులే! ఇద్దరినీ నేను సమంగా ప్రేమిస్తాను’ అని నా మనస్సు తీర్మానించింది.

కాలగమనంలో 30 ఏళ్లు గతించిపోయినవి. ఒకరోజు ఇంట్లో ఫోన్ మోగింది. ఎవరిదో అపరిచిత గొంతు. ‘అక్క ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె నన్ను చూడాలని కోరుకుంటూన్నది. నా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది’ అని అతడు చేరవేసిన సమాచారం. ఇంత సుదీర్ఘకాలం అక్కను దర్శించుకోనందుకు మనస్సు అనంతమైన దుఃఖంలో మునిగిపోయింది. కారణాలేమైనా కావచ్చు. అవాంతరాలెన్నైనా ఎదురయి ఉండవచ్చు. ఇన్నేళ్లు అక్కను చూడకపోవటం క్షంతవ్యం కాదు అని నన్ను నేను నిందించుకున్నాను. ఏవో కొన్ని సెలవులు కలుపుకుని వారంరోజులకోసం బయలుదేరినం. నేనెంతగానో ప్రేమించిన అక్క అని విని ఉన్నారు కాబట్టి నా శ్రీమతి, ఇద్దరు పిల్లలు కూడా ఆమెను చూడాలనే కుతూహలంతో ఉన్నారు. ఆ ఏడే కొత్తగా కారు కొన్నాం. అందరమూ కలిసి ఒక ఉదయం బయల్దేరి సాయంకాలానికల్లా అక్క ఊరు చేరుకున్నాం. ఆమె ఇల్లు సమీపించేకొద్ది నాలో ఆందోళన అధికం కాసాగింది. వాకిట్లో ప్రవేశించి ఓ పక్కనున్న పెద్ద చేదబావి గచ్చుపళ్లెంలో ఉంచిన గంగాళంలోని నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి ప్రవేశించినం        

అక్క తన గదిలో పడుకునే ఉన్నది. పడకచెంతనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె కుడిచేతిని నా రెండు చేతుల్లో తీసుకుని ‘అక్కా!’ అని పిలిచిన. కళ్లుతెరిచి నన్ను చూడగానే, “వచ్చినవా చంద్రా! ఈ అక్కను చూడకుండా ముప్పయ్యేండ్లు ఎట్లా ఉండగలిగినవు? నన్ను పూర్తిగా మరచిపోయినవు!” అని వెంటనే తనకు ఎదురుగా కూర్చుని ఉన్న నా శ్రీమతి నుద్దేశించి, “అక్కా! అక్కా! అని నన్ను నోటినిండా పిలిచే నా తమ్ముని పిలుపు ముప్పయ్యేండ్లు మూగబోయింది. ఊహించగలవమ్మా!” అని ఆమె వంకచూసింది. ఆమె తనను సమీపించి, ‘వదినా!’ అని ఇంకా ముందుకు మాట్లాడలేకపోయింది. “నన్ను క్షమించక్కా!” నా కళ్లు వర్షించసాగినవి. “గడచిన దానికి బాధపడకు. ఇప్పుడొచ్చినవుగదా! అది చాలు”. ఆమె కళ్లు సజలమయినవి. ఇద్దరు పిల్లలను పిలిచి ముద్దుపెట్టుకొన్నది. అక్క శరీరం బాగా శుష్కించి చాలా నీరసంగా ఉన్నది. ముఖం క్షీణచంద్రుని తలపిస్తున్నది. గాంభీర్యం స్థానే ముఖంలో కరుణ, ప్రేమ స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నవి. అక్క ఇంట అయిదు రోజులున్నం. పెద్దమ్మ అప్పటికే కాలం చేసిందని తెలిసింది. ఆ ఊరికి వెళ్లటం విరమించుకున్నం. మా నలుగురి రాకతో అక్క ఇంట్లో సందడిగా ఉన్నది. మా రాకవల్ల కలిగిన ఆనందమో, ఇంట్లో నెలకొన్న కొత్తవాతావరణం వల్లనో అక్క ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నది.

నాల్గవరోజు నుండి మంచంలో నుండి లేచి ఇంట్లో తిరుగాడుతున్నది. చిన్న కచ్చడంలో పిల్లలను తీసుకుని పొలాలు చూపించుమని ఒక పాలేరును ఆదేశించింది. దగ్గరలోనే ఉన్న గోదావరి నదీజలాలతో సయ్యాటలు, పొలాలు, తోటలు చూడటంతో వాళ్లు తమ సమయాన్ని చాలా ఉల్లాసంగా గడిపినరు.

రేపు ఉదయం మేము మా వూరికి బయలుదేరుతామనగా ఆ ముందురాత్రి భోజనాల తర్వాత అక్క తన గదిలో నన్నొక్కణ్ణి కూర్చోబెట్టుకొని చాలా సేపు మాట్లాడింది. చివరగా తను పడుకున్న మంచానికి మరీదగ్గరగా నన్ను కూర్చోబెట్టుకున్నది.

“తమ్ముడూ! చంద్రా! నీతో చెప్పాలనుకొంటున్న నా ఆంతరంగిక జీవితానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయం ఒకటున్నది. అది ఇప్పటిదాకా నా మదిలోనే దాచిపెట్టుకున్న ఒక రహస్యం. ఎవరికీ తెలియని రహస్యం. ఎవరితోనూ పంచుకోవడానికి భయపడిన రహస్యం. సానుభూతితో దాన్ని జీర్ణించుకుని సాంత్వన చేకూర్చే ఆర్ద్రహృదయంగల వ్యక్తి నాకింతదాకా తటస్థపడలేదు. కాని ఆ రహస్యం, దాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకుని నా మనస్సును నిరంతరం కలవరపరిచే ఓ భావన నా హృదయంమీద పెద్ద గుదిబండలాగా మారినవి. జీవితాంతం నేనా భారాన్ని మోయలేను. ఇప్పటికి దానికి పరిష్కారం దొరికిందని అనిపిస్తున్నది.

“నువ్వు నాకు అత్యంత విశ్వసనీయుడవు. నా మీద ఉన్న నీ ప్రేమాభిమానాలు నిర్మలమైనవి. స్వార్థరహితాలు. ఇంకో విషయం కూడా విను! స్త్రీల జీవితాలు, వారి ఆవేదనలు, ఆకాంక్షలను వారి హృదయాలలోనికి చొచ్చుకునిపోయి వాటిని ఆకళింపు చేసుకుని స్పందించే అర్ద్ర హృదయం నీది. అందుకే ఈ అక్క తన అంతరంగాన్ని ఇన్నాళ్ళూ క్షోభపెడుతున్న ఆ జీవిత రహస్యాన్ని నీ ముందర విప్పి తన హృదయాన్ని తేలికపరుచుకోవాలని నిశ్చయించుకున్నది. అందువల్లనే, ఇన్నేళ్లయినా నీమీద ఉన్న సడలని నా విశ్వాసంతోనే నిన్ను నా దగ్గరకు రప్పించిన!” అక్క కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది.

“ఏమిటక్కా అది? నిరంతరంగా నీ మనశ్శాంతిని భగ్నంచేసి నిన్ను వేధిస్తున్న సంఘటన ఏమిటక్కా! ఈ తమ్ముడు నీ విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ముచేయడు. నీ గుండెమీది భారం దిగిపోతుందనుకుంటే ఆ రహస్యమేమిటో చెప్పక్కా!” అన్నాను.
“ఆ గుప్త విషయం తెలిసి అక్క పట్ల ఇంతవరకున్న నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావో, నీ భక్తి ప్రపత్తులు చెదిరిపోతాయో నాకు తెలియదు. కాని ఒక్కటిమాత్రం గట్టిగా నమ్ముతా! తమ్ముడు నాకెప్పుడూ దూరంకాడు. నా పట్ల తనకున్న ప్రేమ ఏమాత్రమూ అస్థిరమవదు.”

“అక్కా! నీ ఈ తమ్ముడు ఎప్పటికీ నువ్వు మొదటిసారిగా చూసిన ఆ ఎనిమిదేండ్ల ముద్దుల కుర్రవాడే. నా అక్కపట్ల హృదయంలో ఆనాడు ఏ భక్తి, ఆరాధనా భావాలు చోటుచేసుకున్నవో అవి చిరస్థాయిగా నిలిచి ఉంటవి. చెరగని నా అక్క మమతానురాగాలను నేనెప్పటికీ వదులుకోను.”

“ఇక అసలు విషయం విను చంద్రా! తన జీవితంలో ఏ పరిస్థితిని నీ చిన్నక్క ఎదుర్కొన్నదో, అచ్చంగా అదే పరిస్థితి నా జీవితంలోనూ తటస్థపడింది. దాని మూలంగా నా మనస్సులో కొంతకాలం పెద్ద సంఘర్షణే జరిగింది. నీ చిన్నక్క సంఘాన్ని ధిక్కరించింది. స్వతంత్రించి తన జీవిత గమ్యాన్ని తానే ఎన్నుకొన్నది. విజేతగా నిలిచింది. నువ్వు చెప్పినట్లుగా ఆమె గొప్ప సాహసి!

“ఇక ఈ అక్క! సమాజానికి తలవంచింది. దాని క్రూర దుర్నీతిని ఎదుర్కొనే సాహసం లోపించి ఓడిపోయింది. రాజీపడి జీవిస్తున్నది. ఇదీ నీ ఆరాధ్యదైవం నీ అక్క నిజమైన అస్తిత్వం!” అని ఆగిపోయింది. అక్క నయనాల నుండి ఉబికిన అశ్రువులు ఆమె చెక్కిళ్ల మీదుగా జారిపడుతున్నవి. నేను వెంటనే లేచి కన్నీళ్లు తుడిచి అక్క రెండు చేతులను నాచేతుల్లోకి తీసుకుని సున్నితంగా నిమురుతున్నా. అక్క నా నుదుటిని చుంబించి, “సదా సుఖసంతోషాలతో వర్ధిల్లు! తమ్ముడూ” అని ఆశీర్వదించింది.

తిరుగు ప్రయాణమంతా ఒకే ఒక భావన ఎడతెరిపి లేకుండా నా మనస్సును కలవరపరచసాగింది: ‘సభ్యసమాజం’- దాని దుష్టనీతి, పక్షపాతబుద్ధి! ఎందరక్కల జీవధారలను శోషించి అర్ధంతరంగానే శుష్కకుహరాలుగా మార్చి వేస్తున్నవో కదా!’

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఇల్లు.. మనిషికి చిరునామా!

by Acharya Veerareddy September 29, 2024
written by Acharya Veerareddy

మనిషికి ఇల్లే ప్రపంచం. ఎవరి ఇల్లు వారికి ఇష్టం. ఇల్లు ఇంద్రభవనం కాకపోవచ్చు. అది ఒక ప్రేమ సౌధం.. సేదతీర్చి ఊరట కలిగించే ఒయాసిస్సు. అందులోని ప్రతి నివాసికి ఇది అచ్చంమైన హృదయ లోగిలి. మనసు ఊసులకు కోవెల… మనిషికి భౌతిక చిరునామా. స్మృతుల భాండాగారం. ‘మన’ అనే ‘కణాలను’ పేర్చి కూర్చిన గూడు. చీమకు పుట్టలా, పిట్టకు గూడులా.. జీవి జీవికో తీరైన నివాసం. అలాగే పుట్టిన ప్రతి మనిషీ తనకంటూ సృష్టించుకున్న ఓ ‘సొంత నివాసం’. అదే మనిషి పేరుకు ముందు ‘ఇంటి పేరు’ లాగా ఒక ప్రత్యేక గుర్తింపును ఆపాదించేది. ఎంతటి కష్టాన్నైనా, దిగులునైనా, అలసటనైనా అవలీలగా మరిపించి అవసరమైన ప్రశాంతతనొనగూర్చే మందిరం. ఇల్లు ఇల్లే… దానికదే ప్రత్యేకం. ఇల్లుకు లేదు ప్రత్యామ్నాయం! ముందర వాకిలి ఇంటికి ముఖ వర్చస్సు. మమతలు పొదిగిన తోరణాలతో కళకళలాడుతూ పన్నీరు పరిమళించే పచ్చదనాల లోగిలి. సదా నూతనత్వంతో విరాజిల్లే వేవేల దృశ్యాదృశ్యాల ఆప్యాయతల నివాసం.   

ఇల్లు ఒక సంస్కృతి!

పెళ్లైన పిదప ఆడపిల్లలు తమ పుట్టింట్లో అతిథిగా మారినా, సనాతన సంస్కృతి అనుసారం, క్రమేణ తమ అత్తవారి ఇంటినే సొంత ఇల్లుగా తీర్చి దిద్దుకుంటారు. అలా కాని పక్షంలో, వారికి ఏ ఇల్లు ఉన్నట్టు? ఎప్పటికీ పుట్టింటిపై మమకారం వదలుకోలేని స్త్రీకి, తనలా తను ఉండడానికి, తనకు నచ్చినట్లు నడుచుకోవడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి చేసే ప్రయత్నంలో కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాని అది జీవన్మరణ సమస్య కాకపోవచ్చు. వారు కోరుకునే చిన్న చిన్న ఆనందాలు దక్కడం లేదనో, ఇతరులు రెచ్చగొట్టడం వలననో, తమకంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఉండాలనే ఆశతో బయటకు వచ్చి వేరే కుంపటి ఆలోచన చేయవచ్చు. అలా విడిపోవాల్సి వచ్చిన ఆడ వారే ‘ఇల్లు’ అనే సంస్కృతికి ఊపిరి పోయగలరు. తమకంటూ ఒక ‘ఇంటిని’ తయారు చేసుకోగల సమర్థులు. గురజాడ వారు అన్నట్లు, ‘స్త్రీలు తమను తామే సంస్కరించుకోవాలి’ అన్నది పరమ సత్యం. ఆ సంస్కరణలో ప్రథమ భాగమే మరో ‘ఇల్లు’కు రూపకల్పన. ఎవరి జీవితం వారి చేతిలోనే ఉంటుంది తప్ప తక్కిన సమాజం అంతా ప్రేక్షకులే కదా!     

మనిషి ఎక్కడెక్కడ వెళ్లినా..

ప్రపంచ నలుమూలల్లో మనిషి ఏ పని మీదైనా ఎక్కడెక్కడ వెళ్లినా, ఎంత కాలం వెళ్లినా, ఐదు నక్షత్రాల అధునాతన వసతి గృహంలో బస చేసినా.. తిరిగి మళ్లీ మళ్లీ చేరుకోవాలనుకునే ఏకైక ప్రియ నివాసం ఇల్లు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే తపన దాదాపు ప్రతి మనిషికి ఉంటుంది. ‘హమ్మయ్య! ఎలాగైతేనేం.. చివరికి ఇల్లు చేరుకున్నాం!’… ఒక గొప్ప ‘స్వంత గూటి’ భావన. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ ఈజ్ బెస్ట్!’ అని అందుకే అంటారేమో. ఎంత చిన్నదైనా ప్రతి మనిషికి ఆ ఇల్లే తొలి స్మృతుల ప్రపంచం. అదొక జ్ఞాపకాల ఖజానా! సంస్కృతుల నమూనా! బాల్య బంధాల ఒడి. ఎవరి ఇల్లు వారికి అందమైన ప్రపంచం. ఇంటింటికో ప్రత్యేకత. ప్రతి ఇల్లు ఓ అనిర్వచనీయ అనుభూతుల ఆలయం. రాళ్లు, మట్టి, ఇటుకలు, కట్టెలతో కట్టినదే కాదు, ప్రేమ బంధాలతో నిర్మించినది.. అనురాగపు నగిషీలు చెక్కుకొని, మమతల మాలికలతో అల్లుకొని పెనవేసుకొన్న కుటుంబానికి కేంద్రం ఇల్లు. శరీరానికి ఆత్మలా, ప్రతి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా మనగలిగేది ఇల్లు. మనిషికి అదొక మానసిక సౌధం! మనకు ‘మనం’గా, ‘మనమే’గా ఉండగల్గే మహా ఆవాసం. మన ఇంట్లో మనం నటించం. కృత్రిమ మెరుపులను తోసిరాజని నిత్యం నిజ స్వరూప ప్రదర్శనమే! రెండవ వ్యక్తి ప్రవేశంతో ప్రారంభమైన నటన, మూడవ వ్యక్తి సమక్షంలో కాస్త విజృంభించి పాకాన పడుతుంది. ఇంటి గడప దాటితే చాలు మనసులో ఏమున్నా బహిర్గతం కానివ్వం. మనిషికి నటించడం ఒక కళ. బయట ప్రపంచంలో బ్రతకడానికి అవసరమేమో ఈ కళ! సాధారణంగా ఎదుటి వ్యక్తిని బట్టి, ప్రతి మనిషి గుణానికి కొలతలు మారుతూ ఉంటాయి. కొత్త రంగులు పులుముకుంటాయి. ఎక్కువ కాకున్నా, తనను తాను తక్కువ చేసుకోకుండా ఉండే ప్రయత్నంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మెరిసేదంతా బంగారం కానట్లు, బయట ప్రపంచానికి మనం అగుపించే తీరు అంతా నిజానికి బహుదూరం!     

జీవితంలో స్థిరపడాల్సిన ప్రతి మనిషికి ఇల్లు ఒక ప్రాథమిక అవసరం. అందుకే దీనికి హృదయంలో ఒక ప్రత్యేక స్థానం. ఎక్కడున్నా, ఇల్లు ప్రస్తావన రాగానే హృదయంలో ఒక వెచ్చదనంతో కూడిన ఆప్యాయత అలుముకుంటుంది. సానుకూల శక్తులను పులుముకుంటుంది. చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. ఇంటిలోని ప్రతి ఇంచుతో మనిషికి కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అవి హృదయ కవాటాలపై అంతర్లీనంగా చిత్రించబడిన చిత్రలేఖనాలై చెక్కు చెదరకుండా నిక్షిప్తమై ఉంటాయి. మనిషి మనసులో ఇంటికి ఎప్పుడూ ఉన్నత స్థానమే!

ఇల్లు అనేది…

ఇల్లంటే నాలుగు గోడలపై పరిచిన ‘కప్పు’ కాదు.. అది మనిషి జీవితం. ఒక ప్రదేశం కాదు.. ఒక భావన. కేవలం ఆకలి తీర్చే భోజన శాల కాదు. సుఖాల్ని మాత్రమే ఇచ్చే వసతి కాదు. అది జీవిత ధర్మాన్ని ఓనమాలతో నేర్పించే పాఠశాల. సంసార యజ్ఞాన్ని సజావుగా చేయించే యాగశాల. అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం. జ్ఞానోదయాన్ని ప్రసాదించే బోధి వృక్షం. రక్షణలో అమ్మ ఒడికి సమాంతరం, మోక్షానికి ముఖద్వారం. గర్భగుడికి పర్యాయం. అందుకే అంటారు.. ఆదర్శ గృహస్థుడే మహా ఋషికి మారు పేరని!

వెల కట్టడానికి ఇల్లు అనేది ఒక ఆస్తి కాదు, మనిషి జీవితంలో నెరవేర్చుకోవాల్సిన విలువలతో కూడిన బాధ్యత. అది మనిషిని కదలకుండా ఒక చోట కట్టి పడేసే ‘గుంజ’ కాదు, స్థిరత్వాన్ని ఆపాదించే దివ్యమైన ‘లంగరు’. అభివృద్ధికి అడ్డంగా నిలిచే ‘గుదిబండ’ కాదు.. అంతిమ ఘడియ దాకా అండగా ఉండే చైతన్య దీపిక.

ఇల్లు ఎంత చిన్నది, పెద్దదని కాదు, ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే పరమ విషయం. సంతోషంగా జీవించడమే కాదు, తోటివారికి ఎంత సంతోషాన్ని పంచుతూ జీవిస్తున్నామనేది ప్రథమం. ప్రతి మనిషికి తన ఇల్లే దేవాలయం.. అందులో కొలువుండే దేవతలు అమ్మానాన్నలు. అప్పుడు గృహమే కదా స్వర్గసీమ!

ఇంటితో అనుబంధం.. అందమైన బలహీనత!

మనిషికుండే అన్ని బలహీనతలకు ప్రధాన కారణం ‘బంధం’. సాధారణంగా అది ఏర్పడేది మనిషితోనో, వస్తువుతోనో లేక వ్యవస్థతోనో కావచ్చు. అలాంటి బంధం తన ఇల్లుతో ఏర్పడితే, అది బలహీనతైనా అందమైనదే! ఇది జీవితాంతం వదులుకోలేని అందమైన బంధం. అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు అందంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇల్లును అంటిపెట్టుకుని ఉన్నవారు కన్నవారిని గౌరవించడంతో పాటు కట్టుకున్న ఇల్లాలిని గుండెల్లో పెట్టుకున్నట్లే! అందుకే ప్రతి ఇల్లు ఒక అనురాగ నిలయానికి ప్రతీక.. మనిషి జీవన వృత్తానికి కేంద్ర బిందువు. ఇల్లంటే.. భౌతికంగా ఒక నిర్మాణమే కాదు, ఆశలు, కలలు, జ్ఞాపకాలతో నిత్యం నినదిస్తూ ఉండే నిండైన స్థలం. అందుకే మనిషికి ఇంటితో పటిష్టమైన అనుబంధం. మనిషి ఎదుగుదలకు అదే పిల్ల వేరు, తల్లి వేరు!

పాతుకున్న చోటే చెట్టుకు మట్టితో అనుబంధం. అదే నాభి బంధం. వేళ్ళతో సహా కదిలించి మరో చోటికి తరలించి ఎంత మంచి మట్టిలో పాతినా ఆ చెట్టు అంతగా ఎదగడంలో రాణించదు. అమ్మను మార్చడం ప్రాకృతం కాదు వికృతం! అలాంటిదే ఇంటికీ మనిషికీ ఉన్న అనుబంధం. ఏ మనిషీ భావోద్వేగాలకు అతీతం కాదు. అవి సర్వసాధారణం. శారీరకంగా హార్మోన్లలో కొన్ని మార్పులు సంభవించినా మానసికంగా ప్రతిబింబించే అనుభవం ప్రస్ఫుటం. అదొక మానసిక వైఖరి, రుగ్మత కాదు. ఒకానొక పరిస్థితిపై ప్రతిబింబించే అంతర స్పందన.. అనుభూతి చెందే విధానం!  

ఇంటితో అనుబంధం ఎవరైనా పెంచుకుంటారు. ఇంటితోనే గాక చుట్టూ పరిసరాల్లో ఉన్న ఇరుగు పొరుగుతో ముడి వేసుకున్న భావోద్వేగానుబంధాలు మన భావి జీవితంతోనూ లోతుగా పెనవేసుకొని ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడూ ఆ ఇంటి గోడల లోపల ఏదో తెలియని భద్రత, వెచ్చదనం మరియు సుపరిచిత విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయనేది నగ్న సత్యం. స్వేచ్ఛ కోసం వెతుకుతున్నప్పుడు ఇల్లు తప్ప మనిషికి మరేదీ స్ఫురణకు రాదు. సర్టెన్లీ హోమ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ యునీక్ అటాచ్మెంట్! అందులోనే మనిషికి సుఖం, సంతోషం మరియు సురక్షితం!    

ఇంటికున్న విలువను బేరీజు వెయ్యలేం! ఇల్లుకు వీడ్కోలూ చెప్పలేం!! ఎందుకంటే అది భావోద్వేగాలకు పెట్టుబడి (ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్), హృదయాలాపనలకు అనువైన ఒడి, వ్యక్తిగత విలువలకు కవచ కుండలం. అక్కడి పరిస్థితులన్నీ చిర పరిచితాలు, సౌకర్యాలన్నీ ప్రియ నేస్తాలు.  మనిషి ఇంటికి భౌతికంగా దూరం కావచ్చు, కాని ఇల్లు మనిషి నుండి మానసికంగా కాదు. ఇంటితో అనుబంధం.. జన్మతో బంధం. అది అంత సులభం కాదు తెంచు కోవడం. అది బలమో, బలహీనతో.. అంత ఇదమిత్థంగా చెప్పడం కష్టం.

మనిషి మనిషికి ఒక ఇల్లు!

ఇల్లంటే గోడలు, తలుపులు ఉన్న భౌతిక ఆవరణ కాదు. మన తలపుల్లో అనుక్షణం ఆవరించే ఓ భావన… ఒక మానసిక సౌధం. మనశ్శాంతికి మరో భౌతిక రూపం ఇల్లు. అమ్మ కడుపులో ఉన్నంత సౌకర్యాన్ని తలపించే ఏకైక నివాసం. పురిటిల్లుకు ప్రతిరూపం. మన గురించి సంపూర్ణంగా విప్పి చెప్పేది  ఇల్లు. మేడల్ని, మిద్దెల్ని తలదన్నక పోయినా, మనిషిగా మన ఉనికికి  అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించేది ఇల్లు.

ఎక్కడ ప్రేమ ఉంటుందో, అక్కడే అసలైన ఇల్లు ఉంటుంది. ఎక్కడ హృదయం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. అందుకే అంటారు.. హృదయమే ఇల్లు, ఇల్లే హృదయమని! మనల్ని ప్రేమించే వారు మన ఇంటినీ ప్రేమిస్తారు. ప్రేమించే చోటనే ఇల్లు ఉంటే, మన పాదాలు విడిచి వెళ్లినా, ఆ ఇంటిని మన హృదయాలు విడిచి వెళ్లవు. ఎందుకంటే ఒక ఇల్లు లాంటిది మరొకటి ఉండదు కనుక. అది ఒక స్థలం కాదు.. ఒక అనుభూతి. మనిషి ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ గాలించినా దొరకనిది ఇంట్లో మాత్రమే దొరుకుతుంది. జీవించినంత కాలం ప్రతి జీవికి ప్రకృతి నిర్దేశించిన అతి ప్రియమైన గమ్యం ఒక్కటే.. ‘ఇల్లు’.

మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?

ఎంతో ఇష్టంతో, శ్రమతో, శ్రద్ధతో కష్టార్జితాన్నంతా వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు, పిల్లలు పురుడు బోసుకున్న నాటి నుండి వారితో పాటు కలిసి ఆటలు, చదువులు, పండుగలు, శుభకార్యాలు జరుపుకున్న ఇల్లు, ఎన్నో కష్టసుఖాలు, తీపి చేదులు  పంచుకున్న ఇల్లు, ఏళ్ల తరబడి బంధువులకు, స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు. ఎన్నో సందర్భాల్లో పెద్దలు దర్శించి దీవెనలు అందించిన ఇల్లు, ఇంటిల్లిపాదికీ  ఎంతో తృప్తినీ, ఆనందాన్నీ కలిగించి, ఎన్నో తీయని అనుభూతుల్ని ఇచ్చిన ఇల్లు… ‘అలాంటి మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?’ ఈ ప్రశ్నను జాతి, కుల, మత, భాష, దేశాల తేడా లేకుండా ప్రపంచం మొత్తం జనాభాలో ఎవరిని ఎప్పుడు అడిగినా ‘అవును, ఇష్టమే!’ అనే సమాధానమే నమ్మకంగా వస్తుంది.

‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే!’ రోమ్ పట్టణ నిర్మాణానికి శతాబ్దాల కాలం పట్టిందని చరిత్ర చెబుతోంది. అలాగే ఇల్లు అనేది ఒక్క రోజులో నిర్మించుకునేది కాదు. దాని నిర్మాణం ఒక మనిషి జీవిత కాలం! ప్రపంచంలోని మనుషులందరికి రోమ్ ఒక్కటే.. ఇల్లు మాత్రం మనిషికి ఒక్కటి! ప్రాణం పోయాక ఎక్కడికి వెళతాడో తెలియదు కానీ మరణం దాకా మాత్రం ఆ మనిషికి చిరునామా ఈ ఇల్లే.      

September 29, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహాప్రస్థానం

by K K Tayaru September 29, 2024
written by K K Tayaru

“నేనొక దుర్గం! నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;”

“1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది” అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ. ప్రపంచం ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను నవీనత్వంతో వ్యక్తపరుస్తూ, సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టేలా రాసిన శ్రీ శ్రీ మహాప్రస్థానం గేయాలు పుస్తక రూపం దాల్చింది 1950లో. ఆ పుస్తక ప్రభ, అందులోని కవిత్వపు శోభ 75 వసంతాలైనా ఇంకా నేటి ఆధునిక ప్రపంచానికి రిలవెంట్‌గానే వుంది.

నేటికీ శ్రీ శ్రీ పేరు మీద ఎన్నో సామాజిక, సాహిత్య స్వచ్ఛంద సంస్థలు నవసమాజ నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూనే వుండటమే అందుకు తార్కాణం. మహాప్రస్థానంలోని గేయాలు కృత్రిమ మేధతో కూడిన ఇంగ్లిష్ మీడియం బోధన యుగంలో కూడా నేటి యువతరం నాలుకలపై అద్భుతంగా పలుకుతున్నాయి. కవిత్వం రాస్తున్న ప్రారంభ దశలో ఏ కవినైనా.. ‘నువ్వేమన్నా శ్రీ శ్రీ అనుకుంటున్నావా’ అని ఎవరైనా అంటే ముసిముసి నవ్వులు చిందిస్తూ పొంగిపోని వారు ఎవరుంటారు చెప్పండి ఇప్పటికీ..!… ఎప్పటికీ..! అలాంటి మహా ప్రవాహం కోసం పదండి ముందుకు మహాప్రస్థానం గేయాలను ఓసారి స్మరించుకుందాం..!

“కళ్ళంటూ ఉంటే చూసి, / వాక్కుంటే వ్రాసీ! / ప్రపంచమొక పద్మవ్యూహం! / కవిత్వమొక తీరని దాహం!” ప్రపంచవ్యాప్తంగా వచన కవిత్వం ఎలా రాయాలనే దానికి విభిన్న అభిప్రాయాలు వున్నా …ఇలానే రాయాలనే నిబంధన ఏమీలేదు. గురజాడ అడుగుజాడలతో ఆరంభమైన సామాన్యుని భాషలోనే కవిత్వం శ్రీ శ్రీ తో విశ్వవ్యాప్తమైంది. పాండిత్యంతో సంబంధం లేకుండా సామాజిక సమస్యలపై స్పందించే ప్రతి సగటు మనిషికి కవిత్వం రాసే ప్రేరణ లభించింది. “ఇక్కడ నిలబడి నిన్ను / ఇవాళ ఆవాహనం చేస్తున్నాను! / అందుకో ఈ చాచిన హస్తం! / ఆవేశించు నాలో! ఇలా చూడు నీకోసం / ఇదే నా మహాప్రస్థానం!”అంటూ శ్రీశ్రీ తన మిత్రుడు కొంపెల్ల జనార్ధన్ రావుపై రాసిన “తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!”అంకితం గేయంతో మనల్ని అడుగులు వేయిస్తుంది.. మహాప్రస్థానం!

నేటి స్వతంత్ర్య భారతావనిలో కూడా స్వతంత్ర్యం రాకముందే రాసిన మహాప్రస్థానం గేయాలు సమాజంలో సజీవమై ఇంకా అక్కడక్కడా అప్పుడప్పుడు కనిపిస్తూనే వున్నాయి. కన్నీటి సాక్షిగా కదిలిస్తూనే వున్నాయి. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వివక్షత, దౌర్జన్యం, అసమానతలు వంటి ప్రాపంచిక సమస్యలు మనకు నాగరిక ప్రజాస్వామ్య లౌకిక సమాజంలో కూడా తారస పడుతూనే వున్నాయి.

‘ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, / ఒక జాతిని వేరొక జాతీ, / పీడించే సాంఘిక ధర్మం / ఇంకానా?ఇకపై సాగదు ‘

“కూటి కోసం, కూలీ కోసం / పట్టణంలో బ్రతుకుదామని / తల్లిమాటలు చెవిని పెట్టక / బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..!”

” ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి”దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది!

విశ్వంతరాళంలో మనస్థాయి ఎంత? అంటూ అంతరిక్ష సరిహద్దులను దాటి ఆలోచిస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి…

“ఆలోచనలు పోయేవాడా! / అనునిత్యం అన్వేషించే వాడా! / చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా / ఆకసంలో,సముద్రంలో / అన్వేషించేవాడా! అని ఆనాడే మన భవిష్యత్తును రాశారు.)

“పొలాల నన్నీ, హలాల దున్నీ, / ఇలా తలంలో హేమం పిండగ – / జగానికంతా సౌఖ్యం నిండగ –

నాలో కదలే నవ్య కవిత్వం / కార్మికలోకపు కల్యాణానికి, / శ్రామికలోకపు సౌభాగ్యానికి / సమర్పణంగా, సమర్చనంగా -“

అంటూ సాగిన శ్రీ శ్రీ ప్రతిజ్ఞ నేటి శ్రామిక, కార్మిక,కర్షక లోకానికి నిలువెత్తు నిదర్శనం.

“మాకు గోడలు లేవు / గోడలను పగులగొట్టడమే మా పని. / అలజడి మా జీవితం / ఆందోళన మా ఊపిరి. /తిరుగుబాటు మా వేదాంతం.”

అంటూ తన ధిక్కార స్వరాన్ని శాస్త్రీయ సాహిత్యప్రపంచం వైపు విప్లవ కాంతులతో మళ్లించాడు.

గెలుపోటములను పట్టించుకోకుండా ప్రయత్నాలు ఆపకుండా జీవన గమనం వుండాలని సమాజం ఎప్పుడూ సాపేక్షమే అని

“నిప్పులు చిమ్ముకుంటూ / నింగికి నే నెగిరిపోతే / నిబిడాశ్చర్యంతో వీరు- / నెత్తురు క్రక్కుకుంటూ / నేలకు నే రాలిపోతే, / నిర్దాక్షిణ్యంగా వీరె..”అంటూ వివరించారు.

“నే నేదో విరచిస్తానని, / నా రచనలలో లోకం ప్రతిఫలించి / నా తపస్సు ఫలించి, / నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ / నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని,…”

నేటికీ ప్రపంచ భాషలలో ఎక్కడా కూడా ‘కవితా! ఓ కవితా!’ వంటి అద్భుతమైన కవిత్వం రాలేదని మహాకవులు సైతం శ్రీశ్రీని అభినందించారు. బహుశా నోబెల్ బహుమతి స్థాయి సాహిత్యం ఇది.

“మెరుపు మెరిస్తే, / వాన కురిస్తే, / ఆకసమున హరివిల్లు విరిస్తే / అవి మీకె అని ఆనందించే కూనల్లారా!” అంటూ రాసిన శైశవ గీతి పిల్లలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ప్రపంచపు విలువను తెలియజేస్తుంది. ఒత్తిడి లేని విద్యను పిల్లలకు సూచిస్తుంది.

ఇక చివరగా ఈ లోకం మీదేనండి!ఈ రాజ్యం మీరేలండి! అంటూ జగన్నాథుని రథచక్రాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. మహాప్రస్థానం లాంటి కొన్ని పుస్తకాలు కొన్ని శతాబ్దాల పాటు కాలాన్ని నడిపిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేస్తుంటాయి. మానవత్వపు రహదారిపై మనల్ని నడిపిస్తుంటాయి. ఏదేమైనా ఈ శతాబ్దపు సాహితీ ప్రయాణంలో శ్రీ శ్రీ మహాప్రస్థానం ఓ ధృవతార అనడంలో అతిశయోక్తి ఏమీలేదు.

“శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా-ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం, pass it on” అంటూ చెలం దాదాపు 85 సంవత్సరాల కిందటే చెప్పారు..!

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us