మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

పరిశోధన పరిమళాలు

by vanaparti padma May 22, 2024
written by vanaparti padma

భువనచంద్ర సినిగేయ సాహిత్య పై డా॥ గుమ్మడి (కె) రామలక్ష్మి పరిశోధన చేసి చెన్నై మూనివర్సిటినుండి డాక్టరేట్ పొందినారు. వారి పరిశోధనలో వెల్లండిచిన
వన చంద్రపాటల్లోని సాహిత్యాన్ని రామలక్ష్మి గారు వివరించిన విధానము తెల్సుకుందాము. భువనచంద్ర చలన చిత్ర సాహిత్య వనంలో సౌకుమార్యం, సౌందర్యం, సౌగంధ్యం లాంటివి కలిసి వున్న పూలు చాల వున్నాయి. సుతిమొత్తని పదాలతో సుందకరంగా పాటను అల్లటం దానికి భావపరిమళంతో ఊపిరిపోయటం లాంటి మెళకువలన్నీ క్షుణ్ణంగా తెలిసిన కవి అంటారు రచయిత్రి. అంతేకాదు సంగీతం, సాహిత్యం, నాట్యం కూడా భువనచంద్ర చలన చిత్రగీతాల్లో త్రివేణి సంగమంగా కొన్ని సార్లు ఉరకలేత్తిస్తు మరోసారి మౌనగానంలా, ఇంకోసారి ఉవ్వెత్తగా ఎగసిన కెరటాంగా కల నుండి జాలువారి సీని జగత్తులో చెదరని ముద్రను ఆవిష్కరించారు. ఇలాంటి వన్నీంటిని శ్రమించి అక్షర బద్దం చేస్తూ అన్ని కోణాల్నీ స్మృశించి పాటల్లోని మర్మాలను తేట తెల్లంచేశారు. రచయిత్రి రామలక్ష్మి.
భువన చంద్ర వ్యవహార భాషలో పాటల్ని మీటటంలో ‘కలం’ కారీ అద్దకం తెలిసిన వారు. టైటిల్ సాంగ్ విషయంలో వీరికి ప్రత్యేక ముద్ర వుంది. తెలుగు, ఆంగ్ల భాషల్లో అక్షరమాలలుగా రాసిన పాటలు ఎన్నింటినో ఆవిష్కరించారు. డబ్బింగ్ పాటల మాతృకలలోని భావం చెడకుండా పెదవుల క దలికకు సరిపోయేలా పాటను అనువదింటం, మాతృకభాష అనువాద భాషలమీద గట్టిపట్టుండాలి.
“గర్భాన పెరిగే పాపాయికి ఆగర్భమే ఓజైలురా, ఉయ్యాల వదిలిని బుజ్జాయికి అడుగడుగూ ఓ జైలురా” “నువు నాకు నచ్చావ్” లాంటి పద బంధపారిజాతం లాంటి భావబంధురమైన ఒకగొప్ప వాక్యం ఈ గ్రంథంలో మనం చూడవచ్చును.
వెండి తెరకు బంగారు పూత పూసిన గీత రచయితల్లో భువన చంద్రకు సముచిత స్థానం ఉంది. వీరి పాటల్లో సరిగమలు సరాగాల్ని మీటుతూ శ్రవణానందం కలిగిసై మరికొన్ని శృంగారానుభూతుల్ని పండించిన పాటల ద్వారా అమృతం కురిసిన రాత్రుల్ని చూపించారు. “ఆమ్మో నీ అమ్మగొప్పదే అందంపోగేసికన్నదే” (అంజి) సినిమా కోసం రాశారు. భువన చంద్ర రాసిన ఐటమ్ సాంగ్స్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులకు మంచి సాహిత్యాన్ని సమకూర్చారు. వీరు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లకు రాసిన పాటలు అనేకం. ఇవి దర్శక నిర్మాతలకే కాక సినీ బయ్యర్లకు లాభాలను చూకూర్చటమే కాక సినిమా విజయాలకు కారణమ్యాయి. 1987వ సంవత్సరము నుండి నేటి దాక నిర్విరామంగా పాటలు రాస్తున్న సినీగేయ చరిత్రలో యుగకర్తగాను, పాటల విస్తృతిని పెంచిన కాలాన్ని భువన యుగంగా భావిస్తాను అంటారు రామలక్ష్మి. భువనచంద్ర డబ్బింగ్ పాటలు రాయడంలోను నేర్పారి వీరి డబ్బింగ్ పాటన్నీ ఒరిజినల్ పాటలుగానే అనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.
సృశించిన ప్రతిభావంతుడు సాహీతివేత్త, బహుభాషా కోవిదుడని, ఇతర గీత రచయితలను మించిన ఘనుడని, నిరూపించే యత్నం చేశారు రచయిత్రి. ప్రాచీన ఆధునిక సాహితీ సంప్రదాయాలను, విలువలను తన పాటల్లో కాపాడుకుంటూ, నిలుపుకుంటున్న భువనచంద్ర అన్ని ప్రక్రియలను అన్ని కోణాల్లో సాహితి దృక్పథంతో సృజించిన కవిగా అక్షరసత్యాన్ని సిద్ధాంత గ్రంథం ద్వారా రచయిత్రి నిరూపించారు. భువన చంద్ర సినీసాహిత్యాన్ని వస్తువైవిద్యాన్ని బట్టి ప్రణయక, జానపద, సామాజిక, హస్య, సందేశాత్మక, అనుబంధ, సంప్రదాయ దోరణి గీతాలు వర్గీకరించారు అందుకొన్ని:- అంజి చిత్రంలో “చిరుగాలి వీచింది చివురాకు వొణికుంది” అనే పాటలో పల్లెటూరి జానపద ధోరణిలో శృంగార కవ్వింపుల్లో హస్యజోడించి కవి రచించారు. మరో పాట అచ్చం జానపద దోరణిలో ఇలా మిరపకాయ బజ్జి లిస్తవా… రాసోళ్ళరాణి సత్తుపల్లి సంతకొస్తవా, రాసోళ్ళరాణి కొర్రమీను లొండిపెడతవా… నాసోకురాణి తాటికల్లు ముంత బెడతవా అంటూ సహజ దోరణిలో జానపద పాటలు ఎన్నో రాశారు అంటారు కవయిత్రి.
భువన చంద్ర రాసిన పాటలు కొన్ని త్యాగజీవనం, ఆశయం, ఆశావాదం స్త్రీ స్వాతంత్ర్యం, ఆదర్శ వాదం, చదువుప్రాముఖ్యత, సంతోషం ప్రాధాన్యత అంశాలకు అణిముత్యాల వంటి సందేశాత్మక విలువలతో కూడిన పాటలు రాశారు. “కొండపల్లి రాజా గుండెచూడరా బసవన్నా… ఓ బసవన్నా గుండెలోన పొంగె ప్రేమనీదిరా… వినరన్నా.. ఓ బసవన్నా లాంటి పాట రాసిన “విలువైన ప్రాణం కన్నా స్నేహమే మిన్న, స్నేహం ల ఏని బతుకేసున్నా” అని స్నేహం యొక్క గొప్పతనాన్ని సందేశించారు. నిరాశ, శోకరి, ఆవరించినా వాటిని అధిగమించి ఆశావాదం వైపు దృష్టి సారించాలని “నేస్తమా… అనంతయాత్రలో ఏకాంత రాత్రిలో నిరాశలో శోకమే… నీ నీడలాగ వెంటనంటిసాగితే డోంట్ వర్రి బిహాప్పీ కదులుతున్న యిక్షణం, మరలిరాదు ఏక్షణం తెలుసుకో” అంటూ యువతరానికి సందేశం ఇస్తారు. స్త్రీ మానసికంగా, శారీరకంగా గాయపడినపుడు ఆమెలో ధైర్యం నింపెలా ఈ పాట “క్షణం క్షణం సంఘర్షణ…. జయించు మా భయం నిరంతరం అన్వేషణం…. లభించదాఫలం.. ఎదురేలేదని ఏనాటికి… ఎదురీదాలి ఈ నాడు అంటూనే మరోచోట “లైఫ్ ఈస్ ఏ చాలెంజ్… ఫెస్ ఇట్, లైఫ్ ఈస్ గేమ్ ప్లేయిట్ వీరిసె ఉదయం, విధిలో సమరం నీదే విజయం అంటూ గుండె ధక్ష్మర్యాన్ని ఇస్తారు భువన చంద్ర తన పాటలద్వారా, “మహిళ ఇక నిదుర నించి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో భలో ముందుకు భయా లెందుకు స్వశక్తి చూపి సాగు ముందుకు అంటు స్త్రీ స్వాతంత్ర్యం గూర్చి పాటల ద్వారా స్పూర్తి నింపుతారు.
ఆదర్శవాదం, చదువు, సంతోషం, అనుబంధగీతాలు, అమ్మ ఔన్నత్యం, భార్యభర్తల బంధం లాంటి ఎన్నో విషయాలను సాహిత్య మేళవిపుతోను ఆర్తి, అర్తనాదాల కలయికగా అనేకమైన గీతాలను భువన చంద్ర గారి కలం నుండి జాలువారాయి. ఇంక గల, గల పారే సెలయేరులా వస్తునే వుంటాయి అని రామలక్ష్మి తన సిద్ధాంత గ్రంథంలో రాశారు.
1980వ దశకంలో పాటల రచయితగా భువన చంద్ర “నాకు పెళ్ళాం కావాలి” చిత్రంతో సినీబయ్యర్లకు వసూళ్ళు తెచ్చిపెట్టిన అలుపెరుగని సవ్యసాచి. 12కు పైగా ఉత్తరాది భాషలు నేర్చుకున్నారు. పుస్తక పఠనం, చర్చలు, సమావేశాల్లో పాల్గొంటూ విజ్ఞానాన్ని పొందారు. 18సంవత్సరాలకీ ఎయిర్పోర్స్లో చేరి శిక్షణ పొంది 18 సంవత్సరాలపాటు విధుల నిర్వహించారు. భువనచంద్ర పాటలేకాదు, నవల, కథలు, శీర్షికలు వ్యాసాలు, కవితలు వంటి అన్ని సాహితి ప్రక్రియలను సృజించారు. వ ఈరు కథలు కూడా రాసి తెలుగుతేజం, స్వప్న, నది వంటి మాస పత్రికల్లోన, స్వాతవారపత్రికల్లోను ప్రచురితమై బహుమతులు గెలుచుకున్నాయి. ఇందు ముఖ్యంగా స్త్రీ ఔన్నత్యం, స్త్రీ ఆదర్శంగా నిలిచే, స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ, విదవా పునర్వివాహం వారి జీవనగమ్యంతో పాటు సంసారంలోని ఆటు, పోట్లు, పుల్లవిరుపు, పెడసరపు మాటలు, ఎత్తిపోడుపులు, దెప్పుళ్లు, హేళన, భార్యభర్తల మధ్య ఉన్న అంతరాలు, మారుతున్న వివాహ వ్యవస్థ లాంటి విషయాలను కథల్లో ప్రతిబింబించారు.
భువన చంద్ర అసలు పేరు ఊకకరణం పూర్ణనంద ప్రభాకర గురురాజు వారి అమ్మ పేరు చంద్రమౌళీశ్వరి దేవిలోని ‘చంద్ర’ ను కాగా కవిగార్కి ఒకసారి కామెర్లు వచ్చినపుడు రక్తం ఇచ్చిప్రాణదానం చేసిన అమ్మకాని అమ్మ భువనేశ్వరిలోని “భువన”ను కలిపి ఇరువురి గుర్తుగా తన కలం పేరును భువన చంద్రగా మార్చుకున్నారు. తొలి పాట నుండె భువన చంద్రగా అందరికి పరిచయం అయ్యారని తన పరిశోధన ద్వారా రామలక్ష్మి తెలియజేశారు. ఈ గ్రంథం సాహితీ ప్రముఖులతో పాటు పాఠకులకు, అభిమానులకు ఉపయుక్తంగా ఉంది.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 19, 2024
written by Narendra Sandineni

అనిశెట్టి రజిత కవిత్వం కొత్త సొబగులతో శోభిస్తున్నది.
*ప్రయాణం కవిత.
*మా నాన్నే విశాల ప్రపంచం కవిత.
*ఊరు బంధం కవిత.
అనిశెట్టి రజిత ప్రయాణం కవిత పై విశ్లేషణా వ్యాసం.

కవయిత్రి, అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన
కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని ప్రయాణం కవిత పై విశ్లేషణా వ్యాసం.ప్రయాణం కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏదేని ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లడం ప్రయాణం.సుదూర భౌగోళిక ప్రాంతాల మధ్య ప్రజల కదలిక ప్రయాణం.జీవితాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి చేసే ప్రయాణం, మతపరమైన తీర్థ యాత్రల కోసం చేసే ప్రయాణం. మిషన్ యాత్రల కోసం చేసే ప్రయాణం.ఇవి అన్ని ప్రయాణం కిందికి వస్తాయి.ఏదైనా ప్రక్రియ లేదా పురోగతి ప్రయాణంతో పోల్చబడుతుంది.ప్రయాణం ముఖ్యంగా ఇబ్బందులు లేదా వ్యక్తిగత అభివృద్ధిని కలిగి ఉంటుంది. కవయిత్రి రజిత ప్రయాణం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“నీ చేతులకు రెక్కలు తగిలించుకొని
“నీ రెక్కల్ని ముక్కలు చేసుకుంటూనే
“శకలాలను మళ్లీ బతికించుకుంటూ
“బతుకులోకి భరోసాగా ఎగిరిపోతూ ..
ఎవరి ఆందోళననైనా తగ్గించడానికి ఉద్దేశించిన సలహా ఓదార్పు మాటలు భరోసా.మనిషి జీవిత ప్రయాణంలో తన చేతులకు రెక్కలు తగిలించుకొని ఆరుగాలం తన రెక్కల్ని ముక్కలు చేసుకుంటూ కష్టపడి శ్రమిస్తాడు.మనిషి తన బతుకు పోరాటంలో తన శరీరంలోని రెక్కలతో పాటు మిగిలిన అవయవాలను కూడా బతికించుకుంటాడు.మనిషి గడుపుతున్న జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుంటూ గుండె నిబ్బరంతో తనకు తానే ఓదార్చుకుంటాడు.మనిషి తన శరీరంలో గల అన్ని అవయవాలను రెక్కలను కాపాడుకుంటూ ఆకాశంలో విహరించే పిచ్చుక వలె ఎగిరిపోతూ స్వేచ్ఛగా తన జీవిత ప్రయాణం కొనసాగిస్తాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నీలోని మనో వికారాలను బయటికి చిమ్మేసి
“నీ మనో వికాసాలను ఎగదోసి నవ్వేసి ..
మనిషి మనసులో ఉత్పన్నమైన భావన మనో వికారంగా చెప్పవచ్చు.మనిషి తన మనసులో చెలరేగే భావాలను బయటికి ఊడ్చి చిమ్మేస్తేనే శుభ్రంగా ఉంటుంది.మనిషి తన మనో భావాలను నియంత్రణ చేయడం చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు.విద్య,వైద్యం,విజ్ఞానం,మనోవికాసం కోసం పుస్తక పఠనం ఎంతో ముఖ్యం.పుస్తక పఠనం వలన మనో వికాసం కలుగుతుంది.మనిషి తనలో కలిగే మనో వికాసాన్ని వ్యక్తం చేస్తూ నవ్వుతూ జీవిత ప్రయాణాన్ని సాగించాలి అంటూ కవయిత్రి స్ఫూర్తిని పొందేలా చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జీవితం నిత్య ప్రయాణమే
“దారి పొడుగునా మజిలీలే ..
జీవితం అనేది మనిషి కొనసాగిస్తున్న జీవనం మరియు అతని ఉనికిని తెలియజేస్తుంది.జీవితం అనేది మనిషి సాగించే ప్రతి రోజు ప్రయాణంగా చెప్పవచ్చు.మనిషి తాను చేస్తున్న ప్రయాణంలో దారి పొడుగునా ఎన్నో అడ్డంకులు,ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగి పోవాలి.మజిలీ అంటే మార్గ మధ్యంలోని తాత్కాలిక నివాసం, మకాముగా చెప్పవచ్చు.మనిషి చేస్తున్న జీవన ప్రయాణంలో మజిలీ ముఖ్యమైనది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

“విసుగే గాని విరామం లేని అడుగులు
“తీరీ తీరని కలలకు పట్టే గొడుగులు ..
మనిషి సాగించే జీవిత ప్రయాణంలో విసుగు ఉండవచ్చు.కానీ విరామం ఉండదు.మనిషి చేస్తున్న ప్రయాణంలో తాను వేస్తున్న అడుగులు గమ్యస్థానం వైపు సాగుతూ ఉంటాయి.మనిషి తన కోర్కెలను తీర్చుకోవడానికి ఒక్కో అడుగుతో ప్రయాణం మొదలు పెడతాడు.తీరీ తీరని కలలు సాకారం చేసుకోవడానికి మనిషి తన తోటి వారితో సంయమనంతో మెలగాలి.మనిషి తోటి వారు అందించే సాయంతో తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆనందంతో ముందుకు సాగుతుంటాడు అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“కోర్కెలను పొదుముకున్న ఊహలు
“ఆ ఊహలకు మొలిచే వ్యూహాలు ..
కోరిక అనగా ఏదైనా వస్తువు,పదార్థం లేదా వ్యక్తికి కావాలని అనిపించడం.కోరిక అనేది బలమైన భావన.కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా సాధించడానికి భావం తోడ్పడుతుంది.విజయం కోసం మనిషికి కోరిక అవసరం.ఆసక్తి కలిగి ఉండటం,ఇష్టం కలిగి ఉండటం కోరిక.ఏ పనినైనా చేయడానికి మనసులో కలిగే ఆశ కోరిక.దేనిపైనైనా ఏకాగ్రత చూపించడం కోరిక.ఊహ అనగా ఒక రకమైన ఆలోచన.ఊహ మనిషి మనసుకి గోచరించే ఒక దృశ్యం.ఊహ ఒక దృక్పథం,దానిని ధ్యానంతో అనుసంధానిస్తుంది.ఊహ అనేది తనకు తానుగా తెలియజేసే అనుభూతుల భావాలు మరియు ఆలోచనల ఉత్పత్తి.ఈ అనుభవాలు ఊహా జనిత మార్పులతో కూడిన స్పష్టమైన జ్ఞాపకాలు.కల్పనకు శిక్షణ ఇచ్చే మార్గం కథ చెప్పడం,వినడం.వ్యూహం అనేది ఒక కళ.వ్యూహం అనేది ఒక పనిని సాధించడానికి ఏర్పాటు చేసుకునే ప్రణాళిక.మనిషి కోరికలను తనలోకి ఆహ్వానిస్తూ స్వాగతిస్తున్న ఊహలను మనం చూడవచ్చు.అట్టి ఊహలకు రూపుదిద్దే వ్యూహాన్ని అనుసరించి నిర్దిష్టమైన ప్రణాళికలతో మనిషి ప్రయాణం ముందుకు సాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“తొడుగుల్లోని తోలుబొమ్మలాటల్లా
“రంగుల దేహాల్లోంచి నటనలు ..
తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోను,పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషలో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రక రకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుక నుండి ఈ పాత్రలను కదిలించాడు.కదులుతున్న ఆ జీవం లేని బొమ్మలతో జీవ నిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.నటన అనేది నటి లేదా నటుడు చేయు పని.ఇది నటన, రంగస్థలం,సినిమా,దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలతో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. నటన అనేది బహుళ ప్రాచుర్యం పొందిన కళ. నటులకు ఉండవలసిన లక్షణాలు మూడు. అంగికము అందమైన రూపం.వాచకం మంచి కంఠస్వరం.అభినయం హావ భావాలతో ప్రేక్షకులను ఆకర్షించుకోగల సామర్థ్యం.తత్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా పోలుస్తారు.నటన అనేది బాగా అభివృద్ధి చెందిన ఊహ.భావోద్వేగ సౌలభ్యం,శారీరక వ్యక్తీకరణ, ప్రసంగం యొక్క స్పష్టత,విస్తృతమైన నైపుణ్యాలను కలిగి ఉంటుంది.తొడిగించిన తోలుబొమ్మల ఆటల వలె మనిషి జీవిత ప్రయాణం కొనసాగుతున్నది. మనిషి రంగురంగుల దేహాలతో కూడిన నటనలు కొనసాగుతున్నాయి.కొంత మంది మనుషులు నిజ జీవితంలో కూడా నటిస్తుంటారు.దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు.మనిషి జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు సహజమే.మనిషి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగాలి.నటనతో మనిషి విలక్షణంగా తన ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ మూడు నాళ్ళ జీవితానికి నటనలు మనిషికి అవసరమా? అనిపిస్తుంది.నటనలు మనిషి బతుకులో భాగమయ్యాయి.కావాలని నటనలు చేయడం వల్ల జీవితం యొక్క లక్ష్యం మాయతో మోసంతో తీర్చిదిద్దబడుతుంది.నటన కొరకు మనిషి బతుకును కొనసాగించవద్దు.నటనలతో తమ తోటి వారిని మోసగించవద్దు అని చెప్పిన భావం అద్భుతంగా ఉంది. .

అనిశెట్టి రజిత

“లోలోంచి ఒక నేపథ్య సంగీతం
“అపస్వరంలోనో సప్త స్వరాల్లోనో గీతం ..
సంగీతం సుప్రసిద్ధమైన కళలలో ఒకటి.సంగీతం ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం,తాళం,పల్లవి మొదలైనవి.సంగీతం శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది.ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. భారతీయ సంగీతంలో సప్త స్వరాలు స,రి,గ,మ,ప,ద,ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది. ‘స’షడ్జమము,‘రి’ రిషభం,’గ’ గాంధారం,’మ’ మధ్యమము, ’ప’పంచమం,‘ద’ దైవతం,’ని’ విషాదం అని సప్త స్వరాల పేర్లు.సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. మనిషి గుండె లోతుల్లో ఒక నేపథ్య సంగీతం మేళవించి ఉంది.మనిషి పాడే పాట స్వరబద్ధంగా లేక ఒక్కోసారి అపస్వరంగా వినిపించవచ్చు.మనిషి లోపల నుండి ఒక్కోసారి సప్త స్వరాలతో కూడిన గీతం వెల్లువలా ఉబికి వస్తుంది.జీవితమన్నాక మనిషి పాడే పాట ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. సంతోషంగా ఉన్నప్పుడు పాడిన పాట స్వరబద్ధంగా ఉండి రంజింప చేస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఆగేదెక్కడో ఆగేదెప్పుడో పరుగులు
“చిక్కులు బడ్డ సహజీవన తంత్రులు ..
తంత్రులు అంటే స్ట్రింగ్స్ అనుకోవచ్చు.ముడులు వేసిన కిరణాలు అని అర్థం.కిరణాలు అంటే తంత్రులు.కిరణాలను తంత్రులతో పోల్చడం.తంత్రి అంటే తీగె,వీణ మొదలైన వాయిద్యాలు.తీగెలను తంత్రులు అంటారు.సితార్ యొక్క తీగలాగా ఉండేది తంత్రి.సహజీవనం అనేది పెళ్లి కాకుండానే యువతీ యువకులు కలిసి జీవించడం.ఇది పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది.సహజీవనంపై హద్దులు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.ఇవి స్నేహం వరకు లేదా శారీరక సంబంధం వరకు కూడా ఉంటాయి.సహజీవనం ఇరువురి అంగీకారం పై ఆధారపడి ఉంటుంది. సహజీవనం వివాహం కాని వ్యక్తులు సాధారణంగా జంటలు కలిసి జీవించే ఏర్పాటు.సహజీవనంలో వారు తరచుగా దీర్ఘకాలికంగా లేదా శాశ్వత ప్రాతిపదికన శృంగార లేదా లైంగిక సన్నిహిత సంబంధంలో పాల్గొంటారు.మనిషి కొనసాగిస్తున్న ప్రయాణంలో పరుగులు ఆగేది ఎప్పుడో,ఆగేది ఎక్కడో తెలియదు.ఆనందంగా కలిసి సహజీవనం సాగిస్తున్న జంటలు అభిప్రాయ భేదాలు ఏర్పడి తంత్రులు చిక్కుబడ్డ వీణలా బాధలకు లోనవుతారు.చిక్కుల్లో చిక్కుకున్న బంధం ఇరువురు మధ్య సాగుతున్న సహజీవన ప్రయాణంలో ఆగేది ఎక్కడో ఆగేది ఎప్పుడో అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“విధి విసిరే వియోగ గాలం
“తీరం చేరనివ్వదు తిరగబడ్డ కాలం ..
విధి తప్పకుండా జరగబోవు సంఘటన.విధిని ఎవ్వరు మార్చలేరు అంటారు.ఉద్యోగ నిర్వహణలో భాగంగా మీరు చేయవలసిన పనిని చేయడం విధి. చేపలు పట్టడానికి ఉపయోగించే సాధనం గాలం. మోసపూరితంగా ఇతరుల నుంచి లబ్ధి పొందడానికి చూపే ఆశను గాలం వేయడం అంటారు.
మనకు ఇష్టమైన వ్యక్తి దూరమైనప్పుడు అనుభవించే బాధ వియోగం.ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులు దూరం కావడం వియోగం.తీరం అనగా సాగర తీరం,నదీ తీరం,తీర ప్రాంతం.భూమి సముద్రంలో కలిసే తీర ప్రాంతంగా నిర్వచింపబడింది. తీరాలు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి దృశ్యం యొక్క స్థలాకృతి, అలల వంటి నీటి ప్రేరిత కోత ద్వారా ప్రభావితం అవుతాయి. కాలం అనగా సమయాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరుచుటకు ఉపయోగించే పదం.గడియారం తెలిపేది కాలం.ఏదైనా పని చేయుటకు ఇచ్చు సమయం కాలం.నిమిషాలు గంటల గురించి చెప్పబడేది కాలం.ఆగమన్నా ఆగనిది కాలం.విధి చేస్తున్న మాయాజాలం తప్పకుండా జరగబోవు సంఘటనను మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషి వియోగం అనే గాలానికి చిక్కి విలవిలలాడుతాడు.సముద్రంలోని అలలు తీరం చేరాలని తహతహలాడుతుంటాయి.కాలం ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు.కాలం ఎదురు తిరిగినప్పుడు మనిషి బాధను అనుభవిస్తాడు.సముద్రంలోని అలలను తీరం చేరనివ్వకుండా ఏదో ఒక శక్తి ఆపుతున్నది.విధి రాత వల్లనే వియోగం ఏర్పడింది అని మనిషి తెలుసుకుంటాడు.ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో ఎడబాటు కలుగుతుంది.తీరం చేరని అలల ప్రయాణంలాగే తిరగబడ్డ కాలం వల్ల విడిపోవటాలతో ఒడిదుడుకుల ప్రయాణం అలా కొనసాగుతూ ఉంటుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఒంటరి మనిషిగా సమూహంలోకి
“సమూహంలోనే ఒంటరిగా నిలిచి ..
ఏకాంతం అంటే కోరుకుని,కావాలని ఒంటరిగా ఉండటం.ఒంటరితనం అంటే ఏకాంతంగా ఉండటం. ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఏకాకి అని లోకులు అంటారు.ఒక లక్ష్యం కోసం ఒక పథకం కోసం ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం జన సమూహం నుంచి ప్రవాహ వేగం యొక్క సుడుల జడుల నుంచి పక్కకు జరిగి విడిగా ఉండటాన్ని ఏకాంతం అంటారు.మనిషి లోకంలోకి పుట్టుకతో ఒక్కడిగా వస్తాడు.మనిషి పోయేటప్పుడు ఒక్కడిగానే పోతాడు.ఈ నడుమ మనిషి గడిపే జీవితమంతా పది మందితో ముడిపడి ఉంటుంది.సమాజంలోకి వచ్చాక మనిషికి ఎందరి అవసరమో సహకారమో కావాల్సి ఉంటుంది.సమాజంలో ఎంతో మందితో ఆత్మీయంగా మెలగవలసి ఉంటుంది.వెలుగు నీడల్లా మిట్టపల్లాల దారిలా ఆటుపోటుల సముద్రంలా కష్టసుఖాలను అనుభవించ వలసి వస్తుంది.కొందరు ఊహల్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉంటే అక్కడ ఎవరు బాధపెట్టరు.ఎవరు మోసం చేయరు.ఎవరు అవమానించరు. నిజానికి ఒంటరిగా ఉండడమే మంచిది.ఒంటరిగా ఉన్నప్పుడు మనలో మనం మాట్లాడుకుంటాం.మన గురించి మనం ఆలోచించుకుంటాం.సమూహంలో అంటే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు. కొంత మంది జనాలతో ఉండటానికి ఇష్టపడరు. విశాల ప్రాంగణం అయినా సరే అందులో ఊపిరి సల్పనట్లు అనిపిస్తుంది.ఒంటరితనం అనేది ఒక రకమైన అనుభూతి.ఒంటరితనం పొందిన వ్యక్తి గుంపులో నివసిస్తున్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు.ఒంటరి మనిషి ఒక్కోసారి ఏమీ తోచక సమూహంలోకి వెళతాడు. సమూహంలో ఉన్నప్పటికీ కూడా అతను ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాడు.జీవితం అనే ప్రయాణంలో ఒక్కోసారి మనిషికి ఏమీ తోచదు.అట్లాంటి సమయంలో కొంత సేపు ఒంటరిగా గడిపినట్లయితే స్వాంతన దొరుకుతుంది.ఒంటరితనంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి సానుకూలంగా ఆలోచిస్తాడు.అనుభూతి చెందుతాడు.తాను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను ఒంటరిగా ఉన్నప్పుడు అందిపుచ్చుకుంటాడు. సమూహంలోని వ్యక్తుల మధ్య భిన్న అభిప్రాయాలు,భిన్న మనస్తత్వాలు చూసి సమూహంలోనే గడిపినప్పటికీ ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు.మనిషి జీవిత ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉంటాయి.మనిషి జీవితంలో ఒంటరితనం ఒక భాగం అనిపిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“తన్లాట ! వెతుకులాట ! వేట !
అన్నింటా వికటించే బతుకాట ..
మెరుగైన సమాజం కోసం మనిషి పడే తపన తండ్లాట.పసి పిల్లవాని కొరకు తల్లి పడే తపన తండ్లాట.ఆరుగాలం కష్టించిన అన్నదాత పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక బతుకు కొరకు పడే తపన తండ్లాట.చదువుకున్న వ్యక్తి ఉద్యోగం కొరకు పడే తపన తండ్లాట.ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్న యువతి తన భర్త వ్యసనాలకు బానిస అయితే అతని మార్చడానికి పడే తపన తండ్లాట.ప్రేమ పేరిట మోసగించిన ప్రియుడి గురించి తలుచుకొని బాధపడుతూ గడపడం తండ్లాట.ఏదేని ప్రత్యేకమైన వస్తువును పొందడానికి చేసే అన్వేషణ వెతుకులాట.మనిషి బతుకులో వెతుకులాట కూడా ఉంటుంది.మనిషి బతుకులో వేట కూడా ఉంటుంది. బతుకు గడపడం కొరకు తండ్లాట ఉంటుంది. బతుకును సాగించుట కొరకు వెతుకులాట ఉంటుంది.బతుకులో వేట కూడా ఉంటుంది. ఒక్కోసారి బతుకు పోరు సాగే ప్రయాణంలో ఎదురు తిరగడం కూడా ఉంటుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషి సంపూర్ణమయిన అల్పజీవి !
మనిషి బిక్కుబిక్కుమంటూ భయం భయంతో జీవనం సాగిస్తూ ఉంటాడు.మనిషికి అసాధారణమైన తెలివితేటలు ఉన్నప్పటికీ కొందరు మనుషులు భయస్తులుగా,పిరికితనంతో తమ జీవితాన్ని నెట్టుకు వస్తారు.భయం,పిరికితనం జాడ్యం అతనిని జీవించి ఉన్నన్ని నాళ్ళు వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది.మనిషి భయాన్ని,పిరికితనాన్ని వదిలిపెట్టాలి.ధైర్యంతో మనిషి కొండనైనా ఢీకొట్టే శక్తి తనలో ఉంది అనే జ్ఞానంతో మెదిలితే అతడు అల్పజీవి కాదు.మనిషి సంపూర్ణమైన అల్పజీవి అనేది చిత్ర విచిత్రమైన డోలాయమైన పరిస్థితిని తెలియజేస్తుంది.మనిషి సంపూర్ణమైన అల్పజీవి అని వ్యక్తం చేసిన తీరు బాగుంది.
“చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమి !
ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం.భూమిపై ⅓ వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సుల్లో నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. ఎడారులు జీవకోటి మనుగడకు సహకరించవని పేరుంది.ఎడారులు చాలా ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రతలు తక్కువ వర్షపాతం మరియు కొరత లేదా వృక్ష సంపద లేని భూమి యొక్క బంజరు ప్రాంతాలు.ఎడారిలో పగటిపూట వేడిగా ఉంటుంది. రాత్రిపూట చల్లగా ఉంటుంది.చెమ్మగిల్లని కన్నులు ఉంటాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మనిషికి దుఃఖం పొర్లుకు వచ్చినప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎడారి భూముల్లో నీరు కనిపించదు.చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమిలా కన్నీళ్లు వేదనతో ఏర్పడి మనిషి సాగిస్తున్న జీవిత ప్రయాణంలో ఇంకిపోయినాయి. ఎడారి భూమిలో కళ్ళు చెమ్మగిల్ల కుండా ఉండే స్థితి వస్తుందా?అని మనలో మనకు సందేహాలు పొడచూపవచ్చు.చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమి అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ప్రయాణం సుదీర్ఘం !
జీవించడానికి మనిషి చేసే ప్రయాణం సుదీర్ఘమైనది. అట్టి ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనిషి ప్రయాణం విరామం లేకుండా నిర్విరామంగా కొనసాగుతుంది. మనిషి జీవన యానంలో సుదీర్ఘ ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది అని కవయిత్రి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అనుభవం అత్యల్పం.
ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న ఆటు పోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. పనులు/విషయాలు చేయడం,చూడటం లేదా అనుభూతి చెందడం ద్వారా జ్ఞానం లేదా నైపుణ్యం పొందడం,నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుభవం.పనులు చేయడం ద్వారా తెలుసుకొను భావన అనుభవం.ఏదైనా పనిని చేసి ఉన్న జ్ఞానంతో వచ్చినది అనుభవం.అనుభవం అనేది సాధారణంగా స్పృహతో కూడిన సంఘటనలను సూచిస్తుంది.మరింత ప్రత్యేకంగా అవగాహనలకు లేదా ఈ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆచరణాత్మకమైన జ్ఞానం మరియు పరిచయాన్ని సూచిస్తుంది. విశాలమైన అర్థంలో ఒక చేతన సంఘటనగా అర్థం చేసుకోబడిన అనుభవం వివిధ అంశాలను ప్రదర్శించేదిగా ఉంటుంది.అనుభవం అత్యల్పం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అయినా ప్రయాణం ఎడతెగనిదే
“కడుపు నిండా కష్టాలున్న కడలి లాంటిదే ..
మనిషి చేస్తున్న జీవన ప్రయాణం ఎడతెగకుండా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది.మనిషి సాగిస్తున్న ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి.బ్రతుకులోని కష్టాలతో, సముద్రంలోని ఆటుపోటుల వలె మనిషి జీవన ప్రయాణం కొనసాగుతుంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“తడి లేని మనసు గుహల్లోకి చొరబడి
“తొలుచుకుంటూ పోవాల్సిందే …!
మనస్సు అంటే అంతరంగం,మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం.మనస్సు అనేది తరచుగా అనుభూతి, అవగాహన,ఆలోచన,తార్కికం,జ్ఞాపకశక్తి,నమ్మకం, కోరిక,భావోద్వేగం మరియు ప్రేరణ వంటి మానసిక దృగ్విషయాలతో అర్థం చేసుకోబడుతుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు,కోరికలు కలిగించేది మనసు.ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం.మనిషి యొక్క భావాలు, అనుభూతులు,అభిప్రాయాలు వారి మనసు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.మనిషి ప్రవర్తన,నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.మనిషి యొక్క గ్రహణ శక్తి,ఆనందం మరియు బోధ,నమ్మకం,కోరిక,ఉద్దేశం మరియు భావోద్వేగాలను అనుభవించడంలో మనసు కూడా ముడిపడి ఉంటుంది.తడి లేని మనసు గల వ్యక్తులు ఉంటారా? అనే సందేహం మనలో పొడచూపుతుంది.మనకు ఇష్టం ఉన్నా లేకున్నా తడి లేని మనసు గుహలోకి చొరబడి తొలుచుకుంటూ మనిషి తన జీవన ప్రయాణం కొనసాగించాల్సిందే.భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు.తడి లేని మనసు గుహల్లోకి చొరబడి తొలుచుకుంటూ పోవాల్సిందేనని మనిషి తన ప్రయాణం కొనసాగించాల్సిందేనని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
‌అనిశెట్టి రజిత మా నాన్నే విశాల ప్రపంచం కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవయిత్రి,అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని మా నాన్నే విశాల ప్రపంచం కవిత పై విశ్లేషణా వ్యాసం.కవితను ఆసక్తితో చదివాను.కవిత నాకు నచ్చింది.కవితలోని భావాలు నన్ను ఆలోచింపజేశాయి.కవిత శీర్షిక పేరు మా నాన్నే విశాల ప్రపంచం.కవయిత్రి తండ్రిని విశాల ప్రపంచంతో పోల్చడం,ఆమెకు తండ్రి పట్ల గల అపారమైన ప్రేమను, అనురక్తిని తెలియజేస్తుంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో తండ్రిని ఎంత మంది ప్రేమిస్తున్నారు? అనే సందేహాలు మనలో పొడచూపుతాయి. కవయిత్రికి తండ్రి పట్ల గల ప్రేమను వ్యక్తీకరిస్తూ కవిత రాయడం గొప్పగా ఉంది.ప్రపంచం అనగా విశాల విశ్వంలోని భాగం,జీవులు నివసించే ప్రదేశం.సాధారణంగా ప్రపంచాన్ని భూగ్రహంగా వ్యవహరిస్తారు.మా నాన్నే విశాల ప్రపంచం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవయిత్రి రజిత కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించి కవితానుభూతిని పొందండి.
“మా నాయినమ్మకు మా నాన్న
“బంగారు కొండ
“మా తాతయ్యకు మా నాన్న
“కొండంత అండ
“మా అమ్మకు మా నాన్న
“నిండైన కుండ
“మా కేమో మా నాన్న
“ప్రపంచం నిండా ..
నాన్న తల్లిని నాయనమ్మ అంటారు.మా నాయనమ్మకు తన కొడుకు అయిన మా నాన్నను పంచ ప్రాణంగా భావించేది. నాయనమ్మ నవ మాసాలు మోసి పెంచిన తన కొడుకును ఆప్యాయంగా బంగారు కొండ అని పిలుస్తుండేది.నాయనమ్మ నాన్నను బంగారు కొండ అంత విలువైన వానిగా భావించేది. నాన్న తండ్రి తాతయ్య.మా తాతయ్యకు తన కొడుకు అయిన మా నాన్న కొండంత అండగా ఉండే వాడు.మా నాన్న కూడా తాతయ్య కనుసన్నులలో మెలుగుతూ చెప్పిన పనులు చేస్తుండే వాడు.తాతయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఎల్లవేళలా నాన్న అందుబాటులో ఉండే వాడు.నాకు మా చెల్లెళ్లకు ప్రపంచంలో మా నాన్నను చూసిన అనుభూతి కలిగేది.మాకేమో ప్రపంచం నిండారా నాన్న ఉన్నట్లు అగుపిస్తుండేది అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఎన్ని కతలు ఎన్ని వింతలు
“విడ్డూరాలతో హాస్యపు జల్లులు
“లోకం తెలిపిన నాన్న చెప్పే
“విశేషాలు విషయాలూ వింటూనే
“లోకం పోకడలు తెలుసుకున్న వాళ్ళం.
కత అనగా సాహిత్య ప్రక్రియ.కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం.చిన్న పిల్లలు నిద్ర పుచ్చడానికి కథలు చెప్పడం అలవాటు.ఏదైనా కొత్త విషయం,వస్తువు,అపురూపమైనది వింత.ఒకింత సంబ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం,వస్తువు, వింత.ఆశ్చర్యం కలిగించేటటువంటిది వింత. అసాధారణ మాటలు విన్నప్పుడు చూసినప్పుడు కలిగే భావన వింత. విస్మయము కలిగించే వస్తువు వింత.లోకం పోకడ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఎప్పుడు మారుతునే ఉంటుంది.మన తాతల తరంలో ఎలాంటి సదుపాయాలు,సౌకర్యాలు లేకుండానే జీవితాన్ని గడిపారు.మన తండ్రుల తరంలో కొన్ని సదుపాయాలు,సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.మన తరంలో ఇంకా కొన్ని సదుపాయాలు,సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఇప్పటి తరంలో చెప్పలేనంత మార్పు వచ్చింది.నేటి తరంలో అన్ని సౌకర్యాలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మనం చిన్నప్పుడు ఉన్నట్లు ఈనాటి మనుషుల్లో ఆత్మీయత, అనురాగం ఆప్యాయతలు కనిపించడం లేదని బాధ పడుతుంటారు.పాత తరం లాగా ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు.నేటి కొత్త తరంలో మనుషులు అంతా కొత్తగా వింతగా ఉన్నారు అంటే ఎలా? కొత్త తరం కొత్తగానే ఉంటుంది.ప్రతి వారు లోకం పోకడ బాగా లేదని వాపోతుంటారు.వర్తమాన లోకంలో మనము కూడా ఒక భాగమే అని అనుకోరు.మనం కూడా లోకంలో మార్పుకు కారణం అని మనకు తెలుసు.అయినప్పటికి పాత రోజులు తలుచుకొని ఎంతో ఆనందంగా గడిపాం అంటే ఎలా? ఇప్పటి మనం నివసిస్తున్న వర్తమానాన్ని ఆహ్వానిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలి.నాన్న నిద్ర పోయే ముందు సాహస వీరుల కథలు చెప్పే వారు.ధైర్యాన్ని నూరి పోసే వారు.నాన్న వెంట బజారుకు వెళితే లోకంలో జరిగే ఎన్నో వింతలు చూపించే వారు.నాన్న లోకంలోని విడ్డూరాలు తెలుపుతూ నవ్వుల జల్లులు కురిపించే వారు.లోకం గురించి అన్ని విషయాలు నాన్న తెలుపుతుంటే విని ఆశ్చర్యపోయేవాళ్ళం అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నాన్నను చూసి మానవ సంస్కారం
“అలవర్చుకున్నాం
“నాన్న వల్ల సమాజాన్ని పరిచయం చేసుకున్నాం
“ఆడపిల్లలమైన మేము స్వేచ్ఛగా
“రెక్కలల్లార్చి విహంగించాం
“నాన్న ప్రజాస్వామికత వల్ల
“నిశ్చింతగా నియమబద్ధంగా ఎదిగాం …
సంస్కారములు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు.ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతం వివిధ దశలలో జరుపబడతాయి. వ్యక్తుల జననము,మరణము తదనంతరం ఆత్మ పరలోక శాంతి నొందు వరకు సంస్కారములు జరుపబడును.సంస్కారములు మొత్తము పదహారు.వీనిని షోడశ సంస్కారాలు అంటారు. సమాజం అంటే మానవులు కలిసి మెలిసి పరస్పర సహకారం అందించుకుంటూ సమిష్టిగా జీవిస్తూ ఉండే నిర్దిష్ట సమూహం.ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘంతో కూడిన నిర్దిష్ట సమూహాలు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని సూచిస్తుంది. వ్యక్తిగా సాధ్యమయ్యే దాని కంటే సమూహంగా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు సమాజాలను ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలోని అందరు వ్యక్తులు మానవ కార్యకలాపాల్లో పాల్గొంటారు.సమాజంలో ప్రజలు ఒకరికొకరు పరస్పర అనురాగం,ఆప్యాయతలను కలిగి ఉంటారు.నాన్న లోని గొప్ప సంస్కారం ఏమిటంటే పెద్ద వారిని చిన్న వారిని అందరిని తన వాళ్లుగా భావించి ఆప్యాయంగా పలకరించే గొప్ప సుగుణం ఉండేది.ఎవ్వరి పట్ల కూడా నాన్నకు ద్వేష భావం ఉండేది కాదు.ఎప్పుడు నాన్న పెదాలపై చిరునవ్వు విరబూసేది.నాన్నకు శత్రువులు, మిత్రులు అని తేడాలు ఉండేవి కాదు.అందరి పట్ల ప్రేమ,సమ భావంతో ఉండే వారు.పెద్ద వాళ్లు,పేద వాళ్లు కనబడ్డా వారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసే వారు.నాన్న సమాజంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. నాన్న వెంట నాతో పాటు చెల్లెలు కూడా పాల్గొనేది. నాన్న మమ్ములను ఆడ పిల్లలం అని మా పట్ల ఎలాంటి భేద భావం చూప లేదు.మేము ఆడ పిల్లలం అయినప్పటికీ మమ్ములను సమ దృష్టితో చూసే వారు.నాన్న చూపించిన ప్రేమ, అనురాగం, ధైర్యం,మొక్కవోని ఆత్మవిశ్వాసం మాకు అలవడింది.నాన్న మేము ఆడపిల్లలం అయినప్పటికీ మమ్ములను బడికి పంపించారు. విద్యా వినయం నేర్పించారు.నాన్న వల్లనే మేము స్వేచ్ఛగా విహరించే పావురాలవలే ఆడుతూ పాడుతూ చదువుకున్నాం.నాన్న ఇచ్చిన ప్రేరణతో ఇప్పటికీ ధైర్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం.నాన్న ప్రజాస్వామ్యవాది.ప్రగతిశీల భావాలతో నిండి ఉండే వాడు.సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వాడు కాదు.సాటి వానికి న్యాయం జరిగించే వరకు పోరాటం చేసే వాడు. నాన్న న్యాయం కోసం నిలబడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.సమాజ అభ్యుదయం కాంక్షించిన వ్యక్తి.పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొని నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించే వాడు.నాన్న అందించిన మార్గదర్శకత్వం మరియు చూపిన బాటలో మేము కొనసాగుతున్నాం.చిన్నతనం నుండి ఉగ్గుపాలతో మంచి నడవడిని,సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని ఎదిగాను.ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నారీమణులకు అండగా ఉంటున్నాను.రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్నాను. సామాజిక కార్యకర్తగా నాన్న వల్లనే ఎదిగాను అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మా నాన్న జన ప్రేమికుడు
“నిత్య చిరునవ్వుల రేడు
“తన భుజాల మీద మమ్మల్నే కాదు
“మా ఇంటిని ఎత్తుకున్న ధీరుడు
“సున్నితమైన హృదయాంతరంగుడు
“జీవనోత్సాహ రాగానికి సాక్షీభూతుడు ! సమాజంలో నివసించే వారిని జనం అని అంటారు. ఇవ్వాళ సమాజంలో స్వార్థపరులే ఎక్కువగా ఉన్నారు.నిస్వార్థపరులైన నాయకులు ఒక్కరు కూడా కాన రావడం లేదు.మా నాన్న జనాన్ని ప్రేమించే వాడు.సమాజంలో జరుగుతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతంకు వ్యతిరేకంగా పోరాడే వాడు.మా నాన్న ఎల్ల వేళలా సామాన్య జనుల హక్కుల కోసం పరితపించే నాయకుడు.మా నాన్న నిత్యం చిరునవ్వులు చిందించే రాజుగా పేర్కొనడం ఆమెకు తండ్రి పట్ల గల అవ్యాజమైన ప్రేమను తెలియజేస్తుంది.లోపల ఎంత బాధగా ఉన్నా బయటకు కనిపించకుండా చిరునవ్వులు కురిపిస్తూ అందరితో ఆప్యాయతగా మెలగడం కవయిత్రి నాన్నగారికే సాధ్యమని కవితలోని వాక్యాలు తెలియజేస్తున్నాయి.చిన్నతనంలో నాన్న మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ప్రేమగా తిరిగేవాడు.మా ఇంటి బాధ్యతలను ఎత్తుకుని భుజాల పై మోసే ధీరుడు.ధీరుడు అంటే ధైర్యం కలవాడు.ధీరుడు అంటే ఎన్ని ఆపదలు చుట్టుముట్టినా కష్టాలు వచ్చినా చలించకుండా అత్యంత ధైర్యం కలిగి ఉండేవాడని అర్థం.నాన్న ‌సున్నితమైన హృదయం కల వాడు.నాన్న మనసులో ఏది దాచుకునే వాడు కాదు.భోళా మనస్తత్వంతో జీవితాన్ని ఉత్సాహంగా రాగాలు పలికించినట్లు నాన్న గడిపే వాడు.ప్రకృతిని ప్రపంచం యొక్క సుస్థిరతను జీవితం కోరుకుంటుంది.ఉత్సాహం అనేది ఒక వ్యక్తి ద్వారా వ్యక్తీకరించబడిన తీవ్రమైన ఆనందాన్ని సూచిస్తుంది.నాన్న ఎల్లవేళలా ఉల్లాసభరితంగా ఉండే వాడు.ఆశావాదం ఆయన ఊపిరి.సప్త స్వరాలను అనేక రీతులలో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి.నాన్న జీవితాన్ని సప్త స్వరాలతో రాగాలు మేళవించినట్లుగా జీవనోత్సాహ రాగానికి సాక్షిభూతుడుగా ఉన్నట్లు వ్యక్తికరించడం చక్కగా ఉంది.
“బతుకు వ్యవసాయంలో కష్టాలతో
“అలంకృతుడైన మా నాన్న
“నిఖార్సైన కార్మికుడు కర్షకుడు !
జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన బతుకు. వ్యవసాయం చేస్తూ రైతులు ఆరుగాలం కష్టించినా కడుపారగా తిండి దొరకక ఆకలితో మలమలలాడుతున్నారు.కార్మికులు ఎంత శ్రమించినప్పటికీ సరియైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలు గడుపుతున్న స్థితిని చూస్తున్నాం.మా నాన్న బతుకు వ్యవసాయం చేస్తూ కష్టాలతో నిండి ఉన్నప్పటికీ ధైర్యంతో జీవనాన్ని సాగించాడు.కార్మికుని వలె కర్షకుని వలె కష్టము చేస్తూ శ్రమను నమ్ముకుని నాన్న జీవనం సాగించాడు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మాకు మా నాన్నే ఈ సుందర
“సువిశాల ప్రపంచం అనిపిస్తాడు.
మా నాన్న మాకు ఈ లోకం గురించి పరిచయం చేసి మాలో ఉత్సాహాన్ని శక్తిని నింపినాడు.ఈ లోకాన్ని మాకు చూపించిన మా నాన్న సువిశాల ప్రపంచం అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.చక్కటి కవితను రాసిన కవయిత్రి రజితను అభినందిస్తున్నాను.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

అనిశెట్టి రజిత ఊరు బంధం కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవయిత్రి,అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని ‘ఊరు బంధం’ కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊరు బంధం కవితను ఆసక్తితో చదివాను. కవిత నాకు నచ్చింది.కవిత నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవిత శీర్షిక పేరు ఊరు బంధం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.కవయిత్రి రజిత ఊరుకు బంధం ఉంటుంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.కవయిత్రి రజిత ఊరు బంధం కవిత చదవగానే మనలను మన ఊరులోకి తీసుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది.కవయిత్రి రజిత ఊరు పట్ల గల ప్రేమను కవిత ద్వారా వ్యక్తం చేయడం చక్కగా ఉంది.ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అని సామెత వాడుకలో ఉంది.కన్న తల్లి జన్మభూమి అయిన ఊరు బంధం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవయిత్రి రజిత కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. గొప్ప అనుభూతిని పొందండి.
“ఊరంటే ఉట్టి మట్టి కాదు
మట్టీ ! మనిషి ! ఉత్పత్తీ !
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు.తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది, పట్టణము కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం అని అర్థం.మట్టిని నేల,నేలలు అని కూడా అంటారు.మట్టిని భూమి,దూళి అని కూడా అంటారు.మట్టి జీవానికి ఆధారమైన సేంద్రీయ పదార్థం.ఖనిజాలు, వాయువులు,ద్రవాలు,జీవ పదార్థాల మిశ్రమం. భూమిలోని మట్టి భాగాన్ని పెడోస్పియర్ అని అంటారు.పెడోస్పియర్ పొర మొక్కల పెరుగుదలకు మాధ్యమంగా,నీటి నిల్వ,సరఫరా,శుద్ధీకరణ సాధనంగా,భూ వాతావరణాన్ని పరివర్తింపజేసేదిగా ఉంటుంది.మట్టి జీవులకు ఆహారం,భూమి మీద ఉండే పదార్థం.మనిషి అనగా ఒక వ్యక్తి.ఉత్పత్తి సేవ లేదా వస్తువు కావచ్చు.ప్రతి ఉత్పత్తి ఖర్చుతో కూడి ఉంటుంది. ప్రతి ఉత్పత్తి ధరకు అమ్మబడుతుంది. ఊరు అంటే ఉత్త మట్టి కాదు.ఊరులో నివసించే మనిషికి మట్టితో అనుబంధం ఉంటుంది.ఊరులో నివాసం ఏర్పరచుకొని నాటి ఆదిమానవుడు మొదలుకొని ఈనాటి నవీన మానవుడు కూడా జీవనం సాగిస్తున్నాడు.మనిషి మట్టితో పంటలు పండించి ఉత్పత్తి చేస్తాడు.ఊరిలో నివసించే రైతులు అనాదిగా మట్టిని నమ్ముకుని పంటలు పండించి జీవనం సాగిస్తున్నారు.రైతులు పండించిన పంటల వల్లనే మనం ఆహారం స్వీకరిస్తున్నాం. ఊరులో మట్టి ఉంటుంది.ఊరిలో మనిషి ఉంటాడు.ఊరిలో మనిషి పండించిన పంటల ఉత్పత్తులు కూడా ఉంటాయి.ఊరుతో మట్టి బంధం ఉంటుంది.ఊరిలో మనిషికి మట్టితో బంధం కూడా ఉంటుంది.మట్టిని నమ్ముకుని బతుకుతున్న రైతుకు ఉత్పత్తితో కూడిన బంధం ఉంటాయని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“ఊరంటే జనజీవన తంత్రం.
ఊరిలో నివసించే వారిని ఊరి జనం అంటారు. ఊరిలో సబ్బండ వర్ణాల ప్రజలు నివసిస్తున్నారు. ఊరిలో వివిధ కులాలు ఉన్నాయి.వివిధ కులాలకు సంబంధించిన జనాలు ఉన్నారు.ఊరిలోని జనులు వివిధ వృత్తులు చేపట్టి జీవనం సాగిస్తున్నారు.ఊరి జనులు ఏ వృత్తి చేపట్టినప్పటికీ అందరు పరస్పర సహకారంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు. ఊరి జనులు అన్నదమ్ముల వలె ఐకమత్యంతో మెలుగుతూ మనుగడ సాగిస్తున్నారు.ఊరంటే జనజీవన తంత్రం అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“సూర్యునితో కలె దిర్గే శ్రమ యంత్రం.
ఊరిలోని జనులు ప్రాతః కాలంతోనే నిద్ర లేస్తారు. సూర్యోదయం కాగానే జనులు పనులు ప్రారంభించి సూర్యాస్తమయం వరకు అలసట అనేది ఎరుగక తమ వృత్తికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై కొనసాగిస్తారు.ఎండ,వాన,చలిని భరిస్తూ పనులు చేస్తారు.సూర్యుని పొద్దుపొడుపు నుంచి మొదలై సూర్యుడు పడమటి దిశకు చేరుకునే వరకు శ్రమ యంత్రాల వలె జనులు పనులు చేపడుతారు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మనిషికి ఊరు చిరునామా
“ఊరు బంధాల సంబంధాల కల్నేత
“ఊర పిశికెలు అల్లుకున్న గూడు
“ఊటబాయిల ఊరే తేట నీరు ..
చిరునామా లేదా అడ్రస్ అనగా భూమి మీద ఒక వ్యక్తి నివాస సంబంధమైన వివరములు ఉంటాయి. తెలుగులో కూడా చిరునామా అంటే అడ్రస్ అనే ఆంగ్ల పదమే అధికంగా వినియోగంలో ఉంది. తపాలా వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి అవసరమైన వివరాలను సూచిస్తూ చిరునామా పదం వాడుతారు.నివాస స్థలం తెలిపే పదం చిరునామా.ఒక నివాసాన్ని కనుగొనడానికి చిరునామా ఉపయోగపడుతుంది.మనిషిని ఏ ఊరు అని అడిగితే ఫలానా ఊరు వాడు అని చెబితే అది అతని చిరునామా అవుతుంది.ఊరితో బంధాలు ఏర్పడతాయి.ఊరులో ఏర్పడిన బంధాలు సంబంధాలు రంగురంగుల పోగులతో అల్లుకున్న వస్త్రం వలె చక్కగా పొందికగా ఉంటాయి.ఊర పిశికెలు అల్లుకున్న గూడులాగా ఊరి జనాలు పరస్పర అనుబంధాలతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు.ఊర పిచ్చుకలు చూడ ముచ్చటగా ఉంటాయి.పల్లెల్లో ఊర పిచ్చుకలు ఇంటి ముందుకు వస్తాయి.పల్లె జనాలు ఊర పిచ్చుకలకు ధాన్యం వేస్తే తింటాయి.ఊట బాయిల ఊరే తేట నీరు చేదుకుని జనాలు తాగుతారు.ఊట బావి నీరు చల్లగా తీయగా ఉంటుంది.ఊట బావిల ఊరే తేట నీటిని ఊరి జనం ఎంతో ప్రీతిగా తాగుతారు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఊరంటే సేద్యగాళ్ళ రంగస్థలి
“పని చేసే చేతులు సృష్టించే
“సకల సంపదల భాండాగారం
“వాయి వరుసల కమ్మని పల్కరింపు …
నాయిక,నాయకుడు అభినయించు చోటు రంగస్థలం.నాటక ప్రదర్శనశాలను రంగస్థలం అంటారు.ధాన్యాన్ని నిలువ ఉంచు ప్రాంతాన్ని భాండాగారం అంటారు.మానవుడు సంఘజీవి.అన్ని బాగున్నప్పుడు పలకరించినా పలకరించక పోయినా పరవా లేదు.మనిషి బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్లి పలకరించడం కనీస మానవ ధర్మం.అదే మనం అనుబంధానికి ఇచ్చే విలువ. బాగున్నావా అనే తీయని పలకరింపు కోసం మనిషి ఆరాటపడతాడు.ఈనాడు మనుషుల్లో ఆత్మీయత కరువైంది.ఒక కమ్మని పలకరింపు ద్వారా మనుషుల్లో ఆనందాన్ని కలుగజేయాలి.ఊరిలో రైతులు వ్యవసాయ భూముల్లో చేసేది సేద్యం. రైతులు సేద్యం చేసి పంటలు పండిస్తారు.రైతులు అందరు కలిసి వ్యవసాయ భూముల్లో సేద్యపు పనుల్లో రంగస్థలంలోని నటుల వలె నిమగ్నమై పనులు చేస్తారు.రైతులు ఆరుగాలం కష్టించి,శ్రమించి వ్యవసాయం ద్వారా తమ భూముల్లో పంటలు పండిస్తారు.రైతులు చెమటోడ్చడం వల్లనే పండించిన పంటలతో ధాన్యాగారాలు నిండుతాయి.ఊరిలోని రైతులు అందరు అన్నదమ్ముల వలె అక్క చెల్లెళ్ల వలె అప్యాయతతో కమ్మగా పలకరించుకుంటారు.ఊరి వారందరు అరమరికలు లేని స్నేహంతో ఆత్మీయతతో మెదులుతారు.ఊరిలోని ప్రజలంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి అప్యాయతగా మసులుకుంటారు.ఊరి జనాల స్నేహం,ఆత్మీయత,కమ్మని పలకరింపు గురించి కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఊరంటే చెట్లు పనిముట్ల స్నేహం.
ప్రతి సంవత్సరం చిగురిస్తూ,పుష్పిస్తూ,కాయలు, పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు.చెట్లు నేల పటుత్వాన్ని,భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలు చేకూర్చడంలోను వ్యవసాయం లోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొలకెత్తడం,పెరిగి పెద్దవి అవటం,పుష్పించి, ఫలాలను ఇవ్వడం,కొంత కాలానికి వయస్సు ఉడిగి నశించడం,ఇవన్ని చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది.ప్రకృతి అందాలకు నిలయమైన ఈ భూమిపై వృక్షాలను నాటుదాం. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ కూడా ఒక్కటి.వృక్షో రక్షతి రక్షితః చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. పనిముట్టు అనేది సాధనం,పరికరం,ఉపకరణం. ఏదైనా పనిని త్వరగా సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువు పనిముట్టు.వ్యక్తి యొక్క సామర్థ్యం పనిముట్ల ద్వారా పెరుగుతుంది.చెట్టు యొక్క కలపతో పనిముట్లు తయారు చేస్తారు. అరక,మడక,నాగలి ఇది కొయ్యతో చేసినది. మేడి,నొగ,కాడిమాను.ఎద్దులతో భూమిని దున్నుతారు.భూమిని దున్నడానికి రెండు ఎద్దులు,ఒక మనిషి అవసరం.ఊరులో చెట్లు ఉంటాయి.చెట్ల కలపతో తయారు చేసిన పనిముట్లతో ఊరి వారికి స్నేహం ఉంటుంది అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషిని మనిషి పట్టించుకునే ఆరాటం
“మట్టి పువ్వుల పైరు పచ్చని యవుసం.
ఊరిలో మనిషి తోటి మనిషిని పట్టించుకునే ఆరాటం ఉంటుంది.ఊరిలో మనుషులు కలివిడితనంతో,ఆప్యాయతతో మెలగడం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.రైతు సాగుచేసిన వ్యవసాయం ద్వారా మట్టిలో పెరిగిన పైరు పువ్వులు పూచి పచ్చదనంతో కళకళలాడుతుంది. వ్యవసాయం అనేది ఒక్కరు చేసే పని కాదు. సమిష్టిగా ఊరి వారందరు కలిసిమెలిసి ఉండి పరస్పర సహకారంతో పనులు చేసుకుంటారు. రైతులు ఒకరిని ఒకరు పట్టించుకునే ఆరాటం ఉంటుంది.రైతులు నారు పోసి నీరు పెట్టి పెంచి కలుపు తీసి మట్టిలో పువ్వులు పూయించి పైరును పచ్చదనంతో కళకళలాడింపజేస్తారు అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“భూమిని మధించి పూజించడం …
“ఊరు సబ్బండ జాతుల సంస్కృతి !
భూమిని ఆరాధించడం వల్ల శ్రేయస్సు మరియు అదృష్టం లభిస్తుంది అంటారు.భూమి పూజ తర్వాత విత్తనాలు నాటడం వంటి ఆచారాలు ఉంటాయి. మన సంస్కృతిలో ప్రజలు ఏదైనా ముఖ్య కార్యాన్ని లేదా పనిని పూజతో అంటే దేవతలను ఆరాధించడంతో ప్రారంభిస్తారు.ఏదైనా కొత్త ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు ప్రజలు భూమి పూజ చేస్తారు.ఎప్పుడు మనిషి నేను అనే భావన కన్నా నలుగురితో మనం అనే భావన ఆనందాన్ని ఇస్తుంది.మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగగా భావిస్తారు. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకున్న సమయంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.పొలాల నుంచి ఇంటికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు.ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తారు.సమాజంలో ముఖ్యమైన పద్ధతులు,నిర్మాణాలు, వ్యవస్థలు,సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి.సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు. అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతూ ఉంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్ని కలిపి సంస్కృతి అంటారు.గతించిన కాలం గురించి భవిష్యత్తు తరాలకు అందించే వారధి సంస్కృతి.ఊరిలో భూమిని పూజించే ఆచారాలు,వ్యవహారాలు అనాదిగా కొనసాగుతున్నాయి.ఊరిలో సకల జాతులు,సబ్బండ వర్ణాల ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషి ప్రకృతితో జత కట్టే నియతి.
భూమి,నీరు,అగ్ని,గాలి,ఆకాశం పంచభూతాలు. వీటికి ప్రకృతి మూలం.ప్రకృతి అనగా మనం కళ్ళతో చూడగలిగే,మనసుతో భావించే,శరీరంతో గుర్తించే వాస్తవ ప్రపంచం.ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం,విస్తృత కోణంలో ఉంది. వాతావరణం,పర్యావరణ వ్యవస్థ,వృక్షజాలం, జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్నిచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి,మనల్ని పోషిస్తుంది.మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం,మనం పీల్చే గాలి,మనం ధరించే బట్టలు,మనం నివసించే ఇల్లు అన్ని ప్రకృతి మాత అందించిన బహుమతులు.ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి.ప్రకృతి మన భౌతిక అవసరాలకు మాత్రమే కాకుండా మనశ్శాంతికి, ఆనందం,ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.ప్రకృతిని పరిరక్షించడానికి మనం కృషి చేయాలి.ప్రకృతిలో ఉన్న అనేక చెట్లు రోజు వారి ఉపయోగాలతో పాటు ఔషధ ప్రయోజనాల కోసం సహాయపడుతాయి.ఊరు బంధంలో నివసించే మనిషి ప్రకృతితో జతకట్టి నియతిగా జీవనం కొనసాగిస్తున్నాడు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మౌఖిక కథన కావ్యాల గుమ్మి.
మౌఖికంగా కథ చెప్పుతున్న కథకుడు మరియు శ్రోతల మధ్య ఒక పురాతన సన్నిహిత సాంప్రదాయం కొనసాగుతున్నది.కథకుడు,శ్రోతలు శారీరకంగా దగ్గరగా ఉంటారు.మౌఖిక కథన సౌలభ్యం ద్వారా సాన్నిహిత్యం,సంబంధం హాయిగా ఉంటుంది.మౌఖిక కథా కథనాలను అనేక రూపాల్లో ప్రదర్శించవచ్చు.పాటగా,నృత్యంతో పాటు ఒక రకమైన నాటక ప్రదర్శనం.మౌఖిక కథ మానవ భాష ఉన్నంత కాలం ఉండి ఉండవచ్చు.తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.తాను స్వయంగా అనుకరించలేని జానపద కావ్యాల్లోనూ పురాణాల్లోనూ వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు.తన భాషలో మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు.రకరకాల విన్యాసాలు వాటిచేత చేయించాడు.తాను స్వయంగా వెనక నుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న జీవం లేని బొమ్మలతో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.నృత్య దశ నుండి మానవుడు నాటక దశలోకి ఎదిగే పరిణామ క్రమంలో తోలు బొమ్మలాట ప్రముఖ పాత్ర వహిస్తుంది.జానపదుని మొదటి రంగస్థలం ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని చెప్పవచ్చు.తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది.జానపద ప్రదర్శన కళలు,తెలుగు నేలను సుసంపన్నం చేశాయి.ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించినవి,జానపద ప్రదర్శన కళలే. వృత్తి జానపద కళారూపాలు ఒగ్గు కథలు,హరి కథలు,నాటకాలు,యక్షగానాలు,చిందు బాగోతం, కోలాటం,తోలుబొమ్మలాటలు మొదలైనవి,ఊరులో ప్రదర్శించే వారు.మౌఖిక కథన కావ్యాల గుమ్మి అని ఊరు గురించి ఊరు బంధం కవిత ద్వారా కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల గోకులు పంచె అమ్మి !
పాలు శ్రేష్టమైన బలవర్ధక ఆహారం.ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి.పాలు అన్ని వయసులవారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం.పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు,బర్రెలు,మేకలు,గొర్రెలు.టీ,కాఫీలను పాలను ఉపయోగించి తయారు చేస్తారు.పాలు తోడబెట్టినచో పెరుగు తయారవుతుంది.పెరుగును పల్చగా నీటితో బాగా కలిపితే మజ్జిగ తయారవుతుంది.పెరుగును బాగా చిలికితే వెన్న తయారవుతుంది.వెన్నను మరగబెట్టినచో నెయ్యి వస్తుంది.పాలతో పాలకోవా,మిఠాయిలు తయారు చేస్తారు.బిస్కెట్లు,చాక్లెట్లు,ఐస్ క్రీములు,రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను ఉపయోగిస్తారు.ఊరులో ఏ ఇంట చూసినా పాడి పోషణ ఉంటుంది.ఊరిలో పాలు,పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు.ఊరిలో పాలగోకులు ఉచితంగా అందరికీ పంచే అమ్మిని గురించి కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఊరు అప్యాయతలు పొంగే అవ్వ !
ఊరు అప్యాయతలు పంచే అవ్వ.మనం నివసించే ఊరు కన్నతల్లి లాంటిది.కన్నతల్లి నవమాసాలు మోసి మనలను కంటుంది.ఊరు మనకు నిలువ నీడను చోటును ప్రసాదించి జీవితాంతం తోడుగా ఉంటుంది.ఊరులో నివసించే జనులు అప్యాయత, అనురాగాలతో కలిసిమెలిసి ఉంటారు.కష్టం వచ్చినా సుఖం వచ్చిన తోడుగా ఉంటారు.ఊరు తల్లి అప్యాయత వల్లనే మన మనుగడ చక్కగా సాగుతుంది.ఊరులో తెల్లవారు జామున కను విందు చేసే మధురానుభూతులు జీవితాంతం నిలిచిపోతాయి.పక్షుల కిలకిలారావాలు,కోయిలల‌ కుహు కుహు రాగాలు మధుర మనోహరంగా ఉంటాయి.మమతలు పంచే బాల్య స్నేహితుల పలకరింపులు మనసును కట్టి పడవేస్తాయి. బంధువులు,స్నేహితులు,అత్తయ్యలు, మామయ్యలు,బాబాయి,పిన్ని,అక్క,చెల్లి, ఇరుగుపొరుగు వాళ్ళ మాటలు,మమకారాలతో ఆనందాల సందడిగా ఉంటుంది.ఊరు అప్యాయతలు పొంగే అవ్వ అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది
“ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ !
ఊరిలోని రైతులు పండించిన పంట వల్లనే కమ్మని ఆహారం తింటున్నాం.ఊరు మనకు ఉనికిని ఇచ్చింది.ఊరు లేకుంటే ఉనికి లేదు.ఊరు లేకుంటే ఊరులోని జనం లేరు.ఊరు మనకు సకలం ప్రసాదించిన తల్లి.ఊరు తల్లి ఉనికి వల్లనే మన ప్రాణాలు నిలుస్తున్నాయి.ఊరు తల్లి ఉనికి వల్లనే మనం మనుగడ సాగిస్తున్నాం.ఊరు ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.ఊరు బంధం కవిత ద్వారా ఎన్నో విషయాలు పంచుకున్న తీరు అద్భుతంగా ఉంది.ఊరు బంధం కవితను రాసిన కవయిత్రి రజితను అభినందిస్తున్నాను.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

హృదయాంజలి

by Jyostna Prabha May 19, 2024
written by Jyostna Prabha

ఆ కలం జన గణాలకు జయకేతనమైంది
అతడు అడుగుపెట్టిన చోటు శాంతినికేతనమైంది
విశ్వాన్ని వెలిగించిన రవీంద్రుడు
కవిత్వాన్ని శ్వాసించిన
విశ్వకవీంద్రుడు .
అతడి కోసం నీలి మేఘాలు తేలి వచ్చాయి
వర్షంగా కురవడానికో
తూఫాన్ గా భయపెట్టడానికో కాదు
అతని జీవన సంధ్యా రేఖను వర్ణమయం చేయడానికి..
నిద్రించి కలగన్నాడు
జీవితమంటే సంతోషమేనని
మేలుకొని తెలుసుకున్నాడు
జీవితమంటే ” సేవేనని”..
ఎక్కడ మనసుకు భయం ఉండదో
ఎక్కడ శిరస్సు సమున్నతంగా నిలబెడతామో
ఎక్కడ జ్ఞానానికి స్వేచ్ఛ ఉందో
అక్కడ స్వాతంత్ర్యం పరిమళిస్తుందన్నాడు
కడలి అలలను చూస్తూ కలవరపడక
.కడదాకా ఈది
ఆవలి గట్టును చేరుకోవాలన్నాడు
చిగురాకులపై నర్తించే మం చు బిందువుగా
కాలమనే అంచులపై కదలి సాగమన్నాడు
అతడు ఆత్మవిశ్వాసాన్ని అనుశాసించాడు
అతడు ఆధ్యాత్మికతను ఆస్వాదించాడు
అందరి మనసులో అమరుడైనాడు
హృదయాన్ని గీతాంజలిగా అక్షరీకరించాడు
అందరి హృదయాంజలి అందుకొన్నాడు.

May 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

చదువుల చెట్లు మీటుతూ …

by Rama Devi Nellutla March 31, 2024
written by Rama Devi Nellutla

ప్రముఖ రచయిత్రి గా, కవయిత్రిగా,పాఠ్యపుస్తకాల రచయిత్రిగా, సంపాదకురాలుగా, అధ్యాపకులు గా బండ సరోజన గారి జీవిత ప్రస్థానం ఎంతో ఆదర్శనీయమైనది. ఎక్కడ ఏ భేష జాలు లేకుండా సాదాసీదాగా ఉంటూ మనుషులను ప్రేమించే స్వభావశీలి. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించినా, ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినా ఆమె కామెనే సాటి. ఇటు రచయిత్రిగా అటు విద్యావేత్తగా వారి జీవిత ప్రయాణం మయూఖ పత్రిక ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ప్ర : నమస్కారం మేడమ్! లద్నూరు నుండి లండన్ దాకా …. ఎట్లా ఉంది ఈ ప్రయాణం ?!
జ : ప్రయాణం అంటేనే ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు ఉంటయి. జీవితం కూడా అంతే !! నా జీవితం కూడా అందుకు భిన్నం ఏమీ కాదు .

ప్ర : మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ? మీ వాళ్లల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా ?
జ : అస్సలు లేరు . అసలు మాది ఒక పక్కా వ్యవసాయ కుటుంబం. జనగామ దగ్గరలోని లద్నూరు మా ఊరు.

ప్ర : అప్పటి రోజుల్లో వ్యవసాయ కుటుంబంలో ఆడపిల్లగా మిమ్మల్ని ఎలా చూసారు ?!
జ : మా నాయనమ్మకు నా మీద శాన ప్రేమ ఉండేది. నన్ను బడికి పంపేవారు . నేను కూడా బాగనే చదువుకునే దాన్ని. అయితే .. నా తొమ్మిదవ ఏటనే నాకు పెండ్లి అయింది.

ప్ర : అవునా ?! బాల్య వివాహమన్న మాట. మరి వాళ్ళు ఎక్కడివాళ్ళు ?!
జ : మేనోళ్లే ! మెదక్ దగ్గర సిద్దన్నపేట వాళ్ళది. మేనత్త కొడుకే !!

ప్ర: వైవాహిక జీవితం మీ విద్యాభ్యాసానికి అడ్డు తగిలిందా? లేక మేనోళ్లే కనుక సహకరించారా?!
జ : అదేగద బాధ! స్త్రీ విద్య అనేదే వాళ్లకు తెలువదు. అందులోనూ ఉన్నత కుటుంబాలలో కూడా ఆడిపిల్లలకు ఏడో, పదో చదువంగనే పెండ్లిళ్లు చేసేటోళ్లు. ఇగ మా లాంటి కుటుంబాలలో చెప్పనే ఒద్దు.

ప్ర: అప్పట్లో చిన్నపిల్లలకు పెళ్లి అయినా కూడా ఒక వయసు వచ్చేదాకా అత్తవారింటికి పంపకపోయేవాళ్లు కదా?! మరి మీ విషయంలో ఎలా జరిగింది?
జ: అయ్యో.. దగ్గరోళ్ళు గనుక తోలుకపోయేటోళ్లు. పదేండ్ల పిల్ల అంటే ఎన్నో పనులకు ఆసరా అన్నట్టే. ఏ మాత్రం జాలి ఉండకపోయేది. పెండ ఎత్తుడు , సానిపి సల్లుడు , పక్కింటి నుండి బిందెల కొద్ది నీళ్లు మోసుడు , దంచుడు , ఇసురుడు, అన్ని పనులు అప్పుడే నేర్చుకోవాలె, చేయాలె కూడ. మా అత్త పని చేయకుంటే ఊరుకోక పోయేది. అట్ల అన్ని పనులు చేసి చేసి కట్టెపుల్ల లెక్క అయిపోయిన.

ప్ర. మరి ఆ చాకిరీ నుంచి విముక్తి కలగలేదా?!
జ. మొదలే చెప్పిన గద…మా నాయనమ్మకు నేనంటే ప్రాణం. ‘ చిన్న పిల్లను గింత చాకిరి కింద చంపుతవా ఏంది ?’ అని తన కూతురితో .. అంటే మా అత్తతో గొడవ పెట్టుకుని మా నాన్నకు బండి పంపమని మతలబు చేసి బండి రాంగనే నన్ను తీసుకుని మా ఊరికి వచ్చేసింది. ‘ పిల్ల ఆగం అయింది. ఇగ అక్కడికి తోలనే వద్దు.’ అన్నది.

డా|| కొండపల్లి నీహారిణి, డా|| బండ సరోజ, శ్రీమతి రంగరాజు పద్మజ

ప్ర. మరి అప్పటి రోజుల్లో చాలా మంది సంతానం, ఇంటి నిండా మనుషులు .. ఇదంతా ఉండేది కదా ! పెళ్లి అయ్యాక కూడా ఆడపిల్ల ఇంట్లో ఉంటే మీ వాళ్ళు ఒప్పుకున్నారా ?!
జ : అదేమీ లేదు, మా నాన్న ‘ తీగకు కాయ బరువా?! మన పిల్ల కొన్నాళ్ళు మన దగ్గర్నే ఉంటది.
‘ అన్నాడు . నేను చదువులో చాలా తెలివైనదాన్ని. నన్ను మిడిల్ స్కూల్ వరకు చదివించాలని మా నాన్న కోరిక.

ప్ర . అంటే .. మళ్ళీ చదువు మొదలు పెట్టారా ?!
జ . అవును, అయితే .. నేను తెలివయిన దాన్నే గానీ , బడి దొంగని. అయినా కూడా సెవెంత్ క్లాస్ లో నేనే స్కూల్ ఫస్ట్ వచ్చాను.

ప్ర. మీకు సాహిత్యంపై ఆసక్తి ఏ వయసులో కలిగింది?! మీ ఇంట్లో ఎవరైనా సాహిత్యం అంటే ఇష్టపడేవాళ్లున్నారా ?!
జ . మా నాన్న ఆ రోజుల్లో .. అంటే నిజాం కాలంలోనే అయిదో తరగతి చదివాడు. ఆయన ఒక్కడే కొడుకు గనుక వాళ్ళింట్లో ఏం చేసినా చెల్లేది. నులక మంచంలో పడుకుని ఏవో పుస్తకాలు చదివేవాడు, పాడేవాడు కూడా. మా ఇంట్లో ఒక పెద్ద చెక్క సందుక నిండా ఉర్దూ పుస్తకాలుండేవి .
మా నాన్న అలవాటు నాకూ వచ్చింది. పిల్లల పుస్తకాలు బాగా చదివాను . అలా నాలో పఠనాసక్తి పెరిగింది.

పుస్తక ఆవిష్కరణ సభలో
March 31, 2024 5 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సామాజిక బాధ్యతనెరిగి రచనలు చేయాలి

by Devendra March 31, 2024
written by Devendra

– అనిశెట్టి రజిత

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి అనిశెట్టి రజిత గారితో…డా.ఎం దేవేంద్ర ఇంటర్వ్యూ

మీ బాల్య నేపథ్యం గురించి చెప్పండి.

మాది హన్మకొండలోని కుమార్పల్లి. మా బాపు అనిశెట్టి బాలరాజు, అమ్మ జయలక్ష్మి. మేమిద్దరం. నాకన్నా రెండేళ్ళు చిన్నది మా చెల్లెలు రేణుక. నేను 14, ఏప్రిల్, 1958 రోజున పుట్టాను. మా బాపు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధం కలిగి వుండేది. ఇంట్లో అటు వ్యవసాయపు వాతావరణం, రాజకీయ వాతావరణమూ ఉండేది. నేను మా వాడలోని పిల్లల్ని పోగేసి తీరొక్క ఆటలు ఆడేది. డ్రామాలు కూడా వేయించేది. అప్పటి నుంచే కొన్ని లక్షణాలు ఉండేవి. అందర్నీ కూడగట్టడం ఒక ఆటో, పాటో నేర్పించే ప్రయత్నం చేయడం. పెద్దవాళ్ళు చేసే ప్రతి పనినీ అంటే అనుకరించడం చేసేది. తిండికి లోటు లేదు. ఆటోరిక్షాలు లేని ఆ రోజుల్లో పది మైళ్ళ దూరంలో ఉన్న ఆంగ్ల భాష స్కూళ్లో చేర్పించారు. పొద్దున రిక్షాలో బయలుదేరి పోతే చీకట్లో ఇంటికొచ్చేది. పసితనం కాబట్టి ఆ అర్థంకాని ఆంగ్ల భాషల్లో చదువూ, బడి వాతావరణం, సుదీర్ఘమైన సమయం అంతా బడిలో ఉండాల్సిరావడం భరించరానిదిగా ఉండేది. రోజూ ఏడుపు, లొల్లి. రోజూ రిక్షా ఆగయ్య తాత అంగీలు చించడం, మా బాపు కమీజులు ఇయ్యడం… అంతా ఒక ప్రహసనంగా జరిగేది. చిన్నప్పటి నుండే పిల్లలను ఎవరైనా సతాయిస్తే చూసి గట్టి చెంపదెబ్బ కొట్టేది. కొట్టిన తరవాత ఏం జరగనుందో అని భయపడేది. రోజూ మా మేనత్త తన వెంట రిక్షాలో నన్ను తీసుకపోయి నన్ను బడిలో దించి తన బడికి వెళ్ళిపోయేది. చిన్నప్పటినుండీ నాకు మా చెల్లెలికి తల్లితో అటాచ్మెంట్‍ లేదు. మా మేనత్త విమలాదేవి పెత్తనంలో ఇల్లు నడిచేది. చదువుకున్నది, హిందీ టీచర్గా ఉద్యోగం చేసేది. మా ఇండ్లలో అది చాలా గొప్పే. ఆమె చాలా స్ట్రిక్ట్, చూస్తేనే అందరూ భయపడేది. నాలుగో తరగతికి వచ్చిన తర్వాత కూడా రోజూ నన్ను చావగొట్టేది. బహుశా చదువు విషయంలో నేను తిన్నన్ని చావు దెబ్బలు ఎవ్వరూ తినలేదేమో. అంతా పద్ధతి ప్రకారం జరగాలి ఆమెకు. ఆమె పెట్టిందే క్రమశిక్షణ అనుకోవాలె. ఇంట్లో మాకో కుట్టుమిషన్‍ ఉండేది. నాకూ మా చెల్లెలుకు మంచి డిజైన్లతో డ్రెస్సులు కుట్టి తొడిగేది. అయినా అవన్నీ నేను చదివే కాన్వెంట్ స్కూళ్లలోని పెద్ద ఉద్యోగస్తుల, పెద్ద హోదాలున్న వాళ్ళ పిల్లల డ్రెస్‍ల ముందు వెలవెలబోయేవి. మంచి బట్టలు లేవని ప్రతి శనివారం నేను కుంచించుకపోయేదాన్ని. ఆ రోజు బడిలో సిగ్గు సిగ్గుగా గడిపేది.

అనిశెట్టి రజితతో ముఖాముఖి గ్రహీత డా|| దేవేంద్ర


రకరకాల అనుభవాలలో బాల్యం గడిచింది. తల్లితో అటాచ్మెంట్‍ లేకపోవడం. తండ్రి ఎక్కువ కాలం హైదరాబాద్‍లో ఉండటం. ఇంట్లో మేనత్త పెత్తనం కింద తన్నులు తింటూ గడిపిన బాల్యం నాది. తల్లితో లేని ఆ అనుబంధం బహుశా ఇప్పటివరకూ ఒక వెలితిగా నన్ను వెంటాడుతూనే ఉందేమో. రోజూ తన్నులూ, ఆ ఇంగ్లీష్‍ చదువుల పట్ల అనాసక్తీ, ఆ వాతావరణం ఏదైతేనేమి, భవిష్యత్‍ చదువుకు ఒక గట్టి పునాది పడిందనుకోవాలి. తెలుగు భాష, పుస్తకాలు, సబ్జెక్ట్ పట్ల మమకారం, ఇష్టం ఉండేది. మాతృప్రేమ లాంటిది కావచ్చు.

మీ కళాశాల జీవితంలోనీ విశేషాలు చెప్పండీ?

కళాశాలలోకి వచ్చిన తరవాత ఒక్క తెలుగు క్లాస్‍ తప్ప అన్ని క్లాస్‍ల పట్ల అనాసక్తి ఉండేది. నాకు ఇంటర్‍లో ఆర్ట్స్ చదవాలని ఉండేది. కానీ మా మేనత్త ప్రెజర్‍ తెచ్చి సైన్స్లో చేర్పించింది. ఆ కాలేజీ రోజుల్లో చదువు తక్కువ ఆటా పాటలే ఎక్కువ, సీరియస్‌నెస్ లేదు. ఫలితంగా ఇంటర్‍లో ఫెయిల్‍ అయ్యాను. తరవాత మరో కళాశాల, హైదరాబాద్‍ పాలిటెక్నిక్‍లో ఫార్మసీ డిప్లొమాలో చేర్చారు. దాన్ని బహు సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఇంటర్‍లో తప్పిన సబ్జెక్టస్ రాసి పాస య్యాను. మొదటి సంవత్సరం ఫార్మసీలో డిస్టింక్షన్‍లో పాసయ్యాను. ఫైనల్‍ ఇయర్‍ చివరన పరీక్షల కు నెలరోజుల ముందుగా 9 మార్చ్, 1979 రోజున మా బాపు హార్ట్ స్ట్రోక్‍తో చనిపోయాడు. నేను పరీక్షలు రాయలేకపోయాను. వరంగల్‍ కొచ్చి నాకిష్టమైన బి.ఏ.లో చేరాను. వెంటాడే పుట్టెడు సమస్యలున్నా బి.ఏ.అంటే ఇష్టం కాబట్టి బంగారు పతకం సాధించలిగాను వెంటనే యం.ఏ.లో చేరడం ,అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించాను .ఆ తరువాత యం.ఫిల్‍.లో చేరాను. తరవాత సాగిన చదువంతా అర్ధాంతరమే. ప్రీ పిహెచ్‍.డి.లో 70 శాతం సాధించినా డాక్టరేట్‍ పూర్తి చేయలేదు. కారణం ఇంటా బయిటా రకరకాల వ్యక్తులూ, వాళ్ళు సృష్టించిన సమస్యలతో ఘర్షణా, తలెత్తిన సంక్షోభాలూ, బాధ్యతలు మీదబడిన ఒత్తిళ్ళు. వీటితో నిరంతరం ఎదురీతతో సరిపోయేది. అందుకే నేను బోల్డ్ గా మారిపోయాను.అప్పటికే వామపక్ష రాజకీయాలతో ప్రభావితమై సామాజికంగా యాక్టివ్‍గా ఉన్నాను. నన్ను నేను ఒక యుద్ధపు పనిముట్టుగా మార్చుకున్నాను. పనిముట్టనే అంటాను. ఆయుధం, అస్త్రం అనాలేమో! బాపు చనిపోయిన నాటినుండీ నాపై అంటే నా మెడలపై ఇంటి బాధ్యతల కాడిని అనివార్యంగా మోయాల్సివచ్చింది.
అటు కళాశాల చదువు ఇటు సమస్యలతో పెనుగులాట అంతా సమాంతరంగా సాగిపోయింది. మరోవైపు ఉద్యమ సంస్కృతి బలపడుతూపోయింది. నా నీడే నాకు శత్రువైన సందర్భాలు, లోకం తెలుసుకోడానికి నెత్తురు అర్పించిన సందర్భాలు అన్నీ అనుభవమయ్యింది ఈ ఆరేడేళ్ళ కాలంలోనే. మనుషుల్లో ఉన్న మృగత్వం, వేటాడే తత్వం, అబద్ధాలతో అంటకాగే తత్వం అన్నీ తెలిసివచ్చాయి. నిజాల కన్నా అబద్ధాలకే ఇప్పుడు పవర్‍, చెలామణి అయ్యే అవకాశం ఎక్కువ. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకునేవాళ్ళే ఎక్కువ. అసూయలు జీవితాలతో చెలగాటమాడి దెబ్బతీస్తాయి. అబద్దానికీ నిజానికీ నిరంతర ఘర్షణ! మంచికీ చెడుకూ మధ్య నిత్య పోరాటం! జీవితమంటే విరామమెరుగని విచిత్ర యుద్ధం!

మీ ఉద్యోగ ప్రస్థానం గురించి చెప్పండీ?

ఉపాధి అంటూ ఏమీ లేనప్పుడు కనాకష్టంగా కాలేజీ స్కాలర్‍షిప్‍లతో గడుపుతూ వచ్చాము. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగిగా చేరాను. తిండికి బట్టకూ సరిపెట్టుకున్నాము. ఇక్కడొక విషయాన్ని తప్పక ప్రస్తావించాలి. 1969-71 తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్ళ వయసులో పాల్గొన్నాను. ఆ ఉద్యమ నేపథ్యమే నాకు ఉద్యోగం ఇప్పించింది అనుకుంటాను. ఒక విధంగా ఆ ఉద్యమమే నాకు నిన్నా మొన్నటి దాకా బువ్వ పెట్టింది. ఉద్యోగ ప్రస్థానంలో ఒక ఆడపిల్లగా, వెనుక ధనరాశులు లేవు, కులం బలం లేదు, తండ్రి నీడా లేదు. ఎక్కువగా మగ ఉద్యోగులతో కొలువైన ఉద్యోగ ప్రాంగణాల్లో సాటి తోటి ఉద్యోగులతో వేధింపులు ఎదుర్కోవడంలో వింతేమీ లేదు. అయితే ఇతర ఉద్యోగినీ మిత్రులు ఎదుర్కొన్న దానికీ నాకూ తేడా ఉండేది. ప్రధానంగా వారు అసూయనూ లైంగిక వేధింపులనూ ఎదుర్కొంటే నేను అసూయనూ స్త్రీ అయినందుకు ఓర్వలేనితనానికి సంబంధించిన వేధింపులు ఉండేవి. నా సామాజిక ఉద్యమ నేపధ్యం వాళ్ళకి తెలుసు కాబట్టి వేధింపుల నుండి చాలావరకు తప్పించుకోగలిగాను. ఇక క్లాస్‍-4, ఇతర ఉద్యోగినులు, భర్త చనిపోతేనో, తండ్రి చనిపోతేనో హ్యుమానిటేరియన్‍ గ్రౌండ్స్లో ఉద్యోగాలకు వచ్చిన ఆడవాళ్ళపై విపరీతమైన ఒత్తిళ్ళు, వేధింపులు ఉండేవి. వారిలో చాలా వరకు నా సపోర్టు, సహాయం కోసం వచ్చేవాళ్ళు. నేను వాళ్ళ పక్షాన నిలబడినందుకు నాపై కక్ష కట్టేవాళ్ళు. అదంతా ఒక అధ్యాయం. నేను దేనికి లొంగను, ఎక్కడా రాజీపడను. భయం, లాలూచీ, లొంగుబాటు నా డిక్షనరీలోనే లేవు. అప్పటికి నా వయసు 31-33 సంవత్సరాలు నా జీవితానుభవాలు నన్ను స్టబర్న్ గా తయారుచేసాయి. యధాతథ సమాజంపై నిరసన, కసి, ధిక్కారం నాలో జ్వలనాలుగా మారాయి. నేను సూటిగా మాట్లాడుతాను కాబట్టి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు నన్ను ఏదోవంకతో నిందించాలని కాచుకుని ఉన్నవాళ్లకు మంచి అవకాశంగా వుంటుంది.

మీరు సాహిత్య సృజన వైపు ఎలా వెళ్ళారు?

చాలా చిన్నప్పటి నుండి పత్రికలు చదవడం, నవలలూ, పురాణేతిహాసాలు చదవడం.. సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. రేడియో కార్యక్రమాలు తప్పనిసరిగా వినడం.. సందర్భాలననుసరించి ప్రసారమయ్యే ‘కవి సమ్మేళనాలు’ రేడియో ద్వారా చాలా ప్రభావితం చేసాయి. జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదవటం ఒక అలవాటుగా మారిపోయింది. 1977లో వరంగల్‍లో ‘చైతన్య సాహితి’ లో వ్యవస్థాపన నుండీ ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆనాటి సుప్రసిద్ధ కవులు, రచయితలు పరిచయం, వారి ప్రసంగాలు వినడం, తరవాత సాంస్కృతిక సమాఖ్య, శ్రీలేఖ సాహితి.. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాహిత్య సదస్సులూ, ఉత్సవాల్లో పాల్గొనడం ఈ విధంగా సాహిత్యాభిరుచి పెరుగుతూపోయింది. ఒకవైపు చైనా, రష్యా, లాటిన్‍ అమెరికాల అనువాద సాహిత్యం, అభ్యుదయ, హేతువాద, విప్లవ సాహిత్యం చదవడం, మన తెలుగు కవుల కవితా సంపుటాలు చదవడం నాలో కవిత్వ, సాహిత్య పిపాస ఎక్కువవుతూపోయింది. నిజానికి పుస్తకాలే నాకు మంచి నేస్తాలుగా మారాయి. సాహిత్యంలోని సృజనశక్తి విలువ తెలుసొచ్చింది. సామాజిక ఉద్యమ సాంగత్యం సాహిత్యానికి మరింత చేరువ చేసింది. నా కలం పాళి ‘అగ్నిపాళి’గా మారిపోయింది. అప్పట్లోనే మా కుటుంబంలో ఒక పాపకు ‘సృజన’ అని పేరు పెట్టుకున్నాము. మన సమాజంలో ఆస్తులకు ఉన్నట్లే కళలకూ, వ్యాపారాలకూ, జ్ఞానానికీ వారసులుంటారు, వారసత్వ సమాజం కదా. నిజానికి శ్రామిక కులం, వర్గంలో పుట్టిన నాకు సాహిత్యానికి సంబంధించి ఎలాంటి శిక్షణ, మార్గదర్శకత్వం గానీ, వారసత్వం గానీ లేదు. మా ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ ఏం తిరుగుడు? ఏం రాతలు? అని నియంత్రించనూలేదు. అది బాగా కలిసొచ్చింది. మా ఇంట్లో మా బాపు, మా మేనత్త ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉండటం వల్ల చదువుల విలువ తెలిసొచ్చింది. ప్రధానంగా మాది వ్యవసాయ కుటుంబం. చేను, చెల్క, పొలం ఉండేది. మా నాయినమ్మ సద్ది గంప నెత్తికెత్తుకొని పొలం కాడికి, చేనుకాడికి పోయేది. నేను ఆమెతోటి చేనుకాడికి పోయేదాన్ని. ఉత్పత్తి! మనం తినే తిండి ఎంతమంది శ్రమో తెలుసుకునే అవకాశం ఏర్పడింది.
నా బాల్యమంతా పరుచుకొని ఉన్న కష్టాలూ, ఆకలి, శ్రమ, శ్రమజీవుల శ్రమశక్తి, ఉత్పత్తీ అన్నీ కలిసి నా రచనలకు పీడితుల జీవన పోరాట ఆరాటాలు, చోదక శక్తులుగా కావడానికి దోహదం చేసింది. రాత్రంటే ఎంత భయపెట్టినా దాన్ని అధికమించి భయంలేని స్థాయికి వచ్చాను. ఎదురీత, ఎదురుపోరాటం తత్వంలోకి వచ్చేసింది. నేను నిలబడిన దానిపట్ల మొండితనం, నేను అనుకున్న లక్ష్యం, ఎనుకున్న మార్గం, చేపట్టిన పనిపట్ల నిబద్ధత ఏర్పడే నైజం అలవడింది. 1979 దశకం చివర్లో నుండి 1980, 1990వ దశకం వరకూ గోడలకున్న నోళ్ళు చాలా విషయాలు నేర్పాయి, కొత్త జ్ఞానాన్నిచ్చాయి. నాటి వామపక్ష పార్టీలన్నింటి నుండీ, ప్రజాతంత్ర వేదికలూ, ఉద్యమాలన్నింటి నుండీ పిలుపులందుకున్నాను వారితో చేరి పని చేయమనీ, కొన్నింటికి నాయకత్వం వహించమనీ అడిగినప్పుడు ఆ దారిలో ముందుకు సాగిపోయాను.
నా 13వ ఏట 9వ తరగతి చదుతున్నప్పుడు కొన్ని కవితలు రాశాను. అయితే అవి భావ కవితలు. ఇంకా అభ్యదయ సాహిత్య సంపర్కం రాని రోజులు. నిజమైన కవిత రాసింది 15, 16 ఏళ్ల వయసప్పుడు ఇంటర్‍ మీడియట్‍ చదువుతున్నా.. ‘చైతన్యం పడగెత్తింది’ కవిత తరవాత భావ కవితలెప్పుడూ రాయలేదు. ‘‘చైతన్యం పడగెత్తింది’’ కవిత అప్పటి తెలుగు టీచర్ల ప్రశంసలు అందుకుంది.
1984లో నాకున్న సామాజిక చేతన ఉద్యమానుభవాల స్ఫూర్తితో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అనే చిన్న పొత్తాన్ని ప్రచురించాను. అయితే అన్ని విధాలా గ్రంథం స్థాయిలో కాకుండా ఒక బుక్‍లెట్‍ స్థాయిలో వచ్చిందా పుస్తకం. 1997లో మాత్రమే ‘నేనొక నల్లమబ్బునవుతా’ అనే కవితా సంపుటిని ప్రచురించగలిగాను. మధ్యలో రచనా వ్యాసంగం కొనసాగింది కానీ ప్రచురణ జోలికి పోలేదు. ప్రజాకవి కాళోజీ ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ఇరవై ఏళ్లు పుస్తక ప్రచురణ చేయకుండా ఉన్నాను.1996లో కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను బోధనేతర ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు. మా గురువు గారు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు గారు.. నన్ను ఉద్దేశించి కొన్ని మాటలు కఠినంగా మాట్లాడారు. ఆ మాటల అర్థం నీవు ఎందుకూ కొరగాకుండా పోయావని. నాపట్ల సదుద్దేశంతోనే అయినా నాకా మాటలు సూటిగా తాకాయి. ఒక పౌరుషం పట్టుదల వచ్చింది. కొన్ని నెలల్లోనే 1997లో ‘నేనొక నల్లమబ్బనవుతా’ కవిత్వం ప్రచురించి పెద్ద సభ పెట్టాను. ఇంక అక్కడి నుండి ప్రచురణాసక్తి పెరిగింది

మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచనలు మరియు ప్రాంత చైతన్యం గురుంచి చెప్పండీ?

మన దేశంలో అయితే అమృతా ప్రీతమ్‍, ఇస్మత్‍ చుగ్తాయి, ఇందిరాగోస్వామి, మహాశ్వేతాదేవి, నీలకంఠన్‍, పెరుమాళ్‍ మురుగన్‍, బెంగాళీ సాహిత్యం మొదలగునవి. తెలుగులో అయితే రావిశాస్త్రి, రంగనాయకమ్మ, ఓల్గా ఇంకెందరో.. చెప్తూపోతే పేజీలు నిండిపోతాయి. ఒక్కొక్క కవీ, రచయితవి ఒక్కో కథో, నవలో, కవితో అయి ఉండవచ్చు లేదా సంపుటాలు, సంకలనాలూ కావచ్చు. ఇక ఒక రచయితకు సంబంధించి మొత్తం రచనలన్నీ ప్రభావితం చేయలేకపోవచ్చు. ఒక రచనో, కొన్ని రచనలో, చాలా రచనలో ప్రభావితం చేస్తుండవచ్చు. రావిశాస్త్రి రచనలన్నీ, దాశరథి రంగాచార్య రచనలన్నీ ప్రభావితం చేస్తాయి. కొన్ని నచ్చుతాయి. కొన్ని ప్రభావితం చేస్తాయి.
విప్లవాల కోట అయిన చరిత్రాత్మకమైన వరంగల్‍ నగరం నడిబొడ్డున జన్మించడం వల్ల పరోక్షంగా విప్లవోద్యమాల భావజాలం, కదనం అన్నీ ప్రభావితం చేసాయి కూడా. దానికి తోడు చదువుతున్న విప్లవ సాహిత్యం ఉద్యమాలకు ఆకర్షితం చేస్తుంది, చేసింది. సమాజ అవకతవకలపై, అసమానత్వాల పట్లా, దోపిడీ పీడనల పట్ల నిరసన, ఆధిపత్యాలు, పెత్తనాల పట్ల ధిక్కార స్వభావం ఉన్నవాళ్ళు తప్పకుండా విప్లవోద్యమాలకూ, ప్రజాతంత్ర ఉద్యమాలకూ ఆకర్షితమవుతారు. నేనూ అంతే. నేనూ మానసికంగా మమేకమై, ప్రత్యక్షంగానూ పాల్గొన్నాను.

సాహితీవేత్తగా మీరు వివక్ష, అవమానాలు ఏమైనా ఎదుర్కొన్నారా?

జండర్‍ వివక్షత అంతటా ఉంది. స్త్రీగా పుట్టడంతోనే వివక్షతలూ, అవమానాలూ మొదలవుతాయి. మన పుణ్య భారతదేశంలో ఆడపిల్లగా పుట్టడం పెద్ద దౌర్భాగ్యం. ఉద్యమరంగమైనా, సాహితీ కళారంగమైనా మొదట స్త్రీగా అయినందుకు తాను ఎన్నో రెట్లు తన అర్హతలనూ ప్రూవ్‍ చేసుకోవాలి. కులం రీత్యా వెనకకు నెట్టివేయబడటం, కులం వల్ల ఏర్పడిన వర్గం రీత్యా నిర్లక్ష్యానికీ గురికాబడటం. సాంఘిక ఆర్థిక హోదాల స్థాయిననుసరించి నిరాదరణకూ గురికావడం. ముఖ్యంగా ఒక స్త్రీ స్వేచ్ఛా భావాలనూ, కదలికలనూ నిరంతర నిర్భందాలు అడ్డకుంటాయి, అసూయ ద్వేషాలు కబళిస్తాయి. అన్నింటికన్నా స్త్రీ ఎదుగుదలను ఆపేది డిమోరలైజేషన్‍ చేయడం అనేది వాస్తవం. ఇదంతా ఒక్క మగవాళ్ళ వల్లనే అన్నిసార్లూ జరగకపోవచ్చు. దేనికీ తీసిపోని మహిళలూ ఉంటారు. వాళ్ళు కులస్వామ్య, పితృస్వామ్య భావజాలంలో నిండా మునిగి అచ్చం పితృస్వామ్య, కులస్వామ్య దురహంకారుల్లా ప్రవర్తిస్తుంటారు. నేను ఉద్యమాల్లో ఒక స్త్రీగా, సాహితీరంగంలో ఒక స్త్రీగా, వెనుకబడిన తరగతుల కులాల స్త్రీగా కొంత వివక్ష ఎదుర్కొన్నాను. ఇంతెందుకు ఈర్షా అసూయలతో ఇప్పటికీ సాటి రచయిత్రులు, రచయితలు కొందరు బట్టకాల్చి మీదేస్తుంటారు. వెనకనుండి వీపులో వెన్నుపోటు పొడిచి పోతుంటారు. ‘‘వెనక దగా ముందు దగా కుడిఎడమల దగా’’ శ్రీశ్రీ అన్నట్లుగానే ఉంది నేటి పరిస్థితి. ‘యూ టూ బ్రూటస్‍’లకు తక్కువేమీ లేదు. అలాంటి ఏ అనుభవమూ నాకు కలగలేదంటే అది అబద్ధపు అతిశయోక్తి అవుతుంది. బాధ్యతలను బరువు అని తప్పించుకునేవాళ్ళూ, ఇన్‍స్టాంట్‍ గా వేదికలూ, పేరూ, గుర్తింపుల కోసం వెంపర్లాడేవాళ్ళు, పునాదుల్లేకుండా గాలిలో మేడలు కట్టేయాలనుకునేవాళ్ళు సాహిత్య కళారంగాల్లో ఉంటారు. చాలా ప్రమాదకర సంస్కృతిని విషరోగంలా వ్యాపింపజేస్తుంటారు. ప్రతిభ ఎవరి సొత్తూ కాదుగానీ నిజంగా ప్రతిభ ఉండి కృషి చేసేవాళ్ళను పడగొట్టాలనే చూస్తారు. నేను దానికి మినహాయింపేమీ కాదు. వెనక నుండి చేసే కుట్రలకు భయపడతాను. ముందునుండి చేస్తే ఎదుర్కొని తలపడతాను భావజాలంతో. నిజాయితీ, నిబద్ధత ఉన్నవాళ్ళంటే ఒక రంగంలో కానీ సమాజంలో కానీ విపరీతమైన అసహనం ఉంటుంది జనానికి. పేదవాళ్లు, ఉన్నత వర్గం కాని వాళ్లు బహుజనులకు ఆత్మవిశ్వాసం వుంటే, అది అహంకారంలా కనిపిస్తుంది మన ‘పేద్దోళ్ళ‘కు. వెనక కూతలూ, కుట్రలూ లేదా తోకముడుచుకొని పోవడాలు. లేదా అబద్ధాలు, అభూత కల్పనలు, అర్థ సత్యాలంటారే.. అర్థసత్యాలతో మనమీద నల్లగుడ్డ కప్పుతారు. అందుకే నేను ముందన్నాను చూడండి ‘‘లోకం తెలుసుకోవడానికి ఇంత నెత్తురు అర్పించాల్సి వచ్చిందీ “అని. నిన్న్నా మొన్నటి దాకా, ఇకముందు కూడా ఉంటాయేమో బట్ట కాల్చి మీదేసి నిందించడాలు. ఏళ్ళపాటు ఆ కాలిన గాయాలతో చిత్రహింసను అనుభవించాను. కొన్ని ఊరుకుంటే ఉసురే తాకుతుందనీ అనుకున్నాను. కొన్ని చిక్కుముళ్ళు విప్పి చూసాను.

తొలి దశ,మలి దశ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి?

ఆనాడు మెజారిటీ కవులు, రచయితలు, కళాకారులు ఉద్యమకారులుగా మారిన సందర్భం. 1969-71 నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపిస్తున్న నేను 1990వ దశకంలో మళ్ళీ ఉధృతంగా తలెత్తిన తెలంగాణ సోయితో తెలంగాణ రచనలు, సభలు, సదస్సుల్లో పాల్గొన్నాను. నా కవితా సంపుటి ‘ఉసురు’ ఆ సమయంలో వచ్చిందే. తెలంగాణ సోయి ప్రధానంగా తెలంగాణ భాషా సంస్కృతుల మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా మొదలయ్యిందే. నా తల్లి భాషలోనే నేను ఎక్కువ రచనలు చేసాను. వివిధ సాహిత్య వేదికల ఏర్పాటుల్లో పాల్గొన్నాను. ‘తెలంగాణ రచయితల వేదిక’ వ్యవస్థాపనలో ఉండి అన్ని తెలంగాణ జిల్లాలలో మహాసభలూ, సదస్సులూ జరుగుతున్న క్రమంలో పాల్గొన్నాను.‘వరంగల్‍ రచయితల వేదిక’ను నిర్మించిన కవులు, రచయితలతో కలిసి నిత్యం ఉద్యమంలో పాల్గొన్నాను. వివిధ సాహిత్య సంకలనాల ప్రచురణ చేయడం వరకూ అన్నిట్లో నేను వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో పనిచేసాను.

‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఏర్పాటులో మీ కృషి ఎలాంటిది?

అదో చరిత్ర. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు సాహిత్య, సాంస్కృతిక రంగాలు అగ్రకుల ఆంధ్రా ప్రాంతం వారి ఆధిపత్యంలో ఉండేవి. సాహిత్య కూటములు, పీఠాలు, పీఠాధిపత్యాలు అన్నీ వీళ్ళ పలుకుబడిలో విలసిల్లుతూ ఉండేవి. తెలంగాణ సాహిత్యకారులు అనామకులుగా వాయిస్‍ లేకుండా ఉండేవాళ్ళు. కవుల్లో ర్యాంకులుండేవి. అన్ని ర్యాంకులూ ఆంధ్రా వాళ్ళవే. అన్ని వేదికలూ, పురస్కారాలూ వాళ్ళవిగా ఉండేవి. (ఇప్పుడు మారిందా అంటే సందేహమే). గాయపడిన మనిషిని చితకబాదినట్లు ఈ క్రూరమైన బానిసత్వంతో పాటు ఇందులో అగ్రకులాలకు (పాలకవర్గ కులాలు) తప్ప ఇతర వెనుకబడిన, బహుజన కులాల రచయితలు, కళాకారుల పట్ల చిన్నచూపు ఉండేది. కులం చెప్పుకోవడానికి భయపడేవాళ్లు. ఎక్కడా వీరికి ఒక స్థానం, స్థాయి ఉండేది కాదు. కొంచెం ప్రవేశం ఉన్నచోట అంచులకు నెట్టబడి ఉండేవాళ్ళు.
దామాషా పద్ధతిన అన్ని కులాల మహిళా రచయితలకు వేదిక నిర్మాణంలో స్థానం కల్పించి వారి గొంతుక వినిపించేలా చేయడం. పెద్ద చిన్నా, ఎక్కువ తక్కువ కులం, స్థాయి అని లేకుండా అందరు కలిసి వేదిక ‘మ్యానిఫెస్టో’ను అనుసరించి ప్రజాస్వామికంగా పని చేయాలన్నదే లక్ష్యం. ఒక విధంగా రిజర్వేషన్స్ పెట్టుకున్నాము అని చెప్పాలి. ప్రధానంగా ఇది మహిళల అంశాలు, విషయాలు, సమస్యలపై పనిచేసే రచయిత్రుల వేదిక.
ప్రజాస్వామికత అనేది అలంకారంలా వాడుకునే ఆభరణంలాంటి పదం కాదు. ప్రజాస్వామికంగా ఉండటం అంత సులభమైన పనీ కాదు. ఏదైనా ఆచరణలో, ఆత్మపరిశీలన, సమీక్ష, విశ్లేషణ ద్వారా సాధ్యమవుతుంది. దశాబ్దం దాటిన ‘ప్రరవే’ ప్రయాణంలో ఆ దిశలోనే ఉన్నాము అనుకుంటున్నాను. భావజాల పరంగా కలిసివచ్చే సోదర సంఘాలు, వేదికలతో కలిసి పనిచేయడం, ప్రజా సమస్యలపై గళమెత్తడం, కార్యాచరణల్లో పాల్గొనడం, రచనలు చేయడం గత పదేళ్ళుగా మా ఆచరణాత్మక కార్యక్రమం. సమస్యాత్మకంగా ఉన్న క్షేత్ర పర్యటనలు, రిపోర్టులు, ప్రచురణలు మా ముఖ్య కార్యక్రమాల్లోని కొన్ని అంశాలు.

ఇప్పటి వరకూ వచ్చిన మీ రచనల వివరాలు తెలుపండి?

నా రచనల్లో కవిత్వం పాలు ఎక్కువ. 1980ల నాటి ఉద్యమాల అనుభవంతో ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ చిన్న కవితా సంపుటి. స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ‘‘నేనొక నల్లమబ్బునవుతా’’(1997) కవితా సంపుటి, ‘‘చెమట చెట్టు’’(1999), ‘‘ఓ లచ్చవ్వ’’ దీర్ఘకవిత(2005) (దళిత బహుజన స్త్రీ, రాజ్యాధికారం) ‘‘ఉసురు’’(2002) తెలంగాణ కవిత్వం, ‘‘గోరంత దీపాలు’’(2005) నానీల కవిత్వం, హైకూల సంపుటి, ‘‘దస్తఖత్‍’’, వచన కవిత ‘‘అనగనగా కాలం‘‘ , ‘‘మట్టిబంధం’’(2006) కవితా సంపుటి, ‘‘నన్హే ఓ నన్హే’’(2007) నానీల కవిత్వం, ‘‘మార్కెట్‍ స్మార్ట్ శ్రీమతి’’ దీర్ఘ కవిత(2010), ‘‘నిర్భయాకాశం కింద’’ (2016), కాలం కాన్వాస్ మీద(కవిత్వం)2023

మీరు సంపాదకత్వం వహించిన గ్రంథాల వివరాలు చెప్పండీ?.

కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదటిదైన బి.సి. ఉద్యోగుల సావనీర్‍ ‘బి.సి. సంకల్పం’ (2010) ప్రచురించాం. తెలంగాణ ఉద్యమ కవిత ‘తెలంగాణ ఉరుములు-మెరుపులు, ‘వెతలే కతలై’ (2011) రచయిత్రుల కథా సంకలనం ముద్రించాం. ‘ఊపిరి’(2012) తెలంగాణలో ఆత్మహత్యలపై నిరసన కవితా సంకలనం వచ్చింది. ‘జిగర్‍’(2013) తెలంగాణ విశిష్టతలపై కవిత్వ వచ్చింది. అపూర్వ త్యాగాలకు నీరాజనం పడ్తూ శరీర అవయవదానంపై ‘ఆకాశ పుష్పం’ (2014) కవిత్వం, ‘ముజఫర్‍నగర్‍ మారణకాండపై నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర’. ‘అగ్నిశిఖ’ అత్యాచారాల వ్యతిరేక సంకలనం. ‘పోలవరం ప్రాణాంతక ప్రయోగం – ముంపు గ్రామాల గోడు’ అచ్చేశాం. ‘అక్షర శరధి దాశరధి’(2016) దాశరధి రంగాచార్య రచనలపై వ్యాస సంకలనం. ‘తీరొక్క పువ్వులు’(2016) భిన్న అస్తిత్వాల సాహిత్యం, పరిచయ వ్యాసాలు. ‘తెలంగాణ రచయిత్రుల శతాధిక కథల సంకలనం’(2017), మహాశ్వేతాదేవి రచనలపై వ్యాసాల సంకలనం(2018), ‘బోల్షివిక్‍ విప్లవం’ స్ఫూర్తి వ్యాసాల సంకలనం(2019), ‘ఏడాది ప్రయాణం’ క్షేత్ర పర్యటనల రిపోర్టులు. ప్రస్తుతం ‘కరోనా కాలం కథలు’ (2020), ఆమె పదం (2023), భారత దేశంలో వితంతు వ్యవస్థ (2023)

మీరు చేసే సామాజిక సేవ కార్యక్రమాలు ఎలాంటివి?

సామాజిక సేవ అనే కన్నా నేను సామాజిక బాధ్యత అంటాను. నేను భూస్వామ్య కుటుంబంలో గానీ, వ్యాపారవేత్తల, పెద్ద ఉద్యోగ హోదాలో వున్న కుటుంబంలో పుట్టలేదు. నా నేపథ్యం మామూలు మధ్యతరగతి కుటుంబం. సాహిత్య భావజాలం సామాజికంగా మార్చుకోవడంతోపాటు మన బాధిత సమాజానికి ఏమైనా చేయాలనేది బాధ్యతగా ఎంచుకొని అనేక మహిళా సదస్సుల్లో పీడిత మహిళా లోకాన్ని చైతన్యపరచడానికి మాట్లాడాను.
ఈ స్వార్థ సమాజం అభాగ్యులుగా, తిరస్కృతులుగా మార్చిన నిస్సహాయులుండే ఆశ్రమాలకు నా మిత్రులు, నేను పిల్లలకు ఫీజులు కట్టి చదివించాలనుకొని ప్రస్తుతం అది కొనసాగిస్తున్నాము. కవులైనా, సామాన్యులైనా వారి అవసరార్థం నాకు చేతనైన ఆర్థిక సాయం చేస్తుంటాను, చిన్న సహాయమే. అయితే ఆ అవకాశం వాళ్లు మనకివ్వడం వల్ల మనమే వారికి కృతజ్ఞత చెప్పుకోవాలంటాను. ఇలాంటివే నాస్థాయి శక్తిననుసరించి చిన్నచిన్న సామాజిక బాధ్యతలు వ్యక్తిగతంగాను, మిత్రులతో కలిసి తీసుకుంటాను.

ఈనాటి యువ రచయితలకు మీరిచ్చే సందేశం.

నేను రచయితలకు, కవులకు, కళాకారులకు చెప్పాలనుకున్నది వేదికలకూ, శాలువాలకూ ఎగబడకండి. అన్నీ ఇన్‍స్టాంట్‍గా రావాలని దిగజారిపోకండి. పురస్కారాల పైరవీలు మానుకొమ్మనీ, కవిత్వ సాధన చేస్తూ సాహిత్య అధ్యయనం కొనసాగిస్తూ రచనలు చేయాలని, కవులు తమ ఆత్మను అమ్ముకుంటే ఆ సమాజం ఆత్మను కోల్పోతుంది. సామాజిక బాధ్యతనెరిగి రచనలు చేయాలి. నూతన సమాజ ఆవిష్కరణకు రచనలు చేయాలి. ప్రతి రచనలో కొత్తదనం కోసం తపించాలి. పేరుకీర్తులూ, పొగడ్తలూ, సన్మానాలూ, పురస్కారాలూ అన్నీ తాత్కాలికమైనవి. కేవలం బాధ్యతాయుతంగా మనం చేసే రచనలే వీటన్నింటినీ మించినవి అయ్యుండాలి. కవులు, రచయితలు, కళాకారులు తమ సృజన కళల ద్వారానే మ్రుత్యుంజయులు అవుతారు.

ఈ మధ్య కాలంలో వెలువరించిన .”కాలం కాన్వాస్ మీద “కవితా సంపుటి గురుంచి నాలుగు మాటలు చెప్పండీ?

కవిత్వం మనిషితనం వేర్వేరు కాదు.కవిగా జీవిస్తే చాలదు. మనిషిగా జీవిస్తేనే కవి గా జీవించినట్లని రవీంద్రుడు అంటారు.మనిషిగా కవిగా జీవించే ప్రయత్నం చేస్తూ చేస్తూ జ్వలించే గులాబీల జ్వాలా ముఖాలనూ,నేనొక నల్లమబ్బునై చల్లారుస్తూ, చెమట చెట్టులా నిలబడి ఉసురుసురని నిట్టూరుస్తూ,అనగనగా కాలం కథలు తెలుసుకుంటూ, నిర్భయాకాశం కింద సమస్త జనం సేదతీరాలన్న ఆకాంక్షతో ఇప్పుడు కాలం కాన్వాస్ మీద కాల చిత్రాలను జీవితపు ఫ్రేమ్ వర్క్ లో దృశ్య మానం చెయ్యాలని ఈ కవితా సంపుటి వెలువరిస్తున్నాను

కాళోజి తో మీకున్న అనుబంధాన్ని గురుంచి చెప్పండీ?

నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1977 లో అనుకుంటా!మా నాన్న గారితో కలిసి కాళోజి గారి ఇంటికి వెళ్ళాను. నేను నోట్ బుక్ లో ఆలోచన తట్టినప్పుడు రాసుకున్న కవితలను ధైర్యం చేసి వారికి చూపించాను.కవితల్ని చూసి సంతోష పడ్డాడు.లకోట(పెద్దగా) ఉన్నాయానీ చెప్పి, ఇట్లాగే రాస్తూ ఉండమని ఆశీర్వదించిండు.1979 లో కాళోజి గారి అధ్వర్యంలో వరంగల్ వేదికగా “చైతన్య సాహితీ “ఎర్పాటు చేసి 2 నెలకొక సారి కవులను, రచయితలను పిలిచి మాట్లాడించే కార్య క్రమాలు జరుగుతుండేవి.ఆ సంస్థ లో నేను కార్యవర్గ సభ్యురాలిగా ప్రతి ప్రోగ్రామ్ హాజరయ్యే దానినీ. “మిత్ర మండలి”ద్వారా ప్రతి నెల సాహిత్య కార్యక్రమాలు జరుతుండేవి.ఇలా వారితో సాహిత్యాను బంధం కొనసాగుతూ వచ్చిందీ.1979 లో మా నాన్న చనిపోవడంతో, కుటుంబ బరువు నాపై పడటం, కాకతీయ విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం లో చేరి ఉద్యోగ జీవితం ప్రారంభించా ను. అయినప్పటికీ సాహిత్యంతో నిత్య అనుభందం కొననసాగింది.. వీలును బట్టి కాళోజీ ఇంటికి వెళ్ళినప్పుడు మనుమరాలు అని పిలిచేవాడు.వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆత్మీయంగా మాట్లాడే వారు.2023 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాళోజి అవార్డ్ ప్రకటించినప్పుడు వారి జ్ఞాపకాలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి.

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

మహిళలూ – సమాజం

by Kondapally Neeharini March 31, 2024
written by Kondapally Neeharini

మహిళలూ – సమాజం March మయూఖ సంపాదకీయం

డాక్టర్ కొండపల్లి నీహారిణి మయూఖ  సంపాదకులు

మార్చ్ నెల,మే నెల మహిళా ప్రాతినిధ్యానికి ముఖ్యమైన నెల లు గా గుర్తించారు. బాగానే ఉంది. ఏడాది పొడుగునా ఎదురయ్యే సమస్యలు సందేహాలతో ఆడవాళ్ళు పడే వేదనలకు  ఏమైనా జవాబుగా మార్గం చూపాయా? చూపితే, ఏ దారి గా ఏ ఋజువులు గా చూపారు? చూపగలరు? అని ప్రశ్నలు తప్పకుండా ఉదయిస్తాయి.
అడుగడుగునా ఆధిపత్యాన్ని చూపిస్తూ అణగదొక్కుతూ ఆడవాళ్లను ఆత్మ న్యూనతలో పడవేస్తున్న ఈ పురుషస్వామ్య సమాజం ఒక్కసారైనా ఆత్మావలోకనం చేసుకోవాలి.
 మగవాళ్ళంతా చెడ్డ వాళ్లని ఆడవాళ్లంతా మంచి వాళ్ళని అనడం లేదు. ఆడవాళ్లు చెడ్డవాళ్ళు ఉంటారు,మగవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఎక్కడైనా మంచి చేస్తూనే ఉంటారు. ఇది మంచి చెడు సమస్య కాదు ఇది ప్రస్తుతంలో దృష్టి పెట్టి చూడాల్సిన సమస్య కాదు యుగయుగాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలను బట్టి ఆలోచించాల్సిన విషయం. మంచి ఉద్దేశంతోటే, గొప్ప ఉద్దేశంతోటే స్త్రీని గౌరవిస్తూ జగతికి మూలం స్త్రీ అని, ముగ్గురమ్మల మూలపుటమ్మా అని, ఆదిశక్తి అని పరాశక్తి అని అన్ని స్థానాలలో అమ్మకే స్థానం ముఖ్యమని, ఆడవాళ్ళకే ప్రముఖ స్థానం అంటూనే… అమ్మానాన్న తల్లి తండ్రి, సీతారాములు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు అంటూ ఉన్నాము , స్త్రీ లకు గౌరవం ఇచ్చేవాళ్ళు అని చెప్పిన  వేద కాలాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది.
స్వార్ధచింతనతో అధికార దాహంతో, అహంభావాదివికారాలతో  స్త్రీల అస్తిత్వాన్ని అణచివేసినటువంటి దుర్మార్గాలన్నీ అందరికీ తెలుసు. అయినా నిజాన్ని ఎవరు ఒప్పుకోరు. పుత్రుడు పుడితేనే పున్నాగ నరకం నుండి తప్పిస్తాడని అనడంతోటే పురుషస్వామ్యం అంటే ఏంటో బయటపడింది. ఇలాంటి ఏవేవో, ఎన్నెన్నో ఉన్నాయి. “ఆ బొంత లోనిదే ఆ మాసిక “అన్నట్టు తమ కన్న ముందు తరాల వాళ్ళు ఏం చేశారో చూసి అదే వ్యవహారాలు నడిపే మగవాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. మేము తప్పు చేయమని అంటారు.కానీ శారీరక శక్తిని తక్కువ చూపిస్తూను అపాయాలు ఎక్కువ పరిస్థితులు ఎదురవుతాయని స్త్రీలు బయట కాలు పెడితే ఎవరీ మతాచారాలు చేస్తారో నని ఇంటిపట్టున ఉంచాము అని సర్ది చెప్పుతూ ఉంటారు.అసలు ఇలాంటి పరిస్థితులు దారి తీయడానికి కారణం ఏమై ఉంటుంది మొదటి నుంచే స్త్రీలకు విలువ ఇస్తూ, స్త్రీల స్థానాన్ని పదిల పరుస్తూ వచ్చినట్టయితే ఈ అపాయాలు వస్తాయి అనే ఆలోచననే కలగకపోయేది. ఆడవాళ్ళని భోగపు వస్తువుగా వాడుకున్నంత వరకు పని యంత్రాలుగా మార్చినంతవరకు పురుషులు ఇటువంటి విపరీతాలకు దారి తీసే రోజులు వస్తాయని ఆ మధ్య యుగంలో ఆలోచించి ఉండకపోవచ్చు. అప్పటికప్పటికీ ప్రస్తుతానికే ఆలోచించుకున్నారు వాళ్ళానాడు. కానీ, భావి జీవితం గురించి ఆలోచించలేదు.అదే ఇప్పుడు ఒక పెద్ద సంఘవిద్రోహంగా సామాజిక దాష్టీకంగా తయారై పురుష జాతిలోని మేధావులను కలవర పరుస్తున్నది. పాత రోజులను తీసుకురాలేము కొత్త రోజులను ఆపలేమూ, నడుస్తున్న రోజులను మార్చలేము !ఇటువంటి సందిగ్ధావస్థలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు మంచి వాళ్లంతా.
అయితే నిస్తేజం లో పడిపోయే పనిలేదు. ఎంతటి వ్రణాణికైనా మందు ఉంటుంది. ఎంతటి కఠినమైన పనికైనా ప్రణాళిక ఉంటుంది. ఏ జాతిని గురించే అయితే తక్కువ చేసి ఇళ్లల్లో మాట్లాడారో ,ఉదాహరణకు ఆ …ఆడపిల్ల దానిపైఎందుకు ఇంత ఖర్చు చేయాలి ?ఆ… ఆడపిల్ల ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్లొచ్చింది? ఆ …ఆడపిల్ల ఇంట్లో వంట చేసి పెడితే సరిపోతుంది? ఆ… ఆడపిల్ల అంత పెద్ద చదువులకు ఎందుకు? ఆ…. ఆడపిల్ల సైనా సైన్యాధ్యక్షురాలు వంటి పదవులు ఎందుకు ?ఆడపిల్ల రాజకీయాలు ఎందుకు అంటూ అనడం మానేసి, కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అనుకోవాలి.కొడుకును కూతురును ఒకటే బడిలో చదివిస్తున్న వాళ్లు కూడా ఏర్పడకుండా ఇళ్లల్లో  భయాలను కలుగజేసేలా మాట్లాడే మాటలు మానుకోవాలి.తండ్రి, తాత బాబాయ్, మామ, తమ్ముడు, అన్న వంటి పురుష పాత్రలందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక కొందరు ఆడవాళ్లు, కాస్త నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడితేనైనా ఈ మగవాళ్ళు అణిగి ఉంటారనుకునే వాళ్ళు ఉంటారు. దీనికి కారణం తన అమ్మకు నానమ్మ కు అమ్మమ్మకు అత్తకు ఇంటి పక్క వాళ్లకు జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి అనుభవాలను ఆ భయం తెలియకుండానే వాళ్ళ మనసులలో జొరబడి ఇంకా ఇలాగే,పాతకాలం వారిలా ఉంటే ఎలా ? నన్నూ అట్లాగే చేస్తారనుకొని, ముందు జాగ్రత్త గా ఉండాలని అనుకోని ఇప్పుడు కొందరు కాస్త నోరు చేసుకుంటున్నారు. ఎదురు తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది ఆలోచన చేయాలి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.
 ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా గ్రహిస్తారు.
ఒకటి మాత్రం నిజం పెరుగుట విరుగుట కొరకే! సామాజిక న్యాయం కోసం ఆలోచించే వాళ్ళు ఇది గ్రహిస్తారు. ఆనాటి చరిత్ర ను తిరిగి చూస్తే తెలుస్తుంది.

_____*****_____

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 31, 2024
written by Narendra Sandineni

గులాబీల మల్లారెడ్డి తేది 26 – 01 – 1952 రోజున తురకవాని కుంట పోతారం (జె) గ్రామం, అక్కన్నపేట మండలం,సిద్దిపేట జిల్లాలో జన్మించారు.తల్లిదండ్రులు భూదేవి,లింగారెడ్డి.తండ్రి లింగారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం పోలీసుల వల్ల చిత్రహింసలు ఎదుర్కొన్నాడు.వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు. తాత మల్ దాదా.నాయనమ్మ ఎల్లవ్వ.తాత మల్ దాదా స్వాతంత్ర్య పోరాట యోధుడు,మొదటి బోల్షివిక్,మొదటి సెక్యులరిస్ట్ కూడా.మల్లారెడ్డి విద్యాభ్యాసం తురకవానికుంట,గుడాటి పల్లె,రామవరం నంగునూరు మండల కేంద్రం, హుస్నాబాద్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పి.యు.సి. చదివాడు.మల్లారెడ్డి డిగ్రీ విద్యను ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటలో చదివాడు. మల్లారెడ్డి న్యాయవిద్యను ఎల్.ఎల్.బి ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో చదివాడు. మల్లారెడ్డి 1978 సంవత్సరంలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాదులో ఎన్ రోల్ చేసుకున్నాడు.మల్లారెడ్డి కరీంనగర్ బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొని 1978 సంవత్సరం నుండి న్యాయవాదిగా కొనసాగుచున్నాడు. మల్లారెడ్డి 1979 సంవత్సరం నుండి 1988 సంవత్సరం వరకు పోతారం (జె) గ్రామానికి సర్పంచ్ గా విధులు నిర్వహించి చక్కటి పేరు తెచ్చుకున్నాడు.మల్లారెడ్డి విద్యార్థిగా సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడే గులాబీ పక్షపత్రికను నడిపాడు.1991 సంవత్సరంలో రైతు భారతం పక్షపత్రికను ప్రారంభించి ఐదు సంవత్సరాలు నడిపినాడు.మల్లారెడ్డి రాసిన కవితలు,కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

మల్లారెడ్డి వెలువరించిన పుస్తకాల వివరాలు:

1) పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటి – 1984.

2) జర్నలిస్టు కథల సంపుటి – 1986.

3) వకాలత్  వజ్రాయుధం

  కోర్టు రణ భూమిలో వెయ్యి యుద్ధాలు వెయ్యి

  విజయాలు – 2014.

4) జనమేవ జయతే కవితా సంపుటి – 2014.

5)మల్ దాదా చారిత్రక నవల -2016.

6) నా లక్ష్యం నా గమ్యం కవితా సంపుటి -2016.

7) ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం కవితా సంపుటి

   – 2019.

8) ప్రకృతి ప్రియురాలు – మానవత కవితా సంపుటి

  2020.

9) ఐదు తరాలు కథా సంపుటి – 2021.

10) ప్రేమ పవనాలు – మానవతా సౌరభాలు. (సాంఘిక నవల) (క్యాంపస్ లో సరిగమలు) – 2022.

మల్లా రెడ్డి రచించిన మల్ దాదా నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం అందుకున్నారు.

గుబాళించిన గులాబీల మల్లారెడ్డి కవిత్వం.  

గులాబీల మల్లారెడ్డి పల్లె పొలిమేరల్లోకి కవిత. 

సుప్రభాతం ఆగుతుందా ? కవిత.

నడవడి కవిత. 

సత్యము స్వప్నము కవిత.

ఎవరన్నారు కవిత.

జంపాల ప్రసాద్ కవిత.

ఎంత హాయి కవిత.

నిజం కవిత.

గది –హృది కవిత.

ఖైది సంకల్పం కవిత.

164 (c r p c) STATEMENT (స్టేటు మెంట్) కవిత.

చేదు మాత్ర కవిత.

నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవిత.

 ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లా రెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని పల్లె పొలిమేరల్లోకి కవిత పై విశ్లేషణా వ్యాసం.

నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన రైతన్నలు ఇది భారతదేశంలోని సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం.దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు. వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.వరుణుడి కరుణ లేక వర్షాలు పడక పంటలు పండవు.వరుణ దేవుని కరుణ కొరకు కప్పతల్లి ఆటలు ఆడుతారు.శ్రమను నమ్ముకున్న రైతు నాగలి పట్టి దుక్కి దున్నుతాడు.రైతు మడిలో పశువుల పేడ ఎరువుగా వాడతాడు.రైతు పొలం మడి చెక్క తయారు కావడానికి ఎన్నో సార్లు దున్నుతాడు.పొలం మడి తయారు కాగానే వరి నాట్లు వేస్తాడు.పచ్చ పచ్చని పైరు తయారై పొలం వరి గొలుసులు వేస్తే చూసి ఆనందిస్తాడు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసికొని కష్టపడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్ట పడే వాళ్ళు ఎవరు? అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా? లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.”నా వాళ్లంతా/నాగళ్ళకు సిలువ వేయబడి/ తరతరాలుగా/ నెత్తురుని/నెత్తురు  కంటే అమూల్యమైన చెమటని/ సమాజం కోసం దారపోస్తున్నప్పుడు.” మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటుపడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం. భారతదేశంలోని రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధార పోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో పల్లె పొలిమేరల్లోకి  కవితా సంపుటిలోని మొదటి కవిత.కవి మల్లారెడ్డి 40 సంవత్సరాల కింద పల్లె పొలిమేరల్లోకి కవిత రాసాడు.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్టుగా ఉంది.మల్లారెడ్డి తుర్కవానికుంట గ్రామంలో రైతు బిడ్డగా జన్మించాడు.తాత మల్ దాదా,తండ్రి లింగారెడ్డి,తల్లి భూదేవి,వ్యవసాయం చేసి జీవనం సాగించే వారు.మల్లా రెడ్డి నాన్న లింగారెడ్డి,తల్లి భూదేవితో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నాడు.“నేనొక్కడిని స్వార్థంతో/ క్యాంపస్ పొలిమేరల్లో/ నగర ఉద్యానవనాల్లో/ శాసనసభల్లో/సాంస్కృతిక సమావేశాల్లో/ కోర్టు దర్బారుల్లో.” విద్యార్థుల జీవిత ధ్యేయం చదువు. విద్యార్థుల సంకల్పం నెరవేరాలంటే యూనివర్సిటీ క్యాంపస్ లో చేరి ఉన్నత విద్య అభ్యసించాలి.యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు భావి జీవితంలో ఉపాధ్యాయులుగా,వైద్యులుగా,ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా,తాసిల్దారులుగా,వ్యవసాయ అధికారులుగా,బ్యాంకు ఉద్యోగులుగా,రక్షణ,పోలీసు,పోస్ట్ ఆఫీస్,వివిధ ఉద్యోగాలలో చేరుతారు.వివిధ రకాల వృత్తులు చేపడుతారు.విద్యార్థులు క్యాంపస్ పొలిమేరల్లో చక్కగా చదువుకొని విద్యను అభ్యసిస్తారు.విద్యార్థులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం సాగిస్తారు.రాజకీయ పార్టీల నాయకులు నగర ఉద్యానవనాల్లో చేరి పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులు సమాజ వికాసం కొరకు పని చేయడం లేదు.పాలకులు తమ ప్రయోజనాలు నెరవేర్చుకొనుట కొరకు పని చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. పాలకులు ప్రజాసంక్షేమం కొరకు ఉపయోగించాల్సిన నిధులు దుర్వినియోగం చేస్తున్న తీరు ఆవేదన కలిగిస్తుంది.ప్రజా ప్రతినిధులు కోట్ల రూపాయల నిధులు దండుకుంటున్న వైనాన్ని ప్రశ్నించే నేతలు కరువు అయ్యారు.నిస్వార్థ నాయకుడు,ప్రముఖ పార్లమెంటేరియన్ తరిమెల నాగిరెడ్డి పార్లమెంట్ అసెంబ్లీలు బాతకాని షాపులు అని పేర్కొన్నారు.తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే గొప్ప గ్రంథం రచించారు.ఈనాడు జరుగుతున్న సాంస్కృతిక సమావేశాలు,సమాజ అభ్యున్నతిని కాంక్షించడం లేదు.ఏదో మొక్కుబడిగా కాలక్షేపం కొరకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.కోర్టు దర్బారుల్లో న్యాయం జరగడం లేదు.బ్రిటిష్ కాలంలో తయారు చేసిన చట్టాలు ఇంకా అమలులో ఉన్నాయి.చట్టంలోని లొసుగుల వల్ల నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు.నేరస్తుల నేర నిరూపణ కావడం లేదు.దీనికి తోడు పోలీసులు నేరస్తుల కొమ్ము కాస్తున్నారు. ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు ప్రవేశ పెట్టక పోవడం వల్ల కోర్టులో కేసులు వీగిపోతున్నాయి.పోలీసులు, ప్రాసిక్యూటర్లు,జడ్జీలకు కూడా అవినీతి చీడ తగిలింది.జడ్జీలు ఆమ్యామ్యాలు అందుకొని తీర్పులు తారుమారు చేసి న్యాయాన్ని నిలువునా పాతేస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం.“పుచ్చు విత్తనాల్లాంటి వాగ్దానాలతో”.కవి మల్లా రెడ్డి  వాగ్దానాలను పుచ్చు విత్తనాలతో పోలుస్తున్నాడు.పుచ్చు విత్తనాలు మొలకెత్తవు.నిజంగానే కొన్ని సీడ్స్ కంపెనీలు పుచ్చు విత్తనాలు మంచి విత్తనాలు అని నమ్మించి రైతులను మోసం చేస్తున్నారు.అమాయకమైన రైతులు పుచ్చు విత్తనాలు కొని మోసపోతున్నారు.రాజకీయ నాయకులు గెలుపు కోసం శుష్కమైన వాగ్దానాలు చేస్తారు.ఓట్ల కొరకు ఓటర్లకు గాలం వేస్తారు.అమాయక ఓటర్లకు సారా తాగిస్తున్నారు. తినిపిస్తున్నారు.డబ్బులు పంచుతున్నారు.ప్రలోభాలకు గురి చేసి ఓట్లను కొల్లగొడుతున్నారు.అవినీతిపరులైన రాజకీయ నాయకుల వాగ్దానాలకు లొంగితే ఐదు సంవత్సరాలు మోసపోవడం ఖాయం అని కవి మల్లా రెడ్డి చెబుతున్నాడు.. “చెదలు పట్టిన చేతులతో/ శవం లాంటి మనిషిలా బతకలేను/ అందుకే/పల్లె పొలిమేరల్లోకి వెళుతున్నాను/ నన్నక్కడే నా వాళ్ళతో/నాగళ్ళకి సిలువ వేసినా సరే/కంకర కొడుతున్న వాళ్లతో/కాంక్రీట్ చేసినా సరే/అక్కడే కోయిలనై/ఇష్టమొచ్చిన కొత్త గానం చేస్తాను.” చెదలు పట్టిన చేతులతో వెళుతున్నాను అని అంటున్నారు.చేతులు ఎక్కడన్నా చెదలు పడతాయా? చేతులు చెదలు పడవని మన అందరికి తెలుసు.కవి మల్లారెడ్డి భావన చక్కగా ఉంది.వేమన ఏమన్నాడు.పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అన్నాడు.శవంలాంటి మనిషిలా బతకలేను. మనిషి చనిపోతే శవం అంటారుశవాన్ని కొందరు ఖననం చేస్తారు.శవాన్ని కొందరు దహనం చేస్తారు.ఇన్నాళ్లు బతికిన మనిషి ఏదో ఒక రోజు జీవితాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే.ఆ శవాన్ని ఎవ్వరు ఇంటి ముందు ఎక్కువ సేపు ఉంచరు.తొందర తొందరగా పాడె కట్టి డప్పులతో శవాన్ని తరలిస్తారు. చనిపోయిన మనిషి అంత్యక్రియల వేడుకల్లో కుటుంబ సభ్యులు,స్నేహితులు,బంధువులు అందరు పాల్గొంటారు. శవంలాంటి మనిషిలా బతకలేను.శవం ఎక్కడైనా బతుకుతుందా?శవం ఎప్పుడు బతకదు.జీవం లేని శవం వలె బతకను.అందుకే పల్లె పొలిమేరల్లోకి వెళుతున్నాను.కల్లా కపటమెరుగని పసిపిల్లల్లాంటి పల్లె జనులైన రైతులతో కలిసి పోతాను.నన్నక్కడ నా వాళ్ళతో నాగళ్ళకి సిలువ వేసినా సరే.ఈ దేశంలో రైతు నాగళ్ళకి సిలువ వేసినప్పటికి దుక్కి దున్నడం మానలేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండి పెడుతున్నాడు.కంకర కొడుతున్న వాళ్లతో కాంక్రీట్ చేసినా సరే. వడ్డెరలు గుట్టలు తొలిచి కంకర రాళ్లు తయారు చేస్తారు.కంకర రాళ్లతో ఇల్లు నిర్మాణం చేస్తారు.కంకర రాళ్లు లేకుండా పునాదులే ఉండవు.పునాదులు లేకుంటే ఇండ్లు ఉండవు.రోడ్లు కూడా కంకర రాళ్లతో వేస్తారు.కంకర కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెర వాళ్ళ శ్రమని స్వేదాన్ని గుర్తుచేస్తున్నాడు.కొండలు పగలేసినం బండలనే పిండినం శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో చెరబండ రాజు కవిత గుర్తుకొస్తుంది.గ్రానైట్ కంపెనీలు వచ్చి గుట్టలు మాయమవుతున్నాయి.ప్రకృతి ప్రసాదించిన వరాలు గుట్టలు.గుట్టలు లేకుంటే పల్లె సోయగం మారిపోతుంది. గుట్టలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం గుట్టల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.వసంత మాసం రాగానే కోయిల కూస్తుంది.కోయిల కుహు కుహు రాగాలు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ప్రకృతికి పర్యాయపదంలా ఉన్న పల్లెలో కోయిలనై ఇష్టం వచ్చిన కొత్త గానం చేస్తాను అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.భావితరానికి పల్లె పొలిమేరల్లోకి కవిత స్ఫూర్తిని అందిస్తుంది.స్వార్థం పరమార్థంగా బతుకుతున్న పాలకుల తీరును చూసి దిగులు కలుగుతుంది.ఈ దేశంలో రైతు మాత్రమే స్వేదం చిందించి అందరి ఆకలిని తీరుస్తున్నాడు.కవి మల్లారెడ్డి చక్కటి కవిత అందించినందుకు అభినందిస్తున్నాను.రైతే రాజు,జై కిసాన్,అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమృతోత్సవాలు జరుపుకుంటున్నాము. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు లేదు.రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.ఈ దేశంలోని రైతులు ఆత్మహత్యలు లేని వారై ఉండాలి.రైతుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని కోరుకుందాం.కవి మల్లా రెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి  సుప్రభాతం ఆగుతుందా? కవిత పై విశ్లేషణా  వ్యాసం.                               .                     

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని సుప్రభాతం ఆగుతుందా? కవిత పై విశ్లేషణా వ్యాసం.సుప్రభాతం ఆగుతుందా ?కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవి మల్లారెడ్డి ఈ కవితను 1984 సంవత్సరంలో రాసాడు. దాదాపుగా 40 ఏళ్లు అవుతుంది.ఆనాటి కాలమాన పరిస్థితులు సామాజిక స్థితిగతులకు అద్దం పడుతుంది.కవిత ఇప్పుడే రాసినట్టుగా అనిపిస్తుంది.ఈనాటికి సమాజంలో మారని సామాజిక సమస్యలు,కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి.సుప్రభాతం అంటే తెలుగులో శుభోదయం. ఆంగ్లంలో గుడ్ మార్నింగ్ అని అర్థం. ఇవ్వాళ ఉదయాన్నే లేచి ఎంత మంది శుభోదయం, గుడ్ మార్నింగ్ చెపుతున్నారు. ఉదయాన్నే ఎంత మంది నిద్ర లేస్తున్నారు.రాత్రి తొందరగా నిద్రపోతే ఉదయాన్నే కోడి కూసే వేళకు లేవగలుగుతారు.Early to bed early to rise makes the man healthy,wealthy and wise.అని ఆంగ్లంలో సూక్తి ఉంది.ఈనాటి పెద్దలు,పిల్లలు గుడ్లగూబల్లా రాత్రంతా మెలకువతోనే ఉంటే ఉదయాన్నే నిద్ర లేవడం సాధ్యం కాదు గదా.వాడ వాడలా వెలిసిన మన దేవాలయాలు ఉదయాన తెరుచుకోవడం లేదు.ఉదయాన్నే గుడిలో వెంకటేశ్వర సుప్రభాతం,విష్ణు సహస్రనామాలు వినిపించడం లేదు.భక్తులు బారెడు పొద్దెక్కిన తరువాత లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదికాలు పూర్తి చేసుకుని గుడికి చేరి పూజలు చేస్తారు.పూజారులు,భక్తులు వచ్చే వేళకు వచ్చి గుడి తలుపులు తెరుస్తారు.పూజారులు దేవుని పూజ చేసి  భక్తులకు హారతి ఇస్తారు.మన శాస్త్రాలు,పూజా విధానాలు మనిషిని సన్మార్గం పై పయనించడానికి తోడ్పడడం లేదు.ఏదో మొక్కుబడి కొరకు పూజలు పునస్కారాలు జపం వగైరా చేస్తున్నారు.చిత్తం ఏమో శివుని మీద మనసు ఏమో గుడి బయట విడిచి వచ్చిన చెప్పుల మీద ఉంటుంది.శివుని శరణాగతి ఎలా దొరుకుతుంది?మనకు  పొద్దున్నే తెలిసిన వారు ఇరుగు పొరుగు వారు కనిపిస్తే ఆప్యాయంగా పలకరించాలి.కవి మల్లారెడ్డి కవితకు సుప్రభాతం ఆగుతుందా ? అని  పేరు పెట్టాడు.సుప్రభాతం ఏనాడు ఆగదు.ఆగిన సందర్భాలు లేవు. రోజుకు 24 గంటల సమయం.కాలచక్రం గిర్రున తిరుగుతుంటుంది.ప్రభాత వేళ సముద్రం చెంతకు చేరి మనం వీక్షిస్తే ఎంతో గమ్మత్తుగా హాయిగా ఉంటుంది.అలలు తీరానికి చేరాలని తహతహలాడుతుంటాయి.అలలు సవ్వడి యొక్క అనుభూతి మాటల్లో వర్ణించలేం.మనసుకు చెప్పలేనంత  ఆహ్లాదంగా అనిపిస్తుంది.”నేను నా మిత్రులంతా/                                         
అర్ధరాత్రి పెంకుటింట్లో”.ఆ కాలంలో నేను నా మిత్రులం అందరం కలిసి స్నేహంగా ఉండేవాళ్ళం.ఈ రోజుల్లో ఎవరైనా అర్ధరాత్రి పెంకుటింట్లో మిత్రులతో కలుస్తున్నారా? లేదు అని చెప్పవచ్చు.నాడు అర్ధరాత్రి పెంకుటింట్లో మిత్రులం అంతా కలుసుకునే వాళ్ళం అంటే విస్మయం కలిగించవచ్చు.ఈ కాలం పిల్లలకు పెంకుటిల్లు ఉంది అనే సంగతి తెలువదు.మన పెంకుటిల్లు మన సంస్కృతికి అద్దం పడుతుంది.భావి తరాలకు పెంకుటిల్లు ఉందనే సంగతి సుప్రభాతం ఆగుతుందా? కవిత చదివితే,మనకు గుర్తుకు వస్తుంది.ఒకప్పుడు 50 ఏళ్ల కింద ఎటు చూసినా అన్ని పెంకుటిండ్లు మనకు దర్శనమిచ్చేవి.పల్లెల్లో ఒకరో ఇద్దరో ధనవంతులు ఉండే వారు.ధనవంతులు కట్టుకున్న పెద్ద పెద్ద లోగిళ్ళతో పెద్ద భవంతులు కనువిందు చేసేలా,రాజ భవనాలను తలపించేలా ఉండేవి.పల్లెల్లో స్తోమతను బట్టి చిన్నవి పెద్దవి పెంకుటిండ్లు ఉండేవి.మంచి గాలి,వెలుతురు వచ్చేటట్లు విశాలంగా ఇల్లు కట్టుకునే వారు.ప్రతి ఇంటి ముందు పందిరి,చెట్లు చేమలు,పెరడు మరియు పశువుల కొరకు ప్రత్యేకంగా దొడ్డి ఉండేది.కష్టం చేసి ఇష్టంగా కట్టుకున్న పెంకుటిల్లు యజమానులు ఇష్ట దైవమైన పరమాత్మను చేరుకున్నారు.తండ్రులు కట్టిన పెంకుటిల్లలో కుమారులు మాత్రం నివసించడం లేదు.ఆనాటి ఆ పాత ఇంటిలో నివసించడం నామోషీగా భావిస్తున్నారు.అలనాటి పెంకుటింటిలో ఎవ్వరు ఉండటం లేదు.పల్లెల్లో ఉన్న పెంకుటిండ్లు అన్ని ఆలనా పాలన లేక శిథిలమై కూలి మట్టిలో కలుస్తున్నాయి.ఇప్పటి వారు కొత్త కొత్తగా బిల్డింగులు రోడ్డుకు ఇరుపక్కల కట్టుకుంటున్నారు. కొత్త పల్లె రోడ్డును చేరింది.పాత పల్లె శిథిలావస్థకు చేరి ఒట్టిపోయిన గోవులా ఎవరు పట్టించుకోని ఈ విధంగా అలానే ఉండి పోయింది.”చిందర వందరగా పడి ఉన్న/ సమస్యల పుస్తకాల మధ్యన కూర్చుండి మాట్లాడుకునేది/నేడావరించిన చిమ్మ చీకట్లను గూర్చి /లక్షల మిలియన్ జీవుల కళ్ళలోని ధైన్యం గూర్చి/  లేదా/రేపటి మహా సుప్రభాతం గూర్చి”. ఇవ్వాళ పల్లెలో పట్నంలో స్నేహితులు ఒక్కచోట కూర్చుండి ఏం చేస్తుంటారు. కాలక్షేపానికి ఉబుసుపోక కబుర్లు చెబుతూ గడుపుతుంటారు. పేకాట ఆడుతారు.తింటారు.తాగుతారు.సమయాన్ని ఖూనీ చేసి ఎంజాయ్ చేస్తుంటారు.షికారుకు వెళతారు..కొందరు ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు.వాకింగ్ లో కూడా పనికి రాని చెత్త కబుర్లతో పకపకలు వికవికలు చేస్తుంటారు.ఎవరి కొంపలు ముంచుదాం‌.తిందాం.తాగుదాం.అసూయ అనే రోగంతో రగిలి పోతుంటారు.తప్పుడు కేసులు పెడతారు.తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తారు.తప్పుడు పనుల్లోనే తేలియాడుతుంటారు. ప్రయోజనకరమైన పనుల గురించి ఆలోచించరు.వాకింగ్ చేస్తున్న వాళ్లు సరైన శ్వాస తీసుకోవాలి.పీల్చేగాలి,వదిలే గాలి సమంగా ఉండాలి.అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి.తోటి వారిని ఆప్యాయతగా పలకరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.ఇవి ఎవరైనా పాటిస్తున్నారా? లేదు అని చెప్పవచ్చు.పేదరికం ఒక శాపంగా మారింది.అసమానతలు బీద,గొప్ప తేడాలు పెచ్చు పెరిగి పోయాయి.కరువు కాటకాలతో పంటలు సరిగా పండడం లేదు.రైతులు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురి అయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.పూర్వం రైతుల ఆత్మహత్యలు ఏనాడు కని విని ఎరుగం.రైతుల ఆత్మహత్యలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.అయినప్పటికీ రైతులు వ్యవసాయం పట్ల నమ్మకంతో పంటలు పండిస్తున్నారు.పడరాని పాట్లు పడుతున్నారు.చాలామంది రైతు కూలీలు ఊళ్లో చేసేందుకు పని లేక ఉన్న ఊర్లో బతుకు గడవక వలసలు పోతున్నారు.ప్రాణంగా పెంచుకున్న పశువులకు మేత లేక వాటి గోస చూడలేక అంగడిలో అమ్ముకుంటున్నారు.పశువులు అంగడి నుండి కబేలాకు తరలి పోతున్నాయి.బతుకు తెరువుకు వలస ఒకటే మార్గం అయింది.పెద్దవాళ్లు ఇంటి పట్టునే ఉండి కలో గంజి తాగి బతుకుతున్నారు.పెద్దవాళ్లు తమ సంతానంతో పట్టణానికి వెళ్ల లేరు.పెద్దవాళ్లు తమ సంతానం తమ వద్ద లేకుండా పల్లెల్లో ఉండలేరు.అయినప్పటికీ ఏదో జీవితాన్ని పల్లె పట్ల ఉన్న గాఢమైన అభిమానంతో రోజులు నెట్టుకు వస్తున్నారు. పల్లెలో ఎటు చూసినా ఆవరించిన చీకటి బతుకులు.లక్షల మిలియన్ జీవుల కళ్ళలోని  ధైన్యం గూర్చి ఆలోచించే కవులు, కళాకారులు మాత్రమే ఉన్నారు.సంపద ఉన్నవాడి అబ్బ సొత్తు కాదు.సంపదను అందరూ సమానంగా పంచుకు తినాలి అని కమ్యూనిజం చెప్తోంది.కమ్యూనిజం మూల బీజాలు భారతదేశంలో ఉన్నాయి.లెనిన్ నాయకత్వంలో సోవియట్ రష్యా అభివృద్ధి పథంలో సాగింది.లెనిన్ మరణం తర్వాత స్టాలిన్ నాయకత్వంలో రష్యాను మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథంలో నడిపించాడు.సోవియట్ రష్యా దేశం యొక్క స్ఫూర్తిని అందుకొని మన తెలంగాణలోని కమ్యూనిస్టు నాయకులు నిజాంకు వ్యతిరేకంగా సాయుధపోరాటం సాగించారు.1946 నుండి 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగింది.తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది వీరులు అమరులయ్యారు.బ్రిటిష్ వారు కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం విధించారు.కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనుచిత నిర్ణయాల వల్ల సాయుధ పోరాటం ఆపివేయబడింది.సాయుధ పోరాటం విజయం సాధిస్తున్న దశలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగకుండా జాతీయ ప్రజాతంత్ర విప్లవం రాకుండా కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డుకున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాము.ఇప్పటికీ ప్రజల కనీస అవసరాలు తీర లేదు.కూడు,గూడు,గుడ్డ,విద్య అందరికీ అందడం లేదు.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. సామాన్యుడి జీవితం ఎండమావిలా తయారైంది.ఆరుగాలం కష్టం చేసిన ప్రజలు అర్థాకలితో మలమలమాడుతున్నారు. వ్యవసాయక విప్లవం రాలేదు.దున్నేవాడికి భూమి లేదు.పేదలు మరింత పేదలుగా మారారు.రైతులు,రైతుకూలీలు తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నారు.పల్లెల్లో మరియు పట్టణాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది.ఎటు చూసినా వైరుధ్యాలు. పాలకులు ప్రజలను వంచన చేస్తూ పబ్బం గడుపుతున్నారు.రేపటి మహా సుప్రభాతం గురించి ఆలోచించే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, మన దేశం మూలాల్లో పరివ్యాప్తమై ఉంది.కవులు,కళాకారులు ఎల్లెడలా సమాజాన్ని చైతన్యం చేస్తూ జాగృతపరుస్తున్నారు.  ప్రజలు తమ హక్కుల కోసం చైతన్యంతో పోరాడుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంది.సంపన్నులు పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు.సంపన్నులు కోట్ల కొద్ది ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో కూడ బెడుతున్నారు.“మీ ఆస్తుల్ని కొల్లగొట్టాలని కాదు”.పేదల ఆస్తుల్ని కొల్లగొట్టింది ఎవరు?ధనికులు,అవిద్య, అజ్ఞానం, అమాయకత్వం, ఆసరా చేసుకుని పేద ప్రజలకు అప్పులు ఇచ్చి వడ్డీల కింద వారి శ్రమను దోచుకుంటున్నారు. పేదలు సంవత్సరాల తరబడి ధనికుల ఇళ్ళ ముందు కావలి కుక్కల్లా కాపలా ఉండి ఊడిగం చేసిన తీరని అప్పులు తీరడం లేదు.పేదలకు ఉన్న కొద్దిపాటి భూమిని అప్పుల కింద జమ కట్టుకొని ఆస్తుల్ని జప్తు చేస్తున్న వైనం ఇంకా కొనసాగుతూనే ఉంది .పేదల ఆస్తులు కొల్ల గొట్టింది ధనికులేనన్నది సత్యం.పేదల అవసరాలను అసరాగా చేసుకుని అప్పులు ఇచ్చేవారు.ధనికులు ఏం చేసినా చెల్లుబాటు అయ్యేది.పేదలు బాధలను కన్నీటి మాటున దాచుకునేవారు. ధనికులు పేదల ఇళ్లకు నిప్పు పెట్టేవారు.“రక్తపాతం సృష్టించాలని అంతకంటె కాదు”.రక్తపాతం సృష్టించాలని పేదలు ఎన్నడు భావించలేదు. ధనికులు చేస్తున్న దుర్మార్గం అన్యాయం అని ఎదురు తిరిగితే నక్సలైట్ అని చెప్పి పోలీసుల చేత ఒళ్ళు హునం అయ్యేలా దారుణంగా హింసింప జేసేవారు.పోలీసులు ఎన్ కౌంటర్  పేరిట అమాయక పేద జనాలను చంపుతున్నారు.రక్తపాతం సృష్టించేది.పేదల గృహాలు దహనం చేసేది ధనికులే.ధనికులు చెప్పిన మాట వినకపోతే రక్తపాతం సృష్టిస్తారు.ధనవంతులు పదవులు పొంది కోట్ల కొద్ది సొమ్మును,తరతరాలు తిన్నా తరగని ఆస్తులు కూడ బెట్టారు. పేదలు పదవులు పొందిన దాఖలాలు ఉండవు.పేదలు పదవిలో ఉన్నా నామ్ కే వాస్తే.అధికారం దర్పం చలాయించేది ధనిక మహారాజులే.ధనికులు ఎలక్షన్లలో గెలవడానికి ఎన్ని జిత్తుల మారి పనులనైనా చేస్తారు.ధనికులు ఎన్నికలు అయ్యే వరకు ప్రజలతో వినయంగా ఉంటారు.ధనికులు పేద ప్రజలకు బాగా తినిపిస్తారు,తాగిస్తారు.ధనికులు పేద ప్రజలను మాయలో ముంచేస్తారు.ధనికులు పేద ప్రజలను ఆ దొరకే ఓట్లు వేస్తాం అనేటట్లు చేస్తారు.పేదల ఓట్లతో గెలిచిన దొర పదవులు అందుకుంటాడు.పేదలు ఎక్కడైనా పదవులు పొందారా ? పేదలు పదవులు పొందడం అనేది కల్ల మాట.పేదలు ధనికులు వద్ద పనిచేస్తూ పేదలుగానే మిగిలిపోతారు. “వాటిపై ఆశ ఉంటే” .పదవుల పై ఆశ ఉంటే మేము ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళమే.ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెబుతున్నది ఎవరు? రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు చేస్తున్నది ఏమిటి? రాజకీయ నాయకులు అబద్ధాలతోనే రోజును ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులు అబద్దాలతోనే జీవితం గడిపేస్తారు. రాజకీయ నాయకులు మాటల మాంత్రికులు.రాజకీయ నాయకులు మాయల మరాఠీలు.రాజకీయ నాయకులు ఏ పని చేయరు.రాజకీయ నాయకులు వాగ్దానాలు మాత్రమే చేస్తారు. రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది ఏమీ ఉండదు.రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టడంలో నిష్ణాతులు అని చెప్పవచ్చు. ”మోసం దగా చేయ రాక కాదు”.పేద ప్రజలను మోసం దగా చేస్తున్నది ఎవరు?రాజకీయ నాయకులు పేద   ప్రజలను మోసం దగా చేసి ఎలక్షన్లలో గెలుస్తున్నారు.పేద ప్రజలపై రాజకీయ నాయకులు చేస్తున్న మోసం,దగా ఎన్నాళ్ళు ఉంటుంది?పేద ప్రజలు అజ్ఞానం,అవిద్యలో ఉన్నంతకాలం రాజకీయ నాయకులు దగా చేసి మోసగిస్తారు. ”మనస్సును చంపుకోలేక,రాజకీయ నాయకులకు మనస్సు అనేది లేదు.  రాజకీయ నాయకులు మాయకులోనై వంచనకు పాల్పడుతున్నారు.సజ్జనులు నిర్మలమైన మనసుతో ధర్మం, న్యాయం,నీతితో వ్యవహరిస్తారు.సజ్జనుల వ్యవహారంలో లోపం ఉండదు.సజ్జనులు ప్రజా సంక్షేమం కొరకే జీవిస్తారు.ఇప్పుడున్న వ్యవస్థలో మానవత్వం విలువల గురించి మాట్లాడితే వాటి వలువలు ఒలుస్తున్న బడా బాబుల  తీరు చూస్తే జుగుప్స కలిగిస్తుంది.”మానవతని హత్య చేయ లేక”.మానవతని హత్య చేస్తున్నది ఎవరు?మానవతని హత్య చేస్తున్నది రాజకీయ నాయకులు అని చెప్పవచ్చు.రాజకీయ నాయకులు ఎప్పుడూ ద్రోహబుద్ధి,ద్రోహచింతనతో గడుపుతు పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు.మనస్సును చంపుకొని ఘోరాలు నేరాలు చేసి అందలాలేక్కుతూ అధికార పీఠాన్ని రాజకీయ నాయకులు అధిరోహిస్తున్నారు.పేద ప్రజలు మాత్రం మనసును చంపుకొని జీవచ్చవంలా బతుకు గడుపుతున్నారు.”ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని, కుట్రని/ /మా కలాలకు చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం సుప్రభాతం ఆగుతుందా?”.భారతదేశంలో నివసిస్తున్న కవులు, కళాకారులు,తపనతో సమాజం యొక్క అభివృద్ధి కొరకు ఇతోధికంగా పాటు పడుతున్నారు.కవులు,కళాకారులు తమ జీవితాలను తపనతో పోరుబాటలో కొనసాగిస్తున్నారు.కవులు, కళాకారులు తమ దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నమ్మిన లక్ష్యం కోసం న్యాయమైన బాటను విడవడం లేదు.పూర్వ కాలంలో మునులు దేవుడు ప్రత్యక్షం కావాలని తపస్సు చేసే వారు.వారు చేస్తున్న తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమై వారి కోరిక నెరవేర్చేవాడు.కాని ఈనాడు కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల సరైన అవగాహనతో ప్రజా యుద్ధం చేస్తూ ప్రజల కొరకే జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ నాయకులు తరిమెల నాగిరెడ్డి,దేవులపల్లి వెంకటేశ్వరరావు,పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి లాంటి ఎందరో మహనీయులు సమాజం కోసం పాటుపడ్డారు.యజ్ఞం చేస్తే వాతావరణం పరిశుద్ధం అవుతుందని వేదం చెబుతుంది.రామాయణ కాలంలో ప్రతి ఇంట హోమం చేసేవారు.శుభకార్యాల ముందు హోమం చేస్తారు. హోమంలో సమిధలను ఆహుతి ఇస్తారు. కవులు, కళాకారులు  సమిధల్లా ఆహుతి అయిన చరిత్ర మనకు ఉంది.కవులు, కళాకారులకు జోహార్లు చెప్పాలి.గద్దరు రాసిన పాటలు ప్రజా కోటికి శిరోధార్యం అయ్యాయి.గద్దర్ పాటల్లో ప్రజా జీవితం తొంగి చూస్తుంది.తెలంగాణ కొరకు తపనతో తపస్సుతో ఉద్యమాలు చేశారు.1200 మంది విద్యార్థులు అమరులు అయ్యారు. ధూంధాం పేరిట పల్లె పల్లెనా ప్రజలను చైతన్యం చేస్తూ కవులు, కళాకారులు ప్రదర్శనలను ఇచ్చారు.కళాకారులు,గాయకులు గజ్జె కట్టి పాడితే హృదయాల లోతుల్లోకి పాట చొచ్చుకు పోతుంది.కవులు ప్రజల కోసం తమ కలాలు ఎక్కుపెట్టి రాస్తున్నారు.పీడిత ప్రజల పక్షాన తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు,వాళ్ల హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజాక్షేమం కాంక్షించి పాటల ద్వారా కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు, కళాకారులు ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు. ప్రజల కోసం పాటు పడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా? సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు దీక్షలు ఎన్నడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపదంగా చెబుతున్నాడు.కవి మల్లారెడ్డి ఆశావాది,తన కలాన్ని పదునుపెట్టి ప్రజాపక్షం వైపున నిలిచి తన రచనల ద్వారా ప్రజలను మేల్కొల్పుతున్నాడు.చక్కటి కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని,సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి  నడవడి కవితపై  విశ్లేషణా  వ్యాసం.

ప్రముఖ కవి,జర్నలిస్టు,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని నడవడి కవిత పై విశ్లేషణా వ్యాసం.నడవడి కవితను ఆసక్తితో చదివాను.నాలో ఆలోచనలు రేకెత్తించింది. నడవడి గల వ్యక్తులను మంచివాళ్లు అంటారు.నడవడి గల వాళ్లు పద్ధతి ప్రకారం నడుచుకుంటారు.నడవడి గల వాళ్లలో రీతి రివాజు వారి సొంతం అని చెప్పవచ్చు.ఇతిహాసం తిరగేస్తే మనకు మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు మన కళ్ళ కెదురుగా ప్రత్యక్షమవుతాడు.మాటమీద నిలబడే వ్యక్తిని మనం ఎక్కడైనా చూసామా?తండ్రి అయిన దశరథ మహారాజు మాటను మన్నించి రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. రామాయణంలో మహర్షి వాల్మీకి శ్రీరాముడిని ధీరోదాత్తుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు.ఏ భాషలో కూడా ఇంత  గొప్ప కావ్యం రాయబడ లేదు.శ్రీరాముడిని మంచి నడవడి కల వాడు అని లోకమంతా భావిస్తుంది.ఈ కాలంలో మంచి నడవడి కల  వాళ్లలో ప్రపంచమంతా శ్లాఘిస్తున్న మహాత్మా గాంధీ ఒకడు. మంచి నడవడి లేని వాళ్లను చూసి లోకమంతా అసహ్యించుకుంటుంది.నడవడి లేని వాళ్లను గురించి చెప్పాలంటే రజాకార్లు మరియు దోపిడీలు దొంగతనాలు చేసే పిండారీలను చెప్పవచ్చు.రజాకార్లు చేసిన అకృత్యపు నీచమైన పనుల వల్ల నిజాం రాజుకు చెడ్డపేరు వచ్చింది.నిజాం రాజ్యం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటుకు నిలువెల్లా కూలిపోయింది.సెప్టెంబర్ 17న ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినం జరుపుకుంటున్నాం.మా నిజాం రాజు  తరతరాల బూజు అని మహాకవి దాశరథి కలం నుండి వెలువడింది.పిండారీలు మొత్తం గ్రామాన్ని దోచుకునే వారు. అత్యాచారాలు చేసే వారు.అడ్డు వచ్చిన వాళ్లను చంపేసే వారు.అందుకే పిండారీ నా కొడుకులు అనే సామెత వెలిసింది.పిండారీల దారుణ దురంతాలను దేశమంతా ఎదుర్కొంది.”పోలీసు మిత్రులారా !/ మీలో కొన్ని ఆటవిక మృగాలు/ప్రవేశించాయని తెలిసాక వ్రాస్తున్నాను ఈ లేఖ”.       
.తప్పు చేసిన వాళ్లను గౌరవించే సంస్కారం భారతీయుల్లో అనాదిగా వేదకాలం నుంచి ఉంది.అటువంటి భావ జాలాన్ని నర నరాల్లో పుణికి పుచ్చుకున్న కవి మల్లారెడ్డి వృత్తిరీత్యా సీనియర్ న్యాయవాది,ప్రవృత్తిరీత్యా కవి,పోలీసు మిత్రులారా అని సంబోధించడం వారి యొక్క తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారాన్ని తెలుపుతుంది.పోలీసుల్లో కొందరు ఆటవిక మృగాలు ప్రవేశించటం ఏమిటి?వింటుంటే చాలా చిత్రంగా ఉంది. వన్యప్రాణులైన పులులు,సింహాలు,చిరుతలు మొదలైన మృగాలు అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి.అవి ఆకలి అయినప్పుడు మాత్రమే జంతువులను వేటాడి చంపి తింటాయి.ఈనాటి నవ నాగరిక నవీన మానవులు తమ స్వార్థం కోసం విస్తారంగా అడవులను నరికి వేయడం మూలంగా  క్రూర మృగాలైన సింహాలు,పులులు,చిరుతలు,జనావాసాల్లోకి చొరబడి దిక్కు తోచక దారి దొరకక చెట్లు చేమలతో కళ కళలాడుతున్న పోలిస్ ఠాణాల్లోకి చేరినయా ఏమిటి? క్రూర మృగాలు కనుక అటవీ శాఖ అధికారులను పిలిచి పులులు,సింహాలు, చిరుతలను పోలీసు ఠాణా బోనులో బంధించారా? అటవీశాఖ వాళ్లు పోలీసు ఠాణాల్లో బంధించిన క్రూర మృగాల సంగతి మర్చిపోయినట్లున్నారు.అటవీ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో బంధించిన క్రూర మృగాలను అడవుల్లో విడిచిపెట్టాలి.అటవీ శాఖ అధికారులు అలసత్వం నిర్లక్ష్యం వల్ల అవినీతికి పాల్పడుతూ‌‌ ఉండడం వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. కాని ఆటవిక మృగాలను దగ్గరగా చూసిన పోలీసులు ఆటవిక మృగాల్లాగే మనుషులను వేటాడుతున్నారు.”మీ లోనూ కొందరున్నారు/మా బోటి మనుష్యులు- / మామూలు వాళ్ళు/ దేనికి ఎదురు తిరగని వాళ్ళు/అందులో సందేహం లేదు”. కవి మల్లారెడ్డి లేఖలో  పోలీసుల్లో కొందరు మంచి వాళ్లు ఉన్నారని ఒప్పుకుంటున్నాడు.కొందరు మానవతామూర్తులు పోలీసు శాఖలో ఉండడం వల్ల పోలీసుల ప్రతిష్ట ఇనుమడించింది.”సిగ్గు పడుతున్నాను నేను/ దేవుడనే వాడుంటే/మిమ్మల్ని మనుష్యులుగా పుట్టించినందుకు”.       
కవి మల్లా రెడ్డి ఆవేదన చెందుతూ రాసిన లేఖలోని చరణాలను తడిమితే  దేవుడు మిమ్మల్ని మనుష్యులుగా ఎలా పుట్టిస్తాడు? అయితే గియితే మిమ్మల్ని మృగాలుగా పుట్టించాలి.కానీ మీరు పోలీస్ శాఖలో చేరి మనుష్యులను బతికుండగానే చిదిమేస్తున్నారు.అంతకంటే మరి సిగ్గుపడుతున్నాను.మనుషులే కానీ మిమ్మల్ని ఉద్యోగాల్లో ఎలా నియమించారని ప్రశ్నిస్తున్నాడు.పోలీసులను నియామకం చేసేటప్పుడు వాళ్ళ మూలాలేమిటి?వాళ్లు నేర చరిత్ర కలిగినవారా?ఏమి ఆశించి పోలీస్ శాఖలో ఉపాధి కొరకు వస్తున్నారు?వాళ్లు మంచి నడవడి కలిగిన మనుషులేనా?  కాదా?వాళ్లలో మానవత్వం ఏ కోశానా అయిన ఉందా? నీతి,నిజాయితీ,ధర్మం,ప్రేమ,సమాజంలో జీవిస్తున్న సాటి మనుషుల పట్ల సానుభూతి ఉందా?వారిలో  మంచి మనిషి లక్షణాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారా? ఇట్లాంటి వాళ్లను పోలీసులుగా నియమించడం మానవత్వానికి అవమానం కాదా? అనర్హులైన ఆటవిక మృగాలను నియమిస్తే ఎన్ని అనర్థాలు ఘోరాలు జరుగుతాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ”ప్రత్యక్షంగా చూసాను”. కవి మల్లారెడ్డి  పంచేంద్రియాల సాక్షిగా కళ్ళతో చూసి లేఖలో వివరిస్తున్నాడు.”రుధిరోద్గారి వరదల్లో/చెర్లు గండ్లు పడినవి/కాలువలు గతులు తప్పినవి/ వంపులు మిట్టలయినవి/పంట పొలాలు ఇసుక దిబ్బలైనవి/ కాని అది ప్రకృతి బీభత్సం”.మన తెలుగు సంవత్సరాది రుధిరోద్గారి 1983 సంవత్సరంలో వచ్చింది.ఆ నాటి వరదలు తుపానుల తాకిడికి మన కరీంనగర్ జిల్లానే కాదు.ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికి పోయింది.చెరువులన్నీ గండ్లు పడినాయి. పంట పొలాలు ఇసుకదిబ్బలైనవి. కానీ అది ప్రకృతి వల్ల కలిగిన విలయం.ఎవరు కాదనలేని కని విని ఎరుగని సత్యం అది ఆ వరదల వల్ల రైతన్నలు తీవ్ర ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. ”ఏమిటో, ఇక్కడ చూస్తున్నానీ విపరీతం/మనుష్యుల రక్తనాళాలు తెగిపడుచున్నవి/కండరాలు కీమాగా కొట్ట బడుచున్నవి/ ఎముకలు నుజుగా నుజ్జుగా మారుచున్నవి/ఒళ్ళు  బొగ్గు రాళ్ల బీడుగా మారుతుంది/మనిషే బతికున్న శవంగా మారాడని వార్త.”చనిపోయిన మనిషిని శవం అంటారు .బతికున్న మనిషి శవంగా ఎలా మారుతాడు? సమాజ హితం కోసం పోరాడే వ్యక్తులను హింసించి ప్రాణాలు తీసే హక్కు ఏ రాజ్యాంగం కల్పించింది.జీవించే స్వేచ్ఛను హరించి వేసే పోలీసులపై కేసులు బుక్ చేయాలి.అట్లాంటి పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలి.దుర్మార్గులైన పోలీసులను కొనసాగించాలా? లేదా? అని ప్రభుత్వాలు పునరాలోచించాలి. సమాజ రక్షణ కొరకు ఎంచుకోబడ్డ పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ మొత్తం భారత జాతికే తీరని అవమానం కలిగిస్తున్నారు.ఇది 1983లో జరిగిన సంఘటనగా తోస్తోంది. ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలో విధి నిర్వహణలో అలసత్వం క్రూరత్వం మర్రిచెట్టు వేళ్ళలా పాతుకుపోయి విధ్వంసం కొనసాగుతోంది.జీవించే హక్కును కాల రాయడం నేరంగా పరిగణించాలి.”అయితె నేమి ఆ కామ్రేడు నడవడి /భావి తరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమ  దూతల ఒరవడిలో” సమాజంలో పేదరికం,నిరుద్యోగం, అసమానతలు కొనసాగుతున్నాయి.పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగి పోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు. అత్యాచారాలు, అరాచకాలు, దోపిడీల గురించి ప్రశ్నించినందుకు పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు. పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు. సమాజం కోసం పాటు పడుతున్న ఆ కామ్రేడ్ నడవడి భావి తరాలకి రహదారి.పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమ ధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి? అని అడుగుతాడు. తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఏ శిక్షా స్మృతిలో ఉంది?పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మశోధన లేని బతుకు అది ఏమి బతుకు ? పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు, కళాకారులు,ప్రజలను సరియైన నడవడికల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చక్కటి కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.                               ‌‌             

గులాబీల మల్లా రెడ్డి  సత్యము స్వప్నము కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లా రెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలి మేరల్లోకి కవితా సంపుటినిలోని సత్యము స్వప్నము కవిత పై విశ్లేషణా వ్యాసం.                                                                                                                                                                  సత్యము స్వప్నము కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.సత్యం అంటే నిజమగు మాట.ఆంగ్లంలో Truth అని అర్థం.మహాత్మా గాంధీ చిన్నతనంలో సత్యహరిశ్చంద్రుడు నాటకం చూసి సత్యం కోసం సత్య హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? కుమారుడు లోహితాస్యుడు పాము కుట్టి చని పోయాడు.సత్యం కొరకు తన భార్య చంద్రమతిని కాటికాపరికి అమ్మేశాడు. గాంధీగారు సత్య హరిశ్చంద్రుని నుంచి ప్రేరణ పొంది ఆ మహనీయుని అడుగు జాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నాడు.జీవితమంతా అదే సత్య పథంలో నడిచాడు.మహాత్మా గాంధీ వ్రాసిన సత్యశోధన పుస్తకంలో కూడా రాసుకున్నాడు.సత్యం అహింసలే ఆయుధంగా మన దేశానికి స్వాతంత్ర్యం సాధించాడు.స్వామి దయానందుడు సత్యం కొరకే చిన్నతనంలోనే ఇంటి నుండి పారిపోయి వేద విజ్ఞానం ఆర్జించి వేదాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ సత్యార్థ ప్రకాశిక గ్రంథం రచించాడు.

అన్ని మతాల ఖండన చేశాడు.సత్యం కొరకు పాటుపడ్డాడు.మల్లారెడ్డి తన తల్లి భూదేవి,తండ్రి లింగారెడ్డి,తాత మల్ దాదా నుండి పుణికి పుచ్చుకున్న సంస్కారంతో సత్యమైన బాటలో నడుస్తున్నాడు. సత్యము స్వప్నము కవిత మనకు అందించిన నిధి అని చెప్పవచ్చు.స్వప్నము అంటే కల అని అర్థం.మల్లారెడ్డి కవిత శీర్షిక  పేరు సత్యము స్వప్నము ఏమిటి? అని  మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.మనలో ఆలోచనలు రేకెత్తించవచ్చు.మనం గురు పూర్ణిమ జరుపు కుంటున్నాం.గురువు అంటే ఎవరు? అజ్ఞానం నుండి అంధకారం నుండి వెలుగులోకి తీసుకు వచ్చే వాడని అర్థం.ఆ రోజుల్లో  శ్రీకృష్ణ భగవానుడు గురువు సాందీపని వద్ద విద్య నేర్చుకున్నాడు అని మనం చదువుకున్నాము.శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధ రంగంలో కలిగిన విషాదానికి భగవద్గీతలోని 700 శ్లోకాలు చెప్పి జ్ఞానోదయం చేశాడు.ప్రతి ఇంట శ్రీకృష్ణ గురువు ప్రబోధమైన భగవద్గీత ఉంటుంది.మనిషి ఎలా జీవించాలి? మనిషి ఎలా మనుగడ సాగించాలి?  మానవుడు మాధవుడిగా ఎలా మారాలో భగవద్గీత  తెలియజేస్తుంది.మహాత్మా గాంధీకి ఏ సందేహం కలిగిన భగవద్గీతను చదివేవాడని తన ఆత్మ కథలో రాసుకున్నాడు. భగవద్గీతలో సత్యం ఉంది కనుకనే అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు.విద్యా హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది.రాజ్యాంగంలో రాసిన రాతలు అమలు కావడం లేదు.అందరికీ ఆరోగ్యం,అందరికీ విద్య కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.కాని పాలకుల  చేతగానితనం వల్ల విద్యా హక్కు ఆరోగ్యం హక్కు నినాదాలుగా మిగిలిపోయాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అందరికీ విద్య అందరికీ ఆరోగ్యం రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలుకు నోచుకోవడం లేదు.మన పాలకుల దమననీతికి ఇది అద్దం పడుతుంది.చదువుల నేపథ్యంలో విద్య ఈరోజు వ్యాపారంగా తయారైంది.విద్య ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యాసంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడి లాభాలు దండుకుంటు న్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ బడులు ఉండేవి.నాణ్యమైన విద్యను అందించేవి.ఆ కాలపు టీచర్లు నిస్వార్ధంగా విద్యాబోధనే ధ్యేయంగా విద్యార్థులను పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే వారు.ఈనాటి ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపు మారిపోయింది.ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసే దశకు చేరాయి.ఈనాటి ఉపాధ్యాయులకు అంకిత భావం లేదు.విధిని మరిచి సవాలక్ష వ్యాపారాలు చేస్తూ రాజకీయ నాయకులకు అండగా ఉంటున్నారు. చదువుల నేపథ్యంలో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా హాస్టల్లో ఉండి చదువును కొనసాగిస్తున్నారు.40 ఏళ్ల కిందట ఇద్దరు,ముగ్గురు స్నేహితులు కలిసి గది అద్దెకు తీసుకొని వంట చేసుకుని కాలేజీకి వెళ్లి చదువును కొనసాగించే వారు.అప్పుడు హాస్టళ్లు ఉండేవి కావు.నేటి కాలంలో పట్టణాలలో గదుల అద్దెలు విపరీతంగా పెరిగాయి.బ్యాచిలర్స్ కు ఎవరు గదులు అద్దెకు ఇవ్వరు. పట్టణంలో గల్లీ గల్లీకి బాయ్స్ హాస్టళ్లు,బాలికల హాస్టళ్లు పుట్ట గొడుగుల్లా వెలిశాయి.నెలకు కొంత డబ్బులిస్తే వాళ్లే భోజనం వండి పెడతారు,వసతి కల్పిస్తారు.చిన్న గదులు మరియు పెద్ద గదులు విశాలంగా ఉన్నప్పటికీ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటాయి.హాస్టల్  నిర్వాహకులు వేళకు భోజనము,టీ,టిఫిన్, స్నాక్స్ ఇస్తారు.విద్యార్థులు పొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి,టిఫిన్ చేసి కాలేజీకి వెళ్తారు.విద్యార్థులు మధ్యాహ్నం వేళ హాస్టల్ కు వచ్చి అన్నం తింటారు.విద్యార్థులు హాస్టల్ నుండి కాలేజీకి వెళతారు.విద్యార్థులు కాలేజీ నుండి సాయంత్రం పూట హాస్టల్ కి వస్తారు.హాస్టల్ లో విద్యార్థులు టీ,స్నాక్స్ తీసుకుంటారు.విద్యార్థులు హాస్టల్ లో చదువుకుంటారు,హోంవర్క్ చేసుకుంటారు.విద్యార్థులు హాస్టల్ లో రాత్రి పూట భోజనం చేసి పడుకునే వరకు చదువు కుంటారు. తిండి మంచిగా ఉన్నా లేకున్నా హాస్టల్ లో ఉన్న విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. హాస్టల్ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతారు.హాస్టల్ లో పిల్లలు ఇది కావాలి,అది కావాలి అని గొంతెమ్మ కోరికలతో హాస్టల్ యాజమాన్యాన్ని సతాయించరు.ఇంటి వద్ద ఉన్న అమ్మా, నాన్నలను డబ్బుల కొరకు ఎలాంటి  ఇబ్బంది పెట్టరు. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల లక్ష్యం చదువు.అదే ధ్యేయంతో విద్యార్థులు చదువును కొనసాగిస్తారు. విద్యార్థులు చదువు పూర్తి అయితే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో కుటుంబానికి ఆసరాగా ఉంటుందని శ్రద్దాశక్తులతో చదువుతున్నారు.కొందరు పిల్లలు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ హాస్టల్లో ఉండి చదువుకుంటు తీరిక సమయాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. హాస్టల్ కు కట్టే డబ్బులు వాళ్లే సంపాదించుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చదువుకుంటూ జీవనం సాగిస్తున్నారు.తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటున్నది.కొందరి తల్లిదండ్రులు వ్యవసాయం,కూలీ పనులు చేస్తున్నారు.అయినప్పటికీ వ్యవసాయంలో,కూలీ పనుల్లో ఏమీ మిగలడం లేదు.కొందరు తల్లిదండ్రులు మార్కెట్ లో కూరగాయలు,పండ్లు అమ్ముతున్నారు.కొందరు తల్లిదండ్రులు పాల వ్యాపారం చేస్తున్నారు.అయినప్పటికీ ఏమీ మిగలడం లేదు.ఎంత పని చేసినా కుటుంబానికి సరిపోయే ఆదాయం ఉండడం లేదు. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు బాగా శ్రద్ధ చూపుతున్నారు.మా బతుకులు ఇలా కడతేరాయి.మా పిల్లలు బాగా చదువుకోవాలి.మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా పని చేసుకుని బతకాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లే నడుచుకుంటున్నారు మరియు బుద్ధిగా మెదులుతున్నారు.కుటుంబం కోసం పిల్లలు త్యాగాలు చేస్తున్నారు.కుటుంబానికి అండగా ఉంటున్నారు. 
“అర్ధరాత్రి హాస్టల్ గదిలో…… మగత నిద్రలో … చైతన్యం శరీరానికి జడత్వం కప్పు కొన్నప్పుడు “కలల సౌదములో …. కళ్యాణ మందిరం                            “సిగ్గుల దొంతర లో … శిల్పాల్లాంటి  కన్నెలు”..
హాస్టల్ గదిలో ఉన్న విద్యార్థులు కూడా కలలు కంటారు.కలలు ఎప్పుడు పడితే అప్పుడు రావు.మగత నిద్రలో కలలు వస్తాయి. చైతన్యం జాగృతమై నిద్ర లేవగానే కలలు మాయమవుతాయి. అర్ధరాత్రి హాస్టల్ గదిలో మగత నిద్రలో చైతన్యం శరీరానికి జడత్వం కమ్ముకున్నప్పుడు కలలు వస్తాయి.కలలు అందరు కంటారు.కలలు నిజం చేసుకునేవాళ్లు కొందరు మాత్రమే ఉంటారు.కలలోని విషయాలు ఆచరణ ద్వారా నిజాయితీగా సాధించుకునేవారు కొందరు అని మాత్రమే చెప్పవచ్చు. తెలంగాణ కొరకు తొలి దశలో 369 మంది విద్యార్థులు అమరులయ్యారు.మలి దశలో తెలంగాణ కొరకు 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు.అమర వీరుల బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.అమరవీరులు లేకున్నా వాళ్లు కన్న కలను తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి చూపించారు. అమరవీరులు నిజాయితీగా కల కన్నారు.అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కలను నిజం చేసిన నిజమైన వీరులు త్యాగధనులు.తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులకు నా జోహార్లు అర్పిస్తున్నాను. అమరవీరులు తెలంగాణ చరితలో చెరిగిపోని శిలాక్షరాలు. అమరవీరుల తెలంగాణ త్యాగం కల ఎప్పటికీ గుర్తుంటుంది. విద్యార్థులు కంటున్న కలల గురించి చెబుతున్నారు.   “కలల సౌదంలో… కళ్యాణ మందిరం”. విద్యార్థులు కంటున్న      కలల సౌధం ఉంది.అందులో కళ్యాణ మందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాట ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా.ఇప్పుడు లక్షల రూపాయలు కళ్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు  చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా? అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త,మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వర కట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు.     “సిగ్గుల దొంతరలో …  శిల్పాల్లాంటి కన్నెలు.”  పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు  కోటి దండాలు శత కోటి దండాలు మరో చరిత్ర సినిమా పాట గుర్తుకు వస్తే తన్మయత్వంలోకి వెళ్లి పోతాం.ప్రాయంలో ఉన్నప్పుడు ఆడపిల్లలు మనోహరంగా కనిపిస్తారు.ఆడపిల్లలు సిగ్గులు ఒలక పోస్తారు. సిగ్గుతో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎంతో అందంగా కనిపిస్తారు.అజంతా,ఎల్లోరా శిల్పాల వన్నెలు చూస్తే ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తాయి.చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూస్తే అక్కడ మనిషి చిత్రంలో ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.అట్టి చిత్రకారుని ప్రతిభకు సెల్యూట్ చేయాలి అనిపిస్తుంది.అజంతా,ఎల్లోరా,శిల్పాలను కళాత్మకంగా తీర్చిదిద్దిన శిల్పులను అభినందించాలి. “అరవిచ్చిన  గులాబీలు … పరిమళించే మల్లెలు.”    అర విచ్చిన గులాబీలు ఎంతో అందంగా ఉంటాయి. అమ్మాయిలను అరవిచ్చిన గులాబీలతో పోలుస్తున్నాడు. పరిమళించే మల్లెలు సువాసనలు వెదజల్లుతాయి.మల్లెపూల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.అమ్మాయిలు పరిమళించే మల్లెపువ్వుల్లా ఉంటారు.మల్లెపూలు తెల్లగా తేటగా ఉంటాయి.మల్లెపూలు సిగలో ధరిస్తారు.సిగలోని మల్లెపూలు మత్తును కలిగిస్తాయి. ప్రేమ మైకంలో దించుతాయి. ”చాయకొచ్చిన చామంతులు … పూబంతులు.” పచ్చదనం పసుపు రంగులో చామంతులు ఎంతో అందంగా ఉంటాయి.  చాయ కొచ్చిన చామంతుల్లా ఉన్న అమ్మాయిలను చూస్తే మైమరిచిపోతాం.బంతిపూలను చూసి పూబంతులు అమ్మాయిలు అంటున్నాడు.ముద్ద బంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జన్మ భాషలు ఎందరికి తెలుసులే.ఘంటసాల గానం చేసిన పాట మనం రోజు వింటాం.ముద్దబంతి పూలు ముగ్ధ మనోహరం గా ఉంటాయి. “వన్నె వన్నెల సన్నజాజులు రంగులేని గడ్డి పూలు.” వన్నె వన్నెల సన్న జాజి పువ్వుల్లా అమ్మాయిలు అందంగా ఉంటారు. రంగులేని గడ్డి పూవుల్లా అమ్మాయిలు సొగసుతో కనిపిస్తారు.”సోకు లేని గరిక పూలు …. వేయి రేకుల కలువ పూలు”.సోకు లేని గరిక పూల వలె ఉన్న అమ్మాయిలు కూడా అందం చిందిస్తున్నారు.వేయి రేకుల  కలువ పూవుల వలె అమ్మాయిలు విలక్షణమైన అందంతో కనిపిస్తున్నారు.”వికసించే మందారాలు …విప్పారే సింధూరాలు.” మందార పూలు ఎన్నో రకాలు ఉన్నాయి.   అందులో వికసించే మందారాల అందం చెప్పనలవి కాదు. వికసించే మందార పూల వలె అమ్మాయిలు సొగసుతో అలరిస్తున్నారు.అమ్మాయిలు శోభను చేకూర్చుతున్నారు. సింధూర పూలు చూడ చక్కగా ఉంటాయి.విప్పారే సింధూరాలు మనోహరంగా ఉంటాయి.విప్పారే సింధూర పూలవలె చూడచక్కగా అమ్మాయిలు సొగసుతో  కనిపిస్తున్నారు.    
“దోసిల్లలో కట్నాలు…… వేయి మొదలు కోటి వరకు” సమాజంలో వరకట్నం దురాచారం ఎంతగా పేరుకుపోయిందో చెప్తున్నాడు.40 ఏళ్ల కిందనే కవిత వ్రాసి మనకు అందించాడు. దోసిల్లలో కట్నాలు వేయి మొదలు కోటి వరకు.ఆ కాలంలో కూడా కట్నం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.వరకట్నం దురాచారం వల్ల ఎంత మంది ఆడపిల్లల జీవితాలు బలి అయిపోతున్నాయో మనం పేపర్లలో చదువుతున్నాం.న్యూస్  చానళ్ళ లో చూస్తున్నాం. ఇన్నేళ్లయినా వరకట్నపు దురాచారపు వికృతపు నీలి నీడలు ఇంకా ఈనాటికీ కొనసాగుతున్నాయి.ఆ రోజుల్లో వేయి రూపాయల కట్నం ఉంటే ఈనాడు లక్షల రూపాయల కట్నం నుండి కోట్ల రూపాయలకు ఎగబాకి వరకట్న వ్యాపారం సజావుగా సాగుతుంది. “నన్ను కొంటున్న అంగడి అంగడి బేరాలు.”వారానికి ఒక రోజు జరిగే సంతలోకి పశువు     లను తీసుకువచ్చి అమ్ముతారు.పశువులన్నీ అంగట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.అమ్మే వాళ్ళతో కొనే వాళ్ళతో అంగడి రద్దీగా ఉంటుంది.అంగట్లో పశువులను అమ్మే దళారులు ఉంటారు.దళారులు పశువుల ధర చెబుతారు.పశువుల్లో ఎవరికి నచ్చిన పశువును వారు ఎన్నుకుంటారు.ఒకే పశువును కావాలన్న వాళ్లు ఎక్కువగా ఉంటే సవాలు వేస్తారు.   “నాకోసం సవాలేస్తున్న నినాదాలు”. వారానికి ఒక రోజు జరుగుతున్న సంతలో సరుకులు,పశువులు, అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి.సంతలో దళారీ రేటును ప్రకటించి సవాలు ఒకటో సారి రెండోసారి మూడోసారి అని అంటాడు. ఎవరి సవాలు నెగ్గితే వారికి ఆ పశువు దక్కుతుంది. “విసిరేస్తున్న నూలు పగ్గాలు.’సంత జరిగే రోజున సవాలు వేసి నెగ్గిన వాళ్ళు పశువుపై నూలు పగ్గం వేసి డబ్బులు కట్టి పశువును సొంతం చేసుకుని వెళ్ళిపోతారు.”సిగ్గేసి మనిషిని అన్నాను”.సంతలో జరిగిన దానిని చూసి సిగ్గేసి మనిషిని  అన్నాడు. సంతలో పశువులను అమ్మినట్లు మనుషులను కూడా అమ్ముతున్నారా?నిజమే మనుషులను పశువుల వలె వరకట్నం సంతలో అమ్ముతున్నారు.అమ్మాయిలు డబ్బులు ఇచ్చి సంతలో మనిషిని కొంటున్నారు.ఇదెక్కడి చోద్యం? అని ఆశ్చర్యం కలుగుతుంది.అమ్మాయిలు సంతలో మనిషిని కొనడం అతడు చూసినాడు.అతడు ఆమెను చూసి సిగ్గేసి మనిషిని అన్నాడు. మనిషికి పశువుకు తేడా లేదు అని సినిమా పాట ఉంది.ఇవాళ అది నిజం చేసి చూపిస్తున్నారు.సమాజం ఎటు పయనిస్తుంది? నాగరికత నుండి అనాగరికత దిశకు వెళుతుంది.రోజు రోజుకు దారుణ దృశ్యాలు కంటున్నాం. వింటున్నాం.ఇది మన దేశానికి పట్టిన అరిష్టం అని చెప్పకనే చెబుతున్నది.వరకట్నం తీసుకుంటున్న మగ మనిషిలో మార్పు రావాలి.
“వాట్ ఆర్ యూ?…..నో…నో..
 “హి…హి…హి… చడి చప్పుడు లేని శబ్దాలతో    
పువ్వులు నవ్వులు రువ్వినవి.”   
ఓ మనిషి నీవు ఏం చేస్తున్నావు? అని ఆమె ప్రశ్నించింది.అంగట్లో అమ్ముడయ్యే పశువు అయిపోయావా.  కాదు…కాదు..అంగట్లో అమ్ముడయ్యే పశువులాంటి నిన్ను చూసి   హి..హి…హి….. చడి చప్పుడు లేని శబ్దాలతో,పువ్వు లాంటి నాజుకైనా ఈనాటి నవీన యువతి ఆత్మవిశ్వాసంతో నవ్వులతో సమాధానం చెప్పింది. “కొంటెగా హేళన చేసింది”. నీవు సంతలో    పశువు అయి పోయావని అతనిని చూసి ఆమె కొంటెగా హేళన చేసింది.ఆమె అతడిని కొంటెగా హేళన చేయడంలో న్యాయం ఉంది.”మెస్కులైన్,సుపీరియారిటీ నీలో లేదన్నది.”    నీలో మగ జాతి ఆధిక్యపు లక్షణాలు ఏకోశాన లేవు. నీవు మగాడివే కాదు.మగాడిలా ప్రవర్తించడం లేదు.మగాడివి అయితే కట్నం ఎందుకు తీసుకుంటావు అని ప్రశ్నించింది?పక్షులు చూడు ఆడ మగ జంటగా అనురాగంతో ఒకే గూటి పక్షులై కలిసి మెలిసి ఉంటాయి.పశువులు కూడా ఆడ మగ జంతువులు కూడా జంటగా ఎప్పుడూ కలిసి మెలిసి తిరుగుతాయి.పక్షులను పశువులను చూసి నేర్చుకో. ధన మదంతో నీలో ప్రేమరాహిత్యం ఏర్పడింది. ప్రేమతో మెలిగే పక్షుల్లా,జంతువుల్లా మెలగడం నేర్చుకో.ఇదేనా నీవు నేర్చుకున్న చదువు సంస్కారం అని ప్రశ్నించింది? ” నన్ను అసలే వరించమన్నవి.” ప్రకృతి పురుషుడు వీరిద్దరిని జంట అంటారు.ప్రకృతి పురుషుడు కలిసిమెలిసి ఉంటేనే సృష్టి. ప్రకృతి పురుషుడులోని అన్యోన్యతను దూరం చేసి అంగట్లో సరుకై అమ్ముడుపోతున్నావు.నీలో జంటగా కలిసి ఉండాల్సిన లక్షణాలను కోల్పోయి ప్రేమ మాధుర్యమును మరిచిపోయి వరకట్నం తీసుకొని అంగట్లో సరుకై పశువులా అమ్ముడైపోతున్నావు. అందుకే నిన్ను వరించమన్నది.  “భోజరాజు ముందరి విక్రమార్కుడి కన్నెల్లా ఎగిసిపోయినవి ఒక్కొక్కటి.    “ఆర్కుడి కోసం విక్రమార్కుడి కోసం.”   చెట్టుమీదనున్న బేతాళుడు శవాన్ని భుజాన వేసుకుని వెళ్తున్నాడు.పువ్వు లాంటి అమ్మాయిలు వరకట్నం కోసం కలియుగంలో పడుతున్న ఇక్కట్లు చూసి విక్రమార్కుని ప్రశ్నించాడు.పువ్వు లాంటి అమ్మాయిలకు సరైన సమాధానం చెప్పాలి.లేకుంటే నీ తల రెండు ముక్కలైపోతుంది.జంటగా ఉండాల్సిన జంటలు అనురాగంతో ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాలి.వరకట్నం దురాచారం వద్దు. అబ్బాయిలు మీరు అంగట్లో సరుకు కావద్దు.ప్రేమ పక్షుల్లా ప్రేమ జంతువుల్లా ప్రకృతి పురుషుడిలా అనురాగంతో కలిసి మెలిసి ఉండాలి అని సమాధానం చెప్పాడు.సరైన సమాధానం చూసి చెట్టు మీద బేతాళుడు విక్రమార్కుడికి కృతజ్ఞతలు తెలిపాడు.మల్లారెడ్డి సత్యము స్వప్నము కవితలోని అద్భుతమైన భావాలు పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి.అయినప్పటికీ సమాజంలో మార్పు లేదు.వరకట్నం దురాచారానికి అతివలు ఆహుతి అవుతున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం.స్వప్నంలో కూడా సత్యమునే  చెప్పిన తీరు చక్కగా ఉంది.సుకుమారమైన లేలేత పూచిన పువ్వులైన అమ్మాయిల ద్వారా కర్తవ్యము తెలియ చేసిన తీరు అద్భుతంగా ఉంది.పువ్వులు కూడా నవ్వగలవని కొంటెగా హేళన చేయగలవని సత్యము స్వప్నము కవిత ద్వారా తెలుసుకున్నాము.కవి మల్లారెడ్డి వరకట్నం వ్యతిరేకించే వారని అభ్యుదయ భావాలు పుణికి పుచ్చుకున్న వారని సత్యము స్వప్నము కవిత ద్వారా తెలుస్తున్నది.కవి మల్లారెడ్డి సమాజం హితం కోరి కవితా వ్యవసాయం చేస్తున్నాడు.వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించాడు. స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి ఎవరన్నారు కవిత పై విశ్లేషణా వ్యాసం. 

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిలోని “ఎవరన్నారు” కవిత పై విశ్లేషణా వ్యాసం. ఎవరన్నారు కవిత శీర్షిక చదవగానే నన్ను ఆలోచింపజేసింది. ఇందులో ఏదో మతలబు ఉంది.మల్లారెడ్డి ఆషామాషీగా ఏది పడితే అది రాసే వ్యక్తి కాదు.ఆయన నిబద్ధత గల వ్యక్తి.విద్యార్థి దశ నుండి కవిత్వాన్ని ఔపోషణ పట్టాడు.కమ్యూనిజం భావ జాలాన్ని హృదయం నిండారా పుణికి పుచ్చుకున్న వ్యక్తి.ఆయన రాసిన తొలి కవితా సంపుటి పల్లె పొలి మేరల్లోకి  కవితల్లోని భావ వ్యక్తీకరణ అద్భుతం.మల్లారెడ్డి యువకుడిగా ఉన్నప్పుడు రాసిన ఆయన కవిత్వ ధార ఉప్పొంగే  కెరటాల్లా సాగుతున్న భావ జలపాతం ఎంతో అద్భుతం.నాకు నచ్చింది.సమాజంలోని అసమానతలను అడుగడుగునా చూసి ఆవేదనతో ఆర్తితో తన గుండెలో రగులుతున్న ప్రకంపనలను అలవోకగా ఆవేశంగా వ్యక్తం చేసిన తీరు నన్ను అబ్బురపరిచింది.”ఎవరన్నారు/ మీరు మంచి వారు కాదని?”.ఎవరన్నారు మీరు మంచివారు కాదని ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉంది.ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారు అని నమ్మిన వ్యక్తి.మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము,ధైర్యం ఎందరికి ఉంటుంది.అలాంటి మంచి కొరకు పాటు పడే మహనీయులు ఉంటారని మనకు మల్లారెడ్డి కలం నుండి జాలువారిన ఎవరన్నారు కవిత చదివితే తెలుస్తుంది. ఎవరన్నారు కవిత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.మనలో మరుగున పడి పోయిన మంచితనాన్ని ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది.ఎంత మంది మంచి గురించి మాట్లాడుతున్నారు? మంచి గురించి పాటుపడుతున్నది ఎవరు?మనసా వాచా కర్మణా మంచితనం పునాదులు కదిలాయో ఏమో అని ఆలోచిస్తున్న తరుణంలో ఒక పరి మన మనసులను మంచితనం కెరటాలపై మల్లారెడ్డి కవిత తేలియాడజేస్తుంది. మల్లారెడ్డి రాసిన కవిత అద్భుతంగా ఉంది.ఇవ్వాళ మంచితనం విలువల గురించి తెలియజేసే గ్రంథం మన భారతీయ ఇతిహాసంలో వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం. రామాయణంలో మంచితనం విలువలు కావ్యం నిండా మనకు వాల్మీకి పంచిపెట్టాడు.లక్షల సంవత్సరాల కింద రాయబడినప్పటికీ అందులోని విషయాలు మంచిని కోరుకునే వారికి శిరోధార్యాలు.ప్రపంచ చరిత్రలో ఏ కావ్యం అంత చక్కగా అంత గొప్పగా రాయబడలేదు.రామాయణంలోని నీతిని నేటికీ మనం అనుసరిస్తున్నాం.మంచి ఎక్కడున్నా మనం స్వాగతించాలి.”మీలో మంచితనం జల లేదని”.వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మంచితనం జల పుష్కలంగా      ఉందని కావ్యం చదివితే తెలుస్తుంది.మంచితనం మానవీయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన ఈ రోజుల్లో మంచితనం జలను గూర్చి గుర్తు చేస్తూ కమ్యూనిజం భావవ్యాప్తితో ఎవరన్నారు కవిత ద్వారా మనకు సందేశాన్ని మల్లారెడ్డి అందజేస్తున్నాడు. మీలో మంచితనం జల లేదని ప్రశ్నిస్తున్నాడు.మంచితనం జల కొరకు ఆరాటపడుతున్న తపన ఉంది.చెరువుల వద్ద వాగుల వద్ద కుంటల వద్ద ఉసికెను తోడితే నీటి జల ఉబికి వస్తుంది.ఆ నీటి జలను చెలిమె అంటారు.ఆ చెలిమె నీరు తీయగా కమ్మగా ఉంటుంది.అమృతం గ్రోలినట్లుగా మధురంగా ఉంటుంది.మళ్లీ మళ్లీ ఆ నీటిని తాగాలనిపిస్తుంది.పారే వాగు వద్ద చుట్టు పక్కల పొలాలు చేనులు చెలకల్లో పని చేసే కూలి జనాలు రైతులు చెలిమె వద్దకు చేరి కమ్మని నీరు తాగుతారు.రైతులు కడవల్లో కుండల్లో చెంబుల్లో నీరు తీసుకుపోతారు.మృగ్యమైపోయిన మంచితనం జలను మళ్లీ మనుష్యుల వ్యక్తిత్వాల్లో మరియు అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండే పల్లె జనుల ముఖాల్లో  చూస్తున్న అభ్యుదయవాది మల్లారెడ్డి.“మీ గుండె లోతులు తెగలేదని”. మంచితనం గుండెల్లో గూడు కట్టు కొని ఉంటుందని మన అందరికీ తెలుసు.మనుషుల హృదయ స్పందనలో ఎలాంటి మార్పులు రాలేదు.”మీ ఎదల్ని కావలసినంత సై పట్ట లేదని? ఎద అంటే మనసు,హృదయం అని అర్థం. మీ మనసు పొరల్లో దాగి ఉన్న మంచితనాన్ని కావల్సినంత పదును పెట్ట లేదని అంటున్నాడు.మనిషి మనసు చంచలమైనది. ఎటుపడితే అటు తిరిగే కోతి లాంటిది. కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ పైకి ఎగురుతుంది.ఎక్కడ కుదురుగా ఒక క్షణం కూడా ఉండదు. కోతులు అడవుల్లో ఉంటాయి. అడవుల విధ్వంసం నరికివేత కారణంగా కోతులు మనుషులు నివసించే జనావాసాల్లోకి వలస వచ్చాయి. కోతులు ఇప్పుడు నగరాల్లోకి ప్రవేశించాయి. నగరంలోనే జీవనం సాగిస్తున్నాయి.ఆ ఇంటి మీద నుండి ఈ ఇంటి మీదకు మరియు ఇండ్లలో ఉన్న చెట్ల మీద తిరుగుతు ఆహారాన్ని వెదుక్కుంటున్నాయి.అడవుల నరికివేత కారణంగా పులులు, ఎలుగుబంట్లు, క్రూరమృగాలు కూడా అప్పుడప్పుడు నగరంలోకి వచ్చి మనుషులను,పశువులను కూడా చంపుతున్నాయి.అందుకే చలించే మనసును కోతి చేష్టలు అంటారు.అలాంటి ఆ మనసును నిర్మలంగా తేటగా ఉంచాలి.మీ మనసును కావలసినంత సై పట్ట లేదని ప్రశ్నిస్తున్నాడు?మనసు గుర్రానికి కళ్లెం వేయాలి.మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి అని తెలియజేస్తున్నాడు.మహామహులైన గొప్పవాళ్లు మనసు చెప్పినట్లు చేయగలరు.కాని మామూలు మనుషులు మనసు తుఫాన్ లో పడి కొట్టుకుపోతారు.“మీ అంతరాంతరాల్లో ఇంకా అడుగు జలలు పుట్టలేదని”.మీ మనసు యొక్క అంతతరాంత రాల్లో ఇంకా అడుగు జలలు పుట్టలేదని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనలోని ఆలోచనల పునాదులను తడుముతున్నాడు.అంతరాంతరాల్లో అంటే లోలోపల అని అర్థం.అనంతమైన ఆకాశంలో నక్షత్ర మండలం ఉంటుంది. అందులో వేనవేల చుక్కలు,తోకచుక్కలు,ఉల్కలు ఉంటాయని మన అందరికీ తెలుసు.నక్షత్ర మండలంలాంటి మన శరీరంలో కూడా అనంతమైన అడుగు జలలు ఉంటాయి.అడుగు జలలు పుట్టలేదని కవి మల్లారెడ్డి ఆవేదన చెందుతున్నాడు.”పాతాళ గంగ ఊటలు ఊర లేదని”.పాతాళ గంగ ఎక్కడ ఉంటుంది.      భూమి అడుగు పొరల్లో పాతాళగంగ నీరు ఉంటుంది అని మన అందరికీ తెలుసు.భూమి అడుగు పొరల్లో నీటిని పాతాళ గంగ ఊటలు అంటారు.ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట చేదబావి, చేనులు,చెలుకలు,పొలాల్లో మోట బావులు ఉండేవి.పట్టణాల్లో చేద బావులు ఉండేవి.చేదబావి నుండి ఇనుప గిరుకకు బొక్కెన వేసి చాంతాడుతో నీటిని పైకి లాగుతారు.పల్లెల్లో చేదబావి నుండి నీరు చేదుకొని తాగడం,స్నానం చేయడం,బట్టలు పిండుకొని ఆరవేయడం,చేద బావి వద్దనే జరుగుతుండేవి. గ్రామాల్లో నివసించే అందరికీ చేద బావులు ఉండేవి కావు. కొందరు కలిగిన వాళ్ళ ఇంటి దగ్గర చేద బావి ఉండేది.చేద బావి లేని వాళ్ళు కలిగిన వాళ్ళ ఇళ్ళకి వెళ్లి చేద బావి నీళ్లు తోడు కొని తెచ్చుకునే వారు.చేద బావి నీరు పాతాళ గంగ నీరు.పంట పొలాల్లో కూడా మోట బావులు ఉండేవి.మోట బావుల నుండి మోట గొట్టిన నీటిని పారకం ద్వారా పంట పొలాలకు అందిస్తారు.రెండు ఎడ్లు కాడికి కట్టి మోట బొక్కెనతో బావి నుండి నీళ్లు పైకి లాగి పొలాలు,చేనులు,చెలుకలు పారించే వారు.ఇప్పుడు మోట బావులు మూలనపడ్డాయి.తర్వాత ఆయిల్ ఇంజన్లు వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ ఇంజన్లు కూడా మరుగున పడ్డాయి.ఇప్పుడు కరెంటు మోటార్లతో నీరు పారిస్తున్నారు. ఇప్పుడు ఆధునికత పేరిట కరెంటు బావులు,ఆ నీరు కూడా  పాతాళ గంగ నీరు.వర్షాలు లేక కరువు కాటకాలతో చేద బావులు, మోట బావులు ఎండిపోయాయి.పల్లెల్లో మరియు పట్టణాల్లో బోరు బావులు తవ్వకం ఎక్కువ అయి పాతాళ గంగ నీటిని ప్రజలు అవసరానికి మించి  విపరీతంగా తోడి వేయడం వల్ల వేయి గజాలు బోర్ వేసినా నీటి ఊట రావడం లేదు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.పల్లెల్లో మరియు పట్టణాల్లో బోర్ల సంస్కృతి వచ్చింది.హైదరాబాదు లాంటి విశ్వ నగరంలో బోర్లన్నీ ఎండిపోయాయి.ఇప్పుడు నదీ జలాలు త్రాగడానికి మరియు సాగు నీరుగా వాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి దాని  నీరు వాడుతున్నారు. ”మీరింకా భువిని నందనవనం చేయలేదని ? మీరు ఇంకా భూమిని నందనవనం చేయలేదని ప్రశ్నిస్తున్నాడు.ఆకాశం నుండి వర్షపు చినుకు పడగానే భూమి పులకరిస్తుంది.ఆ వర్షపు నీరు తాగి భూమి పొరలలో అణిగి ఉన్న అసంఖ్యాకమైన వేళ్ళు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. లెక్కలేనన్ని చెట్లు బ్రతికాయి.ఎండా కాలంలో నామరూపాలు లేకుండా ఎండి పోయిన చెట్లు,చేమలు వర్షం పడగానే మళ్ళీ కొత్త జన్మ ఎత్తుతాయి.వర్షాకాలంలో చెట్లు, చేమలు వర్షపు నీటితో పులకించి పచ్చదనంతో సస్యశ్యామలం చేస్తాయి.బీడు దనమంతా మాయం అవుతుంది.ఆదిమ మానవుడు నుండి ఆధునిక మానవుని వరకు నేలను నందనవనంగా తీర్చి దిద్ది ఎన్నో రకాల పంటలను పండిస్తున్నాడు.ఎన్నో అద్భుతాలు సృష్టించాడు.ఎన్నో ఆవిష్కరణలు చేశాడు.”ఎవరన్నారు ? ఎవరన్నారు ?”.  ఎవరన్నారు అని ఎవరన్నారు అని లోకం తీరు గురించి ప్రశ్నిస్తూ మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు.”మీరింక మంచితనం పంటలు/పుట్ల కొద్ది తీయలేరని ?/ఇంటింటికి పంచలేరని”.    వ్యవసాయదారుడు ఎద్దు ఎవుసంతో ఆరుగాలం కష్టం చేసి పుట్ల కొద్ధి పంటలు పండిస్తాడు.మంచితనం పంటలు ఎవరు పండిస్తారు?మంచితనంతో మెలిగేవాళ్లు మంచితనం పంటలు పుట్ల కొద్ది పండించగలరు.మంచితనం పంటలను అందరి హృదయాల్లో ఆవిష్కరించగలరు.ఎంత మంది మంచి వాళ్ళు ఉన్నారు? అని మనం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. మంచితనంతో మనుగడ సాగిస్తున్న మహనీయులు గ్రామానికి ఒకరో ఇద్దరు ఉన్నారు.మంచి వాళ్లు నడిచిన నేల కూడా పవిత్రమవుతుంది అంటారు.మంచివాళ్లు మంచి నడవడికతో సమాజ శ్రేయస్సు కొరకే జీవిస్తారు.మంచి వాళ్ళ ముఖాల్లో పారాడే మంచితనం పంటలు వాళ్లు జీవించి ఉన్నన్ని రోజులు పండుతాయి.మంచి వాళ్లు వారు నివసిస్తున్న గ్రామాన్ని సౌభాగ్యవంతం చేస్తారు.ఆ మహనీయులు తమ చేతల ద్వారా దయతో మంచితనం పంటలు ఇంటింటికి పంచగలరు. మంచితనం పంటలు పుట్ల కొద్ది తీయలేరని ఇంటింటికి పంచ లేరని అభిప్రాయ పడు తున్నాడు. మంచితనం చిరునామా ఎక్కడ ? అని మనం ప్రశ్నించుకోవాల్సిన తరుణం వచ్చింది.ఇవాళ మంచితనం పంటలు పుట్ల కొద్ది పండించే మనుషులు కావాలి.వాల్మీకి రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభువు ధీరోదాత్తుడు అయిన నాయకుడు,మంచితనంతో రాజ్యాన్ని పాలన సాగించాడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే ఔదార్యం రామునికి ఉండేది. మళ్లీ రామరాజ్యం  రావాలని రాముడి పాలన కావాలని మల్లారెడ్డి ఆరాటపడుతున్నాడు.” మానవత్వం లోతు   తెలియని అర్బకులున్నారేమో/ సేద్యం చేయ రాని       సోమరిపోతులని ఉంటారు కాబోలు”.ఎక్కడ చూసిన మన కళ్ళకు కనిపించేది అమానుషత్వం,అరాచకాలు.వీటిని సృష్టిస్తున్నది ఎవరు?మానవత్వం లోతు తెలియని అర్బకులని మల్లారెడ్డి గుర్తించారు.ఇప్పుడు ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేయడం లేదు.బేవార్స్ గా తిరుగుతూ సోమరిపోతుల జాబితాలో చేరారు.మంచితనం పంటలు ఎందుకు తీయ లేరు. పుట్ల కొద్ది మంచితనం పంటలు తీయ గలరు.ఇంటింటికి పంచ గలరు.ఇవ్వాళ పేరుకుపోయిన సంక్షుభిత సమాజంలో కరుడుగట్టిన అమానుషత్వం నిలువెల్లా నింపుకున్న మనిషి సమాజ వినాశానికి పాల్పడుతున్నాడు.కొద్ది మంది సంపన్నుల చేతిలో సంపద ఉంది.ఆ సంపద కలవారి నడవడిక సరిగా లేదు. కొద్ది మంది సంపన్నులు,రాజ్యాన్ని పాలిస్తున్న నాయకులు, అధికారులు,తీవ్రమైన అవినీతికి,అన్యాయానికి, అక్రమాలకు పాల్పడుతున్నారు.వాళ్ళ చేతలు సమాజానికి వికృత రూపం దాల్చాయి అని చెప్పవచ్చు.మంచితనం కోల్పోయిన మనిషి మంచితనం పంటలు పుట్ల కొద్ది ఎలా తీయ గలడు? పుట్ల కొద్ది పంటలు తీయ లేరనే వాస్తవాన్ని మన ముందు తేటతెల్లం చేస్తున్నాడు.రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంటను తను ఒక్కడే అనుభవించడు.తన వృత్తికి సంబంధించిన సహస్ర వృత్తుల వారికి  సాయపడడం ఈనాటిది కాదు.తరతరాల నుంచి ఎద్దు ఎవుసంతో జత కూడిన ప్రతి వాడికి ఆసరాగా నిలుస్తాడు.పల్లె అంటేనే ఒక కుటుంబంగా మరి వసుధైక కుటుంబంగా జీవించిన చరిత్ర ఉంది.కాని ఈనాడు మారిన ఈ కలియుగం లో మానవత్వం లోతు తెలియని అర్బకులున్నా రేమో సేద్యం చేయ రాని సోమరిపోతులు ఉంటారు కాబోలు. కష్టించి శ్రమించే వాళ్లకు మానవత్వం లోతు తెలుస్తుంది.ఈనాడు కష్టించని అర్బకులే ఎక్కువ.అర్బకులు ఖుషి ఖుషీగా జీవితాన్ని గడిపేస్తున్నారు.భ్రమల్లో తేలియాడుతున్నారు.ఇవ్వాళ రైతు కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటున్నారు. వారికి వ్యవసాయం అంటే ఏమిటో తెలియకుండా తల్లిదండ్రులు పెంచుతున్నారు. చదువు చక్కగా చదువుతున్నారా?అంటే అది కూడా లేదు. చక్కగా చదవక,వ్యవసాయం పనులు నేర్చుకోక,ఖాళీగా ఉంటున్నారు. చదివిన చదువులో నైపుణ్యం లేదు.కాబట్టి ఉద్యోగాలు దొరకవు.ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండటం లేదు. సేద్యం చేయరాని సోమరిపోతులు ఉంటారన్నది వాస్తవంగా తోస్తుంది.”కాని/మీ లోతు గుండె బావి నిండా పూటికె  నిండదని/అది వట్టి బుడుగు మడుగుగా మారిందని/ తెలియదు పాపం అమాయకులకు/దాని నిండా స్వార్థం క్రిములు  కుతకుతలాడుతున్నవి”.మనుషులు చేస్తున్న వింత పనులకు  పరితాపం చెంది మీ లోతు గుండె బావి నిండా పూటికె నిండదని తెలియజేస్తున్నాడు.గుండెకు లోతులు ఉంటాయని మీయొక్క గుండె బావికి పూటికె నిండదని హృదయం డాక్టర్ గా  కార్డియాలజిస్ట్ గా మనలను స్టెతస్కోప్ లేకుండానే పరీక్షించి ఖరాఖండిగా కవి అయిన మల్లారెడ్డి తెలియ జేస్తున్నాడు.”అది వట్టి బుడుగు మడుగుగా మారిందని”.పల్లెలో పుట్టిన మల్లారెడ్డి పల్లెలో ప్రతి ఇంట చేద బావి మరియు చేను,చెలకలు మోట బావిని చూసిన తన తండ్రితో కలిసి ఎద్దు ఎవుసం చేసిన అనుభవంతో చెబుతున్నాడు.చేద బావిలో నీరు రాకపోతే పూటికె నిండిందని తెలుస్తుంది.చేద బావిలో దిగి గడ్డపారతో తవ్వి పూటికె తీస్తేనే జలధార వస్తుంది.చేనులో కూడా ఇలాగే జరుగుతుంది.బావి నిండా పూటికె నిండితే నీళ్ల జలరాదు.జల ఆగిపోతుంది.మళ్ళీ నీటి జలతో బావి కళకళలాడాలంటే ఆ బావిలో పూటికే తీస్తేనే మళ్లీ నీటి  ధార ఊటలు ఊటలుగా ఉబికి వస్తుంది.కొన్ని బావుల్లో పనికి రాని వ్యర్థ పదార్థాలు చెత్త చేరి బుడుగు మడుగ్గా తయారవు తుంది. పనికిరాని చెత్త వ్యర్థ పదార్థాలు తీసి పారేస్తేనే బావి శుభ్రంగా తయారవుతుంది. ఎల్లవేళలా బావిని శుభ్రం చేస్తూ వాడుతుంటేనే బాగుంటుంది. లేకుంటే బావి బుడుగు మడుగు వల్ల ఉన్న జల ఆగి పోతుంది. దాని నిండా స్వార్థం క్రిములు కుతకుతలాడుతాయి.ఇవ్వాళ ఉన్న వ్యవస్థను డ్రైనేజీ మోరీతో పోల్చవచ్చు.దాని నిండా స్వార్థం క్రిములు అడుగడుగునా మనకు అగుపిస్తూ ఉంటాయి. ఒక్కని స్వార్థానికి వేల మంది హాహాకారాలతో అలమటిస్తుంటారు. ధనికులు కోట్ల కొద్ది సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాస్తున్నారు.స్విస్ బ్యాంకులో ఉన్న ధనికుల డబ్బు తీసుకువస్తే భారతదేశం,అమెరికాలాంటి సంపన్న దేశంగా తయారవుతుంది. కాని స్వార్థపరులు సంపాదించిన డబ్బు స్విస్ బ్యాంకుల్లోనే మూలుగుతూ ఉంటుంది.ఆ డబ్బు బయటకు తీయరు.తీసే దమ్ములు మన స్వార్థ రాజకీయ నాయకులకు లేదు.ఇవ్వాళ రాజకీయం ఆటను సంపన్నులు ఆడుతున్నారు.సంపన్నులు డబ్బు కూడబెడుతారు. వితరణ గుణం వాళ్లలో మచ్చుకైనా ఉండదు.సంపన్నుల సంపద ప్రజా సంక్షేమం కొరకు వినియోగించరు.ఇవ్వాళ వ్యవస్థలు భ్రష్టు పట్టాయి.ఏ రంగాన్ని తీసుకున్నా అందులో అవినీతి మరకలు లేకుండా ఒక్కరు లేరు. ఇవ్వాళ అవినీతి గుట్టలు గుట్టలుగా పేరుకు పోయింది.ఎటు చూసినా స్వార్థం నిండిన నాయకులు కోట్ల కొద్ది సంపదను కూడ బెడుతున్నారు. సమాజ సంక్షేమం కొరకు ఏదైనా చేయాలనే తపన,త్యాగం వాళ్లలో ఏ కోశానా ఉండదు.సంపన్నులు స్వార్థంతో జీవనం సాగిస్తున్నారు.అందుకే మల్లారెడ్డి దానినిండా స్వార్థం క్రిములు కుతకుతలాడుతున్నవి.స్వార్థం క్రిముల ఆట పట్టించే యువతకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే చైతన్యం స్ఫూర్తితో జ్వలించే జ్వాలలుగా మారతారు.పరుల గురించి ఆలోచించి మంచి కొరకు మానవత్వం కొరకు పాటుపడే మహనీయుల ఆత్మలు కావాలిప్పుడు.ఆనాటి నాయకులు సర్వ మానవాళి శ్రేయస్సు కొరకు సమాజ విలువల పరిరక్షణకు తీవ్రంగా కృషి చేశారు.ఆనాటి నాయకులు విలువల కొరకే జీవితాన్ని అంకితం చేశారు.ఇవ్వాళ విలువలు పరిరక్షించే దాతలు ఎందరు ఉన్నారు.”కండల బలమున్న/గుండెల  బలమున్న/పడుచు సేద్యగాళ్ళకి – మాకు/పగలు రేయి కష్టించే వాళ్లకు/చెమట చుక్కల్లోనే స్వర్గం చూపే వాళ్లకి/  ఒక పరి అప్పగిస్తే”.దేశమంటే మట్టి కాదు.దేశమంటే  మనుషులోయి అన్నాడు గురజాడ వెంకట అప్పారావు మహనీయుడు.ఆరోగ్యమైన వ్యక్తి ఏదైనా సాధించ గలడు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్న యువత సమాజం గురించి ఆలోచించ గలడు.సమాజ శ్రేయస్సు కొరకు తమ జీవితాలను అంకితం చేస్తారు.ఈనాటి సమాజ వికాసం కొరకు కండల బలమున్న గుండెల బలమున్న పడుచు సేద్య గాళ్ళకు పగలు రేయి కష్టించే వాళ్లకు చెమట చుక్కల్లోనే స్వర్గం చూపే వాళ్ళకు ఒక పరి నాయకత్వాన్ని అప్పగించాలి.అలాంటి యువత కొండల్ని పిండి చేయగలదు.శ్రామికుని స్వేదానికి విలువ కట్టింది karal Marx. ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అనే పిలుపుతో  ప్రతి సంవత్సరం మేడే గా జరుపుకుంటున్నాం.కార్మిక వర్గ ఐక్యతతో సోవియట్ రష్యాలో పోరాటం చేసి లెనిన్ నాయకత్వంలో 1917 అక్టోబర్ లో కమ్యూనిస్టు రాజ్య  స్థాపన మొదటిసారిగా జరిగింది.కమ్యూనిస్టు పాలనలో సంపద అంతా సమాజ పరం చేసి ఆ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింప జేశాడు.జయకేతనం ఎగురవేశాడు.విప్లవాల విజయం బాట పట్టించిన దేశం సోవియట్ రష్యా.”మీ మనసు తట్టలకి/ పురోగమనం త్రాళ్లు కట్టి/ అభ్యుదయం చేంతాడుతో/పూటికంతా లాగుతాం/ మళ్లీ పాతాళ గంగ ఊటల్ని  రప్పిస్తాము”.మనసు ఎక్కడ ఉంటుంది.అంతరంగంలో  ఉంటుంది. మనలో కనిపించే మనసు,బయటకు కనిపించని మనసు కూడా ఉంటుంది.మనసు చేసే మాయలు మంచి కోసమా,చెడు కోసమా మనమే నిర్ణయించుకోవాలి.మనసు తట్టలుగా ఉండదు.మనసును తట్టల్లోకి ఎత్తలేం.మనసును ప్రేమించిన వాడు. మానవత్వం ఉన్న మనిషిగా ఆ మనసును పరిపూర్ణమైన సంకల్పంతో సరైన దారుల్లో నడిపించాలి. మనసును ఉత్సాహంతో ఉద్దీపింప చేయాలి.ఉత్సాహమైన మనసు తట్టలకి పురోగమనం తాళ్లు కట్టి అభ్యుదయం చేంతాడుతో పూటికంతా బయటకు లాగాలి ఆ విధంగా చేసి మళ్లీ పాతాళ గంగ  ఊటల్ని రప్పిస్తాము అని అంటున్నాడు. క్షణ క్షణము మారే మనసును కూడా సరైన దారిలో పెట్టి చక్కని ఆలోచనాత్మక కర్తవ్యమును మనకు ప్రబోధిస్తు న్నాడు. మనిషిలో మాయమైన మానవత్వం జలతో పూటికంతా లాగుతాం అంటున్నాడు.మనిషి అంతరంగంలో అదృశ్యమైన మనసు పొరలకి మళ్లీ పాతాళగంగ ఊటలు రప్పిస్తాను అని చెప్తున్నాడు.మృగ్యమైన మానవతా దీపాలు వెలిగిస్తానంటున్నాడు.ఎంత చక్కటి ఆలోచన.సమాజాన్ని ప్రేమించిన వాడు.సమాజ హితం కోరుతున్న వాడు. మనుషుల్లోని మనసులను,మృగ్యమైపోయిన మానవత్వపు విలువలను తన చైతన్యంతో రప్పిస్తున్నాడు.”గుండె గుండెకు  మోట పెట్టి/బండ బండను మడి చేసి/రాళ్లలో రతనాలు  పండిస్తాం/కరిగిపోని వసంతాలు సృష్టిస్తాం”.గుండె గుండెకు   మోట పెట్టి బండ బండను మడి చేసి రాళ్లలో రతనాలు  పండిస్తాం అంటున్నాడు.ప్రతి మనిషికి గుండె ఉంటుంది.గుండె లబ్ డబ్ మని శబ్దం చేస్తుంది.డాక్టర్ స్టెతస్కోప్ ద్వారా గుండె ధ్వనులను వింటాడు.బీపీ చెక్ చేసి లోబిపి లేదా హైబీపి ఉంది అని చెప్తాడు.సమాజాన్ని పరిశీలించే డాక్టర్ గా సమాజ హితం కొరకు పాటుపడే వ్యక్తిగా మనుషుల గుండెలకు మోట పెట్టి బండ బండను మడి చేస్తాను అంటున్నాడు.బండగా మారిన బండ బారిన హృదయాలను సేద్యం మడి చేసి రాళ్లలో రతనాలు పండిస్తాం అంటున్నాడు.విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విదేశీయులు వచ్చి రతనాలను మన దేశం నుండి కొనుక్కుపోయే వారట.నిజంగా రతనాలు పండిన దేశం మనది.అందుకే మన దేశాన్ని రత్న గర్భ అని అంటారు.”కరిగిపోని వసంతాలు సృష్టిస్తాం”. కరిగిపోని  వసంతాలు ఎక్కడ ఉంటాయి.స్వర్గంలో ఉంటాయి.స్వర్గంలోని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు.స్వర్గంలోని కాలువలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి.స్వర్గంలో ఎవరికి ప్రవేశం ఉంటుంది?మానవత్వంతో ఆలోచించే వాళ్లకి మానవత్వంతో నడుచుకునే వాళ్ళకి స్వర్గంలో ప్రవేశం ఉంటుంది.దుర్మార్గులకు నరకంలో శిక్షలు ఉంటాయి. ”ఎవరంటారు/మాకా దమ్ముల్లేవని?”.ఎవరంటారు మాకు  దమ్ములు లేవని అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు.సత్యమైన బాటలో నడిచే వాళ్ళు ఉన్నారు.మానవత్వంతో నడిచే వాళ్లు ఉన్నారు. సమాజ సౌభాగ్యాల కోసం పాటుపడుతున్న వారు ఉన్నారు. అలాంటి మహనీయులను మీకు దమ్ముల్లేవని అడిగే వారు ఉండరు.”చూడాల్సింది మా కలాల్ని కాదు/మా చేతుల సత్తువని”.కవుల కలాలు కూడా కర్తవ్యం గుర్తు చేయగలవని సమాజ హితం కోసం పాటు పడగలవని చెబుతున్నాడు. చూడాల్సింది మాకలాల్ని కాదు.మా చేతుల సత్తువను అని  తెలియజేస్తున్నాడు.”మా శ్రామిక శక్తి పవనోర్మికలని/మా  నెత్తురు కణాల కత్తులని”.శ్రామిక శక్తి అనే గాలి అలల బలం చేత విప్లవాలు సృష్టించబడ్డాయి.ప్రపంచ చరిత్రలో విప్లవ బాటలో నడిచి విప్లవిస్తే జయం మనది అని ఆ రెండు దేశాల్లో సోవియట్ రష్యా మరియు చైనాలో కమ్యూనిస్టుల పాలన ఏర్పడి ఆ దేశ సౌభాగ్యానికి ఎంతో తోడ్పడ్డాయి.ఇవ్వాళ మరుగున పడుతున్న మానవత్వపు జలను మల్లారెడ్డి ఎవరన్నారు కవిత ద్వారా పంచుకున్నారు.మల్లారెడ్డి అంతరంగంలో పురుడు పోసుకున్న ఎవరన్నారు కవిత సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తుంది.మల్లారెడ్డి శ్రామిక వర్గ పక్షపాతి.ఆయన రాతల్లో అభ్యుదయం,తపన అలాగే  కొనసాగుతుంటుoది.మల్లారెడ్డి మానవత్వం పరిమళాలను పండిస్తాడు.మానవత్వానికి స్వాగతం పలుకుతూ మల్లారెడ్డి కలానికి మంచి పదునుపెట్టాలని కోరుకుంటున్నాను .శ్రామికుని శక్తి నుండి స్వేదం నుండి పంటలు తీస్తాం.నెత్తురు కణాల కత్తులు.శ్రామికుల నెత్తురుని కణాల కత్తులు అంటున్నాడు. ఎవరన్నారు చక్కటి కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.  

 గులాబీల మల్లారెడ్డి  “జంపాల ప్రసాద్” కవిత పై విశ్లేషణా వ్యాసం.   

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని జంపాల ప్రసాద్ కవిత పై విశ్లేషణా వ్యాసం.ప్రగతి శీల విద్యార్థి సంఘం ఉద్యమనేత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా ఎత్తోండ గ్రామంలో జంపాల నాగేశ్వరరావు,కొసరాజు రాజ్యలక్ష్మి దంపతులకు1951 సంవత్సరంలో జన్మించాడు.తండ్రి నాగేశ్వర రావు స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల,తల్లి రాజ్యలక్ష్మి స్వగ్రామం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి. జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ 1968 సంవత్సరంలో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ విద్యలో ప్రవేశం పొందినాడు.అనతి కాలంలోనే అభివృద్ధి నిరోధక శక్తులపై పిడికిలి బిగించి సింహ స్వప్నంగా మారాడు.జార్జిరెడ్డి మరణానంతరం ఉద్యమ పతాకాన్ని భుజానికి ఎత్తుకున్న జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ప్రగతిశీల భావజాలానికి కేంద్ర బిందువు అయ్యాడు.ప్రసాద్ జార్జి రెడ్డి అడుగు జాడల్లో నడిచిన వాడు.జార్జిరెడ్డి పి,డి,యస్,యు. విద్యార్థి సంస్థను స్థాపించాడు.విద్యార్థుల హక్కుల కోసం అహ రహం శ్రమించిన వాడు.యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు అన్నయ్యలా మెదిలిన నిస్వార్థ జీవి.ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించాడు.ఎల్ల వేళలా సమాజ సంక్షేమం గురించి పాటుపడిన వ్యక్తి.కొన్ని అసాంఘిక స్వార్థపర శక్తులు ఆయన సిద్ధాంతాలు నచ్చక ఉస్మానియా యూనివర్సిటీ కాంపౌండ్ లోనే  మట్టుపెట్టారు.విద్యార్థి లోకమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.జార్జి రెడ్డిని అంతం చేసిన ఆయన స్థాపించిన విద్యార్థి సంస్థ అంతం కాలేదు.ఒక వీరుడు మరణిస్తే వేల కొలది వీరులు ప్రభవిస్తారు.స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజును మట్టు పెట్టారు. అయినప్పటికీ భారతదేశ ప్రజల్లో రగులుతున్న స్వాతంత్రోద్యమ కాంక్షను మాత్రం మట్టుపెట్ట లేకపోయారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశమంతా ఎదురు తిరిగి బ్రిటిష్ వారి పై పోరాటం కొనసాగించింది.బ్రిటిష్ వారు తోకముడిచి పారిపోయారు.జార్జిరెడ్డి అందించిన స్ఫూర్తితో వేల లక్షల మంది వీరులు తయారయ్యారు.జంపాల ప్రసాద్ జార్జిరెడ్డి అడుగు జాడల్లో నడిచిన వాడు.జార్జిరెడ్డి అందించిన స్ఫూర్తిని, ఆయన ఆశయాలను,ఆయన సిద్ధాంతాలను,విలువలను,అలాగే కొనసాగిస్తూ వచ్చాడు.ప్రసాద్ ప్రగతిశీల విద్యార్థి సంఘం ఉద్యమానికి ఊపిరిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులను అందరిని రాష్ట్రవ్యాప్తంగా ఏకం చేసి పోరుబాట కొనసాగించాడు. ప్రసాద్ విద్యార్థి లోకానికి ఒక వెలుగుగా నిలిచాడు.1975 సంవత్సరంలో భారత దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్రజాస్వామిక ఎమర్జెన్సీని జూన్ 26, 1975 నుండి మార్చ్ 1977 వరకు విధించింది.ఎమర్జెన్సీని చీకటి రోజులు అంటారు. ఎమర్జెన్సీలో ప్రభుత్వం పాశవికంగా పౌరుల ప్రాథమిక  హక్కులను పూర్తిగా హరించింది.1970 దశాబ్దం నుంచి 1975 నవంబర్ 5న తుది శ్వాస విడిచే దాక విప్లవ భావ వ్యాప్తికై మనస్ఫూర్తితో పనిచేసిన దీక్షా దక్షుడు ప్రసాద్.1975 నవంబర్ 3 న విప్లవ నేత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యతో సహా విజయవాడలో పోలీసులకు పట్టుబడి చిత్రహింసలకు గురయ్యాడు.నవంబర్ 5 న ఖమ్మం జిల్లా ఇల్లందు తాలూకా చీకటిగండ్ల అడవుల్లో నీలం రామచంద్రయ్యతో పాటు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను కాల్చి చంపారు. పోలీసులు ఎన్కౌంటర్ పేరిట కట్టు కథలను సృష్టించారు.1975 సంవత్సరంలో ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో పోలీసులు అమానుషంగా జంపాల ప్రసాదును చెట్టుకు కట్టి ఎన్కౌంటర్ పేరిట చంపేశారు. “నేస్తం/క్యాంపస్ విద్యార్థి వైన నీవు/కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా /చెట్టుకు కట్టి/బందూకు గురిపెట్టినపుడు/ కొండల గుండెలు జాలువారినవి/ కన్నీటి జాలు వారినవి/ చెట్ల కొమ్మలు –ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకీ గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది” అని కవి మల్లారెడ్డి ఆవేదనతో ప్రసాద్ పై కవితను రాశారు. జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం.ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు.అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్.ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు,నీవు పుట్టిన పల్లె,నేల కూడ పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు, విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం,శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి. శిఖరంలా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు కొమ్మలు ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవం లేని బొగ్గుగా మారింది. ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది.”నీ ఆశయాల చిగుళ్ళతో/ వనానికే వసంతం వచ్చింది”.జంపాల ప్రసాద్ అందించిన ఆశయాల చిగుళ్ళైన నూతన ఆర్థిక విధానం,మూఢ సంస్కృతి పై పురోగమించిన తీరు,శాస్త్రీయ విద్యా విధానం కావాలని అతను నాటిన ఆలోచనలు ఇవ్వాళ అందరికీ శిరోధార్యం అయ్యాయి. ప్రసాద్ నీవు అందించిన ఆశయాల చిగురులు తొడిగిన వసంతం వల్ల కొత్త శోభ వచ్చింది అని కవి మల్లారెడ్డి చెప్పిన తీరు చక్కగా ఉంది.”నిన్ను నక్సలైటన్న/నీవే ఎందరికో టార్చ్ లైటని వింటున్న.”/నక్సల్ బరి ఉద్యమం బెంగాల్లో మొదలైంది.చార్ మజుందార్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. దేశమంతా నక్సల్ బరి ఉద్యమం విస్తరించింది.కమ్యూనిజాన్ని నమ్ముకున్న వాళ్ళని నక్సలైట్ అని పిలిచారు.నక్సలైట్లు, విప్లవకారులుగా ప్రసిద్ధి పొందారు.నక్సలైట్లు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్నారు.ప్రసాద్ సమాజం కోసం పోరాడిన వాడు.ప్రసాద్ సమాజం అభివృద్ధిని కాంక్షించినవాడు.ప్రసాద్ సమాజం వెలుగు కొరకు నూతన ఆర్థిక విధానాలు,శాస్త్రీయ విద్యా విధానం కావాలని ప్రజలను మమేకం చేసి ఉద్యమాన్ని నడిపించినాడు.ప్రసాద్ లక్ష్యాన్ని చూసి ఓర్వలేని అప్రజాస్వామిక శక్తులు ఎన్కౌంటర్ పేరిట పాశవికంగా మట్టు పెట్టాయి.ఈ దేశంలో రాజ్య హింస కొనసాగుతుందని చెప్పటానికి ప్రసాద్ హత్య సాక్ష్యంగా నిలుస్తుంది.ప్రసాద్ నీవు చూపించిన అడుగుజాడల్లో అందరు పయనిస్తున్నారు.ప్రసాద్ నీవు అందించిన మార్గం అందరికీ వెలుగునిచ్చే టార్చ్ లైట్ అని వింటున్నాను.ఎమర్జెన్సీలో కవి మల్లారెడ్డి కొంత కాలం జైల్లో ఉన్నాడు.చీకటి రోజులైన ఎమర్జెన్సీకి సాక్ష్యంగా జంపాల ప్రసాద్ ఎన్కౌంటర్ నిలుస్తుంది.వీరుడైన జంపాల ప్రసాద్ గురించి చక్కటి కవితను అందించినందుకు కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను. కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి ఎంత హాయి కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని ఎంత హాయి కవిత పై విశ్లేషణా వ్యాసం.ఎంత హాయి కవిత పేరు వినగానే మనకు ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి ఘంటసాల గళం నుండి పాడిన పాట గుర్తుకు వస్తుంది.పాట వినగానే ఒళ్లంతా తన్మయత్వంలోకి చేరుతుంది. మనకు ఆ పాటను మళ్లీ మళ్లీ  వినాలనిపిస్తుంది.ఎంత హాయి సినిమా పాట వినగానే మనస్సు ఆనందంతో కేరింతలు వేస్తుంది. మనకు ఎద నిండా ఎన్ని బాధలు ఉన్నా ఎంత హాయి పాట వినగానే క్షణంలో మన  బాధలన్నింటిని మరిచిపోతాం. అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళితే డాక్టర్ పరీక్షలు చేసి మీకు ఏ జబ్బు లేదు.మీరు బేషుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు.మీరు కొంత సమయం మ్యూజిక్ థెరఫీ చేయాలి.మీరు అపాత మధురమైన అలనాటి వీనుల విందైన మంచి పాటలు వినమని చెబుతున్నారు.పాటకు పల్లవి ప్రాణం.పాటకు అమేయమైన శక్తి ఉంది.పాటల ఉయ్యాలలో చేరి ఊగితే మనసును తెలియని లోకంలోకి తీసుకుపోతుంది.పాట మనలను ఆకాశ తరంగాల్లో ఊగిస్తుంది.తెలంగాణ పల్లెల్లో నివసించే అమాయక పల్లె జనాలు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛతకు ప్రతిరూపాలు అని చెప్పవచ్చు.ప్రకృతి ఒడిలో పెరిగిన జానపదులు వారి దైనందిన జీవితాల్లో నిత్యం నిర్వర్తించే కర్షక కార్మిక వృత్తులన్నీ కథా వస్తువులే.కార్మిక,కర్షక గేయాలు,తుమ్మెద పదాలు,స్త్రీల పాటలు అంతా దేశీయ సాహిత్యం.“నేను పాడాను నాటి రాత్రి ఒంటరిగా/ ఓ అమాయకపు అద్భుతపు పాట/మా పేట దొర దొమ్మి ఆటల గూర్చి/అంతే/తెల్లారి కల్లా/ సంకెళ్లతో పోలీసులు”.తెలంగాణలో దొరలు చేసిన దొమ్మి ఆటల గూర్చి అమాయకుడైన యువకుడు పాట పాడినందుకు తెల్లారేసరికల్లా సంకెళ్ళతో పోలీసులు వచ్చి అరెస్టు చేసినట్లుగా తోస్తుంది.
తెలంగాణ పల్లెల్లో జనాలు స్వేచ్ఛగా తమ గళాలు విప్పి పాటలు పాడుకొనటానికి వీలు లేదు.ప్రభుత్వాల అనుమతితో పోలీసుల రాజ్య హింస ఎలా జరుగుతుందో మల్లారెడ్డి కవిత చదివితే తెలుస్తుంది.జననాట్యమండలి కళాకారులు పాడిన పాటలతో పల్లెలు మారు మ్రోగేవి.జననాట్యమండలి నుండి ఎదిగిన గద్దర్ గొప్ప కళాకారుడుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు.గద్దర్ ప్రజల జీవితాన్ని కాచి వడబోసినట్లు బతుకు పాటలు రాశాడు.పాట ప్రజా కళారూపం.పొలాల్లో కలుపుతీస్తూ నాట్లు వేస్తూ జానపదులు ఎంతో హాయిగా పాటలు పాడుతారు.పల్లె జనాలు పొద్దున్నుండి సాయంత్రం వరకు వంచిన నడుం ఎత్తకుండా పనులు చేసుకుంటారు.పనుల్లో అలసట అనేది తెలియకుండా ఉండటం కొరకు పల్లె జనాలు పాటల లోకంలో విహరిస్తారు. మనకు స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 రోజున అర్ధరాత్రి వచ్చింది.కాని మన తెలంగాణ ప్రాంతం నిజాం రాజు నిరంకుశ పాలనలో కొనసాగింది.నిజాం రాజు కింద పని చేసే రజాకార్లు వారి తొత్తులైన దొరల,దోపిడీలు,దౌర్జన్యాలు,అత్యాచారాలు, అరాచకాలు,వెట్టి చాకిరి,కుల వివక్ష తీవ్రంగా కొనసాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది యువకులు అమరులయ్యారు.చాలామంది ప్రజలు ఉరి తీయబడ్డారు. చాలామంది ప్రజలు తీవ్రమైన చిత్రహింసల పాలయ్యారు.ఆడ కూతుర్ల మాన,ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న సాహసోపేతమైన చర్య సైనిక తిరుగుబాటు వల్ల సెప్టెంబర్ 17,1948 నాడు నిజాం రాజు లొంగి పోయాడు.అయినప్పటికీ గ్రామాల్లో దొరల దౌర్జన్యాలు,వెట్టి చాకిరి,కుల వివక్ష అలాగే కొనసాగుతూ వచ్చింది.పొట్టి శ్రీరాములు అమరులు అయిన తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.పాటలు పాడుకునే స్వేచ్ఛ లేని తెలంగాణ సమాజం గురించి మనం ఈ కవిత చదవగానే అర్థం అవుతుంది.తెలంగాణలో ఒక గ్రామంలో జరిగిన సంఘటనగా తోస్తుంది.తెలంగాణలో పల్లెలన్నీ దొరల మరియు వారి తాబేదారుల ఏలుబడిలో కొనసాగాయి.దొరల దౌర్జన్యాలకు,అమానుషాలకు అంతు లేకుండా పోయింది.ఇది పల్లెల్లో జరుగుతున్న మామూలు విషయాలుగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు హరించే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇలాంటి రాజ్య హింసను తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు.దొరలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.పోలీసులు డబ్బులకు కక్కుర్తి పడడం ఇప్పటికీ విచ్చలవిడిగా కొనసాగుతుంది.పోలీసులకు విశేషమైన అధికారాలు.పోలీసులు ఏం చేస్తే అదే వేదంగా వాదంగా సాగుతోంది.స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు చేస్తే మందలించే వ్యవస్థ లేదు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కు రాజు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ తన ఇలాఖాలో ఏం చేసినా చెల్లుతుంది.స్టేషన్ హౌస్ ఆఫీసర్ గురించి ఎవరికి ఫిర్యాదు చేసినా చర్య తీసుకోరు. బాధితుడి రోదనలు అరణ్య రోదనలు అవుతున్నాయి.కోర్టుకు వెళ్లిన కోర్టులో న్యాయమూర్తులు లంచం తీసుకొని నేరస్తునికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారు.చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా వాడుకుంటు న్నారు. ప్రజలు తమ హక్కుల గురించి ఎవరిని అడగాలి?కనిపించని ఆ దేవుడికి మొర పెట్టుకోవాలా? సమాధానం దొరకని ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి.ప్రజలను కన్నబిడ్డల్లా చూడాల్సిన పోలీసులు ఆమ్యామ్యాలకు లొంగి తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకులు శుష్క వాగ్దానాలతో ఐదు సంవత్సరాలు ప్రజలను భ్రమల్లో తేలియాడ జేస్తున్నారు. “మోకాళ్లు – రోకళ్లు పోటీ పడినవి నెల్లాళ్ళు/కళ్ళు –నీళ్ళింకిన సంద్రాలైనవి/ ఒళ్ళు – సహారా ఎడారి అయింది”.పోలీస్ స్టేషన్లో దొర ఏం చెప్తే అది జరిగి తీరుతుంది.దొర దగ్గర పోలీసులు లంచం తీసుకున్నారు.బ్రిటిష్ కాలం నాటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఇప్పటికీ అనుసరిస్తూ ఏ నేరం చేయని అమాయకుడిని పోలీస్ స్టేషన్లో ఉంచి మోకాళ్ళకు రోకలి ఎక్కించి అమానుషంగా హింసించారు.పోలీసులు అమాయకుడిని నెల రోజులు హింసించడం తప్పు.ఏ రాజ్యాంగం ద్వారా పోలీసులకు అమాయకులను హింసించే హక్కు కల్పించింది.అమాయకుడిని శిక్షించే హక్కు పోలీసులకు ఎక్కడిది?.పోలీసుల హింస వల్ల అమాయకుని ఒళ్ళు సహారా ఎడారి అయింది.అమాయకునిపై పోలీసుల హింస తలచుకుంటేనే గుండెలు అవిసిపోతున్నాయి. వాళ్ళు“నిజం కక్కిస్తానన్న పోలీసు/అబద్ధం కేసు పెట్టాడు” .పోలీసులు బాధితుడు వద్ద లంచం తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తారు.పోలీసులు విచారణ పేరిట నేరస్తుని వద్ద ఎక్కువగా లంచం డబ్బులు తీసుకుంటున్నారు.పోలీసులు అమాయక బాధితుని కేసును తప్పుడు కేసు అని క్లోజ్ చేస్తున్నారు. అమాయకుడు నేను పెట్టిన కేసు ఎందుకు కేసు క్లోజ్ చేశారు అని పోలీసులను అడిగితే పోలీసులు బాధితున్ని ఏం చేస్తావో? చేసుకో,పో, బయటకు వెళ్ళు అని గెంటేస్తున్నారు.అమాయక బాధితుడు కోర్టుకు వెళ్తున్నాడు.కోర్టులో కూడా కొందరు న్యాయమూర్తులు లంచం తీసుకొని అమాయక బాధితుని ఫిర్యాదును కొట్టివేస్తున్నారు.న్యాయమూర్తులు అవినీతికి పాల్పడడం ఆవేదనగా ఉంది.న్యాయమూర్తులు న్యాయదేవతకు కళ్ళు లేవని అన్యాయపు తీర్పులు రాస్తున్నారు.న్యాయదేవత మమ్మల్ని ఏమీ చేయలేదని న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారు.న్యాయమూర్తులు అవినీతికి పాల్పడడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది.“ఇప్పుడు రోజు పాడుతున్నాను/ అదే పాట/జైల్లో – రైల్లో/ బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి”.తెలంగాణలో పోలీసులు ధనవంతులైన ఆసాములకు దాసులుగా పనిచేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి. ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు.అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు, జడ్జీల ముందు,ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.ఎంత హాయి కవిత 1984 సంవత్సరంలో జరిగిన సంఘటనలకు సాక్షీ భూతంగా నిలుస్తుంది.రక్షించాల్సిన పోలీసులు రక్కసులయి అమాయకుడిని హింసల పాలు చేసి,తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు.పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసే హక్కును ఏ రాజ్యాంగం కల్పించింది? నిజాయితీగా పనిచేసేవాళ్లను పోలీసులుగా విధుల్లోకి తీసుకోవాలి.జడ్జీలను కూడా నిజాయితీపరులను ఎంపిక చేయాలి.పోలీసులు,జడ్జీలు చేస్తున్న అవినీతిని అరికట్టాలి.అవినీతిని అరికట్టడం జరిగే పనేనా?అని అనుకోకూడదు.అవినీతిని అరికట్టడం జరిగి తీరుతుంది.మంచికి పునాది పడుతుంది.ఎంత హాయి పాట మనోరంజకంగా వినబడుతుంది.చక్కటి కవిత రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లా రెడ్డి నిజం కవిత పై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని నిజం కవిత పై విశ్లేషణా వ్యాసం.నిజం అనగా సత్యం.ఆంగ్లం లో Truth అని అర్థం.నిజం అనేది నిజాయితీ, త్యాగం వలె మనం పాటించవలసిన సంగతిగా చెప్పవచ్చు. సత్యం వద అంటే సత్యమునే చెప్పుము.సత్యం పలకడం వల్ల తాత్కాలికమైన కష్టాలు ఎదురైనా చివరికి విజయం మాత్రం తథ్యం అని చెప్పవచ్చు.నిజం పలకడానికి మనిషికి ధైర్యం కావాలి.పొద్దున్నే పాలు అమ్మే వ్యక్తి పాల ప్యాకెట్ తో ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు.సైకిల్ మీద పాల క్యాన్ వేసుకుని ఇంటింటికి తిరిగి పాలు పోసిన రోజులు పోయినవి. సైకిల్ మీద పాల క్యాను వేసుకుని పాలు అమ్ముదామని వీధుల వెంట తిరిగినప్పటికీ పాలను ఎవ్వరు కొనడం లేదు అని వాపోతున్నాడు.ఇదేమి చిత్రమో? క్యాన్ లో పాలు ఇంటింటికి తిరిగి అమ్మే వ్యక్తికి జనాల సంగతి ఏమీ అర్థం కావడం లేదు. విచిత్రంగా జనాలలో ఎంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నాడు.అందరు జనాలు పాల ప్యాకెట్లకు అలవాటు పడి కొనుగోలు చేస్తున్నారు. కొందరు పాల ప్యాకెట్లు తీసుక వచ్చి ఇంటింటికి తిరిగి అమ్ముతున్నారు.పాల ప్యాకెట్ రాగానే పాలు కాగ బెట్టి టీ తయారు చేయడం ఇంటికి దీపం అయిన ఇల్లాలుకు ఆనవాయితీగా మారింది.ఉదయం లేచిన తర్వాత టీ తాగుతూ దినపత్రిక చదివే అలవాటు చాలా మందికి ఉంది.పొద్దున్నే పేపర్ చదవడానికి ఇరుగు పొరుగు వారు రావడం పరిపాటిగా చెప్పవచ్చు.పొద్దున్నే ఇంటి ముందు వాకిట్లో కూర్చుండి జనాలు ఆ రోజు దినపత్రిక చదువుతూ పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తారు.జనాలు ఉబుసుపోక ముచ్చట్లతో పాటు కుటుంబం గురించి,గ్రామం గురించి,దేశం గురించి,పార్టీల గురించి,దేశంలో పెరిగిపోతున్న అవినీతి గురించి,ఆకాశానికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి, చర్చలు, వాదోపవాదాలు చేస్తారు.దినపత్రిక చదవడం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఇళ్లలోని జనాలు అన్ని విషయాలు అక్కడే వదిలేసి ఏం చక్కా ఎవరి ఇంటికి వారు భేషుగ్గా వెళ్ళిపోతారు.జనాలు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం కొరకు ఆసక్తి చూపడం లేదు. ప్రజలు ఎదుర్కోవలసిన సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కదలిక  లేకుండా ఉంటున్నాయి.జనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ఎందుకో ఎవరూ దృష్టి పెట్టడం లేదు అనేది వాస్తవం.మనం జీవిస్తున్న సమాజంలో ఆ రోజటి నాడు పేపర్ చూడకున్నా పాల ప్యాకెట్ అమ్మే అబ్బాయి రాకున్నా ఇంటి యజమానిలో కలిగిన మార్పులు చూస్తే వింతగా తోస్తుంది.అతడు కాలు గాలిన పిల్లిలా ఇంట్లోనే తిరుగుతూ అటు ఇటు తొంగి చూస్తూ దిక్కు తోచక వీధిలో పచార్లు చేయడం విచిత్రంగా వుంటుంది.ఇప్పుడు వ్యక్తులు టీ తాగకుండా ఉండగలరు.కానీ పేపర్ చదవకుండా ఉండ లేని స్థితికి చేరుకున్నారు.ఇవ్వాళ ఎవరైనా పొద్దున లేవగానే టీ తాగుతూ ఒక పార్టీ వాళ్లు ఎదురు పార్టీ వాళ్ళని దుమ్మెత్తి పోయడం చూస్తూనే ఉన్నాం.అధికార పార్టీ వాళ్లు అది చేస్తాం ఇది చేస్తాం అని గుప్పించే వాగ్దానపు వార్తలు ప్రజలను కలవరపెడతాయి. ఆత్మహత్యలు,హత్యలు,దొంగతనాలు,దోపిడీలు,ఊరి గొడవలు,సవాలక్ష సమస్యలకు సంబంధించిన వార్తలు పేపర్లలో రోజు వస్తుంటాయి.ప్రపంచంలో ఏం జరిగింది? పేపర్ చదవడం ద్వారా ప్రపంచంలో జరిగే విషయాలతో పాటు అన్ని విషయాలు మన కళ్ళ ముందు  ప్రత్యక్షమవుతాయి.పల్లె,మండలం,జిల్లా ,పట్టణం,అన్ని ప్రదేశాలకు సంబంధించిన వార్తలు అందిస్తున్నారు.కవి మల్లారెడ్డి నిజం కవితలోని చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.గొప్ప అనుభూతులను సొంతం  చేసుకుందాం.”ఇది దిన పత్రిక మొదటి పేజిలో/ డబ్బా కట్టిన వార్త/ అక్కపల్లిలో/నక్సలైటు వర్గాల మధ్య ఘర్షణ.” దినపత్రికలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి.దినపత్రిక ఎడిషన్ లో వివిధ రకాల వార్తలు ఉంటాయి.దినపత్రికలో అనేక రకాలైన వార్తలతో పాటు కొన్ని సంచలన వార్తలు కూడా ఉంటాయి.ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంచలనం సృష్టించిన వార్తను దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించబడింది అని తోస్తుంది.ఇది ఆ రోజు అక్కపల్లి గ్రామంలో జరిగిన సంచలన వార్తగా చెప్పవచ్చు.అందుకే  దినపత్రిక మొదటి పేజీలో డబ్బా కట్టిన వార్తగా వచ్చింది.అక్కపల్లి గ్రామంలో నక్సలైట్ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించిన వార్తను ఇది ఆ రోజు దినపత్రిక మొదటి పేజీలో వచ్చింది అని కవి మల్లారెడ్డి కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.అక్కపల్లి గ్రామంలో పేద రైతు కూలీలు అత్యధికంగా నివసిస్తున్నారు.గ్రామంలో రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వాలు కల్పించడం లేదు. అందువల్ల రైతులు తమ పొలాల్లో పనిచేసే కూలీలకు న్యాయమైన కూలీ చెల్లించడం లేదు.గ్రామంలోని కూలీలు తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నారు.పేదరికంలో ఉన్న కూలీల పిల్లలకు చదువులేదు,సరైన కూడు,గూడు,గుడ్డ లేదు.హీనమైన స్థితిలో జీవితాలను గడుపుతున్న పేదలకు అండగా నక్సలైట్లు ఉంటున్నారు. అన్నలు గ్రామీణ పేదల సంఘం ఏర్పాటు చేసి పేద వారికి రాత్రి పూట చదువును అందిస్తున్నారు.చీకటిలో బతుకు గడుపుతున్న గ్రామీణ పేదలకు పేదరికంకు గల కారణాలు తెలుపుతున్నారు.అన్నలు పేద ప్రజలకు వారు ఎదు ర్కొంటున్న సమస్యల గురించి సరైన అవగాహన కల్పిస్తున్నారు.ఎందుకు గ్రామాలు సమస్యలకు నెలవుగా ఉంటు న్నాయి? ఎందుకు  ప్రజలు తీవ్రమైన పేదరికంలో బతుకు గడుపుతున్నారు? గ్రామాల్లో భూస్వాముల దోపిడీ ఎందుకు నిరాటంకంగా కొనసాగుతూ ఉంది?.భూస్వాములు పేదల శ్రమను దోపిడీ చేస్తున్నారు.భూస్వాములు చేస్తున్న శ్రమ దోపిడికి వ్యతిరేకంగా గ్రామీణ పేదల సంఘం తరఫున నిలిచి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.ప్రజలు తమ హక్కుల కోసం ప్రభుత్వంను నిలదీస్తూ ఉద్యమాల బాటలో సాగుతున్నారు. అన్నలు గ్రామాల్లోకి వచ్చిన తర్వాత పేదలపై తాము చేస్తున్న దోపిడీకి ఆటంకం ఎదురైంది అని భావించి భూస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. భూస్వాములకు అండగా పోలీసులు నిలుస్తున్నారు.పోలీసులు నక్సలైట్ అన్నల గురించి ఆచూకీ కొరకు ఆరా తీస్తూ గ్రామస్తులందరిని తీవ్రంగా కొడుతూ హింసిస్తున్నారు.వాళ్ళు”పోలీసులు మొదట విప్లవకారుల కోసం వచ్చారు/నాకు పార్టీలతో సంబంధం లేదు/ నేను కమ్యూనిస్టును కాను/అందుకే వాళ్లను లక్ష్య పెట్టలేదు.” అక్క పల్లి గ్రామంలోకి పోలీసులు విప్లవకారుల కోసం వచ్చారు.పోలీసులు గ్రామంలోని ఇల్లిల్లు తిరిగి అన్నల కోసం వెతికారు.పోలీసులు గ్రామం అంతా తిరిగినప్పటికీ అన్నలు ఎవరు కనిపించలేదు. అన్నల కొరకు వెతుకుతుండగా ఒక ఇంటిలో 20 సంవత్సరాల వయసున్న యువకుడు పోలీసులకు కనిపించాడు.అతనికి ఏ పార్టీలతో సంబంధం లేదు.అతను కమ్యూనిస్టు పార్టీకి చెందిన సభ్యుడు కాదు.అందుకే తమ గ్రామమునకు పోలీసులు వచ్చినప్పటికీ అతను వారిని గురించి పట్టించుకోలేదు అని నిజాయితీగా తెలియజేస్తున్నాడు.”తరువాత వాళ్ళు రైతు సంఘ నాయకుల కోసం వచ్చారు/నేనెలాగు సంఘ సభ్యుడుని కాదు/కావున లక్ష్య పెట్ట లేదు”. పోలీసులు అక్కపల్లి గ్రామంలోకి  రైతు సంఘం నాయకుల కోసం వచ్చారు. పోలీసులు రైతు సంఘం నాయకుల కోసం గ్రామంలోని వారి ఇండ్లల్లో వెతికారు.గ్రామంలో రైతు సంఘ నాయకులు ఎవరూ కనిపించలేదు.పోలీసులకు రైతు సంఘం నాయకుల జాడ దొరకలేదు.పోలీసులు రైతు సంఘం నాయకుల కోసం వెతుకుతుండగా అక్కపల్లి గ్రామంలో పోలీసులకు యువకుడు కనిపించాడు.పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నించారు.అక్కపల్లి గ్రామంలోని ఆ యువకుడు తన గురించి చెబుతున్నాడు.నేను రైతు సంఘం యొక్క సభ్యుడిని కాదు.మా గ్రామంలో పోలీసులు వచ్చినప్పటికీ నేను వారిని గురించి పట్టించుకోలేదు అనే నిజం తెలియజేస్తున్నాడు. ”అప్పుడు వాళ్లు లోగడ ఆశ్రయమిచ్చి తిండి పెట్టిన వాళ్ల కోసం వచ్చారు/నా పైన ఆ దాఖలాలేవి లేవు/అందుకే నేను లక్ష్య పెట్టలేదు”అక్కపల్లి గ్రామంలోకి వచ్చిన పోలీసులు అన్నలకు ఆశ్రయమిచ్చిన తిండి పెట్టిన వాళ్ల కోసం వచ్చారు. పోలీసులు అన్నలకు ఆశ్రయమిచ్చి తిండి పెట్టిన వాళ్ళ కొరకు ఇండ్లల్లో వెతికారు.అన్నలకు ఆశ్రయమిచ్చిన తిండి పెట్టిన వారి జాడ దొరకలేదు.వారు ఎవరు కనిపించ లేదు.అక్కపల్లి గ్రామంలోని ఆ యువకుడు చెబుతున్నాడు.నేను అన్నలకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదు. ఎన్నడు వారికి తిండి పెట్టలేదు అని పోలీసులకు చెప్పాడు. అన్నలకు ఆశ్రయం ఇచ్చినట్టుగా తిండి పెట్టినట్టుగా నా పై గ్రామంలో ఏ ఆధారాలు ఎవరు చూపించ లేదు.అందుకే నేను పోలీసులు అక్కపల్లి గ్రామమునకు వచ్చినప్పటికీ నేను వారిని గురించి పట్టించుకోలేదు.”తర్వాత జామీనుదార్ల కోసం వచ్చారు/ నేను ఏ కేసులో ఏ నక్సలైట్ నాయకుడికి జామీనుపడలేదు/ అందుకే/ సంబంధం లేదన్నాను.”అక్కపల్లి గ్రామమునకు పోలీసులు అన్నలకు జామీను ఇచ్చిన జామీనుదార్ల కోసం వచ్చారు.పోలీసులు జామీనుదారుల ఇండ్లల్లో తిరిగి వెతికారు. జామీనుదారుల ఆచూకీ లభించ లేదు. పోలీసులు ఆ యువకుడిని జామీనుదారుల గురించి వివరాలు అడిగారు.ఆ యువకుడు నేను ఏ కేసులో ఏ నక్సలైట్ నాయకుడికి జామీను పడ లేదు అని జవాబు ఇచ్చాడు.అందుకే నాకు జామీను విషయంలో సంబంధం లేదు అని నిక్కచ్చిగా చెప్పాడు.”ఇవాళ్ళ పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ ఎందుకో తెలుసా?/ నేను అక్కపల్లిలో పుట్టినందుకు/ అక్కపల్లిలో ఇరవై సంవత్సరాల నుండి  పెరిగినందుకు/ స్వేచ్ఛగా గాడుపు పీల్చినందుకు/దొరల మాట విననందుకు.”  అక్కపల్లి గ్రామంలోని యువకుడు నేను ఈ పల్లెలో పుట్టినందుకు 20 సంవత్సరాల నుండి ఈ పల్లెలో పెరిగినందుకు నన్ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారు.అక్కపల్లి గ్రామంలో నేను స్వేచ్ఛగా గాలి పీల్చినందుకు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.అక్క పల్లి గ్రామంలో నేను దొరల మాట విననందుకు పోలీసులు నన్ను అరెస్టు చేశారు అనే నిజాన్ని యువకుడు చెబుతున్నాడు.ఈ కవిత పేరు నిజం అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్లతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా రాసారు.దొరలు ఏమైన చేస్తారు. దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పు కుంటారు. దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు ఆవునా? కాదా? అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందు వులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపు దిద్దుకున్నాయి.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు.బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లా రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


గులాబీల మల్లారెడ్డి  గది-హృది కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని గది –హృది కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి తనలో కలిగిన భావాలను స్పందనలను కవితల రూపంలో వెల్లడిస్తున్నాడు.కవిత్వం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆవిష్కరిస్తుంది.కవి మల్లారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లా గ్రాడ్యుయేట్. ఉస్మానియా యూనివర్సిటీ లా హాస్టల్లో ఉండి విద్యాభ్యాసం కొనసాగించాడు.మల్లారెడ్డి సమాజ అభ్యుదయం కాంక్షించి రచనలు చేస్తున్నాడు.మల్లారెడ్డి విద్యార్థిగా చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నాడు.మల్లారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఉండి న్యాయ విద్యను అభ్యసించాడు.మల్లారెడ్డి హాస్టల్  గదులకు హృదయాలు ఉంటాయని తెలియజేస్తున్నాడు.ఆ కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ,రెండే రెండు యూనివర్సిటీలు ఉండేవి.జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ ఉండేది.అందరు విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలో సీట్లు దొరికేవి కావు.పీజీ చేయడానికి రెండే యూనివర్సిటీలు.చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ చదువుకునే అవకాశం అందరి విద్యార్థులకు దక్కేది కాదు. పేదరికం మరియు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక చాలామంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి పల్లెల్లోనే వ్యవసాయం చేసుకునేవారు.కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (జె) తుర్కవానికుంట మారుమూల గ్రామంలో పుట్టిన మల్లారెడ్డి ఉన్నత చదువులకై ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లి సీటు సాధించి హాస్టల్ లో ఉండి లా విద్యాభ్యాసం పూర్తి చేశాడు.ఉస్మానియా యూనివర్సిటీ గడప తొక్కిన వారు ఆ కాలంలో చాలా అరుదని చెప్పవచ్చు. తుర్కవానికుంట గ్రామంలోని మల్లారెడ్డి మరియు రాజిరెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్య నభ్యసించారని మనం గర్వంగా చెప్పవచ్చు. గది –హృది కవిత హాస్టల్ గదులకు అద్దం పడుతుంది.ఒక యువ విద్యార్థిలో కలిగిన సంఘర్షణలను కవితలో చిత్రించిన తీరు అద్భుతంగా ఉంది.”అది హాస్టల్ గది”.ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు హాస్టల్ గదులను కేటాయిస్తారు.ఆ రోజుల్లో విద్యార్థులు విద్యార్జనే  ధ్యేయంగా తమ చదువును రేయింబవళ్లు కష్టపడి కొనసాగించే వారు.మల్లా రెడ్డి విద్యార్థులు చదువుకునే హాస్టల్ గదులు ఎలా ఉంటాయో చక్కగా వివరించారు.”నాలో గదిలాంటి హృది/ మాసిన బిస్తరు/ చుట్టూర చిత్తు కాగితాలు / చిరిగిన చాప చింపు/గుడ్డిగా వెల్గుతున్న బల్బు/ గదినిండా దోమల సమ్మె/ రక్తానికి బదులుగా/ రక్తనాళాలలో సాంబారు/ ప్రవహింప చేస్తున్నాడని దోమల రోధ’.కవి మల్లారెడ్డి చదువుకునే సంకల్పంతో ఉన్న విద్యార్థుల గదులకు హృదయాలు ఉంటాయని కూడా చెబుతున్నాడు. హాస్టల్ గదిలో విద్యార్థుల హృదయాలు చేసే గుండె చప్పుళ్ళను రికార్డు చేసినట్టుగా తోస్తోంది. చదువుకునే విద్యార్థుల గదుల్లో ఏముంటాయి? మాసిన బిస్తర్లు ఉంటాయి.విద్యార్థులు కాలేజీకి వెళ్లి ప్రొఫెసర్ చెప్పేది శ్రద్ధగా వింటారు.నోట్స్ రాసుకుంటారు. కాలేజీ అయిపోగానే మళ్లీ గదికి వచ్చి చదివిన విషయాలను కాగితాలపై రాసుకుంటారు.గదిలో కాగితాలన్నీ చిందరవందరగా పేరుకు పోయి ఉంటాయి.గడ్డి మేసిన ఆవు తర్వాత తీరిగ్గా  నెమరు వేస్తుంది.అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాసిన కాగితాలను చదివి మనస్సులో  నిక్షిప్తం చేసుకుంటారు. ప్రొఫెసర్ చెప్పిన నోట్స్ కాగితాలు గదుల్లో గుట్టలుగా పేర్చ బడి ఉంటాయి.అందుకే హాస్టల్ గది అంతటా చిత్తు కాగితాలతో నిండి ఉంటుంది.ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ లోని అన్ని గదులు దాదాపుగా ఇలానే ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు చదువుకోవాలన్న దీక్షతో పోటీపడి చదువుతారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువులు ఒక  యజ్ఞంలా కొనసాగుతున్నాయి. విద్యార్థులు చిరిగిన చాపలో కూర్చుంటారు.హాస్టల్ గదిలో గుడ్డి బల్బు అలా వెలుగుతూనే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువును  విద్యార్థులు నిరాటంకంగా కొనసాగిస్తారు.విశాలంగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ప్రకృతికి ప్రతిబింబంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో దోమలు కూడా విస్తారంగా ఉన్నాయి.గది నిండా దోమలు సమ్మె చేస్తున్నాయి.విద్యార్థులు గదిలో ఉన్నంత కాలం వారిని దోమలు వెన్నంటి ఉంటాయి. హాస్టల్లో వేడి వేడి సాంబారు తింటారు.కాబట్టి విద్యార్థుల రక్తనాళాల్లో సాంబారు ప్రవహింప చేస్తున్నారని దోమలు సమ్మె చేస్తున్నవి.నిజమే ఆ గదుల్లో దోమలు అంతటా వ్యాపించి ఉంటాయి.సమ్మె చేసే దోమలకు విద్యార్థులు భయ పడరు. విద్యార్థులు చదువుల యజ్ఞమును నిర్విఘ్నంగా దీక్షగా కొనసాగిస్తారు.“అది నా గదిలోని వాస్తవిక గాధ”.అది నా గదిలో జరుగుతున్న వాస్తవిక గాథ అని నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు.”మరి హృది” విద్యార్థుల హృదయం గురించి వారిలో చెలరేగుతున్న హృదయాలోచనలను ఆవిష్కరిస్తున్నాడు.“ఇదిగో అణగారిన ఆశలు/ జీవితం  ముళ్ళబాట / ఆరిపోతున్న దీపం లాంటి కోరిక” తల్లిదండ్రులు తమ కుమారులు చక్కగా చదువుకోవాలని కోరుకుంటారు. పిల్లలు కూడా అలాగే అమ్మా నాన్నల కలలు నిజం చేయాలనే సాధనలో ఉంటారు.ఉద్యోగం సంపాదించాలి. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.తను పెళ్లి చేసుకునే అమ్మాయి అందంగా ఉండాలి.కోట్ల ఆస్తిని కట్నంగా తీసుకోవాలి అని చాలా మందికి ఇలాంటి గొంతెమ్మ కోరికలు,ఎదలో గొప్ప ఆశలు కూడా ఉంటాయి.కొందరు విద్యార్థులు వర్తమానంలో జీవిస్తారు.కొందరు విద్యార్థులు వెలుగుతున్న దీపంలా ఉంటారు.కొందరు విద్యార్థులు సమాజం గురించి ఆలోచిస్తారు.కొందరు విద్యార్థులు సామాజిక బాధ్యతను గుర్తెరిగి నడుచుకుంటారు.కొందరు విద్యార్థులు సమాజంలో ధనికులు,పేదలు అనే రెండు వర్గాలు ఎందుకు ఉన్నాయి? అని ఆలోచిస్తారు.ధనికులు పేదలపై చలాయించే ఆధిపత్యం,వివక్ష చూపడం,మనసును కలచివేసే విషయాలపై అవగాహనతో పోరు బాటన సాగుతారు. మనుషులంతా ఒకటే కదా మరి పేద గొప్ప తేడాలెందుకు? అందరిలో ప్రవహించే రక్తం ఒకటే కదా.కుల మతాల పేరిట కొనసాగుతున్న వివక్ష ఏమిటి? అగ్ర వర్ణాలు చేస్తున్న దోపిడీలు దౌర్జన్యాలకు అంతం లేదా? పేదలు ఆరుగాలం కష్ట పడి పని చేస్తున్న కడుపు నిండా తిండి ఎందుకు దొరకదు.పేదలు పస్తులతో ఎందుకు జీవితం గడుపుతున్నారు. తరతరాలుగా పేదరికంతో ఎందుకు మగ్గుతున్నారు.పేదలు చదువు సంధ్య లేక అనాగరికులుగా వెట్టిచాకిరి చేయడం ఏమిటి? పేదలపై జరుగుతున్న దోపిడీకి చరమగీతం పాడాలని సంకల్పం కొందరిలో ఉంటాయి.” ఆ గది/ ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/  చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/ అమృత లోకాల కోసం బాణం సంధిస్తా.” విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి. కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానతలకు చరమ గీతం  పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లోకి దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు. కొందరు విద్యార్థులు భరతమాత ముద్దు బిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు. ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం.పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పోతాం. ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది. ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు. దొరలు పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.సమ సమాజం కోసం పాటుపడేవాళ్లు సూర్యుడి కిరణాలపై పయనిస్తారు.అమృత లోకాలను స్వర్గమంటారు.స్వర్గంలో పాపులకు చోటు లేదు.ప్రజల కోసం అహరహం పాటుపడుతున్న ఆ యువకులను అమృత లోకాలు అక్కున చేర్చుకుంటాయనే కవి భావన చక్కగా ఉంది.చక్కని కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను. 

 గులాబీల  మల్లారెడ్డి  ఖైది సంకల్పం కవిత పై విశ్లేషణా  వ్యాసం

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి  కవితా సంపుటిలోని ఖైది సంకల్పం కవిత పై విశ్లేషణా వ్యాసం. నేరస్తులు అంటే సమాజంలో చెడు అభిప్రాయం ఉంది. నేరాలు,ఘోరాలు,హత్యలు,అత్యాచారాలు,దోపిడీలు, దొంగతనాలు,దొమ్మీలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లను బంధించి జైలుకు పంపిస్తారు.నేరస్తులు నేరాలు చేయడమే వృత్తిగా ఏర్పరచుకుంటారు.కరుడుగట్టిన నేరస్తులు నేర సామ్రాజ్యం స్థాపించి నేరాలకు పాల్పడుతుంటారు. అటువంటి నేరస్తుల ఆట కట్టించేందుకు పోలీసులు,చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి.న్యాయ స్థానంలో నేర నిరూపణ కాగానే నేరస్తులను జైలుకు పంపిస్తారు.జైల్లో ఉన్న నేరస్తులను ఖైదీలు అంటారు.న్యాయస్థానం నేరస్తులను జైలుకు పంపించడం వారికి సరియైన శిక్షగానే భావించ వచ్చు.ఒక ఆశయం కోసం స్వరాజ్య సాధనే లక్ష్యంగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అల్లూరి సీతారామరాజు అమరులయ్యాడు. బ్రిటిష్ వాళ్ళతో స్వరాజ్యం కోసం పోరాడుతూ చాలామంది యువకులు పట్టుబడి జైలు పాలయ్యారు.స్వాతంత్ర్యం సాధించాలన్న లక్ష్యం సంకల్పం వాళ్లలో కనిపించేది.దేశం కోసం పోరాడిన వాళ్లను రాజకీయ ఖైదీలు ఉంటారు.భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్ పార్లమెంట్లో బాంబులు వేసి పట్టుబడ్డారు. తప్పించుకునే అవకాశం ఉన్నా పారిపోలేదు.బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్ లాంటి గొప్ప వీరులను ఉరి తీసింది.అశేష భారత ప్రజానీకం దృష్టిలో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ అమరవీరులుగా నిలిచారు.భారత దేశ చరిత్రలో ఆ ముగ్గురికి విశేషమైన స్థానం ఉంది.ప్రతి సంవత్సరం ఆ విప్లవ వీరులకు నివాళులర్పిస్తారు.వీరు భరతమాత గుండెల్లో కల కాలం గుర్తుండి పోయే వీరులు.కవి మల్లారెడ్డి జైల్లో ఉన్న ఖైది సంకల్పాన్ని మొక్కవోని ధైర్యాన్ని కవిత్వీకరించారు.కవితను కొత్త పుంతలు తొక్కించారు.ఖైదీలు ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నిస్తే జైలులో అని ఠక్కున సమాధానం వస్తుంది.కటకటాల్లో ఖైదీ అంటే ఎవరు? జైల్లో ఉన్న ఖైది.జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైది ఏం చేస్తుంటాడు? జైల్లో  ఖైదీ కటకటాల్లో బందీగా ఉంటాడు.జైలులో ఉన్న ఖైది కళ్ళలో చిరు నవ్వులు ఉంటాయా?జైలులో ఉన్న ఖైది చూపుల్లో చిరు దివ్వెలు ఉంటాయా? జైలులో ఉన్న ఖైది ముఖారవిందంలో  తరగని సంకల్పం ఉంటుందా?కవి మల్లారెడ్డి ఖైది కళ్ళల్లో మెరుస్తున్న చిరునవ్వులు చూశారు.జైలులో ఉన్న ఖైదితో మాట్లాడుతూ చిరునవ్వులు పూయించారు.జైలులో ఉన్న ఖైది చూపుల్లో చిరుదివ్వెలు చూశారు.జైలులో ఉన్న ఖైది ముఖారవిందంలో తరగని సంకల్పాన్ని చెదిరిపోని దీక్షను చూశారు.ఒక లక్ష్యం కోసం,ఒక ఆశయం కోసం,ఒక ఆదర్శం కోసం, మొక్కవోని దీక్షతో పనిచేసిన భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లలో మంచి లక్షణాలను మనం చూశాం.భారత దేశ స్వాతంత్ర్యం కాంక్షించి ఎందరో వీరులు అమరులయ్యారు. ఆనాటి ఆ వీరుల త్యాగాల ఫలితం మనం సాధించుకున్న స్వరాజ్యం.ప్రత్యేక తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో 1969 సంవత్సరంలో 369 మంది యువకులు బలి అయ్యారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేశారు.ఆ వీరుల త్యాగ ధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న బంగారు తెలంగాణ.ప్రత్యేక తెలంగాణ కొరకు ఆ వీరులు బలి అయి తెలంగాణ పువ్వులు పూయించారు.2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం  ఏర్పడింది.తెలంగాణ కొరకు ఎందరో యువకులు జైలు పాలయ్యారు.తన రక్తాన్ని ఇచ్చి నవమాసాలు కడుపులో మోసిన తల్లి తన కొడుకును జైలులో చూడవలసి రావడం దిగులు కలిగిస్తుంది.జైలులో తన కొడుకును చూసిన తల్లికి కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారినాయి. విద్యాబుద్ధులు నేర్పించి పెంచిన కొడుకు పై తల్లికి అపారమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి. ”నువ్వేం చేసావు నాన్న?/ ఎవరికోసం చనిపోతావు ?/అర క్షణం మౌనం… .జైలులో ఉన్న కొడుకుతో అమ్మ అలా అడగింది.అమ్మ ఎవరు? అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మ పరమాత్మ స్వరూపం. అమ్మ కొడుకు పై ఉన్న ప్రేమతో అలా అడగడం సహజం అనిపిస్తుంది.“ఎక్కడో మారుమూల/గుండె కొండల్లో ప్రతిధ్వనులు”.మనుషులకు గుండెలు ఉంటాయి.మనుషులు మాట్లాడితే ధ్వనులు వినిపిస్తాయి.మారు మూల కొండల్లో మనిషి మాట్లాడితే ధ్వనులు,ప్రతిధ్వనులుగా వినిపిస్తాయి.కొండలకు కూడా గుండెలు ఉంటాయని వాటికి ప్రతిధ్వనులు ఉంటాయని కవి మల్లారెడ్డి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. “ప్రజల కోసం/ వ్యవస్థ మార్పు కోసం/సమస్త జనావళి సుఖ సంతోషాల కోసం”.ప్రజల కోసం ఆ యువకుడు మారు మూల కొండల్లో కోనల్లో నివసిస్తూ అహరహం శ్రమ పడుతున్నాడు.వ్యవస్థ మార్పు కోసం సమస్త జనావళి సుఖ సంతోషాల కోసం పోరు బాట పట్టిన యువకుడిని బంధించి జైల్లో వేశారు.”మరుక్షణమే/ అమాయకపు అమ్మ కోసం బదులు”. జైలులో ఉన్న ఆ యువకుడు అమ్మను ఓదార్చడం కోసం అమ్మతో మాట్లాడుతూ ధైర్యం నూరి పోస్తున్నాడు.“అమ్మా పక్కింటి చిన్నాన్న ఎలా ఉన్నాడు”. జైలులో ఉన్న ఆ యువకుడు అమ్మతో మాట్లాడుతూ మన పక్కింటిలో  గల చిన్నాన్న ఎలా ఉన్నాడు? అని ప్రశ్నించాడు.అమ్మ జవాబు ఇస్తూ చిన్నాన్న కలరాతో చనిపోయాడు అని చెప్పింది.“నాన్నగారి స్నేహితుడు అప్పారావు…? ఎలా ఉన్నాడు అని అమ్మను ప్రశ్నించాడు. అమ్మ జవాబు ఇచ్చింది. “ఇద్దరాడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక/మనో వ్యాధితో మంచం పట్టాడు/ రేపో మాపో రోజులు లెక్కబెట్టుతున్నాడు”.అమ్మ జవాబు విని ఆ యువకుడు “అందరు అంతేనమ్మా/ఏదో ఒక రోజు పోవాల్సిందే”. అని సమాధానం ఇచ్చాడు.జాతస్య హి ధృవో మృత్యు :  భగవద్గీతలో ఉంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రబోధిస్తున్నాడు.పుట్టిన వారికి మరణము తప్పదు మనం ఈ భూమి మీదకు వచ్చింది.ఏదో ఒక రోజు మళ్ళీ మనం తిరిగి వెళ్లి పోవాడానికే పుట్టడం గిట్టడం ఇది ఒక అనివార్య కార్యక్రమం. దీన్ని ఎవరు ఆపలేరు.ఇది ఒక జీవన చక్రం.ఇది ఒక జీవిత ప్రయాణం అని తాత్వికంగా అమ్మకు ప్రబోధిస్తున్నాడు. “కాని/మా కలలు నిజాలు అవుతాయి/అప్పుడే కటకటాలుండవు/కన్నీళ్లు ఉండవు”.అని ఆ యువకుడు అమ్మకు తెలియజేస్తున్నాడు.ఏ సంకల్ప సాధన కోసం మేము పోరాడుతున్నామో మా కలలు నిజాలు అవుతాయి. మేం విజయం సాధించిన తర్వాత అప్పుడు కటకటాల జైళ్లుండవు.ఎవరి కళ్ళలో కన్నీళ్లుండవు.అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు కాదు,సంతోషంతో ఆనంద భాష్పాలు ఉబికి వచ్చాయి.
“ఖైది కళ్ళలో/ తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది”.జైలులో ఉన్న ఖైది కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖ శాంతులు లభించడం లేదు. ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది.పాలక వర్గాలు చేస్తున్న దోపిడిని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదిలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్లలో కవి మల్లారెడ్డి ఒకరు.అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైది సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మంచి కవితను రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లా రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని  మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి 164 ( c r p c)  STATEMENT (స్టేటు మెంట్) కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన”పల్లె పొలి మేరల్లోకి” కవితా సంపుటిలోని 164 (c r p c ) STATEMENT.( స్టేట్ మెంట్) కవిత పై విశ్లేషణా వ్యాసం.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం,1973, తెలుగులో నేర విచారణ చట్టం,1973.ఏమి చెబుతుంది.?పోలీసులు వారి బాధ్యతలను,న్యాయస్థానాల చర్యలను,నేరారోపణ చేయబడిన వారి హక్కులను,ఇతర విషయాలను నేర విచారణ చట్టం తెలియజేస్తుంది.నేరం చేసిన వారిని ఖైదు చేసి,కాపలాలో ఉంచి,తగిన నేరారోపణ చేసి, న్యాయ స్థానం సమక్షానికి హాజరు పరిచి,విచారణ తర్వాత, నేరానికి తగిన శిక్షను న్యాయస్థానం విధిస్తున్నది.నేరం సమాచారం అందగానే, దర్యాప్తుని ప్రారంభించి పోలీసు వారు చర్య తీసుకుంటారు.నేరస్థుని పట్టుకోవడం నుంచి అతన్ని విచారణకు లోబరచడం వరకు చర్య తీసుకోవాల్సి ఉన్నది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 164 (c r p c)  STATEMENT (స్టేట్మెంట్)ఏం చెప్తుంది.అంగీకారాన్ని వాంగ్ములాల నమోదు చేయుట గురించి తెలుపుతోంది.వాంగ్మూలాల నమోదు,ఎవరు నమోదు చేస్తారు?పోలీసులు వాంగ్మూలం నమోదు చేస్తారు.చీమలు పుట్టలు పెడతాయి.చీమల పుట్టల్లో పాములు చేరతాయి.పల్లెల్లో చేనులు,చెల్కల్లో పుట్టలు ఉంటాయి.పుట్టల్లో పాములు ఉంటాయని జనాలు దూర దూరంగా వెడతారు. పాములను నాగదేవతగా నాగుల పంచమి రోజున పూజిస్తారు. పాములు బయటకు వస్తే బడిత పూజ చేసి చంపేస్తారు.పాము కోరల్లో విషం ఉంటుందని పాము కుడితే చనిపోతారని జనం నమ్మిక.ఎర్ర చీమలు,నల్ల చీమలు,పసుపు చీమలు,అని చాలా రకాల చీమలు ఉన్నాయి.All ants are social and live in colonies.చీమలు బాగా కష్టిస్తాయని శ్రమజీవులు అని అంటుంటారు.వేసవిలో చీమలు తమ కొరకు ఆహారాన్ని సేకరిస్తాయి.చీమల ఆహారం విత్తనాలు.చీమలు మనుష్యులకు ఎంతో సహాయం చేస్తాయి.నెపోలియన్ చక్రవర్తి ప్రపంచ సామ్రాజ్యాధిపత్యం సంపాదించాలన్న కాంక్షతో ఎన్నో యుద్ధాలు చేశాడు.కొన్ని యుద్ధాలు గెలిచాడు.కొన్నింట్లో  పరాజయం పాలయ్యాడు.నెపోలియన్ చక్రవర్తి యుద్ధం చేసి అలసిపోయి ఒక కొండ గుహలో దాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఆ కొండ గుహలో చీమను చూశాడట. ఎన్నిసార్లు విఫలమైనా చీమ తన ప్రయాణాన్ని అలాగే కొనసాగిస్తుంది.నెపోలియన్ చీమను ఆదర్శంగా తీసుకొని రాజ్య కాంక్ష అయిన యుద్ధాలను కొనసాగిస్తూ ప్రపంచ విజేతగా నిలిచాడని చరిత్ర వల్ల మనకు తెలుస్తున్నది.కవి మల్లారెడ్డి 164 (c r p c) STATEMENT ( స్టేట్ మెంట్) కవిత ద్వారా సమాజానికీ హిత బోధ చేస్తున్నాడు.చీమల్లాగా జీవిస్తున్న 90% జనాలకు ఈ కవిత ఒక స్ఫూర్తిని ఒక వెలుగును ప్రసాదిస్తుంది.”చీమలు పెట్టిన పుట్టలు చీమలకే చెందాలని/ పాములు దూరితే పడగలు కోయండని/చిట్టి చిట్టి చీమలకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తాను”.చీమలను ఉదాహరణగా తీసుకొని చీమల్లాంటి కోట్లాది జనాలకు పాములు దూరితె పడగలు కోయండని కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాడు.ఎంత బలవంతమైన సర్పమైన సరే ఐక్యంగా కలిసి పోరాడిన చలి చీమల ధాటికి ఆగలేదని చీమలకు విజయం కలుగుతుందనే జీవన సత్యాన్ని నూరి పోస్తాను అని అంటున్నాడు.బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కి చావదె సుమతి అని.సుమతి శతక కారుడు బద్దెన చెప్పినట్లు మనం చదువుకున్నాం.”అనంత జీవరాశిలో/
పది శాతం లేని పాముల మాట నమ్మితే/ పాలకవర్గం పాములకే  పావులుగా మారితే/ నా కలాన్ని లాగేస్తే/ నా గళాన్ని నొక్కేస్తే/ఊపిరాడేంత వరకు/ పిడికిలితో పోరాడుతాను/కత్తి లేకున్నా సరే ప్రాణమైన విడుస్తాను”.సృష్టిలో అనంతమైన జీవరాసులు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు.ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.మానవుడు రెండు తెగలుగా విడిపోయాడు. 1) ధనికులు 2)  పేదలు.10 శాతం ఉన్న ధనికులు, 90 శాతం ఉన్న పేదలపై అధికారం చెలాయిస్తున్నారు.10 శాతం లేని ధనిక పాముల మాట చలామణి అవుతోంది.పాలకవర్గం కూడా ధనిక పాముల మాటకే పావులుగా మారుతున్నది. 90 శాతం కంటే ఎక్కువ ఉన్న పేదల పక్షాన పోరాడే కలాలు గళాలు ఉన్నాయి.“నా కలాన్ని లాగిస్తే/నా గళాన్ని నొక్కిస్తే/ఊపిరాడేంత  వరకు/పిడికిలితో పోరాడుతాను”.సామాజిక దృక్పథంతో కవులు రచయితలు పేదల పక్షాన రచనలు చేస్తున్నారు.ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గళాలను విప్పుతున్నారు.“కత్తి లేకున్నా సరే/ ప్రాణమైన విడుస్తాను”.అని ప్రతిన పూని పొరుబాట సాగిస్తున్న వీరులు ఉన్నారు.ఎందరో వీరులు ప్రాణాలు పణంగా పెట్టి పోరు సలుపుతున్నారు.ప్రజా పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయి. తమ హక్కుల కోసం అణగారిన వర్గాల్లో చైతన్యం మొదలైంది.
“కాని/నిరాశా వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/మర్మ సిద్ధాంతాన్ని/ మాయా సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి ఉన్న/చీమలకు మాత్రం చస్తే చెప్పను.” చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య,నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను గళాలను చంపుతున్నారు.అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని, మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను. చీమలను ఉదాహరణగా చెబుతూ 90 శాతం ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని  కాంక్షించే వారిలో ఒకరని 164( c r p c) STATEMENT ( స్టేట్ మెంట్) కవిత చదివితె తెలుస్తుంది.ప్రజాస్వామ్య దేశంలో మనం  నివసిస్తున్నాం.ప్రజల కొరకు ప్రజల చేత  పాలింపబడే దేశమని గొప్పలుగా  చెప్పుకుంటున్నాం.ప్రజాస్వామ్యం అపహస్యం  పాలయింది.మునుగోడు ఎలక్షన్లు అవి ఎలక్షన్లే కావని ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయారనే సంగతి లోకమంతా ఎరిగిందే. అక్కడ ఏ పార్టీ గెలిచిన అది గెలుపు కాదని బలుపు అని ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.ఇంకా సమాజంలో అసమానతలు,వివక్ష  కొనసాగుతుంది.  అసమానతలు వివక్ష రూపుమాపడానికి ప్రజాస్వామ్యవాదులైన కవులు,రచయితలు, ఉద్యమకారులు,కళాకారులు,తమ జీవితాలను అంకితం చేస్తున్నారు.హక్కుల కోసం పోరాడే వాళ్లను అంతం చేస్తున్నప్పటికి.ప్రజా పోరాటాలు నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.ప్రజలకు స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగించే కవితను అందించినందుకు కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను. కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి ” చేదు మాత్ర” కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,జర్నలిస్ట్, సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన “పల్లె పొలిమేరల్లోకి” కవితా సంపుటిలోని “చేదు మాత్ర” కవిత పై విశ్లేషణా వ్యాసం.చేదు మాత్ర ఎవరికి ఇస్తారు?అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రోగం నయం కావడానికి డాక్టర్ చేదు మాత్ర ఇస్తాడు. ఆయుర్వేదం,యునాని,హోమియోపతిలలో వ్యాధులు నయం కావడానికి మూలికలతోని  మందులు తయారు చేస్తారు.ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుండి మందులు తయారు చేయడం ఏమిటి? చిత్రంగా అనిపించవచ్చు.చేదు మాత్ర ఏమిటి? చేదు మాత్ర వేసుకుంటే రోగం తొందరగా నయమవుతుందని రోగులకు అపారమైన విశ్వాసము.చేదు మాత్ర ఇవ్వడానికి మల్లారెడ్డి మెడిసిన్ చదివిన డాక్టర్ కాదు.వృత్తి రీత్యా సీనియర్ న్యాయవాది,ప్రవృత్తి రీత్యా కవి.ఇందులో ఏదో మతలబు ఉంది. చేదు మాత్ర కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. మా పల్లె గొల్ల ఎల్లయ్య గొర్ల కాసుకుని జీవించే వాడు.జీవాలను పెంచుతూ వాటిని పొద్దుగాల నుండి చీకటి పడే వరకు మేపుతూ రాత్రి కాగానే గొర్ల మందకు కంచె వేసి జీవాల మధ్యనే జీవించే అమాయక జీవి. జీవాలను మేపుతూ వాటికి దాహం వేస్తే చెరువుల  వద్ద నీటిని తాపే వాడు.ఇంటి నుండి సద్ది మూట తెచ్చి ఇస్తే స్నానం చేసి అక్కడే ముద్ద మింగి జీవాలతో జీవంగా బతికిన వాడు.అక్షరం పోకడ రాని వాడు.ఎల్లయ్య తల్లిదండ్రులు కూడ జీవాల పెంపకంతోనే జీవితం గడిపారు. ఎల్లయ్యకు చదువు అంటె అదెట్లుంటదో అతనికి తెలువదు. ఎల్లయ్య కూడ తల్లిదండ్రులు ఎలా జీవాలతో మెదిలారో తను కూడ అలా జీవాలతో గడుపుతూ చదువు సంధ్య జోలికి పోలేదు.జీవాలతోనే జీవనాన్ని కొన సాగించాడు.ఊర్లో బడి ఉన్నప్పటికీ తోటి పిల్లల్లా చదువుకోవాలనే ఆలోచన లేని వాడు. ఇరుగు పొరుగు పిల్లలు బడికి పోయి చదువుతుంటే వాళ్ళ లాగా చదవాలని అనుకోలేదు.నలుగురి దగ్గరికి వెళ్లి మాట్లాడలేని వాడు.ఎల్లయ్య గొర్రెలు ఎన్ని కాస్తున్నాడో తెలియని వాడు.గొర్రెల గుర్తులే ఆనవాలుగా ఏలుకునేటోడు కరీంనగర్ జిల్లాలో పుట్టాడు కానీ కరీంనగర్ ని కన్నాగురం అనెటోడు.karal Marx అనటానికి నోరు తిరగని వాడు.”ఏదో అన్యాయం జరిగి/వాడిలో అవేశం పెరిగి/ ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమట వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/వాని పోక డేంది? /పటేలు ఎవ్వడు?/వాని పటాటోపం ఏంది/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి/ కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జిలలో పోలీసు తమ్ముళ్లు ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను.”ఈ కవితను వ్రాసిన సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచే వాళ్ళు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి.దొరలకి,పటేండ్లకి పెండ్లిండ్లకి మరియు పేరంటాలకు జీవాలు ఇనాం ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై,పటేండ్లపై,మరియు పోలీసులపై వానికి కక్ష ఎందుకు ఉంటుంది.ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి.అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం, దొరలు పటేండ్ల  ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి  శిక్ష వేయడం ఎంతవరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కాని తీరా శిక్ష పడ్డాక జడ్జిలలో కూడ పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి  వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన  గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర. జడ్జిలలో పోలీస్ తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జిలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదు మాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.మనసున్న మనుషులు గా చేదు మాత్రను ఇచ్చి రోగాలను నయం చేసే ఆనాటి వైద్యుల వలె మసలు కోవాలి.ఈనాటి వైద్యులు శవాలను అడ్డు బెట్టుకొని డబ్బులు దండుకుంటున్న  తీరును గర్హించాలి.చేదు మాత్ర కవితను పోలీసులు మరియు జడ్జిలు చదవాలి.మంచి కవిత చదివితే సమాజం కొరకు మంచి చేయాలన్న ఆలోచన కలుగుతుంది.పోలీసులు మరియు జడ్జిలలో పరివర్తన రావాలని సమాజ సంక్షేమం కోసమే పాటు పడాలని కోరుకుంటున్నాను. మంచి కవితను రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లా రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

గులాబీల మల్లారెడ్డి  “నిశ్శబ్ద నిరాకార  ఛాయ చిత్రాలు” కవిత పై విశ్లేషణా వ్యాసం.                                                    

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన”పల్లె పొలిమేరల్లోకి “కవితా సంపుటి లోని “నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు”కవిత పై విశ్లేషణా వ్యాసం.కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవి మల్లారెడ్డి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.”మానవతా శిఖరాలని/ అధిరోహించాలని జిగీషీతో/ తపనతో/ఎన్నెన్నో కలలు – అంతర్యంలో  అలలు/ దారిలో ఎన్ని ఆటంకాలు -అవరోధాలు”.కవి మల్లారెడ్డి కవితా పంక్తులు ఎంతో మంచి భావనలను కలిగి ఉన్నాయి.తన కలం ద్వారా సృజన శక్తికి పదును పెట్టాడు.ఇవ్వాళటి సంక్షుభిత సమాజంలో అసలు మానవత్వం ఉందా? అని ప్రశ్నించుకోవలసిన అవసరం వచ్చింది.మానవత్వం ఎక్కడో మూలన చేరి మరుగున పడిన మాణిక్యం వలె దాగి ఉందా? అనే సందేహాం మనలో పొడ చూపుతుంది.ఎవరైనా వ్యక్తి మానవత్వం గురించి మాట్లాడితే పాత కాలం నాటి వ్యక్తి అని వింతగా చూస్తారు.గాంధీ అంటే ఎవరు? అని ప్రశ్నించే రోజులు మనకు ముందు ముందు ఎదురవుతాయి.ఈ కాలం పిల్లలకు గాంధీ అంటే జాతి పిత అని కూడా తెలియదు.మనం మన కరెన్సీ నోట్ల పై గాంధీ బొమ్మ ముద్రించి ఉంటుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 న గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం.అయినప్పటికీ గాంధీ ఎవరు అంటూ మనల్ని నిలదీస్తారు.ఈనాటి తరాన్ని మనం నిందించాల్సిన అవసరం లేదు.రోజులు మారాయి. ఆనాటి నేతలు త్యాగ పురుషుల నడకలు సత్యం పునాదుల మీద సాగేవి.వాళ్ళ ఆలోచనలు ఆచరణలు సమాజ సంక్షేమం దిశగా సాగేవి. అలాంటి నేత అన్నా హజారే ఉన్నారు.ఈనాడు మనుషుల్లో విశాల దృక్పథం కొరవడింది.ఆయినప్పటికీ మల్లారెడ్డి తన కవితల ద్వారా మానవతా భావనలు ప్రేరేపించేలా మనల అందరిని మన చుట్టు ఉన్న సమాజాన్ని మంచితనం తరగల పై నడయాడేలా చేస్తున్నారు.ఇవ్వాళ ఉన్న వ్యవస్థలో మానవతను గురించి ఆలోచించడం చాలా బాధగా ఉంటుంది.రోజు మనం  ఎక్కడ చూసినా అమానవీయ సంఘటనలు మన కళ్ళ ముందు కదలాడుతాయి.మన దేశంలోనే కాదు.అగ్రరాజ్యం అయిన అమెరికాలో కూడా జాత్యహంకారపు విద్వేషపు నీలి నీడలు ఇంకా తొలగిపోలేదు.నల్ల జాతికి చెందిన అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటికీ నల్లజాతి ప్రజల పై శ్వేత జాతీయుల దౌష్ట్యం ఇంకా కొనసాగుతోంది.తెల్ల జాతికి చెందిన అమెరికన్ పోలీస్ అధికారి నల్లజాతికి చెందిన జార్జి ప్లాయిడ్ మెడ పై బూటు కాలుతో తొక్కి ఎనిమిదిన్నర నిమిషాల పాటు చిత్ర హింస చేసి చంపాడు.జార్జి ప్లాయిడ్ మరణం పై  విచారం చెంది నల్ల జాతి ప్రజలు అంతా ఐక్యమై అమెరికా ప్రెసిడెంట్  భవనం పై దాడి చేశారు.అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బంకర్ లోకి వెళ్ళి దాక్కున్నాడు.ప్రజాస్వామ్య దేశం అయిన అమెరికాలో జరుగుతున్న  ఈ అరాచకాలు  మానవతకు మచ్చలు కావా? మానవత అంటే ఏమిటి?అని ప్రశ్నించే రోజులు రానున్నాయా ? అనిపిస్తుంది.అలాంటి ప్రశ్నలు మనకు అడుగడుగునా ఎదురవుతాయి.కవి మల్లారెడ్డి ఈ కవితను 40 ఏళ్ల కింద రాశాడు.మానవతా శిఖరాలను అధిరోహించిన వారు ఎవరు?బుద్ధ భగవానుడు,ఏసుక్రీస్తు,మహమ్మద్ ప్రవక్త,స్వామి దయానంద సరస్వతిలాంటి ఎందరో మహనీయులు ఆ కోవకు చెందిన వారు.పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య దేశం.ప్రజాస్వామ్య దేశంలో కూడా అస్థిరత వల్ల సమాజంలో కల్లోలం చెలరేగి ఆందోళన కలిగిస్తున్నది.ఈనాటి సమాజంలో కొందరు మానవతావాదులు మానవతా శిఖరాలను అధిరోహించాలనే జిగీషీతో తపనతో కృషి చేస్తున్నారు.“ఎన్నెన్నో కలలు- /ఆంతర్యంలో  అలలు/దారిలో ఎన్ని ఆటంకాలు-అవరోధాలు’. కలలు అందరికీ ఉంటాయి.కాని ఆ కలలను సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు.తెలంగాణ సాధన కొరకు తొలిదశలో 369 మంది అమరులైన వీరులు,మలి దశలో అమరులైన 1200 మంది వీరులను మానవతామూర్తులు అని పేర్కొనవచ్చు. “ఆంతర్యంలో అలలు”.ప్రతి మనిషి అంతర్యంలో దేవుడు ఉంటాడు అంటారు.అందుకే జీవుడు దేవుడు అన్నారు.ప్రతి మనిషిలో మనసులో చెలరేగే ఆలోచనలు రెండు రకాలు అని చెప్పవచ్చు.ప్రతి మనిషిలో కనిపించే మనసు అతని ముఖంలో ప్రస్ఫుటంగా ప్రతిపలిస్తూ ఉంటుంది.ప్రతి మనిషిలో కనిపించని మనసులోని ఆలోచనలు అతనిలో అంతర్యామి రూపంలో దాగి ఉంటాయి.కనిపించే మనసు,కనిపించని మనసులోని భావనలు యదార్థమైనవి.నోటితో మంచి పలుకుతూ నొసటితో వెక్కిరించే వారు ఎక్కువ ఉన్న సమాజంలో జీవిస్తున్నాం.నోటితో నొసటితో కూడా యథార్థాన్ని వెల్లడించే సౌశీల్యత ఎందరికి ఉంటుంది? అలాంటి సౌశీల్యత ఉన్నవాళ్లే మానవతామూర్తులు అని చెప్పవచ్చు.జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని భావించడంలో సందేహం లేదు.సముద్రంలో అలలు ఏం చేస్తుంటాయి?గులక రాయి వేస్తే అలలు అక్కడే ఆగిపోవు. అలలు తీరాన్ని చేరాలనే తపనతో తహతహలాడుతూ ఉంటాయి.”దారిలో ఎన్ని ఆటంకాలు -/అవరోధాలు”.తెలంగాణ కోసం 56 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది.ఎంతో మంది  పిట్టల్లా రాలిపోయారు.తెలంగాణ కల సాకారమైంది.తెలంగాణ ప్రాంత అస్తిత్వం కొరకు పోరాటం చేయాల్సి వచ్చింది.ఆ పోరాటంలో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి జూన్ 2, 2014 చరిత్రలో ఒక మైలురాయి.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.ఔనన్నా  కాదన్నా ఇది నిజం. “భూగోళాన్ని బంతిగా ఆడుకోవాలని/ రాజకీయ ఆటగాళ్ళు/పాచికలతోనే గెలిచింది.’మనకు తెలిసిన మహాభారత గాధను కవి మల్లారెడ్డి గుర్తు చేస్తున్నాడు.మహా భారతం చరిత్రలో నిలిచి పోయింది.అది మనం ఎప్పటికీ మరిచిపోని గాధ.దుర్యోధనుడు ధర్మ యుద్ధం ద్వారా పాండవులను గెలువలేమని తెలుసుకొని శకుని ద్వారా మాయా ద్యూతం ఆడించి పాండవులను అడవుల పాలు చేశాడు.కాని తర్వాత 12 ఏళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత పాండవులకు వారి రాజ్యం వారికి అప్పగించాలి.కాని దుర్యోధనుడు రాజ్యం పాండవులకు అప్పగించ లేదు.దుర్యోధనుడు యుద్ధమునకు పురికొల్పాడు. ఆనాటి ధర్మయుద్ధంలో పాండవులు గెలిచారు.కౌరవులు ఓడిపోయారు.ధర్మం గెలిచింది.అధర్మం ఓడిపోయింది.ఈనాటి కలియుగంలో రాజకీయ ఆటగాళ్లు భూగోళాన్ని బంతిలా ఆడుకోవాలని పాచికలతోనే గెలిచింది అనే విషయాన్ని మనందరికీ  విశదం చేస్తున్నాడు. “నువ్వా? నేనా? చూసుకుందామనే/కుటిల కుతంత్ర శాంతి కాముకులు”.ఈనాటి సమాజంలో రాజకీయం వికృత రూపం దాల్చింది.ఊసరవెల్లి రాజకీయాలతో అధికారం పొందడానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.ప్రజలను వాగ్దానాల ఎరలు వేసి  దోపిడీ చేస్తున్నారు.ప్రజల కొరకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశామని చెబుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.కుట్రలతో,కుతంత్రాలతో,రాజకీయ నాయకులు అధికారాలను చేజిక్కించుకొని శాంతికాముకుల పై చేస్తున్న దోపిడీని కవి మల్లారెడ్డి తన కవిత ద్వారా తీవ్రంగా ఎండగడుతున్నాడు.”పైస కోసం కళ  -కళ కోసం కళ కాదనే/సినీ చిత్రాలు – ఆడ నవలల కుప్పలు”..కళలు ఎన్ని అంటే అవి అరువది నాలుగు అని ఎరిగినదే.కవి మల్లారెడ్డి చెప్పినట్లు పైస కోసం కళ తయారయింది.కళను పైస నడిపిస్తుంది.పైస లేని కళకు గుర్తింపు లేదు.సృజన చేసిన కవికి రాణింపు లేదు.ఎంత గొప్పగా రాసినా ఏదో మతలబు ఉంటేనే అది ప్రింట్ అవుతుంది.లేకుంటే ఆ కవికి గుర్తింపు లేదు.కళలు మానవ మనుగడకు దోహదం చేశాయి.కళల పట్ల కళాకారుల పట్ల చిన్నచూపు ఇప్పటికీ కొనసాగుతోంది.కళ కోసం కళ కాదనే సినీ చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం.సినీ జగత్తు ఊహ లోకాల్లో విహరింపజేస్తూ ప్రజలను మాయలో పడవేస్తుంది.ఆ మాయలోనే,మత్తులోనే జనాలు మూడు గంటలు సినిమాను చూస్తూ ఆనందించడం మనం చూస్తూనే ఉన్నాం.నిజ జీవితానికి సినిమాకు తేడా ఉంది.అయినప్పటికీ జనాలు ఆ మాయలో మత్తులో పడి మునిగి తేలుతున్నారు.40 ఏళ్ల కింద ఆడ నవలలు కుప్పలు తెప్పలుగా వస్తుండేవి.ఏ పత్రిక తిరిగేసిన ఆడవాళ్ళ నవలలే ఉండేవి.మగవాళ్ళు రాసిన నవలలు కనిపించేవి కావు.మగవాళ్ళు నవలలు రాసినప్పటికీ ఆడవాళ్ళ పేరు మీద రాస్తేనే పత్రికల్లో ప్రచురింపబడుతుండేవి.ఆ నవలలలో వాస్తవిక జీవిత చిత్రణ ఎక్కడ వెతికినా కనిపించేది కాదు.ఏవో ఊహలు కాల్పనిక జీవితాన్ని చిత్రించేవి. సమాజానికి ఆ నవలల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు.”దమ్మారే దమ్ శ్రుతులు – /జుగుప్స నింపుతున్న మతులు”.సినిమాల్లో చూపిస్తున్న దమ్మారే దమ్ శ్రుతులు ఎగురడాలు,దుముకడాలు,అవాస్తవ స్థితికి అద్దంపడుతున్నాయి.తల్లి,తండ్రి,కొడుకు,కూతురు ఆ సినిమా నృత్యాలు కుటుంబంతో కలిసిమెలిసి చూడాల్సిన విధంగా ఉండటం లేదు.సినిమాలు చూస్తే సినిమాల్లో డ్యాన్సులు నిజంగానే జుగుప్స కలిగిస్తున్నాయి.ఏం సినిమా చూసామనే నైరాశ్యం మనల్ని ఆవహిస్తుంది.”ఏదో బలమైన అన్వేషణ/నా నర నరాల్లో పొంగినప్పుడు/ స్వాప్నిక జగత్తు ధరిత్రిని/ నా పద్యాలలో పదాలలో ఆవిష్కరిస్తూ”. కవి మల్లారెడ్డి  ఉబుసు పోక కొరకు కలం పట్టిన వ్యక్తి కాదు.సమాజంను సామ్యవాదం దిశగా నడిపించాలని కాంక్ష గల వ్యక్తి.స్వప్నలోక ప్రపంచంలో భూమండలమంతా వ్యాపించి ఉన్న ధరిత్రి భూమాతను పద్యాలలో పదాలలో ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఊరకనే జరగవు.థామస్ అల్వా ఎడిషన్ మనం ఉపయో గించే బల్బును తయారు చేయడానికి 999 సార్లు ప్రయత్నించాడట.అయినప్పటికి నిరాశ చెందక వెయ్యో సారి బల్బును కనిపెట్టాడు.మహానుభావుల ఆవిష్కరణలు అలాగే ఉంటాయి.ఆపిల్ పండు నెత్తి మీద పడగానే భూమికి గురు త్వాకర్షణ శక్తి ఉందని నిరూపించాడు న్యూటన్ మహాశయుడు.”నా అంతర్యం చెలిమె నుండి/ జాలువారుతున్న ప్రతి కళా బిందువు/ఒక రసరాగ ఝరి అనంత సౌరభాల విరి”.సృజన చేసే కళ అందరికీ అబ్బదు.సృజన కారులని కవులు అంటారు.నా మనస్సు లోపల నుండి దూసుకు వచ్చే కవిత్వం చెలిమెలోని ఊటలాగా జాలు వారుతున్న ప్రతి కళాబిందువు నవరసాలతో కూడిన రాగాలను ఆలపిస్తున్న జలపాతం.నేను రాస్తున్న కవిత్వం అనంతమైన సువాసనలు వెదజల్లుతున్న పూల తోటలోని పువ్వు అని కవి మల్లారెడ్డి  వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.”ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు”.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి.అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని చివరకు మానవతనే ముఖ్యమని మానవత కోసమే ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి మల్లారెడ్డి చాలా బలమైన భావాలతో కవితను రాసినట్టు మనకు గోచరిస్తుంది.ఈ కవితలో వాడిన పదజాలం కవితా సంపుటి పల్లె పొలిమేరల్లోకి కవితలన్నింటిలో తలమానికంగా ఉంది.కవి మల్లారెడ్డి నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవిత మొత్తం కవితా సంపుటిని అజరామరం చేసింది.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వరంగల్ జిల్లా శాసనాలు-సంవత్సరాలు

by Acharya Madireddy Andamma March 31, 2024
written by Acharya Madireddy Andamma

సాంకేతిక పరిభాష

పరిచయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974లో వరంగల్ జిల్లా (వ.జి.)కు చెందిన 142 శాసనాలను ముద్రించింది. 1985కు పూర్వం ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు తాలూకాలుగా విభజింపబడి ఉండేవి. ఈ కారణంగా ఆ యా గ్రామాలకింద తాలూకా పేరు ఉంటుంది. వరంగల్ జిల్లాలో ఉన్న 142శాసనాలు దిగువ తెలిపిన అరవైనా లుగు (64)  గ్రామాలల్లో లభించాయి. అత్యధిక శాసనాలు వరంగల్ తాలూకాలో ఉన్నాయి. అందులోనూ ఒక వరంగల్

కోటలోనే దాదాపు ఇరవై (20) శాసనాలున్నాయి, హనుమకొండలో పదిహేను (15) శాసనాల లభించాయి.

ఆ యా శాసనాల వివరాలను తెలుసుకున్న తర్వాత శాసనాలలోని సంవత్సరాల గురించి తెలుసుకుందాం.

శాసనాల వివరాలు:

అకారాది క్రమం ప్రకారం 63 గ్రామాలు – 142శాసనాలు

1)            అయ్యనవోలు     (శా.సం. 23, 103)

2)            అశోక్ నగర్                 (శా.సం.116)

3)            ఆకునూరు                 (శా.సం.3,37)

4)            ఇంగుర్తి           (శా.సం. 49, 59, 60. 76,106)

5)            ఉరుసుగుట్ట                (శా.సం. 99, 100)

6)            కంఠఆత్మకూరు   (శా.సం.75)

7)            కందికొండ                  (శా.సం. 194,105)

8)            కాజీపేట           (శా.సం. 1,4,15)

9)            కుందవరం                  (శా.సం. 58)

10)కుమరపల్లి              (శా.సం. 13)

11) కొండపర్తి               (శా.సం. 48, 142)

12) కొరవి                   (శా.సం.6,137,138, 139, 140)

13) కొలనుపల్లి    (శా.సం. 87,88)

14) గిర్మాజిపేట   (శా.సం. 61,93)

15) గుండాల      (శా.సం. 78, 117)

17) గుర్జాల                       (శా.సం. 32)

18) గూడూరు              (శా.సం. 27)

19) గోబిచెర్ల       (శా.సం. 120, 121,122)

20) గోవిందపురం (శా.సం. 26)

21) ఘనపూర్              (శా.సం. 82,114,115 )

22) చిట్యాలపాడు (శా.సం. 52)

23) చీర్యాల                 (శా.సం. 112,133)

24) జఫర్ ఘడ్             (శా.సం. 2)

25) తాటికొండ              (శా.సం. 30)

26) డిచ్చకుంట   (శా.సం. 55,56)

27) ధర్మారావుపేట         (శా.సం. 69)

28) ధర్మసాగర్             (శా.సం. 74)

29) నరసం పేట            (శా.సం. 16)

30) నర్సింలుపేట      ( శా.సం. 9)

31) నవాబుపేట   (శా.సం. 5,134)

32) నారాయణగిరి (శా.సం.     10,135,136)

33) నిడిగొండ     (శా.సం. 7.17,57)

34) నీలకుర్తి                (శా.సం. 77)

35) పర్కాల                (శా.సం.81)

36) పాకాల                 (శా.సం. 67)

36) పాకాల                 (శా.సం. 67)

37) పాలంపేట.  (శా.సం. 50, 79)

38) పెంబర్తి                 (శా.సం. 126)

39) పెద్దాపూర్              (శా.సం. 125)

40) పొన్నవోలు             (శా.సం. 10)

41) బనాజిపేట              (శా.సం. 14)

42) బెక్కల్లు       (శా.సం. 20,38,42)

43) బైరాన్పల్లి               (శా.సం. 18,19)

44) మచ్చపురం (శా.సం. 51,54)

45) మట్టెవాడ (శా.సం. 33,68,130)

46) మహబూబాద్         (శా.సం.84,90)

47) మాటేడు(శా.సం. 24, 25,86)

48) ముప్పవరం            (శా.సం. 70)

49) మేడపల్లి(శా.సం.21,118,119)

50) మొగలిచెర్ల    (శా.సం. 123,124)

51) మొరిపిరాల            (శా.సం. 40)

52) యెల్లంపేట             (శా.సం. 39)

53) యెల్కుర్తి     (శా.సం. 73,91)

54) రాంపూర్               (శా.సం. 85)

55) రాఘవాపురం          (శా.సం. 11)

56) రామన్నపేట           (శా.సం. 53)

57) రాయపర్తి     (శా.సం. 66, 83)

58) రాజులకొత్తపల్లి          (శా.సం. 92)

59) వరంగల్కోట శాసనాలు మొత్తం = 20

(3.30. 34,41,46,47,62,63,65,71,89,95, 96, 97, 98, 102, 108, 109, 111,131,132,141 =

20శాసనాలు

60) వర్దన్నపేట             (శా.సం. 72)

61) వెంకటాపురం (శా.సం. 31)

62) శామీర్ పేట            (శా.సం. 98)

63) సాయంపేట            (శా.సం. 110)

64) హన్మకొండ             (శా.సంఖ్యలు)

హన్మకొండశాసనాలు మొత్తం = 15 (శా.సం. 22, 23, 29, 35, 36, 43, 44,45,80,94,101,113,127, 128, 129).

శాసనాలుతాలూకాలు:

ఈ శాసనాలను తాలూకాల పరంగా విభజించిచూస్తే, అత్యధికంగా 72శాసనాలు వరంగల్లు తాలూకా లో లభించాయి. 23శాసనాలు మహబూబాబాద్ తాలూకాలో, 19శాసనాలు జనగాంతాలూకాలో, 15శాసనాలు నరసంపేట తాలూకాలో, 9శాసనాలు ములుగు తాలూకాలో, మూడు (3) శాసనాలు పర్కాలలో లభించాయి. ఒకే ఒక శాసనానికి రామన్నపేటశాసనం (53) తాలూకా పేరు లేకుండా ఉన్నది.

శాసనాలు – గ్రామాలు

శాసనాలను గ్రామాలపరంగా చూసినపుడు అ) అత్యధిక శాసనాలున్న గ్రామాలు, ఆ) ఐదు శాసనాలు ఉన్న గ్రామాలు, ఇ) మూడుశాసనాలున్న గ్రామాలు, ఈ) రెండు శాసనాలున్న గ్రామాలు, ఉ) ఒక శాసనమున్న గ్రామాలు అని విభజించవచ్చు.

ఈ విభజన వల్ల ఆయా గ్రామాల వైశిష్ట్యం, గ్రామాల ప్రాచీనత, ఆ యా గ్రామాలలో ఉన్న వ్యక్తులు, జరిగిన సంఘటనలు,వ్యక్తులఇంటిపేర్లు, వృత్తులఆపాధాన్యత, వారి కిచ్చిన లేదా పొందిన హక్కులు మొదలైన అంశాలు, వాటి ప్రాచీనతలు, ప్రాముఖ్యతలు తెలుస్తాయి.

అ) అత్యధిక శాసానాలున్న గ్రామాలు:

20 శాసనాలు – వరంగల్ కోట

(8.30.34,41,46,47,62,63,65,89,95,96, 97, 98, 102,108,109,111,131,132,141)-

వరంగల్ తాలూకా

15 శాసనాలు: హనుమకొండ

శా. సం. 22, 28, 29, 35, 36, 43, 44, 45,80, 94, 113,127, 128, 129 – వరంగల్ తాలూకా

ఆ) ఐదు శాసనాలు:గ్రామాలు:

కొరవి    (శా.సం. 6,137,138, 139, 140) మహబూబాబాద్ తాలూకా

ఇనుగుర్తి (49, 59, 60,76,106) మహబూబబాద్ తాలూకా

ఇ) మూడు శాసనాలున్న గ్రామాలు:

1) నిడిగొండ (శా.సం. 7,17,57) జనగాంతాలూకా

2) చేర్యాల(శా.సం. 8,112,133) జనగాంతాలూకా

3) బెక్కల్లు (శా.సం. 20,38,42) జనగాం తాలూకా

1) మాటేడు (శా.సం. 24, 25, 86)                     మహబూబాబాద్ తాలూకా

2) నర్సింలుపేట (శా.సం. 107,135,136)          మహబూబాబాద్ తాలూకా

1) మేడపల్లి       (శా.సం.21,118,119)                          నరసంపేటతాలూకా

1) ఖాజీపేట       (శా.సం. 1,3,15)                                  వరంగల్ తాలూకా

2) మట్టెవాడ      (శా.సం. 33, 68, 130)                         వరంగల్అలూకా

3) గోబిచెర్ల        (శా.సం. 120,121,122)                      వరంగల్అలూకా

ఈ) రెండు శాసనాలున్న గ్రామాలు:

1) ఆకునూరు(శా.సం. 3,37) జనగాంతాలూకా

2) నవాబుపేట (శా. సం. 5,134) జనగాంతాలూకా

3) బైరాన్ పల్లి     (శా.సం. 18,19) జనగాంతాలూకా

1) మహబూబాబాద్ (శా. సం. 84,90) మహబూబాబాద్లోలూకా

2) కందికొండ(శా.సం. 104,105) మహబూబాబాద్ లూకా

1)            పాలంపేట (శా.సం. 50, 79)               ములుగు తాలూకా

2)            మాచపురం (శా.సం. 51,54)            ములుగు తాలూకా

1)            గుండాల (శా.సం. 78,117) నరసంపేట తాలూకా

2) దిచ్చకుంట     (శా.సం. 55,56) నరసంపేట తాలూకా

1) మొగిలిచెర్ల     (శా.సం. 123, 124) వరంగల్ తాలూకా

2) అయ్యనవోలు (శా.సం. 23,103) వరంగల్ తాలూకా

3) ఉరుసుగుట్ట   (శా.సం. 99,100) వరంగల్ తాలూకా

4) కొండపర్తి       (శా.సం. 48,142) వరంగల్ తాలూకా

5) రాయపర్తి      (శా.సం. 66, 83) వరంగల్ తాలూకా

6) కొలనుపల్లి     (శా.సం. 87,88) వరంగల్ తాలూకా

7) యెల్కుర్తి      (శా.సం. 73,91) వరంగల్ తాలూకా

8) గిర్మాజిపేట     (శా. సం. 61,93) వరంగల్ తాలూకా

ఉ) ఒక్క శాసనమున్న గ్రామాలు

1) శామీర్పేట     (శా.సం. 12) జనగాంతాలూకా

2) గూడూరు      (శా.సం. 27 ) జనగాంతాలూకా

3) కుందవరం     (శా.సం. 58) జనగాంతాలూకా

4) పెంబర్తి         (శా.సం. 126) జనగాంతాలూకా

1) ఎల్లంపేట       (శా.సం. 39) మహబూబాబాద్లూకా

2) నీలకుర్తి        (శా.సం. 77) మహబూబాబాద్లూకా

3) రాజులకొత్తపల్లి (శా.సం. 92) మహబూబాబాద్లూకా

1)            వెంకటాపూర్ (శా.సం. 31) ములుగు తాలూకా

2)            చిట్యాలపాడు (శా.సం.52) ములుగు తాలూకా

1) ఖాన్ఆత్మకూర్ (శా.సం. 75) పర్కాల తాలూకా

2) పర్కాల (శా.సం.81) పర్కాల తాలూకా

3) సాయంపేట (శా. సం.110) పర్కాల తాలూకా

1) ధర్మారావుపేట (శా.సం. 69) నరసంపేట తాలూకా

2) రాంపూర్       (శా.సం.85) నరసంపేట తాలూకా

3) అశోక్ నగర్    (శా.సం. 116) నరసంపేట తాలూకా

4) గుర్జాల         (శా.సం. 32) నరసంపేట తాలూకా

5) పాకాల         (శా.సం. 67) నరసంపేట తాలూకా

6) బానాజిపేట     (శా.సం. 14) నరసంపేట తాలూకా

7) నరసంపేట (శా.సం. 16) నరసంపేట తాలూకా

8) గోవిందపురం (శా.సం. 26) నరసంపేట తాలూకా

1)            రామన్నపేట (శా.సం.53) తాలూకా పేరు లేదు

1) జాఫర్ ఘడ్ (శా.సం. 2) వరంగల్ తాలూకా

2) నారాయణగిరి (శా.సం. 9) వరంగల్ తాలూకా

3) పున్నవోలు (శా.సం. 10) వరంగల్ తాలూకా

4) రాఘవపురం  (శా.సం.11) వరంగల్ తాలూకా

5) కుమర్పల్లి      (శా.సం. 13) వరంగల్ తాలూకా

6)పెద్దాపూర్       (శా.సం. 125) వరంగల్ తాలూకా

7) సిద్ధేశ్వరగుట్టహనుమకొండ (శా.సం.101) వరంగల్ తాలూకా

8) మొరిపిరాల (శా.సం. 40) వరంగల్ తాలూకా)

9) ఖుషీమహల్ వరంగల్ (శా.సం.71) వరంగల్ తాలూకా

10) వర్ధన్నపేట (శా.సం. 72) వరంగల్ తాలూకా

11) ధర్మసాగర్ (శా.సం. 74) వరంగల్ తాలూకా

12) ముప్పవరం (శా.సం. 70) వరంగల్ తాలూకా

13) తాటికొండ (శా.సం. 30) వరంగల్ తాలూకా

శాసనాలు – సంవత్సరాలు

ఈ నూటనలభైరెండు(142) శాసనాలలో 87 శాసనాలకు సంవత్సరాలు లేవు. ఇక మిగిలినవి 55 శాసనాలు. అందులో ఒక శాసనంలో శక సంవత్సరం గాకుండా కలియుగసంవత్సరాన్ని పేర్కొన్నారు, శక సం వత్సరం పేర్కొనలేదు.

ఇక మిగిలిన 54శాసనాల్లో కొన్నిట్లో కేవలం తెలుగు అంకెల్లో శక సంవత్సరాన్ని పేర్కొన్నారు. ఇలా ఇలా రకరకాల విభజనలు పోగా పహేను (15) శాసనాలలోని సంవత్సరాలకు ‘సాంకేతిక పరిభాష’ను వాడార 3. అందులోనూ ఒకటి శిథిలరూపంలో ఉంది. ఇక మిగిలిన పద్నాలుగు 14) శాసనాలు స్పష్టంగా ‘సాంకేతిక పరిభాష’లో ఉన్నాయి.

మిగిలిన 54శాసనాలలో కొన్నిటిలో శకసంవత్సరం గాకుండా చాళుక్యవిక్రమశకం లేదా ఆయా రాజుల పరిపాలనా కాలాన్ని(సంవత్సరాన్ని) పేర్కొన్నారు. కొన్నిటిలో చాళుక్యవిక్రమశకం మరియు శక సంవత్స రాన్ని తెలుగుఅంకెల్లో పేర్కొన్నారు.

కొన్నిట్లో కేవలం శక సంవత్సరాన్ని తెలుగు అంకెల్లో పేర్కొన్నారు. ఇలా ఇలా రకరకాల విభజనలు పోగా పదిహేను(15) శాసనాల్లో సంవత్సరాలకు ‘సాంకేతిక పరిభాష’ను వాడారు. అందులోనూ ఒకటి శిథిల రూపంలో ఉంది. ఇక మిగిలిన పద్నాలుగు 14) శాసనాలు స్పష్టంగా ‘సాంకేతిక పరిభాష’లో ఉన్నాయి. ఈ వ్యాసంలో ఆ పద్నాలుగు(14) శాసనాల సాంకేతికపరిభాష గురించి, సంవత్సరాల గురించి వివరించడం జరిగింది.

ఈ పరిభాషను కుడి నుండి ఎడమకు చదవాలి, రాయాలి. అలా వచ్చిన శక సంవత్సరానికి 78 కలిపి తే వచ్చేది (కామన్ ఎరా = సి ఇ). ఇప్పుడు మనం వాడుకుంటున్న సాధారణ సంవత్సరం అంటే క్రీ.శ. వరంగల్ జిల్లా శాసనాలు-సంవత్సరాలు-సాంకేతిక పరిభాష:

1.సముద్ర పుర భేందుమితే శకాబ్దే

(మేడిపల్లిశాసనం.21, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 52)

సముద్రం  = 4

పుర     = 3

 ఖ      =  ఆకాశం=  0

ఇందు=చంద్రుడు= 1

శక సంవత్సరం 1034, క్రీ.శ. 1112

2. సక(శక)మహీపాలాబ్దనికరంబు నయజలనిధినభోవిధు సంఖ్య (మాటేడు శాసనం. 24, వరంగల్ జిల్లా

శాసనాలు, పుట. 68

నయ = కండ్లు =  2

జలనిధి=సముద్రం=4

నభ = ఆకాశం = శూన్యం = సున్న (0)

విధు = చంద్రుడు =

శక సంవత్సరం 1042, క్రీ.శ. 1120

3. రత్నాంబోధి వియత్శశాంక గత శాకాబ్దే

(గోవిందపురం శాసనం. 26, వరంగల్ జిల్లా శాసనాలు,పుట. 74)

రత్నం = త్రిరత్నాలు= 3

(బుద్ధం, ధర్మం, సంఘం శరణం గచ్ఛామి)

అంబోధి = సముద్రం= 4

వియత్ = ఆకాశం= 0

శశాంక=చంద్రుడు= 1

శక సంవత్సరం 1043, క్రీ.శ. 1121

4. శాకాబ్దే తత్వరురదైరిమతిమతి రుధిరోద్గారి

(కొండవర్తి శాసనం. 48, వరంగల్ జిల్లా శాసనాలు, పుట.136)

తత్వ = పంచభూత తత్త్వాలు (5×5) = 25

రుద్రైః = ఏకాదశ రుద్రులు = 11

శక సంవత్సరం 1125, క్రీ.శ.1203

5. శాక్యేహ్యర్కేందు సంఖ్యే

(ఇనుగుర్తి శాసనం. 49. వరంగల్ జిల్లా శాసనాలు, పుట.141)

అహి =నాగులు  = 8

అర్క = సూర్యుడు = 12

ఇందు = చంద్రుడు =1

శక సంవత్సరం 1128, క్రీ.శ.1206

6. శరలోకేందు భూసంఖ్యే శాకాబ్దే|

(పాలంపేట శాసనం. 50, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 149)

శర = మన్మథుని బాణాలు = 5

లోక = త్రిలోకాలు =3

ఇందు = చంద్రుడు = 1

భూ = భూమి =1

శక సంవత్సరం 1135, క్రీ.శ.1213

7. శరలోకేందు భూసంఖ్యే శాకాబ్దే

(చిట్యాలపాడు శాసనం. 52, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 156)

శర = మన్మథుని బాణాలు = 5

లోక = త్రిలోకాలు  =3

ఇందు = చంద్రుడు = 1

భూ = భూమి =1

శక సంవత్సరం 1135, క్రీ.శ.1213

8. చంద్రాబ్ధీశమితే ప్రమాధిని శకస్యాబ్ధౌ

(నిడిగొండ శాసనం. వరంగల్ జిల్లా శాసనాలు, పుట.171)

చంద్ర = చంద్రుడు = 1

అభి= సముద్రం  =4

ఈశ = ఈశులు = 11

శక సంవత్సరం 1141, క్రీ.శ.1219

9. ప్రమాధిని శకస్యాబ్దే, (త్ర ——) శిథిలం

(కుందవరం శాసనం, 58, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 176)

10. రామాబ్ధి రుద్రగణితే శాకేబ్దే వృషసంజ్ఞకే|

(ఇంగుర్తి శాసనం. 59, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 176)

రామ= ముగ్గురు రాముళ్లు = 3

అబ్ధి = సముద్రం = 4        

రుద్ర=ఏకాదశరుద్రులు = 11

శక సంవత్సరం 1143, క్రీ.శ. 1

11. నేత్ర రసేందు భూ పరిమితే శాకాబ్దకే

(కొండపర్తి శాసనం. 64, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 198)

నేత్ర = కండ్లు=2

రస = ఆరు రసాలు= 6

ఇందు = చందుడ్రు= 1

భూ= భూమి= 1

శక సంవత్సరం 1162, క్రీ.శ.1240 – 1

12. శాకాబ్దే గిరి తర్క భూ శశి మితే

(వరంగల్కోటశాసనం. 65, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 2000)

గిరి=  సప్తగిరులు= 7

తర్క= ఆరు శాస్త్రాలు= 6

భూ= భూమి= 1

శశి =చందుడ్రు= 1

శక సంవత్సరం 1167, క్రీ.శ. 1245

13. శాకాబ్దే శశినంద భాస్కరమితే

(అయనవోలుశాసనం. 103, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 273)

శశి = చంద్రుడు   = 1

నంద =  నందులు          = 9

భాస్కర = సూర్యుడు = 12

(ద్వాదశ ఆదిత్యులు)

శక సంవత్సరం 1291, క్రీ.శ.1369

14. శాకేద్రి రంధ్ర నేత్రేందు సంఖ్యే రాక్షసహాయనే

(కందికొండశాసనం. 104, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 279)

అద్రి=  పర్వతాలు =7

 రంధ్ర = మానవశరీరంలోని రంధ్రాలు= 9

నేత్ర = కండ్లు

ఇందు= చందుడ్రు =  1

శక సంవత్సరం 1297, క్రీ.శ.1375,

15. శాకాబ్దే తత్త్వ దేవవ్రజి(జ) విభుగణితే రక్తసంవామి వర్షే (వరంగల్కోటశాసనం. 111, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 291)

తత్త్వ = పంచభూత తత్వాలు = 25

దేవ=    4

ప్రజి= కృష్ణుడు    =1

శక సంవత్సరం 1425, క్రీ.శ. 1504,

వరంగల్ జిల్లాలోని పై శాసనాలను పరిశీలించినపుడు క్రీ.శ.12వ శతాబ్దపు ప్రారంభ కాలం నుండి అంటే పావులూరిమల్లన కాలం నుండి క్రీ.శ.14వ శతాబ్ది అంతం వరకు దాదాపు మూడు శతాబ్దాలు శాసనాల లో ఈ సాంకేతిక పరిభాషను వాడినట్టు తెలుస్తున్నది.

(ఈ వ్యాసం ఇంతకు ముందు వ్యాసానికి పొడిగింపు అని గమనించగలరు)

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

హోలి జీవన కేళి

by Jyostna Prabha March 31, 2024
written by Jyostna Prabha

ఒక వేకువ ఉదా రంగు కిరణమై

హృదయంలో నాదం మోగిస్తుంది

ఒక నీలిమ అనంత ఆకాశమై

మనసులో ప్రశాంత భావాన్ని మీటుతుంది

ఒక గాఢ నీలం విశాల సంద్రమై

వేయి కెరటాలుగా సంచలిస్తుంది

ఆకుపచ్చదనం అవనిపై పరిచిన వృక్షజాలమై

ఆహ్లాదాన్ని పెంచుతుంది

ఒక పసిమివర్ణం తీయని ఆమ్రమై

మాధుర్యం పంచుతుంది

ఒక నారింజ రంగు సాయం సంధ్యా కిరణమై

వేయి రాగాలు దిద్దుతుంది.

ఒక రక్త వర్ణం అనురాగమై

అంత రంగాలను స్పృశిస్తుంది

ప్రపంచమంతా సప్త వర్ణమయం

ఇది హోలీ ఇది వసంతోత్సవం.

ఇది ఆమని పలకరింత.

ఒక్కో వర్ణం జీవితాన్ని రంగులమయం చేస్తుంది

విషాద ని శీధాలను వదలి వేస్తూ ఉల్లాస ఉదయాలకు ఊపిరి పోస్తూ

ప్రతి ఏటా ఉత్సాహం పంచుతుంది హోలీ బ్రతుకులు రాగరంజితం చేసుకోమంటుంది ఈ రంగుల కేళి.

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi March 31, 2024
written by Chillara Bhavanidevi

ధారావాహికం – 11వ భాగం

అన్నపూర్ణాదేవి మందిరం సుందర మనోహరంగా ఉంది. అత్తరు గుబాళింపులు, పూలగుచ్ఛాల స్వాగతాలు రాయల మనసుకు మరింత ఆహ్లాదాన్ని సమకూరుస్తున్నాయి.
ఎక్కడనుంచో శ్రావ్యమైన వీణావాదన విన్పిస్తున్నది. సర్వాంగ సుందరంగా శయ్యామందిరం అలంకరించి ఉంది. రాయల మనసు అన్నపుర్ణాదేవి పట్ల విరహంతో వేగిపోతున్నది. ఆమె సౌందర్యంలోని రాజసానికి రాయలు ఏనాడో ఆకర్షితులయ్యారు. గజపతులతో రాయల వైరాన్ని అన్నపూర్ణాదేవి ప్రేమానురాగాలతో మరపించింది.
రాయలు శయ్యామందిరం చేరేసమయానికి అన్నపూర్ణాదేవి సౌందర్య దేవతలా అలంకరించుకుని ఉంది. ప్రియ సమాగమానికి ఎదురుచూస్తున్నది. రాయలామె వెనుకగా వచ్చి నిలిచారు. పరిచితమైన గాఢస్పర్శ… ఆపై ఆమె నడుము చుట్టూ ప్రభువు చేతులు. ఆమె వెనుదిరిగేలోపు రెండు అరచేతులతో వెనుకనుంచి ఆమె కన్నులు సుకుమారంగా మూసేశారు. ఆమె పరవశించి పోయింది.
‘‘ప్రభూ!’’ అనగలిగింది.
‘‘ఉహూ. పేరు చెప్పాలి’’ శృంగార రాయలు కవ్వించారు. ఆమె సిగ్గుపడిరది. రాయల హృదయంలో మొహం దాచుకుంది. ఆమె శరీరం అణువణువు ప్రభువు కోసం నిరీక్షిస్తున్నదని అర్థమయింది.
రాయలు ఆమె చుబుకాన్ని పట్టి కళ్ళల్లోకి చూశారు. ఆమె కళ్ళలో తన ప్రతిబింబం మరింత అందంగా కన్పిస్తోంది. ఆమె కళ్ళు వాల్చేసింది. దూరంగా జరిగింది.
‘‘దేవిగార్కి కోపమా’’ చమత్కరించారు.
‘‘లేదు ప్రభూ! కృష్ణచంద్రుని కోసం చకోరంలా ఎదురుచూపులు’’
‘‘మాటలు నేర్చారు దేవిగారు’’
‘‘మీ చేతల ముందు మా మాటలేం పనిచెయ్యవులెండి’’ అలుక నటించింది.
‘‘మా చేతలు మీకంగీకారమైనవే కదా’’
‘‘మా అంగీకారాలతో ప్రభువులకు నిమిత్తమేముంటుంది’’ నిష్ఠూరం ధ్వనించింది.
‘‘ఇన్నాళ్ళూ రాలేదని అలుకా! ఏవేవో అవాంతరాలు… ఓప్‌ా… ఇంకా ఎడబాటా దేవీ!’’ ఆమెను బలవంతంగా తనవైపు తిప్పుకున్నారు రాయలు. ఆమె మొహం ముడుచుకున్న పద్మంలా ఉంది.
‘‘మీ మనసులోని మాట సెలవీయండి దేవీ! మేము దాసులం’’ చేతులు కట్టుకొని వినయం నటించారు.
‘‘మాట తప్పరుగా’’ ఆమె ఆ అవకాశం కోసమే వేచి ఉంది.
‘‘ఉహు..’’ చేతిలో చేయివేసి దగ్గరికి లాక్కున్నారు.
ప్రభువు కౌగిలి నుండి విడివడుతూ…
‘‘తీరా కోరాక కాదనకూడదు మరి’’ మరింతగా నొక్కి చెప్పింది ఆమె.
‘‘అంత అనుమానమా దేవీ! మన కులదైవం విరూపాక్షస్వామి పాదాల మీద ఆన. సరేనా!’’ ఆమెను దగ్గరికి తీసుకున్నారు.
‘‘మన కుమారుడు తిరుమల రాయలు’’ సంకోచంతో ఆగింది.
‘‘ఊఁ! తిరుమల రాయలు’’ రెట్టించారు మురిపెంగా.
‘‘తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయండి ప్రభూ! ఇదే నా విన్నపం’’ తీరా చెప్పేశాక రాయలేమంటాడోననే భయాందోనలు ఆమెను చుట్టుముట్టినై.
రాయలు మందహాసం చేశారు. ఆమె హృదయం తేలికపడి వికసించిన పద్మమయింది.
‘‘ఇంతేనా! దీనికా ఇంత గుబులు! తిరుమలరాయలు గాక మరెవరికి పట్టాభిషేకం చేస్తాం? యువరాజు మాకు వారసుడని మీరెరుగరా!’’ ఆదరంగా ఆమెను సందిట చేర్చుకున్నారు.
‘‘అదికాదు ప్రభూ! కొన్నాళ్ళుగా నాకెందుకో కొన్ని ఉత్పాతాలు గోచరిస్తున్నాయి. పీడకలలొస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యానికి భావి సామ్రాట్‌ మన చిరంజీవి కావాలనే నా కోరిక ప్రభూ!’’ అభ్యర్థించింది. ఆమె మీద వీరేంద్రుని నీడ పూర్తిగా కమ్ముకొంది.
‘‘కాదనం. తొందర ఎందుకు? యువరాజుకింకా ఆ వయస్సు రాలేదుగా!’’ అనునయించాడు.
‘‘తొందరపడక తప్పదు ప్రభూ!మీరు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన విధానాన్ని గుర్తుచేయక తప్పటం లేదు. మన్నించండి ప్రభూ! తరతాలుగా ఈ సింహాసనం తండ్రి బిడ్డల వారసత్వంగా రావటం లేదు. అదే నా బాధ. మన యువరాజు తండ్రికి వారసుడిగా రాజు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత త్వరగా తిరుమలరాయలకు పట్టాభిషేకం చేస్తే నా మనసు అంత కుదుటపడుతుంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి తల్లిమనసు ఆర్థ్రమైంది.
‘‘సరే దేవీ! రేపే అప్పాజీవారితో సంప్రదించి నిర్ణయిస్తాం’’ అన్నాడు మెత్తగా.
‘‘అప్పాజీవారిని అడిగితే ఈ పని జరుగుతుందనే ఆశ నాకు లేదు ప్రభూ!’’ మెల్లగా అంది.
రాయలు ఉలిక్కిపడ్డారు. వినకూడనిదేదో విన్నట్లు దిగ్గున లేచారు.
‘‘ఏమిటిది దేవీ! అప్పాజీవారినే అనుమానిస్తున్నారా! వారు మీకు పితృసమానులు’’ కఠినంగా అన్నారు.
‘‘పితృసమానులే గానీ పితృదేవులు కారుగా! వారు ఈ పట్టాభిషేకాన్ని అంగీకరిస్తారని నేననుకోను. వారి ఆలోచన వేరువిధంగా ఉంది ప్రభూ!’’ అన్నపూర్ణాదేవి కంఠం మృదువుగా ఉన్నా స్పష్టంగా ఉంది.
‘‘ఏమిటది?’’
‘‘తమ కుమారుడు గోవిందరాయలను విజయనగర సింహాసనంపై…’’
ఆమె మాట పూర్తికాకముందే రాయలు అసహనంగా కదిలాడు. రెండు చేతులతో చెవులు మూసుకుంటూ ‘‘ఆపు అన్నపూర్ణాదేవీ! మీ అభియోగానికి ఋజువులున్నాయా?’’ ప్రశ్నించాడు.
ఆమె మాట్లాడలేదు.
‘‘సరే! ఈ పట్టాభిషేకానికి అప్పాజీవారు అంగీకరిస్తారనే నమ్మకం నాకుంది. ఇలాగైనా వారిమీద మీకున్న అనుమానం తొలగిపోతుంది’’ అంటూ వేగంగా వెళ్ళిపోతున్న రాయలను వెనుకనుంచి చూస్తూండిపోయింది అన్నపూర్ణాదేవి. ఆమె కనుకొలకుల్లోంచి అశ్రుబిందువులు ధారగా చెక్కిళ్ళను తడుపుతున్నాయి.
తనకేమైంది?తనేం చేసింది?ఏంమాట్లాడిరది?ప్రేమమూర్తిని నొప్పించింది. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత ప్రణయ సంగమాన్ని నిరాకరించి కైకలా వరం కోరింది. కైకలాగానా? అంటే వంశనాశనం కోరిందా? అలా జరగటానికి వీల్లేదు. పితృసమానులైన అప్పాజీవారు ప్రోద్భలం చేయనిదే రాయలతో తన వివాహం జరిగేదేనా? ఆయనకే అలాంటి దురాలోచన ఉంటే రాయలను ఏనాడో మట్టుబెట్టగల శక్తిమంతుడు గదా! తననెంత ఆదరంగా చూస్తాడు! తను ఎందుకింత కఠినంగా మారిపోయింది? ఎన్నడూ లేనిది రాయల మనసునెంత నొప్పించింది! తీవ్రంగా పరితాపం చెందింది అన్నపూర్ణాదేవి.
‘‘జగన్నాథ! జగన్నాథ! మంచిపని చేశావు. నీ కుమారుని భవిష్యత్‌ నీకు ముఖ్యంకదా! అదే నిరూపించి వీరమాతవనిపించుకుంటున్నావు’’ అంతదాకా చాటున ఉండి అన్నీ విన్న వీరేంద్రుడు కపట ప్రశంస చేశాడు.
‘‘ఛీ! ఆలుమగల మాటలు కూడా చాటుగా వింటున్న నీదేం సంస్కారం’’ ఆమె వ్యథగా ఛీత్కరించింది.
‘‘నాకు ఆ తేడాలేం లేవులేమ్మా! నేననుకుంటున్నట్లు జరిగితే అది చాలు. రాయల మాటలను ఆ కుటిల తిమ్మరుసు అంగీకరిస్తాడన్న నమ్మకం మాత్రం నాకు లేదు’’ వ్యంగ్యబాణం విసిరి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు.
అన్నపూర్ణాదేవి ఆవేదనగా శయ్యాగతురాలై రోదిస్తున్నది. మంజరి కొంత సంకోచిస్తూనే ఆమె దగ్గరికి వెళ్ళింది.
‘‘దేవిగార్కి ఉపచారాలేమైనా చేయమంటారా’’ మెత్తగా అడిగింది.
‘‘వద్దు మంజరీ! నా మనసేం బాగాలేదు’’ బేలగా అంది.
‘‘పానీయం ఇవ్వమంటారా దేవీ’’ అనునయంగా అడిగింది మంజరి.
‘‘వద్దు. ప్రభువు మనసు నొప్పించాను. వీరేంద్రుని మాటకి లోనయ్యాను’’ రోదించింది రాణి.
‘‘వారి మాటలకేముంది దేవీ! ఏది యుక్తమో మహారాజుగారికి తెలుసు. తిమ్మరుసులవారున్నారుగా! మీరు కలతపడకండి’’ ఆమెను ఓదార్చుతున్నదే గానీ మంజరి మనసు మనసులో లేదు. అన్నపూర్ణాదేవి కోరిక ఎటువంటి దుష్ఫలితాల్ని కల్గిస్తుందోనని ఆమెకూ భయంగా ఉంది. వీరేంద్రుని నీడ ఇంతింతై అన్నపూర్ణాదేవి మందిరంమీదే కాదు యావత్‌ విజయనగర సామ్రాజ్యమంతటా పరుచుకుంటున్నట్లనిపిస్తున్నది.
* * *
చంద్రప్ప తెచ్చిన సమాచారం విని తిమ్మరుసు ఆశ్చర్యపోయారు. బాధపడ్డారు. రాయలు మంత్రిమండలి సమావేశం ఏర్పాటుచేశారనీ, తిరుమల రాయల పట్టాభిషేకం గురించి ప్రకటించారనీ,తనతో మాటమాత్రం సంప్రదించ కుండా రాయలీ నిర్ణయం తీసుకోవటం తిమ్మరుసు మంత్రిని కలవరపెడుతోంది.
రాయలు తనను శంకిస్తున్నారా? రాయలలో ఎందుకీ మార్పు? ఇది దేనికి నాంది?
ఆలోచిస్తుండగానే రాయలు తిమ్మరుసు మందిరంలోకి ప్రవేశించారు.
సాధారణంగా మహారాజు దగ్గరికి మంత్రి వెళ్ళటం ఉంటుంది గానీ మంత్రి దగ్గరికి రాజు వెళ్ళటం ఉండదు. రాయలు, తిమ్మరుసుల బంధం ఇటువంటి సూత్రాలకు అతీతమైంది. రాయల్ని చూస్తూనే తిమ్మరుసు మనసులోని ఆలోచనలు, అనుమానాలన్నీ మాయమైనాయి.
‘‘రాయా! రండి. ప్రభువులవారి రాకకు కారణం’’ ఆదరించారు.
తిమ్మరుసును చూస్తూనే రాయలు తాను వచ్చిన పని ఎలా చెప్పాలా అని కొంచెం సందిగ్ధపడ్డారు.
‘‘అప్పాజీ! మిమ్మల్ని సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాం. అది చెప్పాలని ఇలా వచ్చాం.’’
‘‘ఏమిటది రాయా! నా దగ్గర దాపరికం దేనికి’’ తిమ్మరుసు ప్రోత్సాహంగా మాట్లాడారు.
‘‘మా కుమారుడు తిరుమలరాయలకు పట్టాభిషేకం చేస్తామని అన్నపూర్ణాదేవికి వాగ్ధానం చేశాం. ఆ ప్రకారం యువరాజు పట్టాభిషేకానికి నిర్ణయించాం. ఏర్పాట్లు మొదలయ్యాయి.’’
తిమ్మరుసు ఊహించిందే గదా! ఆయన కళ్ళల్లో రాయలపట్ల పితృప్రేమ తొణికిసలాడుతోంది.
‘‘చాలా సంతోషం రాయా! కానీ యువరాజు ఇంకా పసివారు గదా! అయినా మీరు దక్షిణ జైత్రయాత్రకు వెళ్ళేముందు ఈ పట్టాభిషేకం శుభంగా అన్పించదు.’’
తిమ్మరుసు మాటలకు రాయల మొహంలో రంగులు మారినై.
‘‘శుభంగా ఉన్నా లేకున్నా మేమిచ్చిన మాట అమలు జరిగి తీరాల్సిందే’’ పట్టుదలగా అంటూ వెళ్ళిపోతున్న రాయలకేసి నిస్సహాయంగా చూశారు తిమ్మరుసు. ఆ మేధోనాయకునికేదో స్ఫురించింది. వెంటనే రామలింగ నాయకునికి కబురు చేశారు.
* * *
‘‘అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతున్నది’’ వీరేంద్రుడు
ఉద్యానవనంలో కంటకుడితో ఆనందం పంచుకున్నాడు.
‘‘తిమ్మరుసు ఈ పట్టాభిషేకానికి ఒప్పుకోడనే అనుకున్నాను. ఆశ్చర్యంగా
ఉందే’’ కంటకుడు ఆశ్చర్యపోయాడు.
‘‘అదే తిమ్మరుసు తెలివి. ఒప్పుకోకపోతే రాయలకు అనుమానం రాదూ! తిమ్మరుసు ఒప్పుకోకపోతే మన పని మరింత సులువయ్యేది’’ వీరేంద్రుడి గొంతులో కోపం ధ్వనిస్తున్నది.
‘‘ఎలా?’’ కంటకుడు అడిగాడు.
‘‘ఎలాగంటే తిమ్మరుసు తిరుమలరాయల పట్టాభిషేకాన్ని తిరస్కరిస్తే రాయలకి తిమ్మరుసుకు మధ్య వైరం పెరిగేది. ఇప్పుడలా కాదే! ఇద్దరూ ఒకటిగా ఉన్నంతకాలం మనకి అగచాట్లే’’ వీరేంద్రుడు చేతులు నులుముకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
హఠాత్తుగా కంటకుడు హుషారుగా చిటికేశాడు.
‘‘ఆఁ! నాకో ఉపాయం తట్టింది.’’
వీరేంద్రుడు కంటకుడి దగ్గర ఆతృతగా చేరాడు.
‘‘ఏమిటది చెప్పు’’
‘‘తిమ్మరుసు అయిష్టంగా ఒప్పుకున్నట్లు రాజుకు తెలుసు. తిమ్మరుసు ఒప్పుకున్నట్లే నటించి కుతంత్రంతో పట్టాభిషేకాన్ని ఆపేసినట్లు సృష్టిస్తే!’’
‘‘అవును. ఆ ముసలి మంత్రి అలాంటివాడే! జనం నమ్ముతారు కూడా! కానీ ఎలా? ఆ! యువరాజుని హత్యచేసి ఆ నేరం తిమ్మరుసు మీద వేస్తే ఒక దెబ్బకి రెండు పిట్టలు’’ వీరేంద్రుడు ఉత్సాహంగా చెప్పాడు. కంటకుడు నివ్వెరపోయాడు. అతనెంత దుర్మార్గుడైనా హత్యచేసే ఆలోచన లేదు. అందునా యువరాజుని.
‘‘అలా వద్దు. ఏదో ఒకటి చేసి పట్టాభిషేకం ఆపేద్దాం’’ కంటకుడు వారించాడు.
‘‘అవును. ఏదో ఒకటి చేయాలి. అవును…’’ అంటూ దగ్గరిగా వస్తూనే ఛురికతో కంటకుడ్ని ఓ పోటు పొడిచాడు.
‘‘ఇదే చేసేది. నాకే సలహాలు చెప్పేవాళ్ళు నాకెందుకు జగన్నాథ!’’ పెద్దగా నవ్వి, వీరేంద్రుడు భృత్యుల్ని పిలిచాడు.
‘‘ఈ శవాన్ని తుంగభద్రలోకి విసిరేయండి’’ హూంకరించాడు.
* * *
పుత్రశోకాన్ని తప్పించటమెవ్వరితరం! గండమనాయకుడు విషణ్ణ వదనంతో తిమ్మరుసు ఎదురుగా ఆసీనుడై ఉన్నాడు.
‘‘విచారించకండి గండమనాయకా! మీ కుమారుడు కంటకుడు మాయం కావటం గురించి నాకు వీరేంద్రుని మీద అనుమానంగా ఉంది’’ తిమ్మరుసు గండమనాయకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘ఆ వీరేంద్రుని సాంగత్యం వద్దని ఎన్నోమార్లు చెప్పి చూశాను మహామంత్రీ! అతను ఎప్పుడూ పగబట్టిన తాచులా కన్పిస్తాడు. చివరకు నా కుమారుడినే బలితీసుకున్నాడు’’ గండమనాయకుని కంఠం రుద్దమైంది.
‘‘మీ శోకానికి కొంతవరకూ మేమూ బాధ్యులమే!వీరేంద్రుని ఆనాడే పంపేసి ఉంటే ఈనాడు విజయనగరానికీ కలత వచ్చేదికాదు’’పశ్చాత్తాపపడ్డారు తిమ్మరుసు.
‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ దుర్మార్గుడ్ని కత్తికో కండగా…’’ గండమనాయకుడి ఆవేశాన్ని వారించారు మంత్రి.
‘‘అందుకు తగినవాడే! ఇప్పుడు మన కర్తవ్యం యువరాజుని రక్షించుకోవటం’’ ఉపదేశించారు.
‘‘యువరాజునా?’’ ఆశ్చర్యపోయాడు గండమనాయకుడు.
‘‘యువరాజుకు పట్టాభిషేకం అంటే మేము కాదంటామనీ, తద్వారా మాకూ, రాయలవారికీ మధ్య చిచ్చుపెట్టాలనీ వీరేంద్రుని పన్నాగం. పట్టాభిషేకానికి మేము సమ్మతి తెలపటంతో ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు వీరేంద్రుడు మమ్ములను రాయలవారి దృష్టిలో ఎలా నీచునిగా చూపించాలా అని ఆలోచిస్తాడు. అది నెరవేరటానికి వాడికున్న ఆయుధం యువరాజు. ఆ పసివాడి ప్రాణానికి వీరేంద్రుడు ముప్పు తలపెడతాడని నాకు తోస్తున్నది. మీరు కాపలా కట్టుదిట్టం చేయండి. అహర్నిశలు యువరాజు భద్రత మీద దృష్టి పెట్టండి. వీరేంద్రుని సంగతి ఇంక అటో ఇటో తేల్చేసే సమయం వచ్చేసింది. శత్రుశేషం ఉంచటమే మేము చేసిన పొరపాటు’’ తిమ్మరుసు మాటలతో గండమనాయకుడు కార్యోన్ముఖుడయ్యాడు.
* * *
అన్నపూర్ణాదేవి చాలా ఆందోళన పడుతోంది. మూడురోజులుగా తిరుమలరాయలు మూసినకన్ను తెరవటం లేదు. రాజవైద్యులు వైద్యం చేస్తున్నారు. రోగనిర్థారణ కాలేదు. మందులు పనిచేస్తున్నట్లు కన్పించవు.
‘‘జగన్నాథ స్వామీ! నా బిడ్డని కాపాడు. నీ దర్శనం చేసుకుంటాను.’’ ఆమె ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంది.
‘‘జగన్నాథ! జగన్నాథ!జగన్నాథుడేం చేస్తాడమ్మా!అసలువారు వేరే ఉన్నారు.’’
‘‘వీరేంద్రా! ఆపు నీ వాచాలత. నీ మాటలే నాకు చేటుతెచ్చాయి.’’ ఆవేదనతో అంది రాణి.
‘‘ఉన్నమాటంటే ఎందుకమ్మా అంత కోపం? ఇది మామూలు జ్వరం కాదు. విషజ్వరం. ఎవరో కావాలని తెప్పించింది.’’
‘‘ఎవరికా అవసరం ఉంది? నాలుగునాళ్ళలో పట్టాభిషేకం చేసుకుంటున్న నా చిట్టితండ్రికి కీడు చేయతలపెట్టిన కఠినచిత్తులెవరుంటారు’’ ఆమె కంఠం రుద్దమైంది.
‘‘ఇంకెవరు ఆ…తి… జగన్నాథ!’’ ఇంతలో శ్రీకృష్ణదేవరాయలవారు వేం చేస్తున్నారనే వార్త రావటంతో వీరేంద్రుడు తప్పుకున్నాడు.
అతనేం చెప్పదలిచాడో ఆమెకు అవగతమయింది.
కళ్ళనీళ్ళతో మ్రాన్పడి యువరాజు దగ్గర కూర్చుండిపోయింది. కృష్ణదేవరాయలు విచ్చేశారు. కుమారుని అపస్మారక స్థితి ఆయన మనసును కలచివేస్తుంది.
‘‘ఇదేమి విధిలీల దేవీ! కుమారునికి పట్టాభిషేకమని అనుకున్నామో లేదో! ఇటువంటి అనారోగ్యం. రాజవైద్యులకు అంతుబట్టని వింతరోగం’’ రాయలు వ్యాకులపడ్డాడు.
‘‘నాకు అంతా అగమ్యంగా ఉంది ప్రభూ! మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి. మా మందిరంలో మాకు తెలీకుండా ఏదో కుట్ర రాజవైద్యులను మార్పు చేస్తే మంచిదేమో’’ తల్లి హృదయంతో అన్నది.
‘‘మీ అనుమానం ఎవరిమీద?’’ రాయలు కుమారుని శయ్యచెంత చేరాడు.
‘‘లేదు… లేదు…’’ తడబడిరది.
‘‘నాయనా తిరుమలరాయా! మాకేసి ఓసారి చూడు తండ్రీ’’ కృష్ణదేవరాయలు కుమారుని స్పృశిస్తూ పదేపదే పిలిచారు. కుమారుడు
కళ్ళు తెరువనే లేదు. అన్నపూర్ణాదేవి రోదిస్తున్నది.
‘‘ఎవరక్కడ? రాజవైద్యుల్ని వెంటనే రమ్మనండి’’ బిగ్గరగా ఆదేశించిన రాయలు తలపట్టుకొని అక్కడే కూలబడిపోయారు. కుమారుని చల్లబడ్డ శరీరం ఆయన గుండెల్ని బద్దలుచేసింది. భావి విజయనగర సామ్రాట్టు మరణంతో కృష్ణరాయల తేజం మందగిస్తున్నట్లు మందిరంలో దీపాలు మలుగుతున్నాయి.
* * *
తిరుమలరాయల మరణవార్తతో విజయనగర సామ్రాజ్యం శోకసంద్రంలో మునిగిపోయింది. కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకున్నప్పటికీ, చికిత్స జరుగుతుండగానే యువరాజు రాజమందిరంలోనే జబ్బుపడి మరణించటం కృష్ణరాయల్ని అమితంగా కుంగదీసింది. తిమ్మరుసు మొదలునరికిన అరటిచెట్టులా కూలబడిపోయాడు. అన్నపూర్ణాదేవి దుఃఖానికి అంతేలేదు.
‘‘నేను మొదట్నుంచీ అనుమానిస్తూనే ఉన్నా’’ వీరేంద్రుడు సమయం చూసి మరో పాచిక విసిరాడు.
శోకసముద్రంలో మునిగిఉన్న కృష్ణదేవరాయ దంపతులు ఏమిటన్నట్లు తలెత్తిచూశారు.
‘‘జగన్నాథ! ఇదంతా ఆ తిమ్మరుసు మంత్రి కుట్రే. అవును!మన యువరాజుకు పట్టాభిషేకం చేయటం ఆయనకు సుతరామూ ఇష్టంలేదు. కానీ మెప్పుకోసం పైకి ఒప్పుకున్నట్లు నటించాడు. ఆపై ఆటంకం తొలగించుకోవటానికి ఇలా పసివాడని కూడా చూడకుండా రాజవైద్యులని లోబరుచుకుని విషప్రయోగం చేయించాడు’’ తీవ్రంగా ఆరోపించాడు వీరేంద్రుడు.
‘‘ఎవరక్కడ?’’ కృష్ణరాయని కళ్ళు అగ్నికణికల్లా ఉన్నాయి.
‘‘రాజవైద్యుల్ని తక్షణం ప్రవేశపెట్టండి’’ నిప్పు కురుస్తున్నదా స్వరంలో.
రాజాజ్ఞ ప్రకారం రాజవైద్యులు వచ్చారు. వారు నివేదించిన ప్రకారం యువరాజు మరణం విషప్రయోగం వల్లనే జరిగిందని నిర్థారణ అయింది.
కృష్ణరాయని కోపానికి అంతులేదు. కోపంలో మనిషికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నశిస్తుంది. అదే జరిగింది.
‘‘సాళ్వ తిమ్మరుసు మంత్రిని బంధించండి’’ కృష్ణరాయని శోకతప్త హృదయం చీకట్లో కూరుకుపోయింది. విజయనగర జ్యోతిని చెరసాలలో బంధించి ఆర్పేసే ప్రయత్నం బలంగా ప్రారంభమయింది.
అన్నపూర్ణాదేవికేం పాలుపోవటం లేదు. వీరేంద్రుడెన్ని విధాల చెప్పినా తమ కుమారుని మరణానికి తిమ్మరుసు కారకుడంటే ఆమె అంగీకరించలేక పోతుంది. తిరుమలాంబతో మొరపెట్టుకుంది. పట్టపురాణి కూడా రాయలవారికి ఎంతో చెప్పిచూసింది. కాల్చి ఎర్రబడిన ఇనుము మీద సమ్మెట దెబ్బల్లా పుత్రశోకంతో అడలుతున్న రాయల హృదయంపై వీరేంద్రుని మాటల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. ఎవరేం చెప్పినా వినేస్థితిలో రాయలు లేరు. పుత్రశోకంతో బాటు విజయనగర సామ్రాజ్య రక్షకుడు తిమ్మరుసుకు వాటిల్లిన ఆపద గురించి అన్నపూర్ణాదేవి పలువిధాల విలపించింది. ఆమేకాదు, యావత్‌ సామ్రాజ్య ప్రజలు కంటతడి పెట్టారు. రాజరికంలో అనుగ్రహ ఆగ్రహాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనుభవంలో చూస్తున్నారంతా. మంజరి, చంద్రప్పలతో సహా, రాజప్రముఖులంతా తిమ్మరుసును రక్షించే మార్గాల కోసం అన్వేసిస్తున్నారు.
* * *
శ్రీకృష్ణదేవరాయలు కొలువుతీరారు. కానీ అది మునుపటిలా రసవంతంగా లేదు. విషాద నిర్వేదంగా కఠిన శిలలు ఆసీనులైన వంచనా వేదికగా ఉంది. రాయలకత్యంత సమీపంలో ఆసీనుడైన వీరేంద్రుని చూసి అంతా కోపంతో ఊగిపోతున్నారు. పైకి ఏమీ అనలేకున్నా అందరికీ తెలుసు ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి వీరేంద్రుడేనని.
తిమ్మరుసు మంత్రి ఇప్పుడు మంత్రి కాదు. ఆయన్ని బందీగా సభకు తీసుకొచ్చారు. సభ యావత్తూ తిమ్మరుసునా స్థితిలో చూసి విచారంతో తల దించుకుంది. తిమ్మరుసు రాయలు తనను శంకిస్తున్నాడన్న నిజాన్ని జీర్ణించుకోలేని వేదనతో కుంగిపోతూ కన్పిస్తున్నారు. కృష్ణరాయలు తిమ్మరుసు నేరాన్ని విచారించమని న్యాయపరిషత్తును ఆదేశించారు.
ప్రధాన న్యాయాధికారి రాజాజ్ఞను శిరసావహిస్తూ తిమ్మరుసు మంత్రి పట్ల గౌరవాభిమానాలను బయటికి కనపరచకుండా కఠినత్వాన్ని కప్పుకుంటూ విచారణ చేశాడు.
‘‘మీ పేరు’’
‘‘సాళ్వ తిమ్మరుసు’’
‘‘శ్రీశ్రీశ్రీ మహారాజుగారి కుమారుడు తిరుమలరాయలకు విషప్రయోగం చేయించి చంపించారని మీమీద అభియోగం. దీనికి మీ సమాధానం?’’
తిమ్మరుసు నిర్వేదం నిండిన కళ్ళతో కృష్ణరాయలకేసి ఓసారి చూశారు. శ్రీకృష్ణదేవరాయలు అధోవదనుడై ఉన్నారు. దేవేరులంతా ఖిన్నులై ఉన్నారు. తాను జీవితమంతా శ్రమించి నిర్మించిన విజయనగర మహాసామ్రాజ్య సభాపరిషత్తును పరికించారు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. తిమ్మరుసులవారేం చెప్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు.
‘‘నాపై మోపబడిన అభియోగాన్ని ప్రభువువిశ్వసిస్తే నేను చెప్పవలసినదేమీ లేదు.’’
తిమ్మరుసు గొంతులో రాయలపైన ప్రేమాభిమానాలు చెక్కుచెదరలేదు. రాయలు తలెత్తి తిమ్మరుకేసి ఓసారి చూసిఉంటే విజయనగర సామ్రాజ్య భవిష్యత్తు మరోలా ఉండేది.
‘‘రాజవైద్యులను ప్రవేశపెట్టండి’’ న్యాయాధికారి ఆజ్ఞతో రాజవైద్యులు వచ్చారు. గడగడ వణుకుతున్నారు. వీరేంద్రుని వైపు చూశారు. అతని బెదిరింపు కనుసైగతోనే!
‘‘ఏమీ భయం లేదు.జరిగింది చెప్పండి. ఈ సాళువ తిమ్మరుసు రాకుమారునికి విషప్రయోగం చేయమని మీకు చెప్పాడా?’’ ప్రధాన న్యాయాధికారి ప్రశ్న.
‘‘అవును. వైద్యం పేరిట రాకుమారునికి విషప్రయోగాన్ని చేయమన్నారు.’’
‘‘ఎవరు?’’ గద్దించాడు న్యాయాధికారి.
‘‘మ…మ… మహామంత్రిగారే!’’ తిమ్మరుసు వైపు చూపించారు.
సభయావత్తూ శిలలా అయిపోయింది. తిమ్మరుసు మ్రాన్పడిపోయాడు. వీరేంద్రుడు పైకి ఆశ్చర్యం నటిస్తున్నా లోలోపల ఎంతో సంతోషిస్తున్నాడు.
అన్నపూర్ణాదేవి స్పృహ తప్పి పడిపోయింది. తిమ్మరుసు చూపు రాజవైద్యుల నుంచి వీరేంద్రుని మీదికి మరలి ఆగిపోయిందో క్షణం. ఆ తర్వాత ఆయన చూపు శ్రీకృష్ణ దేవరాయల మీద నిలిచింది.
ఈ చక్రవర్తి తన రాయలేనా? విధి ఎంత విచిత్రమైనది! ఆనాడు ఈ రాయలను మహారాజు చంపమంటే చంపలేదు. రక్షించి సింహాసనమెక్కించి విశాల సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. రాజ్యమే కావాలనుకుంటే ఆనాడు తనను అడ్డుకునేవారెవరు? ఆరేళ్ళ పసివాడిని బలిగొనేంత కసాయివాడా తిమ్మరుసు? ఈ నింద పడటంకన్నా దీనిని రాయలు అంగీకరించటమే నరకంగా ఉంది. వీరేంద్రా! నీ పన్నాగం సఫలమయిందని సంతోషిస్తున్నావా! విజయనగర సామ్రాజ్యలక్ష్మి వైభవం మసకబారుతోందా! ఇంతకాలం తాను వేయికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్న తన రాయల చుట్టూ ఏదైనా ముళ్ళకంచె పడిరదా!
ఆవేదన, ఆందోళనలతో ఆ వృద్ధమంత్రి పరితపిస్తున్నాడు. తనమీద మోపబడిన నిందకన్నా సామ్రాజ్య రక్షణకు సంబంధించిన ఆవేదనే ఆయనలో ఎక్కువగా ఉప్పొంగుతున్నది.
ప్రధాన న్యాయమూర్తి తిమ్మరుసు మంత్రికి ఇలా వివరించాడు`
‘‘విజయనగర సామ్రాజ్య నిర్మాతగా ఈ రాజ్యం మిమ్ములను ఆప్తుడిగా భావించింది. ప్రభువులు తండ్రిసమంగా ఆదరించారు. నలభై ఏళ్ళు ఈ రాజ్యానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. అయినా ప్రభువులు ఈ సందర్భంలో మీకు కృతజ్ఞత చూపించనవసరం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యంలో గతంలో మీరు మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేదు. ఆనాడు మహారాజుగా
ఉన్న ప్రభువు సోదరుడు మహారాజుగారి కళ్ళు పీకించమని మీకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను మీరు నెరవేర్చక వారిని మోసగించి మేక కన్నులు చూపి ద్రోహం చేశారు. ఇప్పుడు రాకుమారుని విషప్రయోగం చేసి చంపించటం వల్ల మళ్ళా రాజద్రోహిగా నిలిచారు.’’
మళ్ళీ సభనుద్దేశించి ‘‘ఈ సాళువ తిమ్మరుసు బ్రాహ్మణుడు కాబట్టి మరణశిక్ష విధించలేము. ఈ నేరానికి శిక్ష వీరి రెండు కళ్ళు పొడిచేయటమే!’’ తీర్పు ముగించి ప్రధాన న్యాయమూర్తి మహారాజుకేసి నిస్సహాయంగా చూశాడు.
శ్రీకృష్ణదేవరాయలు తలదించుకుని కనుకొలకుల్లో ఊరుతున్న చెమ్మని కొనగోటితో విదిలించారు. తన కళ్ళు పీకకుండా కాపాడి చక్రవర్తిని చేసిన అప్పాజీకి తానిచ్చే బహుమానం ఆయన కళ్ళు పొడిపించటమా! హా దైవమా! నాకెందుకీ శిక్ష విధించావు?
రాయలు మూగవ్యధతో తీర్పును ఆమోదిస్తున్న సూచన ఇచ్చారు.
‘‘మరో రెండునాళ్ళకు సూర్యోదయానికి ఈ సాళువ తిమ్మరుసు కళ్ళు పొడిచే శిక్ష అమలు చేయమని ప్రభువుల ఆజ్ఞ’’ ప్రధాన న్యాయాధికారి చివరిగా వినిపించాడు.
తిమ్మరుసు హతాశుడైపోయారు. గోవిందరాయల కళ్ళు ఎరుపెక్కినై అతనేనాడో తిరుగుబాటు ప్రకటించేవాడు. కానీ తిమ్మరుసు వల్లే ఆగిపోయాడు.
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద అద్భుత వైభవంగా విరాజిల్లుతున్న ఆ దృశ్యాన్ని, ఆపాదమస్తకం రాయలమూర్తిని కళ్ళారా, మనసారా నిండుగా చూసుకున్నారు అప్పాజీ. కన్నీటి తెర కమ్ముకుంది. రాయల రూపం మసకబారింది. ఇంతలో రాజభటులు వచ్చి తిమ్మరుసును కారాగారానికి తీసుకెళ్తుండగా ప్రభువు పరితాపంతో దిగ్గున లేచి సౌధాంతరాళంలోకి నిష్క్రమించారు.
సభ అంతటా కలకలం.
‘‘ద్రోహం…అన్యాయం’’అరిచారెవరో! అంతటాఅదే నినాదాలు. వెళ్తున్న తిమ్మరుసు ఆగి వెనుదిరిగాడు. చేతులు జోడిరచి సభకు వందనం చేసి ఇలా అన్నారు.
‘‘అయ్యా! మీ అందరికీ శతాధిóక వందనాలు. విధి బలీయం. విజయనగర సామ్రాజ్య పరిరక్షణకు ఇంతకాలం మీరందించిన సేవలు, త్యాగాలు అనుపమానాలు. దయచేసి ఇకమీదట కూడా ఇదేవిధంగా మహాసామ్రాజ్య భారాన్ని వహించండి. ఇదే నా కడసారి ప్రార్థన’’ తిమ్మరుసు భటుల వెంట వెళ్ళిపోతుంటే సభ యావత్తూ కన్నీరు మున్నీరుగా అయింది.
రాజరికం ఇచ్చిన ఫలం ఇదా! అంతటి మహామంత్రికే ఈ గతిపడితే తమలాంటివారి గతి ఏమిటి? ఏ విషకీటకం ప్రభువు మెదడులో జొరబడిరది? తమలో తాము గుసగుసలాడుకుంటున్న ఆ సభలో వీరేంద్రుడు మీసం మెలేయటం చంద్రప్పకు అసహనీయంగా ఉంది.

March 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us