మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

మాఅవ్వ

by T.V Srinivas November 30, 2023
written by T.V Srinivas

మాధవిపురం (మద్దికెర) లోఅక్షరాలునేర్చుకున్నమొదటిబాలిక. ఇంకాచదువుకుంటాఅన్నమాటనిగొంతుఆపేసి, 12 ఏళ్ళకేపసుపుతాడువేసేసుకుని,మంగళంపాడేసుకుంది. పుస్తకాలటకెక్కాయి. ట్రంకుపెట్టెకిందికిదిగిఅత్తారింటికినడిపించింది. అత్తారింట్లోతనకికలిసొచ్చినదేమిటంటే , తనకన్నామూడేళ్ళుపెద్దవాడైనాసవితికొడుకుతోసహఆరుమందిసంతానం. 40 ఏళ్ళమొగుడు. మరోఆరేళ్ళకుతనపంటపండిమరొముగ్గురుసంతానంవారిలోఆఖరివాడుమానాన్న. 18ఏళ్లవయసుకిమూడుపువ్వులుఆరుకాయలుగాతొమ్మిదిసంతానంఆమెతోముడిపడిపోయింది.

మాఅవ్వజీవనప్రస్థానం  1910 నుండి 1980 వరకుఅంటేశ్రీశ్రీపుట్టినప్పటినించిశంకరాభరణంసినిమావిజయోత్సవాలవరకు.అందులోచివరిపదేళ్ళభాగంలోనేనేనున్నా. అందులోప్రత్యక్ష్యంగాచూసినేనుపదిలపరుచుకున్నదిచివరిఐదేళ్ళజ్ఞాపకాలు.అప్పటికితనుసర్వస్వతంత్రురాలావడంతోతనసహజశైలిని , తనఅనుభవాలుపోతపోసుకున్న‌వ్యక్తిత్వపరిమాళలనుఆస్వాదించగలిగాను.  ఇంట్లోమాపిల్లలకందరికితనేశ్రీరామరక్ష.  మాస్నేహితులకుమాత్రంహడల్. వాళ్ళోస్తేమేంవాళ్ళతోబయటికెళ్ళితనతోఉండమనివాళ్ళనిఎక్కవగాఇంటికిరానిచ్చేదికాదు.పనిపాటలేదాఅనివాళ్ళనిపంపించేసేది.

50 ఏళ్ళువంటింటిగుమ్మానికిదిండుపెట్టుకునిపడుకుని,  గడిపినా, రెండుప్రపంచయుద్థాలు, మనస్వాతంత్రపోరాటాలాగూర్చిమాకర్థమవ్వాల్సినరీతిలోబాగాచెప్పేది. రతన్టాటా‌ , టాటాసన్స్గ్రూప్చైర్మన్గాస్వచ్చందంగావైదొలగినట్లు, తన 65 తనవంటింటిఅధికారాలన్నిమాఅమ్మకుఅప్పగించింది.మొదట్లోమాఅమ్మచేసేవంటల్లోఎవరైనాఉప్పుతక్కువైందిఅంటెతక్కువేసిమంచిపనిచేసిందికావాలంటేకలుపుకోవచ్చుకదాఅనేది. అదేఉప్పుఎక్కువైనరోజుతనతప్పేంలేదుఈసారికొన్నఉప్పులోనేఉప్పుఎక్కువైందని, రాళ్ళఉప్పుఅమ్మేబండివాడుపళ్ళికించినపుడేతనకిఅనుమానమొచ్చిందని, ఇకరేపట్నించిఈఉప్పుకితగ్గట్టువండుతుందిలేఅనిమాఅమ్మకుభలేసపోర్ట్గామాట్లాడేది.

మాఅవ్వతనజీవితంంలోచూసినవిమూడేసినిమాలుఒకటిశ్రీవెంకటేశ్వరమహాత్మ్యంరెండవదిలవకుశమూడవదిభక్తప్రహ్లద.  మిగతాఏసినిమాలుచూడకపోయినఅమెభక్తప్రహ్లదకన్నాగొప్పసినిమాలేదు, ఇకరాదనేది‌ఆమెగట్టినమ్మకం..అమెదృష్టిలోఎన్టిఆర్కన్నారోజారమణిగొప్పనటుడు.నిఙమేనండిరోజారమణిఓనటీమణిఅనిఆమెనిఒప్పించడంకష్టం.

నేనుఇంట్లోఅందరికన్నాచిన్నఅవ్వడంతోనన్నెప్పుడుతనపక్కనేపడుకోపెట్టుకునేది,  రోజూకథలు , కబుర్లుఎన్నోచెప్పేది. హోమ్వర్క్లుగట్రాలుఅన్నిసాయంత్రమేచెయ్యించేది, రాత్రిఏడింటికిభోజనం , ఎనిమిదింటివరకుమాఅవ్వతోకథాకాలక్షేపం, తరువాతముసుగెట్ట్టేయ్యడం.అప్పుడప్పుడు 10 గంటలప్రాంతంలోఘంటసాల, సుశీలపాటలురేడియోలోమంద్రస్థాయిలోవినిపించేవి.

 1979 లోఓరోజు.

మానాన్నగారుతనస్నేహితులుకొందరినిభోజనాలకుపిలిచారు. ఆయనేమెనుకూడాస్వయంగారాసిచ్చారు. కొంతవరకుమాఅవ్వసలహాలమేరకువంటావార్పుతరువాతఅన్నసంతర్పణపూర్తిఅయ్యింది.వంటలన్నిఅద్భుతంగాఉన్నాయ్యన్నారు,  కానికొంచెంతక్కువయ్యాయి.. చాలమందిమరిమరివడ్డించమన్నారు, కానిసర్దడంసాథ్యమవలేదు.  మానాన్నగారికితలకొట్టేసినట్టయింది..అందరువెళ్ళిపోయాకఅమ్మనుఅవ్వనుబాగాచివాట్లేసారు, మాఅవ్యకిమాట్లాడేదానికిపెద్దగాఅవకాశం దొరకలేదు.

ఆనాటిరాత్రిమాఅవ్వఎక్కువగామాట్లాడలేదు, చాలదీర్ఘాలోచనలోఉండిపోయింది. ఎప్పుడోఅర్ధరాత్రినాచెంపమీదకొన్నికన్నీటిబొట్లురాలాయి.

తరువాతరోజుమాఅవ్వనాకు 1930 కాలంనాటిఆకలిరాజ్యంగురించిచెప్పింది.  కొన్నినెలలతరబడిఇంట్లోడబ్బులుఉండేవికావట. వంటసామాగ్రికొనేదానికిచాలకష్టంగాఉండేదట. ఇంట్లోఉండేవాళ్ళుకాకావచ్చిపోయేబంధువులుబాగాఉండేవాళ్ళట.ఓపడి(1.3 Kg) బియ్యంరోజుకిసరిపోయేదికాస్తఓపూటకుకూడాతక్కువయ్యేది. దానితోమాఅవ్వేకష్టపడిఎలాగోఅందరికిసర్దివడ్ఢిచ్చేది, ఆలాతనకుపొదుపుగావండడంబాగాఅలవాటుఅయ్యిందట. దానివల్లతనకుమానాన్నతోమాటలుపడవలసివచ్చిందనికొంతబాధపడిఇకమానాన్నగారిసలహామేరకు, ఇంట్లోభోజనాలవిషయంలోతనింకతలదూర్చనని, తనకిష్టమైనపనులుచేసుకొంటానని, తనకునచ్చినపుస్తకాలుకొన్నితెచ్చిపెట్టమనినాకుచెప్పింది.ఆలామాఅవ్వనన్నుమొదటిసారిగాతెచ్చివ్వమనిఅడిగినపుస్తకంగురజాడవారికన్యాశుల్కం. ఓరోజురాత్రిఆపుస్తకంగురిoచిచెబుతూ. తనలాంటివాళ్ళకోసమేఈపుస్తకంరాసారనిచెప్పేది.

తరువాతచలంరాసినపువ్వుపూసింది, కన్నీటికాలువ, మునిమాణిక్యంనరసింహరావురాసినకాంతంకథలుఇలాఎన్నోపుస్తకాలుమాఇంటిదగ్గరలోఉన్నగ్రంధాలయంనుండితెచ్చిచ్చేవాళ్ళం.  ఆపుస్తకాలగురించిమాఅమ్మతో, పిల్లలతోచాలగొప్పగాచెప్పేది. నాకంతఅర్థమయ్యేదికాదు. 

ఆలాకొన్నాళ్లతరువాతఓరోజునన్నుదగ్గరికిపిలిచిఒరేయినీకుమీస్కూల్లోఎదోబాగాచదివావనిమొదటబహుమతివచ్చిందటగా, మీఅమ్మఅందరికిచెప్పిఆనందపడుతోంది. నీవునాకుఇంకఈకథలపుస్తకాల్నిచదివివినిపించరా, రోజుకొన్నిపేజీలు, అర్థమయ్యిందాఅనిఆజ్ఞాపించింది.ఆలాకొన్నాళ్ళకునేనుచదవాల్సివచ్చినపుస్తకంగురజాడగారువ్రాసినముత్యాలసరాలు, అందులోనుండిఓరోజుకన్యక, చదివినతరువాతమాఅవ్వకంటనీరు, నాకుకూడాఎదోతెలియనిఓబాధ

ఆరోజుపూర్ణమ్మచదవాల్సివచ్చింది. ఇంట్లోఎవరులేరుఅందరుదసరాపేరంటాలకువెళ్లారు. నేనుఅవ్వమాత్రమేవున్నాము.నేనుచదవడంమొదలుపెట్టాను..

కాసులకులోనైతల్లితండ్రి

నెనరున్యాయంవిడనాడి

పుత్తడిబొమ్మనుపూర్ణమ్మనుఒక

ముదుసలికిచ్చిముడివేసిరి

పెనిమిటికాంచిననిమిషమున

కన్నులక్రమ్మెనుకన్నీరు

చదివినవెంటనేఓసారిఅప్రయత్నంగాకన్నెత్తిఅవ్వనుచూసాను

తనముఖంప్రశాంతతకన్నాచాలనిర్వేదంగాకనిపించింది.

నాచేయిపట్టుకునికొంచెందగ్గరగాతీసుకుంది, తనుమాట్లాడలేదు

కానీనాకర్థమయ్యింది.నేనుతరువాతభాగంచదవాలని

అటపాటలోతోటికన్నియలు

మొగుడుతాతయనికేలించ

పూర్ణమ్మదుర్గనుచేరిదుఃఖించే

నాకుతెలియకుండానేఆగిపోయాను. మాఅవ్వచేయిఆలాగేనన్నుపట్టుకుంది, మాఅవ్వభావాలూఅన్నినాకుఅర్థమయ్యాయి, పూర్ణమ్మలాతనమనుసులోఆదుర్గమ్మనుచేరిరోజుఇన్నేళ్లుదుఃఖించిందిమాఅవ్వ.

ఇప్పుడునాక్కూడాఇంకాచదవాలనిపించింది. కానీమాటగొంతుపెగలిరాదనిఅక్షణంతెలియలేదు. కానీచదవసాగాను

అన్నతమ్ములకప్పుడుపలికెను

అన్నల్లారాతమ్ముళ్ళరా

అమ్మనుఅయ్యనుకాయండి

నలుగురికూచొనినవ్వేవేళ

నన్నొకపరితలవండి

మీమీకన్నబిడ్డలనొకతెకు

ప్రేమనునాపేరివ్వండి

ఇకమాటపెగల్లేదు, కంట్లోనీళ్లుయధేచ్చాగాబలబలరాలాయి.మాఅవ్వఒడిలోతలదూర్చుకున్నాను, ఆమెచేతులునాతలనిమురుతుండగా, ఆలాఎంతసమయంగడిచిందోతెలియలేనేలేదు. ఆమెకంట్లోఇంకిపోయినకన్నీరు, నాకంటప్రవహించిందేమో!

ఆతరువాతనన్నెప్పుడుఏకథకానీ, కవితకానీచదవమనలేదు.

మంచిసాహిత్యంమనసునికదిలిస్తుందని, అటువంటిసాహిత్యంపైనాఆసక్తికిబీజంవేసిందిమాత్రంమాఅవ్వే.

ముగింపు :

తనకెదురైనఅన్నిఅవాంతరాలను, తనకున్నవిచక్షణతోతనకనుకూలంగామార్చుకున్నమాఅవ్వమాకెప్పటికీస్ఫూర్తిదాయకమే. జీవితాన్నిపూర్ణమ్మలాత్యజించలేదు, మరేపోరాటాలుచెయ్యలేదు.  తనతోముడిపడ్డకుటుంబాలకుఆలంబనగానిలబడింది. అదిఅప్పటికాలంలోకట్టుబాటైన, ఓరకంగామంచిబాటే.

November 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓటేద్దాం ఓటేద్దాం ఓటేద్దాం!

by A. Venugopal November 30, 2023
written by A. Venugopal

ఓటేద్దాం ఓటేద్దాం ఓటేద్దాం!
స్వార్ధము లేనటువంటి సమర్థులకు ఆచి తూచి !ఓ !
1.ప్రజలయొక్కబాగోగులపట్టింపేధ్యేయంగా
నిజాయితీ నిబద్ధతలు లక్ష్యమైనపక్షానికి
మసిపూసీ మారేడని మాయలు మోసం చేయని
మానవత్వ విలువలున్న మంచి మనసు
కలవారికి !!ఓటేద్దాం !!
2.ప్రజాస్వామ్యవిలువమరచిబమ్మినితిమ్మినిచేయని ,అవినీతీబంధుప్రీతికాసన మేయనివారికి.చెప్పేదీఒకటైతేచేసేదీవేరొకటై
తీరందాటినవెంటనెతెప్పనుకాల్చనివారికి !!ఓటేద్దాం !!
3.ఉద్యోగుల,ఉపాధ్యాయఉన్నతులనుగౌరవించి,ఉత్సాహాన్నందించిఉరకలేసిపనిచేయగ,ప్రోత్సాహాలందించి పోషణచేసే వారికి- రైతన్నల సంక్షేమమె రామరక్షయ న్నోరికి !!ఓటేద్దాం !!
4.సంప్రదాయసంస్కృతులకుసాదరసా కారమిచ్చి,చెప్పి నట్టి ప్రమాణాలు తూ చ తప్పక చేసి ,పట్టంగట్టించినోరిప్రాణాలకుప్రాణమిచ్చి
ప్రగతిపధంలోప్రభుతనుపరుగెత్తించే వారికి !!ఓటేద్దాం !
5.మద్యానికి ఆశపడి మానవతనువిడనాడీ -డబ్బుకు దాసోహమనిధర్మాన్నీమరవకుడీ ,ప్రతిఓటు పవిత్రమనీ
భవితకిదిపునాదియనీ- యోధులమై మనమంతాయోచించీఅడుగులేసి!!ఓటేద్దాం !!

November 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఎనిమిదో అడుగు-డా. కొండపల్లి నీహారిణి కవిత్వం

by Bandari Rajkumari November 30, 2023
written by Bandari Rajkumari

డాక్టర్ కొండపల్లి నిహారిణి ఎనిమిదో అడుగు పేర వెలువరించిన కవితాసంకలనంపై బండారి రాజకుమార్ సమీక్ష చేశారు. ఆమె కవిత్వలోని లోతుపాతులను శిఖామణి వంటి కవుల కవిత్వంతో పోలుస్తూ విశ్లేషించారు.

కొండపల్లి పేరు ఇనంగనే కొండపల్లి బొమ్మలు యాదికొత్తయి. చిత్రకళాతపస్వి డా॥కొండపల్లి శేషగిరిరావు గారు యాదికొత్తరు. కొండపల్లి వారి కుటుంబం మానుకోట దగ్గర్లోని పెనుగొండ నుండి ఓరుగల్లుకు పొట్టచేతబట్టుకుని వచ్చిన కుటుంబం.దశాబ్ధాల కాలం గిర్రున తిరిగింది.వరంగల్ నుండి అధిక మెజారిటీతో M.P గా గెలిచిన పెండ్యాల రాఘవరావు గారు దేశప్రజలకు సుపరిచితులు.వారి ముద్దుల కూతురు నీహారిణి.పెండ్యాల వారి ఇంటిబిడ్డ  కొండపల్లి వారి ఇంట అడుగుపెట్టి “కొండపల్లి నీహారిణి” అయింది.వీరిది చిన పెండ్యాల గ్రామం.మనకు పెండ్యాల వారి వంశం నుండి మరో అగ్గికెరటం విప్లవకవి వరవరరావుగారు అత్యంత సుపరిచితులు.ఇదంతా ఎందుకంటే కొందరు ఇంటిపేరుతో ప్రసిద్ధులయితరు.రెండు కుటుంబాలు సాహిత్య ,కళా రంగాల్లో ఆరితేరినవారిని అందించినయి.కేవలం కుటుంబాలకున్న కీర్తి,ప్రతిష్ఠలతో కవయిత్రి గొప్పవారుకాలేరు. ఎన్నివున్నా, ఎంతవున్నా లోలోపలి ప్రతిభ, స్పందించే హృదయం లేకుంటె కవి కాలేరు. కొండపల్లి నీహారిణి గారు సృజనశీలురు, సౌమ్యులు, అంతకుమించిన సహృదయులు.

కొండపల్లి నీహారిణి గారు గతంలో అర్రతలుపులు, నిర్నిద్రగానం అనే రెండు కవితాసంపుటాలు వెలువరించారు. “ఎనిమిదో అడుగు” పేరుతో తన మూడవ కవితా సంపుటిని ప్రచురించారు.వీటితో పాటు “వ్యాసహారిక” పేరుతో వ్యాససంపుటిని,”అమెరికాలో ఆరునెలలు” పేరుతో  యాత్రా చరిత్రను,తెలంగాణ వేగుచుక్కలు ఒద్దిరాజు సోదరులు-పరిశోధనా గ్రంథం,జ్వలిత చేతనం—ఒక యోధుడి గాథ(జీవిత చరిత్ర),కళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు(జీవిత చరిత్ర),బందూక్ నవల -సమగ్ర విశ్లేషణ మరియు నా ప్రజా జీవితం , చిత్రశిల్పకళా రామణీయకం పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.ఇది కవయిత్రి సంక్షిప్త పరిచయం.

Literary corner: Bandari Rajkumar on Kondapalli Niharini poetry

నీహారిణి గారు రాసిన “ఎనిమిదో అడుగు” కవితా సంపుటి గురించి మాట్లాడుకుందం.77 కవితలున్న ఈ సంపుటి నుండి ఒకటీ అరా కవితల్ని విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం.పదండి!

గ్యాస్ నూనె సీసా,బూడిద చిప్పలతో సంజె కెంజాయిని ఆహ్వానిస్తున్న కవయిత్రి,వాళ్ల బాపమ్మను విద్వాంసురాలుగా,తబ్లాయిస్ట్ లా,వీణవాద్య కళాకారిణిగా వర్ణిస్తుంది.చిన్నపిల్లలు మారాం జేత్తాంటె తినడానికి ఏదో ఒకటి అమ్మ ఇత్తనే వుంటది.అమ్మ ఇచ్చే ‘ఓయమ్మ పనాయ్ “తింటూ బాపమ్మ మోకాళ్లపై వంగి,భుజాలపై వాలి ఆడుకున్న బాల్యమే అందమైనదని జ్ఞాపకాల దొంతరల్ని నెమరేసుకుంటది.అద్భుతమైన బాపమ్మ పనితనాన్ని యాదికి తెప్పించిన “ఎక్కాబుడ్డీ” కవిత ఓ అందమైన అనుభవ శకలం.

“లోకబాంధవుడు కొండలమాటుకెళ్ళకముందే/ కలువరేడి సూచనలు రాకముందే/ తొందరగా శుభ్రపరిచి ఎక్కాబుడ్డీని వెలిగించి/ పెద్దదర్వాజ గూట్లో పెట్టి చీకట్లు పొగొట్టాలనే బాపమ్మ (ఎక్కాబుడ్డీ,పేజీ నం:17)

ఎక్కాబుడ్డీని వెలిగించే సమయాన్ని తెలియజేయడానికి సూర్యున్ని లోకబాంధవుడిగా,చంద్రున్ని కలువరేడుగా వర్ణిస్తూ సూర్యాస్తమయం పురాగ కాకముందే చంద్రుని వెన్నెలలు సోకకముందే ఎక్కాబుడ్డీని వెలిగించే బాపమ్మను స్మరిస్తూ…షోకేసులల్లో షోపీసులుగా పెట్టుకుంటున్న ఎక్కాబుడ్డీ ఇప్పుడొక అందమైన మాన్యుమెంట్ అని వాపోతుంది.

తెలంగాణ పల్లెలో రాత్రిని వెలిగించిన కందిలి,ఎక్కాబుడ్డీ,దీపం బుడ్డీ,పెళ్లిళ్లలో దారి చూపిన పెట్రోమాక్స్ లైట్ ,లాంతరు దీపాలన్నీ కవుల కవితల్లో చక్కగ ఒదిగిన వైనాన్ని సూడొచ్చు.జీవితానికి వెలుతురును పంచి,దారి చూపే నేస్తంగా లాంతరును ప్రతీకగా వాడుకున్న కవులు సుత మనకు కనిపిత్తరు.శిఖామణి గారి “పలకల లాంతరు” కవిత,యువ కవయిత్రి ‘రక్షిత సుమ’ రాసిన “దారిలో లాంతరు” కవితా సంపుటి యాదికొత్తయి.ఇదే వొరవడిలో రాసిన బిల్లా మహేందర్ “దీపం బుడ్డీ”,శిల్పా జగదీష్ గారి “పెట్రోమాక్స్ వెన్నెల” ప్రత్యేకంగా చెప్పవచ్చును.

బుడ్డిల/కొద్దిగంత గాసునూనె పోసి/ఒత్తిని జరంత పైకిలేపి అగ్గిని ముట్టిత్తె చాలు/ముఖం మీది నిలువెత్తు సింధూరంలా/ఎలుగుతూనే ఉండేది 
— బిల్లా మహేందర్ (దీపం బుడ్డీ)

నాన్న కన్నుమూసిన కాళరాత్రి/నువ్వు తలకాడ వెలగలేక ఆరలేక/నీ మ్యాంటల్ కంటిని చిదుముకుని/బొట్లుబొట్లుళగా రాలి/మా దు:ఖసాగరంలో /నువ్వొక కన్నీటి కెరటమై కలిసిపోయావు ఓ నేస్తం
—శిల్పా జగదీష్ (పెట్రోమాక్స్ వెన్నెల)

ఆకాశపు చెట్టు చిటారు కొమ్మన/పూసిన చందమామ పువ్వులా/మా రెల్లుగడ్డి ఇంటి చూరున వ్రేలాడుతుంది/పలకల లాంతరు — శిఖామణి(పలకల లాంతరు)

ఒక్కొక్క కవి ఒక్కో రీతిన స్పందించిన తీరును వారి వారి బతుకుల్లోంచి తవ్విపోసుకున్నరు.ఏ కవితా కృత్రిమంగా అనిపించదు.ఒకరు బాపమ్మను మరొకరు బాపును తల్సుకున్నరు.యాదులన్నీ మనిషి మనసు సూరుకు పట్టుకుని యాల్లాడుతున్న గబ్బిలాలై ఖచ్చితంగా మెలిపెడుతయి.

కవయిత్రి ‘నగర వాసన పరిమళిస్తున్న నడిబొడ్డు అడ్డా ‘అని అడ్డా మీది బతుకుల్ని కలగంటుంది.

“భుజాలు కుంగుతున్నా/ స్వేదజలం పొంగుతున్నా/ రహదార్ల విస్తరణలో/ ఎక్కడో ఓ దగ్గర వ్యాకుల పడ్తూ / పిలవబడే ఏకైక ఆధారం”(పేజీ నం:63)

“అడ్డా పురా సంస్కృతికి రూపంగాకున్నా/ పొట్టకూటికి నెలవు/ చదువుకున్న నిరుద్యోగులకు/ చదువుకోని చిరు ఉద్యోగులకు/ పనిలేని దరిద్రనారాయణులకు/ రికాం లేని రాకపోకల కనులవిందు/ రిక్తహస్తంగాని నడిచొచ్చే నిధి అడ్డా” (పేజీ నం:65)

బడుగుజీవుల బతుకు గుండెదరువు ‘అడ్డా’ను ఒక్కొక్కలు ఒక్కో దృష్టితో కవితామయం జేశిన కవులు తారసపడుతరు.అడ్డా మీద రాసిన కవితల్ని పరిశీలిస్తే అన్నవరం దేవేందర్ గారి ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’,అశోక్ ఆవారి ‘సిద్ధిపేట లేబర్ అడ్డా’ , ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు.

“పల్లె పొలిమేరలు దాటి/అడ్డామీద సరుకుగా మారిన సందర్భం/అంగడిలో గొడ్డూ గోదా అమ్ముడుపోయినట్లు/నిలువెత్తు మనిషి తనను తానే అమ్ముకుంటున్న దృశ్యం
—అన్నవరం దేవేందర్ (మంకమ్మతోట లేబర్ అడ్డా)

“గుంపులున్నీ ఒక్కొక్కటిగా/మాయమవుతుంటే/అడ్డంతా బోసిపోయి/ఆకలి కేకల తుఫాను/ఒక్కసారిగా అంతమవుతుంది”
—బిల్లా మహేందర్ (అడ్డా)

“పనైపోంగనే లేబర్ పక్షులు/రంగు కోరికల సీతాకోకచిలుకలైపోతయ్ /అప్పటికే మేల్కొని వున్న స్పిరిట్ గ్రంథులు /గాంధీ నోటును సూడంగనే/పక్షులన్నీ గూటికి చేరినట్లు కర్తవ్యంగా/కల్లు కాంపౌండో..వైన్ షాపో చేరిపోతయ్ “
—అశోక్ అవారి (సిద్ధిపేట లేబర్ అడ్డా)

ఎవరెన్నితీర్ల జెప్పినా మారని అడ్డా మీది బతుకులు మన పాలకుల నిర్లక్ష్య విధానాల్ని ఎండగడుతనే వున్నయి.ఒకసారి అడ్డా మీద నిలబడి సూడున్రి.దినసరి కూలీల బతుకువెతలు కండ్లపడుతయి.కూలీ పని ఇప్పియ్యడానికి సుత దళారీ వర్గం సిద్ధంగా వున్న తీరు గమనిస్తం. ట్రాలీల్లో పశువుల కంటే హీనంగా కుక్కి తీసుకపోయే దృశ్యాలు కంటతడిపెట్టిత్తయి.సొమ్ము చేతులబడ్డంక పెయి నొప్పులు తగ్గాలంటే ఒక చేతిలో 90 సీసా ,ఇంకో చేతిలో మిరపకాయ బజ్జీ అనివార్యమైన దుస్థితి కంటపడుతది.

అనాదిగా దళితుల మీద జరుగుతున్న దాడులు సూసుకుంట వత్తనే వున్నం. ఇప్పుడు బుద్ధిజీవులైన దళిత మేధావుల్ని సుత మానసికంగా హింసించి ,ఆత్మహత్యకు పురిగొల్పుతున్న విశ్వవిద్యాలయాల తీరుకు మనందరం సిగ్గుపడాల్సిన సందర్భం.చరిత్రను పునర్లిఖించాలనుకుని కలలు కనే యువతరం ఒక్కసారి ఆలోచించాలి.చెట్టంత కొడుకు(రోహిత్ వేముల)ను పోగొట్టుకున్న తల్లి రాధికమ్మ బాధకు, కడుపుకోతకు స్పందనగా రాసిన కవిత “దు:ఖ సముద్రం”.

“ఈ అపరిష్కృత అనుభవం/ శ్మశాన వైరాగ్యం గాదని/ చైత్య వైభవమౌతుందని/ ఇరుకుదారుల్లోని వైశాల్యాన్ని/ నైరాశ్యాల్లోని వెలుగు చిక్కుల్ని/ చరిత్రకెక్కించేందుకు నిశ్శబ్ధంగా చేరవేద్ధాం

అమ్మా!/ నిరంతర పోరాటాల్లో/ సత్తువ నిస్సత్తువలు/ విపరీత రాజకీయాలు చేస్తుంటే/ తస్మత్ జాగ్రత్త సూచికలు/ నీ కంటిధారలకు ఏ రీతిగానూ వెలగట్టవు”(పేజీ నం:31)

రోహిత్ వేముల స్మృతిలో పుంఖానుపుంఖాలుగా కవిత్వం వచ్చింది.చరిత్ర ఓ నల్ల చందమామను తన గుర్తుగా ఆకాశాన వేలాడదీసింది.ఇదే కోవలో రోహిత్ స్మృతిలో  రాసిన బలమైన కవితల్లో పసునూరి రవీందర్ “నేనింకా నిషిద్ధ మానవుణ్ణే” గురించి చెప్పుకుని తీరాలి.

“ఈ అంటరాని భూమ్మీద/ఇవాల నా పేరు వేముల రోహిత్ 
…….

మీ తరాల ద్రోహం మీద/చావుడప్పుల మోతనవుతా/ఈ దేశానికి పట్టిన బ్రాహ్మాణీయ వైరస్ ను పాతరేసేందుకు/అదుగో నేనొక చూపుడు వేలునై/మళ్లీ మళ్లీ పుడుతూనే వుంటా!/మీ మస్తిష్కాల మీద/నా ఆత్మగౌరవ గెలుపు జెండాను ఎగరేస్తూనే ఉంటా!”
—పసునూరి రవీందర్ (నేనింకా నిషిద్ధ మానవున్నే)


అమ్మ, అక్క, కూతురు, ఏడడుగుల బంధం పై రాసిన కవితలు; కాళోజీ, జాషువా, శ్రీశ్రీ, అబ్ధుల్ కలాంలపై రాసిన కవితలు;మాతృభాషా పరిరక్షణ గురించి రాసిన కవితలు;బిజీ లైఫ్ లో పిల్లలతో గడపలేని స్థితిని చెప్పే కవిత,టెక్నాలజీ చేతికొచ్చినంక,గ్లోబలైజేషన్ కాలంలో జరుగుతున్న విపరీత పరిణామాలపై స్పందించి రాసిన కవితలు; న్యాయవ్యవస్థలోని డొల్లతనాల్ని ఎత్తిచూపే కవిత,తెలంగాణ గురించీ,ప్రభుత్వ పథకాల్లో భాగంగా హరితహారం,చెరువుల గురించిన కవితలు,గేయరూపంలోని కవితలు అన్నీ సమగ్రంగా పరిశీలిస్తే వస్తు వైవిధ్యానికి కొదువలేదనిపిస్తుంది.పుట్టిపెరిగిన “చిన పెండ్యాల” ఊరు మీద రాసిన కవిత ఆకట్టుకుంటుంది. నూతనాదర్శ కుటుంబ కదంబం కోసం రాసిన ‘ఎనిమిదో అడుగు’ కవిత ఆలోచింపజేస్తుంది.

తెలంగాణ గురించి రాసిన కవితను ఒకసారి సూద్దం.

“వాగులవంకల, ఇసుకదిబ్బల/ సుందర వనాల చెట్లుచేమల/ పిచ్చుక కువకువల / కనువిందు, వినసొంపు నా భవ్య తెలంగాణ!” (తెలంగాణ,పేజీ నం:15)

కొత్తగా సాధించుకున్న తెలంగాణ భవిష్యత్ లో ఎలా వుండాలో ఒక ఊహ చేసింది కవయిత్రి.చాలా బాగుంది.ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే తెలంగాణ వచ్చాక హరితహారం ముసుగులో ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ జోరుగ సాగుతీన్న తీరు, ఇసుక మాఫీయా వర్ధిల్లుతున్న వైనం దిగ్భ్రాంతికి గురిచేయకమానదు.తదుపరి కవిత్వం ఎలా వుండబోతుందో సూడాలె.’బుద్ధి : కర్మేణ’ కవితలో ప్రకృతి విధ్వంసాన్ని ప్రస్తావించినప్పటికీ తెలంగాణ కోణం నుండి విశదీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

కవయిత్రి సద్దుల బతుకమ్మరోజు చెరువులో పడి మునిగిపోతుంటే అక్కయ్య,బుచ్చయ్యలు కాపాడిన జ్ఞాపకాల్ని కైగట్టిన కవిత “కొంగు బంగారం” చెప్పుకోదగింది.

“అమ్మ దాటిపోయింది/ పోలికల్లో ఇమిడి,స్వభావాల్లో కలిసి/ బాపు దాటిపోయిండు/ రాగాల్లో పాటగా స్వరాల్లో భావంగా/ అచ్చొత్తుకున్న గుండె పిట్టగోడల్లో/ మొలిచిన మొక్కలు తంగెళ్లుగ విరబూసె/ ఊహల పందిరిగుంజల అల్లనల్లన అల్లిన, తీగల ప్రేమ గుర్తులు,పోరాటాల గుత్తులు/ ఆలోచనలై వ్రేళ్లాడె,ప్రతి పాదులోనూ వ్రేళ్లూనె” (పేజీ నం:32)

తవ్వుకున్న చెరువుకథల్లో తనొక మునగని రూపమని చెప్పుకుంటది.సాగనంపాలన్న సంబురంతో సిబ్బి కావాలని మారాం జేత్తది.అమ్మ,బాపులు దాటిపోయినా దండైన సంస్కృతి వున్నదంటది.మంచికవిత.

అక్కడక్కడ తెలంగాణ పదాలు కనబడ్డప్పుడల్లా కండ్లల్ల తళుక్కున మెరుత్తయి.పదాల గుండెసాటు కథలన్నీ ఇప్పిజెప్పుతయి. మానవసంబంధాలపట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల అమితమైన పాయిరమున్న కవయిత్రి ఇకపై  తెలంగాణ భాష,పలుకుబడులు తొణికాసలాడే మరిన్ని కావ్యాలు రాయగలదని ఆశిస్తూ..నా చిన్ని ప్రయత్నంగా నాల్గు మాటలు నపరింత ఇనిపించిన.”ఎనిమిదో అడుగు” ఫలవంతమవ్వాలని కోరుకుందాం.శనార్తులు.

November 30, 2023 138 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

మానవత….కథ

by Aruna Dhulipala November 30, 2023
written by Aruna Dhulipala

అద్భుతమైన బంగ్లా అది..
చూపరులను అక్కడే కట్టిపడేస్తుంది. మొత్తం విద్యుద్దీపాలతో అలంకరించబడి ఆరోజు ఇంకా అందంగా కనిపిస్తోంది.. ఆ వెలుగులు చుట్టుపక్కల అంతా పాకి పున్నమి వెన్నెల విరబూసినట్టుగా ఉంది. ప్రత్యేకంగా తయారు చేయబడిన కళా నైపుణ్యంతో భవనం నిండా ఎటు చూసినా ఐశ్వర్యం తొణికిసలాడుతున్నది. మామిడి తోరణాలు, పూల దండలు, దీప శిఖలు అడుగడుగునా దర్శనమిస్తూ భక్తిభావాన్ని గుబాళిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలి పర్యవేక్షణ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది అన్ని చోట్లా….అవును శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి మరి !
ఇంటి యజమాని విద్యాధర్ అమితమైన భక్తి కలవాడు. వాళ్ళ నాన్నగారు రాజారావు హయాం నుండి ఈ ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దానిలో ఎటువంటి లోపం లేకుండా ప్రతీ సంవత్సరం అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఆ ఉత్సవాలను చూడడానికి జనాలు ఉవ్విళ్లూరుతారంటే అతిశయోక్తి కాదు. మొదటినుండీ బాగా ఆస్తిపరులు కావడం మూలంగా విద్యాధర్ ఎలాంటి లోటు లేకుండా గారాబంగా పెరిగినప్పటికీ దానికి ఏమాత్రం తీసిపోకుండా వస్త్రవ్యాపారంలో పెట్టుబడి పెట్టి తమ ఆస్తిని రెండింతలు పెంచాడు.
విద్యాధర్ కి ఇద్దరు కొడుకులు..తండ్రి క్రమశిక్షణలో ఆరితేరి
ఆయన వ్యాపారంలో భాగస్వాములై తండ్రికి తగ్గ తనయులు అనిపించారు. పెద్ద కొడుకు వినయ్ కి గత ఏడాది వివాహం జరిగింది.చిన్న కొడుకు వినోద్ కి మేనరికం ఉంది. ఆ అమ్మాయి ఎమ్ బిఎ లో చేరడం వల్ల అది పూర్తయ్యాక వివాహం అనుకున్నారు. ఇక
కోడలు వచ్చాక జరుగుతున్న మొదటి నవరాత్రులు కాబట్టి చుట్టపక్కాలకు, స్నేహితులకు ఆత్మీయులందరికీ ఆహ్వానం పలికాడు. ఎవరి వీలును బట్టి వాళ్ళను రావాల్సిందిగా ఫోన్లు చేసి మరీ చెప్పాడు. ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు, ప్రసాదాలు పంచడం, ఆ తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు…తిరిగి సాయంకాలం ప్రదోష పూజలు, భజనలు, ప్రసాదాలు, అల్పాహార విందు. ఈ రకంగా ప్రణాళిక సిద్ధం చేయబడింది..దీంతో పాటు ప్రతినిత్యం పేదవారికి చేసే అన్నదానం
మరీ ప్రత్యేకం. వస్ట్రవ్యాపారి కావడం వల్ల వస్త్రదానం కూడా ఇంకో ప్రత్యేకత. ఈ విషయంలో కొడుకులిద్దరూ ఎటువంటి అడ్డు చెప్పరు. పైగా ఎంతో శ్రద్ధగా, నియమంగా పూజల్లో పాల్గొంటారు.
విద్యాధర్ ఇంటి పక్కన దాదాపు అర ఎకరం ఖాళీ జాగా ఉంటుంది. ప్రత్యేకంగా నవరాత్రుల కోసమే దాన్ని ఖాళీగా ఉంచుతారు. ఆరోజు ఉదయం వేదోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇంకో వైపు హోమాలు జరుగుతున్నాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు. భక్తి ప్రపత్తులతో సంబరాలు జరుగుతున్నాయి. విద్యాధర్ భార్య శ్రీవాణి భర్తకు తగ్గ ఇల్లాలు. చక్కని చీరకట్టు, నుదుట ఎర్రని కుంకుమబొట్టు, కంటి చివరలను కలుపుతూ సన్నని కాటుక రేఖ, పెదవులపై చెరగని చిరునవ్వు, వయసు తేడాలు లేకుండా అందరితో ఆత్మీయ పలకరింపు, హుందాతనం ఆమెకు పెట్టని ఆభరణాలు. పరోపకారం ఆమెకు ప్రాణం. మానవతకు నిలువెత్తు నిదర్శనం అన్నట్టుంటుంది. ఆమెను చూస్తే ఎవరికైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. విద్యతో పాటు వినయం ఆమె సొత్తు. భర్తకున్న భక్తిలో ఆమెకు ఒక పాలు ఎక్కువే అని చెప్పాలి. అందుకే పనులు చేసేవాళ్ళు ఎంతమంది వున్నా అన్ని విషయాలను దగ్గరుండి స్వయంగా చూసుకుంటుంది.
వంటశాలలో విరామం లేకుండా నైవేద్యాలు, ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. ఆ ఇంటి వంట మనిషి మల్లి అన్యమనస్కంగా, అసహనంగా పని చేస్తోంది ఆరోజు. మనసు మనసులో లేదు ఆమెకు. కాలుగాలిన పిల్లిలా వంటశాలనుండి హాలులోకి ఇటూ అటూ తిరుగుతోంది. రోజూ ఇంట్లో ఉండే పనివాళ్లు నలుగురు, మల్లితో పాటు వుండే మరో వంట మనిషి కాకుండా మరో నలుగురు వంటవాళ్లను, నలుగురు పనివాళ్లను ఈ పదిరోజుల కోసం పిలిపించారు. ఇంత హడావిడిలో మల్లి ధ్యాసంతా ఇంటి మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జనారణ్యంలోంచి బయటపడతానా అన్నట్టు తొందరగా టైం గడిస్తే బాగుండు అనుకుంటూ మధ్యమధ్యలో గోడ మీదున్న వాచీ కేసి చూస్తోంది. తొందరగా కదలని ముల్లు మీద విసుక్కుంటోంది కూడా. గత కొద్దిరోజులుగా తన ఇంటి వ్యవహారం ఆమెను కుదురుగా ఉండనీయడం లేదు.
మల్లి భర్త చంద్రం. వ్యవసాయ పనుల్లో కూలీగా వెళ్తుంటాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లల తర్వాత
ఆపరేషన్ చేయించుకుంటానంటే వారసుడుగా ఒక మగ నలుసు కావాలని చంద్రం తల్లి భీష్మించుకుంది. తల్లి నోటికి భయపడి చంద్రం ఏమీ చేయలేక “ఎట్లా పోషిస్తామన్న” మల్లిని సముదాయించాడు. మూడవసారి కూడా ఆడపిల్ల పుట్టడం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బిడ్డ పుట్టిన కొన్నాళ్ళకే చంద్రం తల్లి మరణించింది. ముగ్గురూ చిన్నపిల్లలు కావడం వల్ల వారి ఆలనా పాలనా వీళ్ళకు చాలా కష్టమయ్యేది. పెద్దపిల్ల పుట్టిన ఆరు నెలలకు విద్యాధర్ ఇంట్లో వంటకు కుదిరింది మల్లి. సహజంగా నెమ్మదస్తురాలు, ఒళ్ళు దాచుకోని తత్వం గల మల్లి వాళ్ళింట్లో మనిషిగా మెలగసాగింది. విద్యాధర్ కుటుంబమంతా మల్లి పట్ల ఎంతో ఆత్మీయత కనబరిచేవారు. తరువాతి రెండు కాన్పుల సమయంలో కొంతకాలం పనికి వెళ్ళకున్నా శ్రీవాణి ఆదరణతో జీతం అందుకుంది మల్లి. మూడో కాన్పు వద్దని, ఆడపిల్లయినా, మగ పిల్లవాడు అయినా ఈ రోజుల్లో ఒకటేనని శ్రీవాణి ఎంతో నచ్చచెప్పింది. అయినా వినక ముసలావిడ పంతం నెగ్గించుకుంది.
*

చంద్రానికి పదిహేను రోజుల క్రితం జ్వరం తగులుకొంది. దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రం నుండి ఏవో మాత్రలు తీసుకువచ్చి వాడడంతో కొంత నెమ్మదించింది. వెంటనే చిన్నదానికి జ్వరం అంటుకొంది. మందులు వేస్తుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. నిన్నంతా పిల్ల ఏమీ తినలేదు. పెద్ద డాక్టరుకు చూపిద్దామంటే డబ్బు లేదు. అమ్మగారిని అడిగితే ఇస్తుంది. కానీ ఇప్పటికే ఆమెకు తన కుటుంబం చాలా ఋణపడి ఉంది. ఇంకా కూడా అడగడానికి తనకు నోరు రావట్లేదు. “గోరు చుట్టుపై రోకలి పోటు” అన్నట్టు చాలా రోజుల తర్వాత పనికి వెళ్లిన చంద్రం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడని కొంతకాలం యజమాని పనికి రావద్దన్నాడని పక్కింటి కనకయ్య ఇంటికి తీసుకొచ్చాడు. పనికి వెళ్లలేదు కాబట్టి కూలీ డబ్బులు లేవు. మల్లికి ఏమీ పాలుపోవడం లేదు. ఇక్కడి నుండి ఆహారం ఏదో ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు పెట్టగలుగుతుంది కానీ వైద్యం ఎలా చేయించ గలుగుతుంది? ఇక్కడున్న పరిస్థితిలో వారం నుండి ఇంటికి తొందరగా పోవడం కూడా అవడం లేదు.. ఇవాళ తెల్లవారుజామున వచ్చినప్పటినుండీ పని తెమలలేదు. వచ్చే ముందు చంటిది వద్దని మారాం చేయడం, వదిలించుకుని వస్తుంటే దీనంగా చూడడం కళ్ళల్లో కదలాడుతోంది. చంద్రం చూసుకుంటాడనుకుంటే అతని ఆరోగ్యం కూడా బాగా లేదాయె!! పోనీ ఇంతమంది పనివాళ్లు వున్నారు కాబట్టి విషయం చెప్పి కాస్త ముందు వెళ్లిపోతానని అమ్మగారికి చెప్పాలన్నా అటు పూజలు, ఇటు అతిథులతో శ్రీవాణి ఒక క్షణం కూడా తీరికగా ఉన్నట్టు అనిపించలేదు.
అమ్మవారి నామస్మరణతో, భజనలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. నిస్సహాయంగా చూస్తూ ఉంది మల్లి. రాత్రి తొమ్మిది గంటలు దాటింది.. జనం పలుచబడ్డారు. అందరికీ వీడ్కోలు పలికి అలసిన ముఖాలతో ఇంట్లోకి వచ్చారు కుటుంబ సభ్యులు. మెల్లిగా శ్రీవాణితో “అమ్మా! నేను ఇంటికి వెళ్లనా?” అని అడిగింది సందేహంగా మల్లి. “తిని వెళుదువు గానీ” అన్నది శ్రీవాణి. “లేదమ్మా వెళ్ళాలి” అంది ఉబికి వస్తున్న కంటి నీటిని బయట పడకుండా గద్గద స్వరంతో.. “చెప్పేది నీకే..నీవు తిని ఇంట్లో వాళ్లకు కూడా పట్టుకెళ్ళు” అన్నది శ్రీవాణి ఆదేశిస్తూ..చేసేది లేక గుడ్లలో నీరు కుక్కుకుంటూ
ఏదో తిన్నాననిపించి ఇంటికి బయలు దేరింది. ఇల్లు చాలా దగ్గరే. వెళ్లేసరికి చిన్నది నవ్వుతూ తండ్రితో ఆడుతూ కనిపించింది. చంద్రం కూడా ఉత్సాహంగా కనిపించాడు. ఏమీ అర్థం కాలేదు మల్లికి. మల్లిని చూడగానే చంటిదాన్ని పక్కకు దింపి “మల్లీ! శ్రీవాణమ్మ ఒక మనిషిని పంపి డాక్టరును ఇంటికి పిలిపించిందే.. ఆయన మన ఇంట్లనే నన్ను, పాపను చూసి మందులు రాసిచ్చి ఆయనతో ఏదో చెప్పిండు. ఆయన వెళ్లి మందులు, కొన్ని పండ్లను కూడా తెచ్చి ఇచ్చిండు. అట్లనే అమ్మ ఇచ్చిందని, ఖర్చులకు వాడుకొమ్మని 500 రూపాయలు చేతుల వెట్టిండు. ఆయమ్మను బగవంతుడు సల్లగ సూడాల” అని చెప్పుకుంటూ పైకి చూస్తూ చేతులు జోడించాడు.
అయోమయంగా చూస్తూ జరిగిందేమిటో అర్థం కాక మౌనంగా తలూపి తను తెచ్చింది వాళ్లకు పెట్టింది. ఆ నలుగురూ ఆదమరచి నిద్రపోయారు. ఏం జరిగిందో తెలియక పరిపరి విధాల ఆలోచనలతో మల్లికి రాత్రంతా జాగారమే అయ్యిండి. పొద్దున్నే లేచి పనిలోకి వెళ్లిన మల్లి శ్రీవాణి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె దుఃఖమంతా తీరేదాక మల్లిని పొదివి పట్టుకున్న శ్రీవాణి మల్లికి విషయం అర్థమయ్యేలా చెప్పసాగింది. “మల్లీ! కొద్దిరోజులుగా నీవు బాధలో ఉండడం నేను గమనించాను. చంద్రానికి జ్వరమని చెప్పావు. కానీ ఏదో తెలియని బాధ నీ మనసులో ఉన్నట్టు నాకర్థమైంది. నాకు చెప్పడానికి సందేహిస్తున్న విషయం పసిగట్టాను. ఈ నవరాత్రి బిజీలో అంతగా పట్టించుకోలేదు. కానీ నిన్న అమ్మవారికి నవరాత్రులు మొదలైనా నువ్వు సంతోషంగా లేవు. లేకుంటే మా అందరికంటే ఎక్కువ నువ్వే హడావుడి చేసేదానివి. అందుకే నువ్వు చెప్పకపోయినా మీ ఇంటికి మనిషిని పంపి విషయం తెలుసుకుని
డాక్టరును పంపించి మందులు ఇప్పించాను. నువ్వు మా ఇంట్లో దానివి. నీకు కష్టం వస్తే ఊరుకుంటానా చెప్పు? అలా ఊరుకుంటే నేను చేసే పూజలకు అర్థం లేదు. మనిషిని మనిషిగా చూడని పూజను ఆ భగవంతుడు కూడా స్వీకరించడు. ఎన్ని ఆడంబరాలకు పోయినా మానవత్వమే మనిషికి అసలైన అలంకారం. ఇంకెప్పుడూ నా దగ్గర నీకు మొహమాటం ఉండొద్దు” అని చెప్పింది. “ఇంకా చూస్తావేం! నాకో కప్పు కాఫీ ఇచ్చి పని మొదలుపెట్టు” అంటూ నవ్వింది.
‘అలాగే అమ్మా!’ అని శివరాత్రి లాంటి తమ బతుకుల్లో నవరాత్రి ఉత్సవం నింపిన శ్రీవాణిని కళ్ళప్పగించి చూస్తూ ” తల్లీ! వచ్చే జన్మలోనైనా ఈ అమ్మ రుణం తీర్చుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వమంటూ” ఆ అమ్మవారికి నమస్కరించుకుంటూ కొంగును లాగి బొడ్లో దోపి, రెండవరోజు దేవీ నవరాత్రోత్సవ నైవేద్యం చేయడం కోసం ఉద్యుక్తురాలైంది మల్లి కొత్త ఉత్సాహంతో, ప్రశాంత చిత్తంతో….

November 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మరో మాగ్నాకార్టా

by Madiraju Brahmananda Rao November 30, 2023
written by Madiraju Brahmananda Rao


ప్రజాకవి వేణుశ్రీ శతకపరంపరలో నాయకశతకం మూడవది. ఇంతకుముందు ప్రచేతసశతకం-కైరవశతకాలను రచించాడు. ఈ రెండు శతకాల్లోను రాజకీయ-సామాజికాంశాలకు సమప్రాధాన్య మివ్వబడింది. కాని ఈ నాయకశతకం ఫక్తు రాజకీయ శతకమే. ఇందులో మనకు కేవలం బడాబడా నాయకులే కనిపిస్తారు. వారు చేసే రాజకీయ (వికృత) క్రీడలే ఈ శతక వస్తువు.
”నాయకుల గుణముల మార్చ నారసింహ-వేగరావయ్య భువి పైకి వేడ్కజేయ ” అనే మకుటంతో 109 సీసపద్యాలతో నాయక శతకం కూర్చబడింది . కవి జన్మభూమి ఋణం తీర్చుకొంటూ-స్వంత గ్రామంలో కొలువైయున్న శ్రీనరసింహస్వామికి ఈ శతకమంకిత మిచ్చాడు. సామాన్యంగా నారసింహునకంకితమిచ్చే రచనలన్నీ దాదాపు విప్లవాత్మక-బీభత్సాలు గానే ఉంటాయి. నరసింహ తత్త్వమే అట్టిది. ఇదే పద్ధతిలో ఈ శతకరచన సాగుతుంది. పూర్వరచయితలు పలువురు ”దుష్టసంహార నరసింహ దురితదూర” అంటూ సంబోధించి దుష్టులను చంపేయమని కోరగా –వేణుశ్రీ వారిపై కొంత మేర జాలిచూపి అట్టి దుష్టులస్వభావాన్ని మార్చమనే కోరాడు.
ఈనాటి రాజకీయమెంతటి భయానకంగా తయారయిందో నాయక శతకం కళ్లకు కట్టినట్లు చూపించింది. శతకారంభంలో పూర్వపు నాయకులు రాజకీయాలనెంత ఉన్నతంగా నడిపించారో తేటతెల్లం చేస్తూ–నేటి నాయకులెంతగా వాటిని భ్రష్టు పట్టించారో రచయిత మొదటగా అంచనా వేసాడు. దేశ పరమార్థాన్ని కోరి ఆనాటి నాయకులు ఏ విధంగా స్వార్థ త్యాగం చేసి జైళ్లకు వెళ్లారో చెప్పి-ఈ నాటి నాయకులు స్వార్థంతో స్వలాభాన్ని కోరి ప్రజలను ఏవిధంగా ఇక్కట్లపాలు జేసి జైళ్లలో కుక్కుతున్నారో తులనాత్మకంగా పరిశీలించి ఆనాటి, ఈనాటి నాయకుల తారతమ్యాన్ని గ్రహించమని మొదటి పద్యంలోనే ప్రజాకవి కోరుతున్నాడు. నాందిగా రూపొందింపబడిన ఈ కోరికే శతకమంతటా విస్తరింపబడింది. ప్రచేతస-కైరవ శతకాల్లోని రాజకీయాంశాలకు కొనసాగింపుగా నాయక రాజకీయాంశాలిందు ప్రస్తావింపబడ్డాయి. మొదటి రెండు శతకాల్లో రచయిత నాయకులను సుత్తితో కొడితే ఈ
శతకంలో నాయకులను సమ్మెటతో మోదాడు.
1
ఈశతకంలో చెప్పబడ్డ నాయకులేయొక్క రాష్ట్రానికో సంబంధించిన వారు కారు. దేశం లోని అన్ని రాష్ట్రాల్లోను నాయకులు వెలగబెడుతున్న నిర్వాకాలివ్వే. మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాం కాబట్టి– ఉభయ రాష్ట్రాల్లోని నాయకులను దగ్గరుండి గమనిస్తుటాం కాబట్టి- తేలిగ్గా ఉభయ రాష్ట్ర నాయకుల స్వరూప స్వభావాలనే మన ఆలోచనలను పరిమితం చేసుకొని ఈ శతకాన్ని విమర్శిస్తాము. కాని ఇందలి వస్తువు అపరిమితమైన మేరగలిగినట్టిది.
వేణుశ్రీ రాజకీయ నాయకులను చాలా నిశితంగా దగ్గరనుండి గమనిస్తూ–రాజకీయ స్థితిగతులను సమీచీనంగా అవలోడనం చేస్తూ ఈశతకాన్ని ఆధునిక రాజకీయ వ్యవస్థకు దర్పణంగా మలిచాడు. అందుకే ఇందలి విషయాలు గానీ-నాయక పాత్రలు గానీ సులభంగా కళ్లకు కట్టినట్లు కనబడతాయి. రాజకీయపరంగా ఇందు ప్రస్తావింపబడని అంశమంటూ ఏదీ లేదు. నేడు రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో తెలుసుకో్వాలనుకుంటే ఈ శతకాన్ని చదివితే చాలు. అవగతమై పోతుంది. శ్రేష్ఠ-దుష్ట పాలనావ్యత్యాసాన్ని గమనించాలంటే ముందుగా వినీతనాయకుల ప్రశంసలు-అవినీతి పాలకాభిశంసనలు చేయాలి. ఈ పనే వేణుశ్రీ ఈ శతకంలో చేసాడు. శతకారంభ పద్యంలోనే నాటి నాయకులను ప్రశంసిస్తూ ”ఒకనాటినాయకులోర్పుతో ప్రజలను కష్టపెట్టకుండ కలసి మెలసి” అంటూ పూర్వనాయకుల నిబద్ధతను ప్రశంసిస్తూ ”నేటి నాయకులు స్వార్థనేతలైరి” అంటూ అని మొదటి పద్యాన్ని ముగించాడు. శతకానికి నాందీయనదగిన ఈ పద్యం లోనే శతకప్రణాళిక యేమిటో కవి స్పష్టపరిచాడు. పాలకుడు మంచిపాలన అందిస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. పండగ చేసుకుంటారని ”రాష్ట్ర ప్రజకు బాధ రాకుండ పాలించి ” (79) అనే పద్యంలో స్పష్టం చేసాడు. ”మంచిమనసు నాయకులను మరవరెవరు ”(95) అని చెప్పి దీనికి వ్యతిరేకమైతే ఆతనిని ఆ ప్రజలే అథ:పాతాళానికి త్రొక్కుతారన్నాడు.
ఈ శతకంలో వేణుశ్రీ రాజకీయంగా అన్ని సంఘటనలను మన దృష్టికి తీసుకొని వచ్చాడు. ఏ విషయాన్ని విడిచి పెట్టలేదు. ఉచిత పథకాలు-ఆ పథకాల మాటున ఉండే నయవంచనలు; భూ ఆక్రమణలు- వాటి వెనుక దందాలు, భూమి రిజి్ష్ట్రేషన్లు-ధరణి పోర్టు
2
లావాదేవీలు; అధిక పన్నులు-అక్రమసంపాదనలు-కుంభకోణాలు; గిట్టుబాటు ధరలు-కోల్డు స్టోరేజులు; ఇండ్లకేటాయింపులు-డబుల్ బెడ్ రూములు; కుల, మత సంఘాలు-వాటి మధ్యచిచ్చు; క్రీడాసంఘాలు-వాటిపై అజమాయిషీ; అక్రమ కట్టడాలు-నాయకుల అనుచిత లబ్ధి; సాహిత్యసంఘాలు-వాటి వైరం; ఉద్యోగస్థుల-పెన్షనర్ల జీతాలు- ఇట్లా ఒకటేమిటి-చెప్పుకుంటూ పోతే అనేకాంశాలిందు చోటుచేసుకున్నాయి. నాయకులు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని ఒకవేళ పట్టించుకున్నా అది తమకు లాభాన్ని చేకూర్చే పథకంగా రూపొందించుకొంటారని వేణుశ్రీ ఆవేదన. ప్రజలను గొఱ్ఱెలను చేసి నాయకులు వాటిని ఉచిత పథకాలంటారు. ”ప్రజలు గొఱ్ఱెలనియు పథకములను పేర –ఉచితమనియు పంచి ఊసులెట్టు ” (16). అంటూ ఇవన్నీ ఓట్ల కొనుగోలు పథకాలే అని రచయిత నిర్ణయం. ఇట్లా నాయకులు ప్రవేశపెట్టిన పథకాలనేకం ఈ శతకంలో ప్రస్తావింపబడ్డాయి. విజయోత్సవాలు-దశాబ్ది ఉత్సవాలు- విధవలు, వృద్ధుల పథకాలు బతకమ్మచీరెలు-బియ్యం పథకాలు-పెండిండ్లపథకాలు- (32) మొదలైన వన్నీనాయకులు చిత్తశుద్ధితో చేసేవి కావు. కేవలం ఓట్లు దండుకోవటానికే.
ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికై ప్రవేశపెట్టబడ్డాయి. నేటి నాయకులు వాటినికూడా తమ స్వార్థానికై భ్రష్టు పట్టించటం నిజంగా బాధాకరమే. ఇందులో ప్రథానమైనవి విద్య-వైద్యరంగాలు. ప్రస్తుత పాలకులు ఎయిడెడ్ పాఠశాల, కళాశాలలను ఎత్తివేసారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం ఛెసారు. కార్పొరేట్ వారు దోచుకోవటానికి అనుకూలంగా విద్యావిధానాన్ని మార్చివేసారు. ఆస్పత్రులను కూడా ఈ విధంగానే ప్రజలకందుబాటు కాకుండా విధానాలనన్నిటినీ మార్చారు. ఇష్టమైన విధంగా వారే ఫీజుల నిర్ణయించుకొనే నియమాలు రూపొందించారు. పెట్టుబడులు పెట్టి పెద్దయాస్పత్రుల/ వ్యాపారసంస్థల పాఠశాలలుబెట్టి .. ” (99) అంటూ తన అసహనాన్ని కవి ఇట వెలిబుచ్చాడు.
ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల మధ్య పార్టీల మధ్య పరస్పర విద్వేషాలు తారాస్థాయినందుకొన్నాయి. చట్టాలు చేసి వాటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లవలసిన నాయకులు కేవలం దూషణలకే పరిమితమయ్యారు. అసెంబ్లీలలో సహితం
3
కారుగూతలకే ప్రాధాన్యమిచ్చారు. వ్యక్తిగత ఆవేశ కావేషాలు హద్దులు దాటాయి. ఇదేమని ప్రశ్నిస్తే వారిని జైలుపాలు చేస్తారు. పార్టీలు మారటం -విడిచిన పార్టీని తిట్టటం సర్వసాధారణమైపోయాయి. ఈ పెడ సంస్కృతిని నిరసిస్తూ రచయిత విపుల సమీక్ష చేయటం 41-42-43 పద్యాల్లో గమనింప వచ్చు. ఇటీవల బాగా ముదిరిన సలహాదారుల సంస్కృతిని గూర్చి చెపుతూ ”నాయకుల సలహానందించె వారల-శకుని పాచికలాగా శల్యపాత్ర ” (6) వారిది శకుని, శల్యపాత్రలన్నాడు.
ఈ శతకం ప్రస్తావించిన ముఖ్యమై అంశాలు మరో మూడున్నాయి. 1. రైతులవెతలు 2. సాహిత్య సంస్థలు 3. స్వంత రాజ్యాంగం. నాయకులు రైతులను బానిసలుగా మార్చారు. వ్యవసాయ ఫలాలన్నీ కార్పొరేట్ సంస్థలకు ముట్టేటట్లు చేసారు. కోల్డ్ స్టోరేజులంటూ ఊదరగొట్టారు. (25) తమకు నచ్చిన సాహిత్య సంస్థలను ఆదరించారు. తమను పొగిడే కవులకు పదవులిచ్చారు(98). చివరకు కవులు కూడా నాయకప్రలోభాలకు లొంగిపోయారంటూ” దురభిమానం తోడ దొరల కవితలన్ని–వాస్తవాల నసలే వ్రాయలేరు” (8) అంటూ ఏ పరిణమాన్ని తాను కోరలేదో ఆ పరిణామమే కవుల్లో చోటు చేసుకోవటం వలన సాహిత్యవేత్త అయిన రచయిత ఈసందర్భంగా పొందిన అంతర్మథనం అంచనావేయలేనట్టిది.
నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని విడబుచ్చి స్వంత రాజ్యాంగాలను రచిస్తున్నారు. వాటినే అమలుపరుస్తున్నారు. చివరకు కోర్టులన్నా, కోర్టు ధిక్కరణలన్నా లక్ష్యపెట్టటం లేదు. ఈ విషయమే ”రాజ్యాంగమములును రక్షణ చేయుచు” (105) అనే పద్యంలో చెప్పబడింది.
ఇక నాయకుల అక్రమసంపాదన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. రాజకీయాలెప్పుడైతే సేవాధర్మాన్ని వదలిపెట్టి అనైతిక సంపాదనకు తెరదీసాయో అప్పుడే ప్రజాజీవితం ప్రశ్నార్థకమయింది. యువతను ప్రలోభ పెట్టి తమ బానిసలుగా మార్చి యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. విజ్ఞానవంతులను ప్రక్కకు నెట్టివేసారు. (97) ఉన్నతాదర్శాలతో మెలగవలసిన నాయకులు చివరకు కాముకులై ప్రవర్తించటం క్షమింపరాని నేరమంటూ గర్హించాడు(84).
4
నాయక శతకం ప్రస్తుత నాయకుల వ్యవహార చిత్రాలను సమీక్షించే శతక సర్వస్వం. ఇట్లాంటి నాయకమ్మన్యులను సరిజేయటానికి ప్రజలహక్కులపత్రమీ శతకం. గాడిదప్పిన రాజకీయాలు-నీతిదప్పిన నాయకులు మారాలంటూ ” కులమతభేదాల కూకటివేళ్లతో-పెకలించు పార్టీలు పెరగవలయు”(108)అని శతకాంతంలో కోరుకున్నాడు. శతకానికి భరత వాక్యంగా ”దేశసౌభాగ్యమింకను తేజమొప్పు-జనులు సుఖసంతసమ్ముల సరిగనుండు” (109) అని చెప్పిన రచయిత సమీహ నెరవేరాలని కోరుకుందాము. చిరంజీవి వేణుశ్రీ ప్రజోపకరాలైన మరిన్ని రచనలు చేయాలని ఆశిద్దాం.

November 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖ…తెలుగు వాచకం…

by -ప్రమోద్ ఆవంచ November 30, 2023
written by -ప్రమోద్ ఆవంచ

ప్రియమైన అన్నయ్య ఆవంచ క్రాంతి కుమార్ కు, నమస్కారములు..
నేను నల్గొండలో కుశలంగా ఉన్నాను.మా మూడవ తరగతి పరీక్షలు ఇంకను రెండు వారాలలో జరగగలవు.నేను బాగా కష్టపడి చదువుతున్నాను.వారం క్రితం మా పంతులు గారు మమ్మల్ని వినోద యాత్రకనీ
కొలనుపాకకు తీసుకొనిపోయారు.ఇది నల్గొండకు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పురాతన పట్టణం.పూర్వం ఇది శైవ మత కేంద్రంగా ఉండి దక్షిణ కాశీ అని గౌరవ నామం పొందిందట.ఇందులో సోమేశ్వర ఆలయం,చండికాలయం,కోటి లింగాలయాలు గొప్పవి.
జైనులకు కొలనుపాక చాలా పవిత్రమైన క్షేత్రం.ఇక్కడి జైన
మందిరంలో మూడు గుళ్ళు ఉన్నాయి.గోపురాలు, శిఖరాలతో అలంకరించి ఉన్న చిత్రాలతో ఈ ప్రదేశం చాలా అందంగా ఉండేది….ఇక సెలవు…

ఇట్లు నీ తమ్ముడు…
ఆవంచ ప్రమోద్ కుమార్…. అడ్రస్…..ఆవంచ క్రాంతి కుమార్..పోస్ట్..చర్లపల్లి….తా.జిల్లా.నల్గొండ..ఆంధ్రప్రదేశ్.
1979 వ సంవత్సరంలో మా నాన్న ఆవంచ సీతారామారావు గారు రాసిన మూడవ తరగతి తెలుగు వాచకం పుస్తకంలోని ఏడవ పాఠ్యాంశం.. శీర్షిక..లేఖ…ఈ లేఖ అప్పట్లో ఒక సెన్సేషన్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చే ఉత్తరాలను మా పోస్ట్ మాన్
రాజయ్య తెచ్చి ఇచ్చేవాడు.రాజయ్యకు బస్టాండ్ దగ్గర
ఒక టీ స్టాల్ కూడా ఉండేది.పక్కనే ఒక బోర్ ఉండేది.
ఆ బోర్ ఊరి జనాల దాహాన్ని తీర్చేది.ఆ పక్కనే బ్రహ్మంగారి గుడి,ప్రతి సంవత్సరం జాతర జరిగేది.ఆ జాతరలో వడ్ల కుమారస్వామి మైకులో
ఘంటసాల మధురగీతాలను అద్బుతంగా పాడేవాడు.
ఒక వారం రోజులు పండుగ వాతావరణం ఉండేది…
కుమారస్వామి బొంగరాలు బాగా తయారు చేసేవాడు.
నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో,చనిపోయాడని తెలిసింది.ఇక పోతే ఆ లెటర్లలో సారాంశం…అన్నయ్య క్రాంతి కుమార్ గారికి….అంటూ కొలనుపాక గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతూ మేమూ వస్తాం…మాకు చూపించండీ అంటూ…ఇప్పుడాలోచిస్తే అప్పట్లో మా అన్నయ్య నేనూ చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళమేమో? నేనైతే చాలా చిన్న వాడ్ని,అంతగా జ్ఞాపకం లేదు. నాకూ,మా అన్నయ్యకు నాన్నే పెద్ద హీరో. ఇంతే కాదు మా అన్నయ్య క్రాంతి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నా గురించే ఎక్కువగా ఆలోచించేవాడు.నా మంచి చెడులను పట్టించుకునేవాడు.మా అమ్మ బాషలో చెప్పాలంటే, కోపంతో ఒక మాట అన్నా,వెంటనే మర్చిపోయే గుణం మా క్రాంతిది.ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు.ఏ మార్పూ లేదు….కట్ చేస్తే…
మా నాన్న లైబ్రరీనీ వెతుకుంటే ఈ మూడవ తరగతి తెలుగు వాచకం పుస్తకం బయట పడింది.అది
పందొమ్మిది వందల డెబ్బై ఏడు,ఎనిమిది సంవత్సరాలలో
రాయడం మొదలై డెబ్బై తొమ్మిదిలో పూర్తయి ఉంటుంది.
అప్పుడు నేను మూడవ తరగతి చదువుతున్నాను.
అప్పట్లో మా ఊర్లో ప్రైమరీ స్కూలు అయిదవ తరగతి వరకే ఉండేది.ఆ స్కూలుకు హెడ్ మాస్టర్ గా మా చిన్నాయన ఆవంచ లక్ష్మారావు ఉండేవారు.ఆయన అంటే ఊర్లో భయం ఉండేది.ఉత్తమ ఉపాధ్యాయుడే
కాదు, మంచి రాజకీయ వేత్త.ఊర్లో ఉన్న కుల పెద్దలంతా
ప్రతిరోజూ సాయంత్రం ఆయనతో సమావేశం కావల్సిందే.
ఊర్లో ఎలాంటి సమస్య అయినా ఆయన తీర్చేవారు.
మా నాన్నకు తోడ ముగ్గురు తమ్ముళ్ళు.నాన్న ఆవంచ సీతారామారావు గారు..మంచి సాహితీ వేత్త.ఆ రోజుల్లో ఆయన దేవులపల్లి రామానుజరావు ఆద్వర్యంలో రాసిన ఎన్నో పుస్తకాలు,అనువాదాలను ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించింది.పెద్ద తమ్ముడు లక్ష్మారావు, డెబ్బైవ దశకంలో చర్లపల్లిలో ఆయనది ఒక ఎరా…ఇటు ఉపాధ్యాయుడిగానూ,అటు ఊరి రాజకీయాల్లోనూ, చురుగ్గా పాల్గొన్న ఆయన చరిత్ర ఒక ప్రభంజనం. తరువాత ఆవంచ వేణుగోపాల్ రావు……నల్గొండ జిల్లాలోనే ప్రముఖ అడ్వకేట్.1969 సంవత్సరంలో తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి.తన ఉపన్యాసాలతో యువతను ఉత్తేజ పరుస్తున్నాడన్న కారణంగా ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది, అప్పటి ప్రభుత్వం.తాను రాసిన అనేక వ్యాసాల ద్వారా ప్రజలను ఉత్తేజ పరచిన పోరాట యోధుడు. తరువాత ఆవంచ మురళీధర్ రావు…ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా ఉండి బీఏ పబ్లిక్ గైడ్ పుస్తకాలు రచించారు.ఈ నలుగురు సోదరులు ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యులు…….కట్ చేస్తే…
ఈ మూడవ తరగతి పుస్తకంలో మొత్తం పదహారు పాఠ్యాంశాలు ఉన్నాయి.అవి..ఓరుగల్లు, తోడేలు- మేకపిల్ల,మర్యాద రామన్న తీర్పు, రామదాసు,ఆవు, దీపావళి,లేఖ, బస్సు ప్రయాణం,సంత, పోస్టాఫీసు,నీతి పద్యములు,హితవులు,సుమతీ సూక్తులు,వేమన పద్యాలు, తెలుగు జాతి ఒక్కటే, తెలుగులందరూ ఒక్కటే…..భాషా బోధన విషయంలో
పిల్లలకు తలకు మించిన భారం ఉండొద్దన్న ఉద్దేశంతో
అప్పటి వరకు అమలులో ఉన్న పాఠ్య పుస్తకాన్ని అయిదు శాతం తగ్గించేందుకు 400 కొత్త మాటలకు బదులు 250 కొత్త మాటలను మాత్రమే ప్రవేశ పెట్టాలనీ
అప్పటి ప్రణాళిక సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఆ మేరకు ఒకటి, రెండు తరగతులలో విద్యార్థులకు సుపరిచితమైన మాటలే కాకుండా 250 కొత్త మాటలను
ఈ పుస్తకంలో ప్రవేశ పెట్టారు.
ఈ పుస్తకంలో సంబంధిత పాఠ్యాంశానికి తగ్గట్టుగా ఒకటి, రెండు బొమ్మలు ఉన్నాయి.ఆ బొమ్మలు వేసింది, చర్లపల్లిలో మా ఇంటి వెనకాల లైనులో ఉండే ఫైన్ ఆర్ట్స్ డిస్కంటిన్యూవ్ విద్యార్ధి యద్దు లక్ష్మీ నర్సింహ్మ.వీళ్ళ ఇల్లు కొప్పోలు రంగనాయకమ్మ ఇంటి పక్కనే ఉండేది.యాబైవ దశకంలో
నర్సింహ్మ వాళ్ళ నాన్న చర్లపల్లి స్కూలులో ఉపాధ్యాయు డిగా పనిచేసారు.పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే భద్రయ్య, టీచర్ గా పనిచేసే శంకరయ్యలు అన్నయ్యలు.
ఒక అక్క.నర్సింహ్మ మూడు సంవత్సరాల వయసులోనే
తండ్రి చనిపోతే ఇద్దరు అన్నలే పెంచి పెద్ద చేసారు.డిగ్రీ
చదివేప్పుడు టీబీ రావడంతో చదువును మధ్యలోనే ఆపేసాడు నర్సింహ్మ.ఆ గ్యాపులో డ్రాయింగ్ మీద ఉన్న
ఆసక్తితో ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో చేరాడు.మళ్ళీ అనారోగ్య
కారణాలతో అది కూడా డిస్కంటీన్యూవ్ చేసాడు.ఆ సమయంలోనే నాన్న రాసిన పుస్తకానికి బొమ్మలు చాలా అద్భుతంగా వేసాడు.ఆ బొమ్మల్లో మీకు నచ్చినదేది అని
అడిగితే ఎనమిదవ లెసన్ బస్సు ప్రయాణానికి గీసిన
బొమ్మలు అని చెప్పాడు.అవే ఎందుకు అని అడిగితే ….
నార్కట్ పల్లి నుండి వచ్చే బస్సులు చర్లపల్లికి వచ్చేసరికి
విపరీతమైన రద్దీ, బస్సు లోపల తొక్కిసలాటతో బస్సు
ఎక్కాలంటే చికాకు కలిగేది….ఆ అనుభవంతో బస్సు ప్రయాణం పాఠ్యాంశానికి వేసిన రెండు బొమ్మలు ఒకటి
బస్సులో తొక్కిసలాట.. రెండవది బస్సులో క్యూ పద్దతి…
ఈ రెండు బొమ్మలు చాలా శ్రద్ధగా వేసాను.మొత్తం పుస్తకం లో ఆ రెండు బొమ్మలే నాకు ఇష్టమైనవనీ నర్సింహ్మ
చెప్పాడు.ఆ తరువాత కొన్ని రోజులకు డిగ్రీ పూర్తి చేసి, కొద్ది కాలం డ్రాయింగ్ టీచర్ గా పనిచేసాడు.ఆ తర్వాత
ఎలక్సిటీ డిపార్ట్మెంట్ లో చేరి, పదేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు…
1979 వ సంవత్సరంలో వచ్చిన ఆ మూడవ తరగతి తెలుగు వాచకం పుస్తకాన్ని మా నాన్న రాయడం
అది తవ్వకాల్లో బయటపడడం…ఆ పుస్తకంలో బొమ్మలు
వేసిన లక్ష్మీ నర్సింహ్మ‌‌‌ గురించి నలబై సంవత్సరాల తరువాత తెలుసుకుని, ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ..ఆ జ్ఞాపకాలను ఆయన రీకలెక్ట్
చేసుకుంటూ మా నాన్న గురించి చెపుతుంటే…. నేను ఇంకా… ఇంకా అంటూ రెట్టింపు ఉత్సాహంతో అడుగుతూ ఉప్పొంగిపోయాను.మా నాన్నకు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను…….

November 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సముద్రమే నా కడకు వచ్చింది

by Padmavathi Neelam Raju November 29, 2023
written by Padmavathi Neelam Raju

చాలా సంవత్సరాల తరువాత మా వూరు వెళ్ళాను. అక్కడకి వేళ్ళ గానే  రెండు రోజులకే నాకు  దగ్గరగా ఉన్న కొత్తపట్నం   సముద్రానికి వెళ్లాలనిపించింది. ఆ మర్నాడే ఒక ఆటో తీసుకొని కొత్తపట్నం బయలుదేరాను. వూరు చాల మారిపోయింది. బస్టాండ్ దగ్గర కనకాంబరాలు తమలపా కులు అమ్మే అమ్మాయిలు చాల తక్కువ కనిపించారు . కొత్తపట్నం ఎప్పుడు వెళ్లిన ఇదివేరుకు బస్సు  కిటికీ నుంచే కనకాంబరాలు , మల్లెపూలు తమలపాకులు కొన్ను క్కునే వాళ్ళం. చాల తాజాగా ఉండేవి. బస్సు దిగిన తరువాత ఒక 5 కిలోమీటర్లు దూరం కాలినడకన సముద్రం వడ్డుకు నడవాల్సి వచ్ఛేది. ఒక  బస్సు  మాత్రమే వడ్డు వరుకు వెళ్ళేది . ఇప్పుడు ఆటో లు కూడా వెళుతున్నాయి. దారిలో చాలా అప్పార్ట్మెంట్స్ కనిపించాయి. కొత్తపట్నం వూరు దాటి సముంద్రం వైపు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే కూర్చుని అట్లువేస్తున్న ఒకామెను చూసి, ఆటో ఆపమని అన్నాను. ఇలా రోడ్ పక్కన అట్లుఅమ్మేవాళ్లు మధ్యలో ఎక్కడ కనిపించలేదు. 

ఆటో అబ్బాయి నన్ను చూసి,  “ఇక్కడ వద్దులెండి మేడం! అట్లు అంత బాగుండవు. పంతులు మెస్ దగ్గరలోనే ఉన్నది . అక్కడ ఆపుతా, అక్కడ తినండి. అన్ని వేడి వేడిగా బాగుంటాయి ”అని చెప్పాడు. 

నేనేమి మాట్లాడలేదు. ఎందుకంటే నేనెప్పుడో నా  చిన్ననాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. మా అమ్మ , ఆమ్మా , మాస్టారు గారి భార్య , ఆవిడా ఆడపడుచు రాఘవమ్మ గారు , ఇలా చాల మంది మా ఊరినుండి  కలిసి ఆ, కా , మా , వై ( ఆషాఢం , కార్తీకం, మాఘం , వైశాఖం ) సముద్ర స్నానాల కు కొత్తపట్నం వెళుతుండేవారు. నేనెప్పుడూ వాళ్ళ మధ్యలో బుడంకాయ్య్లలే వెంటబడి వెళ్లేదాన్ని. వద్దంటే నానా గొడవ చేసేదాన్ని. ఆ గొడవ కంటే నన్ను వాళ్ళతో తీసుకెళ్లడమే మంచిదని మా ఆమ్మ అనుకోనేది . 

 కార్తీక పౌర్ణమి నాడు సముద్రస్నానాలకి వెళ్ళినప్పుడు, ఉదయాన్నే అయిదు, ఆరు గంటలకే   సముద్రం చేరుకొని తొమ్మిది గంటల దాక సముద్రస్నానాలు చేస్తూ, ఇసుకలో ఆడుకొంటూ అలలవెంటే  పరిగెడుతూ, గవ్వలు , నక్షత్ర చేపలను ఏరుకుంటూ గడిపేసేదాన్ని . పెద్దవాళ్ళ పూజలు అయ్యాక, వెనక్కి  బయలుదేరేవాళ్ళం. నేను చిన్నదాన్నని మా ఆమ్మ నాకు ఇలాగె రోడ్డు పక్కనే అట్లు పొసే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అట్లు పెట్టించేది. ఎందుకో మరి నాకు ఆ  అట్లు మా అమ్మ చేసిన అట్లకంటే కూడా చాలా రుచిగా అనిపించేవి. 

అదే మాట మా అమ్మతో అనే దాన్ని. “అమ్మ ! పుల్లమ్మత్త  అట్లు చాల బాగుంటాయి! నువ్వు కూడా ఆలా చేయరాదు! “అని. మా అమ్మ , అన్నయ్య పెద్దగా నవ్వేసేవారు. “ఆకలివేస్తే గడ్డయినా రుచిగానే ఉంటుంది” అని అన్నయ్య మొట్టికాయవేసేవాడు. 

పంతులు మెస్ వచ్చింది   . “మేడం! టిఫిన్ చేస్తారా!”అన్న పిలుపుతో ఈ లోకాం లోకి వచ్చిపడ్డాను మళ్ళీ.

 “అలాగే అట్లు నువ్వు కూడా తిను”  అని అన్నాను వాడితో.

 వాడు “ఒక ప్లేటు పూరి  కూర, ఒకప్లేటు అట్లు అంటూ నాకూడ  ఆర్దర్రిచ్ఛేసాడు. 

మళ్ళి  సముద్రం వైపుకి  ఆటో నడిచింది. నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపటిదాకా వెయిటింగ్ ఛార్జ్ ఇస్తానని వాడికి చెప్పాను సముద్రం తో కాసేపు అలా  గడపాలనే . వాడు ఆనందంగా తలూపాడు.

కొత్తపట్నం సముద్రం వద్దకి చేరుకున్నాను. ఆటో అబ్బాయి అవసరమైనప్పుడు తన మొబైల్ కి కాల్ చేయమని చెప్పి , తుఫాన్ షెల్టర్ దగ్గరగా  ఆటోని ఆపు కొని కూర్చున్నాడు. 

 *********   *******   ****** ********

సముద్రం అలాగే ఉంది . నా చిన్నప్పటి లా గే. అదే చెలియలికట్ట , అదే దూకుడు, అదే ఘోష , కాలంతో పని లేనట్లు ఎగసిపడే అలలు , తామే కాలమని చెబుతున్నట్లనిపిస్తుంది . అలల ను తాకుతూ తీరం వెంబడే నడవటం మొదలు పెట్టాను. ప్రతి అలా  నన్ను  సృసిస్తూ నన్నుపలకరిస్తున్నట్లున్నది.ఇంకొంచం లోపలకు వెళ్ళాను పెద్ద అల ఒకటి నన్ను బలంగా తాకింది. నా కాలికింద మట్టిని లాగేస్తూ నన్ను ఆలింగనం చేసుకోవాలని  చేతులు చాచినట్లనిపించింది. నేను అలల ఊపుకి పడిపోయాను. మళ్ళి  లేచి నిలబడ్డాను. ఈసారి అలల తాకిడికి నిలదొక్కుకొని మళ్ళీ  నిలబడ్డాను… అలలు పడుతున్నాయి , తిరిగిలేస్తున్నాయి  అనంత కాలంలో అలుపెరుగని బాటసారిలా.ఇదే ఒక జీవన సత్యమనిపించింది

 నాలో నేనే నవ్వు  కున్నాను. అప్పటికే సగం తడిశాను.  కాసిని నీళ్లు తలమీద చల్లుకొని తీరంవైపుకి నడిచాను. సముద్రం వడ్డున అంత సందడి లేదు. అది పుష్య మాసం. సముద్రస్నాలకు జనాలు అంతగా రారు.  అక్కడక్కడా కొందరు జాలరి పిల్లలు ఆడుకొంటున్నారు. 

నేను వాళ్ళ వైపుకి నడిచాను. “పిల్లలు! ఈ రోజు బడికి వెళ్ళలేద? “అని అడిగాను.

 “లేదండి!”ఆ పిలుపులో ఎదో కొత్త నాగరికత కనిపించింది. 

“మా టీచరు సెలవు పెట్టింది . ఈ రోజు మాకు పాటా లు జరగవు” .

“ఎందుకని?” 

“మా జాలరి పల్లె కు  రెండు కిలోమీర్ల దూరంలో ఒక బడి ఉంది. అక్కడ మాకు ఒకే టీచర్ ఉంటుంది. మేమంతా అక్కడికే వెళతాము.”

 “అలాగ, మరి ఈ రోజంతా ఎం చేస్తారు”. సన్నగా పొడవుగా ఉన్న ఒక పిల్లా డు “మేమంతా సముద్రం పైకి పోతాము. ఇయాల అటు-పోతూ వస్తది. సముద్రం ముందుకి వెన్నకి జరుగుద్ది.” నాకు వివరం ఇచ్చాడు.

“ సముద్రం జరుగుద్ది”.  ఈ మాటలు నేను ఎప్పుడో విన్నట్లనిపించింది.  సముద్రపు హోరు నాకేదో గుర్తుచేస్తున్నట్లనిపించింది. కొద్దీ దూరం లో ఆ ఇసుకలో కూర్చుండిపోయాను. ఎన్నోవిషయాలు మనం గుర్తుంచుకోము. కొన్ని విషయాలు  జ్ఞాపకాలుగా మన మనసులో ఎక్కడో  నిక్షిప్తమై పోతాయి . అవి మనకు సంతోషం కలిగించవచ్చు…. కొన్ని బాధను మిగల్చవచ్చు.

అటుగా వేళ్ళు తున్న ఒక చిన్న పిల్లాడిని పిలిచాను ,”ఒరేయ్ ! బుడ్డోడా ! ఇట్రా !”

వాడు లగెత్తుకుంటూ వచ్చాడు. “నా పేరు బుడ్డోడు కాదండీ! నా పేరు రాగులండి!”

“రాగుల !”ఎక్కడో విన్నట్లున్నది. 

“అవునండి . అది మాతాత పేరండి ! మా అయ్య నాకు ఆ పేరు పెట్టాడండి!” వాడేదో చెపుతున్నాడు. రాగులు నాకు గుర్తు కొచ్చాడు. 

  ************                    *************                             *************          

తెడ్డు తిప్పి తిప్పి బలంగా తయారైన భుజాలు , పిక్కల పైదాకా వేసుకున్న ఆకుపచ్చ ని క్కరు, ఎర్ర రంగు నెట్ బనీనువేసుకొని పోతపోసిన నల్లటి శిలా విగ్రహంలా ఉండే ఆటు పోటు  తెలిసిన జాలరి రాగులు. సముద్రానికి వచ్చే వాళ్ళదగ్గర  డబ్బులు తీసుకొని ఆలా కాసేపు సముద్రం పైదాకా తన పడవలో తిప్పుకొస్తుంటాడు. నేను కాలేజీ చదువుకొచ్చ్చినప్పటి నుంచి ఆలా సముద్రానికి  పిక్నిక్ కు వెళ్లడం బాగా అలవాటు. అంతే కాదు ఎన్  ఎస్ ఎస్  ఆక్టివిటీస్ లో భాగంగా మేము జాలరి పల్లెలకు వెళ్లి వాళ్లకు విటమిన్ బిళ్ళలు , చిన్న పిల్లలకు  వాక్సిన్లు    ఇస్తూండేవాళ్ళం. అప్పుడు సరదాగా ఎవరైనా జాలరి కి డబ్బులిచ్చి పడవలో సముద్రం పైన అలలు పుట్టేదాకా వెళ్లి వెన్నక్కి వచ్చే వాళ్ళం. 

కానీ రాగులు ఆలా కాదు. వాడికి ధైర్యమెక్కువ. వాడు చాల దూరం సముద్రం లోపలిదాకా తీసుకెళతాడు. ఆరోజు నేను ఒక్క దాన్నే పడవ ఎక్కాను. నాకు చాలా  చాలా  దూరం సముద్రం లోకి వేళ్ళలనిపిచింది. “రాగులు! నాకు ఇంకా పైదాకా సముద్రంలోకి వేళ్ళా లని ఉంది. 

తీసుకెళతావా”. అని అడిగాను. 

“ అమ్మాయ్ గారు  ! నడిమింట సూరీడు నెత్తిమీదున్నప్పుడు సముద్రం శానా ఊపుమీదుంటాది. ముందుకి వెన్నకి జరుగుతాఉంటాది . శానా  జాగరతగా కూకోవాలా పడవలో. లేదంటే, నేను నిన్ను మోసుకు రావాల్సి వస్తది.”

“ఏం   పరవాలేదు. వెళ్దాం పద” అన్నాను .  రాగులు పడవను నీళ్లలోకి తోసి నన్ను కూర్చోమన్నాడు. తరువాత నడుస్తూనే పడవను నడుములు పైదాకా అలలు వచ్చే  వరకు తోసుకెళ్లి , ఒక్క ఉదుటున పడవలోకి  ఏగిరి కూర్చొని , అతి వేగంగా తెడ్డు తిప్పడం మొదలు పెట్టాడు . వాడు పడవను నడుస్తూ తోసి నప్పుడు నాకు భయమనిపించలేదు. తెడ్డు వేస్తున్నప్పుడు పడవ  అలలతో పోటీపడుతున్నట్లనిపించింది.  చాల మెలుకువగా రాగులు పడవ ని తిప్పుతున్నాడు. అంతే వేగంగా పడవని తోస్తు పడవ మీదే సవారీ అన్నట్లు పెద్ద పెద్ద అలలు మీద మీద కు వస్తున్నట్లనిపించింది.   నాలో భయం మొదలయింది. గట్టిగ కళ్ళు మూసుకున్నాను.

“ఏంటి   భయమేస్తుందా  ?” అని రాగులు విశాలంగా నవ్వాడు. “లేదు” అని బింకంగా అన్నానే గాని, వెన్నులో ఎక్కడో జలదరింపు వస్తున్నది. రాగులు పడవ మధ్యలో నిలబడి తెడ్డు వేస్తున్నాడు. 

“నేను నీ వైపుకి వచ్చి కూర్చొన ” అని అడిగాను. 

 వాడు చాల తేలికగా “రామ్మా!” అని అన్నాడు. 

నాకు భయం పోగట్టడానికి రాగులు కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు.  

 “అమ్మాయి గోరు! ఈ సముద్రం ఉండాదే , మహా గొప్పది. మడిసికి ఎప్పుడు పరిచ్ఛలు పెడతా ఉంటది. ఇలా మొదట్లోనే భయపెడతాది! ముందుకి వేళ్ళా మను కో  అన్ని వింతలే. ఒక కొత్త పెపంచకము . అక్కడ అంత జలమే, ఇంకేమి అగుపడదు.  అప్పుడనిపిస్తది ఈ సముద్రం మద్దెలో నువోక్కదానివే  అని, భయమాడకు. ఈ తల్లేమీ చేయదు. అది గో ఆడ  సూడు దూరంగా నీలాకాశం భూమి ని తాకుతున్నట్లనిపించటం లేదు. ఇదిగిదిదో ఇటు చూడు, దూరంగా, సముద్రపు కొంగల గుంపు  ఎగురుతున్నాది  . ఇవే మాకు అప్పుడప్పుడు దా రి చూపెడుతుంటాయి. నీటిలోకి సూడు. నీకేమి కనబడదులే! కానీ అప్పుడప్పుడు సొర మీను లు ఎగసి పడతా ఉంటాయి. సముద్రానికి మన పైన పెమ . అప్పుడు మన దగ్గరకి జరుగుద్ది  పున్నమి నాడు, అమావాసనాడు సముద్రం పోటేట్టు త్తాది.   నాతో కలిసి పడవలో వస్తుంటది.   నాకట్ట  శాన సార్లు అనిపించింది. మన మనసు తోటి సూడా ల ఈ సముద్రాన్ని”.  

వాడి మాటలు నాకు ధైర్యానిచ్చాయి . 

సముద్రాన్నే చూస్తున్నాను. అంతా  నీరే. అంతటా నీరే . విశాలంగా ఉన్న సముద్రం. ఎన్నో రహస్యాలను తన అనంత మైన  లోతులలో దాచి . మనషి యొక్క అస్థిత్వాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. మనిషేంత చిన్నవాడు. అణువులో అణువంత కూడా కాదనిపించింది. ఈ సముద్రానికి కోపమొస్తే , “ఆమ్మో! ఇంకేమైనా ఉన్నదా! మనిషేక్కడ మిగులుతాడు!”

“ఈ అనంతమైన జలాలలో నేను మాత్రమే కాదు, రాగులు కూడా ఉన్నాడు. 

 కానీ వాడు ఈ సముద్రం బిడ్డ.  సముద్రం తో ఒక అవినాభావ సంభందం వాడికి ఉన్నట్లనిపించింది ”. 

“అమ్మాయి గారు ! అట్టా  సూడండి! సముద్రం రంగులు మారుస్తది . పొద్దున్నే నీలంగా స్వచంగా  బాల సూరీడుతో ఆడుకుంటున్నట్లుంటది. మధ్యలో తెల్లగా మెరిసిపోతుంటాది.  సూరీడ్ని సూస్తా . మిట్టమద్యాన్నం వేళా  ఎన్నో  రంగులు , నెమలి లాగా కనిపిస్తాది . అలలు ఎగసిపడుతూ ఉంటాయి ఆ సూరీడి కోసం నర్తిస్తాది. సాయం సంధ్య వేళ ఎర్రగామారుద్దీ కోపంగా, సూరీడ్నికోపంగా చూస్తున్నట్లుంటది. రాత్రి వేళ తారలన్నీ  ఈ సముద్రం తో  కబుర్లు సెప్పాలంటూ నేలమీదకు వచ్చినట్లుంటది. సెందురుడే మో అలిగి దాక్కున్నట్లుంటది అమవాస దినాన”. 

చాల భావుకతతో రాగులు మాట్లాడుతున్నాడు. 

“ఈ ప్రకృతిసౌందర్యాన్ని ఆస్వాదించడంలో కారెవరు అనర్హులు. భావుకత ఏ ఒక్కరి సొత్తు” కాదనిపించింది

అప్పటికే చాలా దూరం వచ్చేసాము. నిర్మలంగా ఏ  కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రం మధ్యలో ఉన్నాను. ” వెన్నకి వెళదామా “ అన్నాను . 

“అట్టాగే” అంటూ రాగులు పడవను వెన్నక్కి తిప్పాడు. ప్రశాంతగా ఉన్న సముద్రం, అలల మధ్యకొచ్చేసరికి తన నైజం చూపిస్తున్నట్లనిపించింది. అప్పటికే మధ్యాన్నం దాటిపోయింది. సముద్రానికి పోటు  పెరిగింది. పెద్ధ పెద్ద అలలు పడవను ఊపేస్తున్నాయి. ఒక పెద్ద అల వచ్చి పడవమీద పడింది. పడవ కిందకు జారిపోయింది. రాగులి చేయ్యి  కండరాలు బిగుసుకున్నాయి. అతి బలంగా తెడ్డు వేయడం మొదలు పెట్టాడు. అలలు నన్ను, పడవను పూర్తిగా  తడిపేశాయి. “భయపడమా కమ్మాయి! ఇది మాకు అలవాటే. నీకు కొత్త కదా. కూసంత భయమేస్తది”.  అంటూ చాకచక్యంగా పడవను తీరానికి చేర్చాడు . 

రాగులికి కొచం ఎక్కువ డబ్బులే ఇచ్చాను. దానికే వాడెంతో తృప్తిగా  “ఎప్పుడైనా సముద్రం కాడ కొస్తే నన్ను తలుచుకోండి అమ్మాయి గారు. వచ్చేస్తా. మీమ్మల్ని  సముద్రమంత తిప్పుకొచ్చేస్తా”. అంటూ చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు. 

          **************                 ***********                    **********                       ***************

“మేడం మీకు గవ్వలు కావాలా?”అంటూ రాగులు అడగడం వినిపించింది . 

 “మీరె క్కడ ఉంటారు”, అడిగాను ఆ చిన్న రాగుల్ని. వాడు దూరంగా ఉన్న వెదురు తోటల ఆవల ఉన్న కొన్ని పాకలు చూపించాడు. 

“నేను నీతో వస్తాను మీ తాతను చూపిస్తావా?” అన్నాను. వాడు కాస్త అయిష్టంగా తలూపాడు .

“మరి గవ్వలు కొనుకుంటావా , నా కాడ  శాన ఉన్నాయి గుడిసెలో”.  

“ అలాగే పద “ అంటూ వాడి గుడిసెల వైపు నడిచాను. దారిలో పక్కాగా తమలపాకు తోటలు కనిపించాయి. పాకల దగ్గరికి చేరే కొద్దీ ఎండు చేపల వాసనా కూడా ఘాటుగా రావడం మొదలెట్టింది. నాకు కొంచం తల తిరిగినట్లనిపించింది . 

ఒక పాక బయట బాగా పాత  బడిన పడవ ఒకటి పెట్ట్టున్నది. అందులో బాగా ముసలివాడల్లే కనిపిస్తున్న ఒక వ్యక్తి కూర్చొని చుట్ట తాగున్నాడు. 

 “ఎరా రాగులు, అప్పుడే వచ్చావేంటి , గవ్వలు ఏరుకోడం అయిపో యినాదా  లేదా ?”  మల్లి పోతావ” అంటూ అడుగుతున్నాడు. 

“ఈ మేడం  గారెవరో మన పాక సూడాలంటేను తీసు కొచ్చ” అంటూ, ఆగ కుండా పాక లోకి లగెత్తాడు. 

“మన పాకల్లో ఏముంటాయి “ అనుకొంటూ “ఎవరు?” అంటూ కాస్త కష్టంగా తల తిప్పి  నా  వేపు చూసాడు. వయసు మీద పడి , పడవ ను నడిపే శక్తీ లేక అలాగే ఆ పడవ లో కూర్చొని సముద్రానికి కబుర్లు చెబుతున్నట్లున్నాడు రాగులు.  నేను గుర్తుపట్టినట్లు “మీరు రాగులే కదూ?”      అన్నాను. 

“అవును . నువెవ్వరు? ?

“చాల ఏళ్లనాటి మాట, మీతో సముద్రం మధ్యలోకి వచ్చానునేను”.  

రాగులు తడబడి పోయాడు, తబ్బిబైనాడు. 

 “గుర్తు కోచ్ఛినాది నువ్వు కాలేజీ అమ్మాయివి కదూ. చాల పెద్దదానివయి పోయావు.”  

 “అవును రాగులు. నువ్వు కూడా తాతవైపోయావు” 

“అమ్మాయి గారు సముద్రం తోనే ఉండే వాళ్ళం , మా వయస్సు, మా ఆయుస్సు అంతా సముద్రం లాగేసుకొని, సముద్రమైతే అలాగే ఉండి  పోతది. మేము ఈ సముద్రం కాడే  ఇలాగె రాలి పోతాము. “

చిన్న రాగులు కొన్ని గవ్వలు నా ఒళ్లోపోసి, పరిగెత్తుకుంటూ పోయాడు, పోతు అరిచి చెప్పాడు

”పది రూపాయలు మా తాతకు  ఇవ్వండి”.

కొద్దీ సేపు అలాగే ఆ పడవ లో రాగులు పక్కనే కూర్చొని రాగుల్నే చూస్తూ  అనుకున్నాను“భావుకత ఉన్న రాగులు వయసుతోపాటూ సముద్రం ఇచ్చిన అనుభవంతో పాటు “వేదాంతిలాగా మారాడని”  

 వేళ్ళు తున్న నన్నుచూసి రాగులు మనసారా నవ్వుకొంటూ “ ఇయ్యాల సముద్రమే  నా కాడ  కొచ్చింది” అన్నాడు. నేను వెన్నక్కి చూసాను చిరునవ్వుతో.    

November 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

రచనను విమర్శ చేయాలంటే లోతుగా అధ్యయనం చేయాలి – ఆచార్య భూమయ్య

by Aruna Dhulipala November 26, 2023
written by Aruna Dhulipala

కవిరాజహంస, కవిరత్న బిరుదాంకితులైన సుప్రసిద్ధ విమర్శకులు, కవి, రచయిత, ఆధ్యాత్మిక, తత్త్వవేత్త, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య గారితో మయూఖ ముఖాముఖి..


1.నమస్కారం సార్..మీరు పుట్టి పెరిగిన ఊరు, మీ బాల్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఉంది మాకు. వాటిని గురించి చెప్పండి.
జ: నమస్కారం అమ్మా! మా ఊరు కరీంనగర్ జిల్లా లోని వెదురుగట్ట గ్రామం. మా అమ్మగారి పేరు శాంతమ్మ, మా నాన్నగారి పేరు లస్మయ్య. సెప్టెంబర్ 5, 1950 వ సంవత్సరంలో నేను పుట్టాను. 5వ తరగతి వరకు మా ఊళ్ళోనే చదివాను. అది గుడిసె బడి. 4, 5 క్లాసులు అందులోనే ఉంటాయి. హైస్కూల్ చదవడానికి చొప్పదండి వెళ్ళాను. మా ఊరికి, అక్కడికి ఒక మూడు మైళ్ళ దూరం ఉంటుంది. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాణ్ణి. 6వ తరగతి నుండి 11వ తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూలు చొప్పదండిలో చదివాను. కరీంనగర్ లో ఎస్.ఆర్.ఆర్ కాలేజీ ( శ్రీ రాజరాజేశ్వర కళాశాల )లో 12వ తరగతి (పియుసి) చదువుకున్నాను. ఆ తర్వాత బీఎస్సీ కరీంనగర్ జిల్లాలోని ఆర్ట్స్& సైన్సు కళాశాల జగిత్యాలలో చేశాను. అప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర తొలి ఉద్యమం (1969-70) జరుగుతోంది. ఆ తర్వాత ఎమ్.ఏ తెలుగు వైపు ఆసక్తి కలిగింది. దాంతో హైదరాబాదుకు వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్& సైన్సు కాలేజీలో చేరి ఎమ్.ఏ తెలుగు పూర్తి చేశాను.

2. మీరు ఎంఫిల్ ప్రాచీన సాహిత్యం పైన, పిహెచ్ డి ఆధునిక సాహిత్యం పైన చేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
జ.. నేను తీసుకున్న విషయాలు రెండూ పద్యకావ్యాలే. నాకు ప్రాచీన కవిత్వం మీద ఎంత మక్కువో ఆధునిక కవిత్వం పైన కూడా అంతే మక్కువ. పద్యం మీద ప్రేమే ఆ దిశగా ప్రోత్సహించింది. నేను ఎమ్.ఏ తెలుగు చదివిన తర్వాత వరంగల్ లోని లాల్ బహదూర్ కళాశాలలో మొదటిసారి జూనియర్ లెక్చరరుగా చేరాను. ఎంఫిల్ చేయాలనిపించింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పి.జి. సెంటర్ వరంగల్ లో ఉంది. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్లనవసరం లేదు కదా! అటు ఉద్యోగం చేస్తూనే ఎంఫిల్ చేయడానికి అవకాశం ఉంది. కొరవి గోపరాజు “సింహాసన ద్వాత్రింశిక” మీద చేయాలనుకున్నాను. ఈ టాపిక్ ను సూచించింది డా. పాటిబండ మాధవ శర్మ గారు. దానికి సూపర్ వైజర్ కోవెల సుప్రసన్నాచార్య గారు. 1976లో ఎంఫిల్ అయిపోయింది. వెంటనే కాకతీయ యూనివర్సిటీ లో ( అప్పుడే ప్రారంభం అయింది.. తెలుగులో మొదటి రిజిస్ట్రేషన్ నాదే) చేరాను. సుప్రసన్నాచార్య గారే నలుగురైదుగురు భావ కవుల పేర్లను సూచించారు. ఇదీ అని చెప్పలేదు. అందులో నేను నాయని సుబ్బారావు గారిని ఎంచుకున్నాను. దానికి రెండు కారణాలు. మాకు ఎమ్ఏ లో అధ్యాపకురాలు నాయని కృష్ణకుమారి గారు. వారి నాన్నగారే సుబ్బారావు గారు. అందువల్ల ఆ పేరు తెలుసు. ఆమె మాకు బోధకురాలు కావడం వల్ల ఒక ఆత్మీయత ఉంటుంది కదా! ఇది ఒక కారణమైతే అంతకుముందు ఆయన మీద పిహెచ్ డి ఎవరూ చేయకపోవడం రెండవ కారణం. తదనంతర కాలంలో ఎవరికైనా సుబ్బారావు గారి సమాచారం కావాలంటే నా థీసిస్ చూస్తారు కదా! కొరవి గోపరాజు గురించి కూడా అంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాక నాయని సుబ్బారావు గారిలో ఇతరులకు లేని ప్రత్యేకత ఏంటంటే ఆయన తన జీవితాన్నే కవిత్వంగా రాసుకున్నారు. గొప్పకవిగా పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు గారిలోను, మహా భావకవిగా పేరు తెచ్చుకున్న కృష్ణశాస్త్రి గారిలోనూ ఇది లేదు. అందువల్ల నేను ఆయన పట్ల ఆకర్షితుడనయ్యాను. ఆయనపై పరిశోధన 1980లో అయిపోయింది. 1981లో అచ్చు వేయించాను. ఎంఫిల్ పుస్తకం 1983 లో అచ్చయింది.

3. మిమ్ములను అంతగా ప్రేరేపితులను చేసిన నాయని సుబ్బారావు గారి భావ కవిత్వ గొప్పదనం ఎటువంటిది?
జ…..ఇంతకుముందే చెప్పాను కదా! నాయని సుబ్బారావు గారు తన జీవితాన్నే కవిత్వీకరించారని. మొదట ఆయన “సౌభద్రుని ప్రణయ యాత్ర” రచించారు( 1922-25 ) ఆయన మేనమామ కూతురు హనుమాయమ్మ. కానీ ఆయన ‘వత్సల’ అని రాసుకున్నారు. మొదట ఆ అమ్మాయిని మేనమామ ఈయనకు ఇస్తాననడం కారణాంతరాల వల్ల నిర్ణయాన్ని మార్చుకోవడం, తిరిగి అంగీకరించడం.. ఇదంతా అభిమన్యుడు, శశిరేఖల పరిణయాన్ని పోలి ఉండడం వల్ల దానికి ఆ పేరు పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య రెండేళ్ల కాలం విరహాన్ని అనుభవించి విరహగీతాలు రాశారు. ఒకచోట కృష్ణశాస్త్రి ఈయనను గురించి రాస్తూ ” కవిత్వం రాయకపోతే ఈయన ఏమై పోయేవాడో ” అన్నారట. తన వేదననంతా కవిత్వం ద్వారా తొలగించుకున్నారు.
వివాహం జరిగిన తర్వాత ఫలశ్రుతి (1926) అని కూడా రాసుకున్నారు. అయితే ఈ ఫలశ్రుతి ప్రబంధ ధోరణిలో కాకుండా ఆధ్యాత్మికమైన స్పర్శతో ఉంటుంది. పెళ్లయిన తర్వాత బీఏ పరీక్షలు రాస్తుండగా పరీక్ష హాలులో మూడు పద్యాలు రాశరట. ఇవి సంయోగ శృంగారాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవి.
ఉదా.. “మత్పురానేక పుణ్య జన్మములు పండి/ జాహ్నవీ స్వచ్ఛవును సుధా సాధుమూర్తి/ వైన నీ దివ్య సాన్నిధ్యమందుకొంటి/ పుడమికిన్, స్వర్గమునకొక్క ముడి రచించి…ఇలా అద్భుతమైన భావాన్ని పండించారు.
విశ్వనాథవారు, సుబ్బారావు గారు చాలా సన్నిహితులు. విశ్వనాథ వారు “వేయిపడగలు” లో వీరి వియోగ, సంయోగ శృంగారాల గురించి కిరీటి, శశిరేఖ పేర్లతో కొన్ని పేజీలు ఉపాఖ్యానంగా రాశారు. నేను ఒక ఇంటర్వ్యూలో సుబ్బారావు గారి భార్య వత్సల గారిని ‘ఇది నిజమేనా?’ అని అడిగితే చివరలో వుండే చిన్న కల్పన తప్ప అంతా నిజమే అని చెప్పారు. ఇక సుబ్బారావు గారి తల్లి మేన కోడలు తన ఇంటి కోడలుగా రావాలన్న కోరిక తీరకుండానే మరణించడంతో ఆయన రాసుకున్న పుస్తకం ‘మాతృగీతాలు’. ఇందులో 63 పద్యాలున్నాయి. ప్రతీ ఖండికకు నెంబర్ -1అని పెట్టి మూడు పద్యాలు రాశారు. అందులో “ఒక్క ఏడాది అయినా ఆగకపోతివి” అంటూ తల్లిని గురించిన బాధతో విషాద కావ్యంగా రాసినారు. ఒకటి వియోగ సంయోగ కావ్యం, మరొకటి విషాద కావ్యం. ఈ రెండు కావ్యాలు 1922 – 26 మధ్య వచ్చాయి. ఇవి ఆయనకు గొప్ప భావ కవిగా పేరు తెచ్చాయి. ఆ తర్వాత మూడు దశాబ్దాల వరకు ఆయన రచనలు వెలువడలేదు.
రిటైర్మెంట్ తర్వాత హైద్రాబాదుకు వచ్చి ఆగిపోయిన కవిత్వాన్ని తిరిగి ఆరంభించి 1958లో “భాగ్యనగర కోకిల” రాసారు. ఆ తర్వాత తానెదుర్కొన్న పరిస్థితులను “వేదనా వాసుదేవం” గా రాశారు. దీంట్లో 108 పద్యాలున్నాయి. మకుట నియమం, ఛందో నియమం లేకపోయినా ఇది కొన్ని శతక లక్షణాలతో శతకంగా పేర్కొనబడింది. వేదన అంటే ఒక అర్థం భక్తి అని కదా! తన బాధను చెప్పుకున్నట్టే వుంటూ భక్తి భావంతో ఉంటుంది. అందుకే విష్ణు సహస్ర నామాలలోని వాసుదేవ తత్వం యొక్క ప్రభావం ఉందని థీసిస్ లో రాశాను. నేను రాసిన పుస్తకాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైన కృష్ణకుమారి గారు “మా నాన్నగారు బతికి ఉంటే ఎంత బాగుండు?” అన్నారు.
మరో బాధాకరమైన విషయం సుబ్బరావు గారి ఒక్కగానొక్క కొడుకు హఠాత్తుగా మరణించాడు. అతని పేరు మోహన్ రావ్. ఆ పేరు మీద ఆయన “విషాద మోహనం” కావ్యం రాశారు. 75 ఖండికలు, ఒక్కో దానికి మూడు పద్యాల చొప్పున 225 మధ్యాక్కరలతో రాసిన కావ్యం. నంబర్ -1 అని రాస్తూ 3 పద్యాలు, నంబర్ – 2 అని రాస్తూ 3 పద్యాలు రాసుకుంటూ వచ్చారు. ఆ మూడు పద్యాల్లో ఒకే భావం ఉంటుంది. ఈ కావ్యంలో, ఎవరైనా చనిపోయినప్పుడు మనిషికి ఉండే దుఃఖాన్ని సహజమైన స్థితిలో వర్ణిస్తూ దుఃఖ తీవ్రత, దుఃఖ ఉపశమనం, స్మృతి…ఇలా మూడు దశలుగా చెప్తారు. చివరకు రాసిన పద్యాల్లో విష్ణువును స్మరిస్తూ “లోకానికి శాంతి కలుగు గాక” అనే శాంతివచనాలు ఉంటాయి.
గోపీచంద్ గారు నడుపుతుండే ‘యువ’ పత్రికకు పద్యాలు రాయమని వీరిని అడిగారట. ఏం రాయాలని ఆలోచించి తాను పుట్టిన ఊరు ‘పొదిలె’ను తలచుకొని ఆ ఊరి జ్ఞాపకాలను, ఆ ఊళ్ళో ఉండే గుడి గోపురాలకు సంబంధించిన పూర్వ కథలు తెలుసుకొని 1200 పద్యాలతో కూడిన “జన్మభూమి” అనే కావ్యం రాశారు. వీటన్నింటి గురించి విపులీకరించాను.

ఆచార్య భూమయ్యగారితో ఇంటర్వ్యూ గ్రహీత శ్రీమతి అరుణధూళిపాళ

4.. “భౌమ మార్గం” అని చెప్పబడిన మీ విమర్శనాత్మక శైలిలోని వైవిధ్యం ఏమిటి?
జ. నేనొక వినూత్న పద్దతిలో విమర్శ ప్రారంభించాను. “కొత్త విషయం లేకుండా రాయడం” నా జీవ లక్షణం కాదు (నవ్వుతూ) అదే విమర్శలోనూ కొనసాగింది. అందరు చేసే విమర్శ ధోరణికి భిన్నంగా ఒక కొత్త ఊహ వచ్చింది. పాఠకుడిని కవికి దగ్గర చేర్చడం, వాళ్ళిద్దరి మధ్య వారధిగా ఉండే ఉద్దేశ్యం ప్రధానంగా స్టూడెంట్ ప్రశ్న వేసినట్టుగా చెప్పుకొని దానికి నేనే సమాధానం చెప్పడం. అంటే అక్కడ ప్రశ్న, జవాబు రెండూ నేనే. ఆ పద్ధతిలో మొదటగా “నాయనితో కాసేపు” రాశాను. సుబ్బారావు గారు రామారావు గారికి అభిమాన కవి కావడం వల్ల, ఆయన గురించి నేను రాసినందువల్ల నేనంటే రామారావు గారికి ఎంతో అభిమానం ఏర్పడింది. ఆ తర్వాత అదే కోవలో నేను రాసిన “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అన్న పుస్తకానికి ముందుమాట రాస్తూ నా విమర్శకు “భౌమ మార్గం” అని పేరు పెట్టారు. భౌమ అంటే భూమయ్యకు సంబంధించిన ఒక అర్థం, మరో విధంగా రామారావుగారు భౌమ అంటే “Down to Earth Approach” అనే అర్థం చెప్పారు. అంటే ఆకాశం నుండి భూమికి దిగడం. అంటే విమర్శ క్లిష్టంగా కాకుండా సరళంగా, అందరికీ అర్ధమయ్యే విధంగా ఉందని చెప్పడం. భౌమ అంటే భూమికి సంబంధించినది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ‘భౌమమార్గం’ అంటే సంభాషణాత్మక శైలి. “ముందు ముందు కాలంలో ఇది ఏ పేరుతో స్థిరపడుతుందో కానీ ఇప్పటికి మాత్రం నేను దీనికి ‘భౌమమార్గం’ అని పేరు పెడుతున్నా” నని చేకూరి రామరావు గారు అన్నారు. అలా నా విమర్శకు ఒక ప్రత్యేకత ఏర్పడింది.

5. ‘భౌమ మార్గం’ లో వెలువడిన మీ రచనలేవి?
జ. భౌమ మార్గంలో వెలువడిన నా విమర్శ గ్రంథాలు 7. అందులో అయిదు తెలుగు కవిత్వం అయితే 2 సంస్కృతం. 2000 సంవత్సరంలో ఈ వరుసలో నాలుగు పుస్తకాలు అచ్చు అయినాయి. తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రిలో ఒక సెమినార్ జరిగింది. అందులో పాల్గొని “కర్పూర వసంతరాయలు” కావ్యంలోని దాంపత్యంపై పత్ర సమర్పణ చేశాను. ఆ నేపథ్యంలో “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అనే స్ఫురణ వచ్చింది. లోతుగా పరిశీలిస్తే సినారె గారి ఋతుచక్రం , గుఱ్ఱం జాషువా ముంతాజ్ మహల్ , విద్వాన్ విశ్వం పెన్నేటి పాట మొదలైనవి. వాటిలో సంపత్ అనే కలం పేరుతో శంఖవరం రాఘవాచార్యులు విశ్వనాథ విజయం అనే కావ్యం రాశాడు. చాలా అందమైన కావ్యం. ఇలాంటి కొన్ని కావ్యాలు తీసుకొని వాటిలో దాంపత్యం ఎంత గొప్పగా చిత్రించబడిందో చెప్తూ “ఆధునిక కవిత్వంలో దాంపత్యం” అనే విమర్శ గ్రంథం రాశాను. మూడవది “కర్పూర వసంతరాయలు- కథా కళాఝంకృతులు”.
ఇందులో కర్పూరవసంతరాయలు గేయ కావ్యంలోని కవితావిశేషాలను వివరించాను. వస్తు స్వీకృతిలో, వస్తు నిర్వహణలో,పాత్రల చిత్రణలో, సన్నివేశ కల్పనలో సినారె గారి ప్రతిభను వివరించాను. ఇక నాల్గవది సురవరం ప్రతాపరెడ్డి గారు 354 మంది కవులతో వెలువరించిన “గోలకొండ కవుల సంచిక” ఆధారంగా “గోలకొండ కవుల సంచిక” రాశాను. 2012 లో “వేమన అనుభవసారం” కూడా ఇదే మార్గంలో రాశాను. ఇందులో 15 శీర్షికలు ఉంటాయి. మానవ జీవితంలోని మంచి చెడులను, మనిషికి ఉండాల్సినవి, ఉండకూడనివి అయిన లక్షణాలను కాచి వడబోసి చెప్పిన కవి ఆయన. ఒక యోగిగా మారితే తప్ప ఆ యోగిని అర్థం చేసుకోలేము. అంతటి తత్త్వవేత్త ఆయన. ..ఇక సంస్కృతంలో శంకరాచార్యులవారి సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల పైన కూడా ఇదే మార్గంలో విమర్శ పుస్తకాలు రాశాను.

6. నాయని సుబ్బారావుగారి రచనల సమాహారంగా ” నాయనితో కాసేపు ” అనే పుస్తకంలో సుబ్బారావు గారి కవిత్వాన్ని గురించి చెప్పిన విషయాలేవి?
జ.. నాయని సుబ్బారావు గారు 1899 లో జన్మించారు. 2000 సంవత్సరంలో ఆయన శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో ఒక వ్యాసం కాకుండా పుస్తకమే రాయాలనిపించింది. దీంట్లో నాయని సుబ్బారావు గారి కృతులన్నిటి గురించి గురు శిష్యుల సంవాద రూపంగా రాశాను. నా పిహెచ్ డి లో ఆయన రాసిన ‘జన్మభూమి’ గురించి ఎక్కువగా రాయలేదు. ఒక చాప్టరుగా రాశాను. అందుకే దాని గురించి సవివరంగా రాయలనుకున్నాను. అంతకు ముందు నేను విమర్శ గ్రంథాలు రాసి, తర్వాత 5 పద్య కావ్యాలు రాశాను కాబట్టి కవిత్వం, దాని శ్రమ అన్నీ అవగతమైనాయి. దానికి తోడు నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా! అందుకే ఈ పద్యకావ్యాల తర్వాత వచ్చిన విమర్శ వినూత్నంగా వచ్చింది. అప్పటి, విమర్శకు, తర్వాతి విమర్శకు మధ్య ఉన్న శైలీ పరమైన తేడాను గుర్తించారు కాబట్టే చేకూరి రామారావు గారు భౌమమార్గం అన్నారు. అదేంటంటే ఎమ్ ఏ చదివిన విద్యార్థులు పి హెచ్ డి కోసం ఏ టాపిక్ రాయాలనే దాని కోసం మా దగ్గరకు వచ్చేవాళ్ళు. అలా వచ్చే స్టూడెంటును కల్పన చేసుకొని అతని చేత ప్రశ్నలు వేయించు కున్నట్టుగా నేను ఈ విమర్శ రాయడం మొదలు పెట్టాను. దీంట్లో సీరియస్ నెస్ ఉండదు. కవిత్వం యొక్క అందచందాలు చెప్పటమే ఉద్దేశ్యం. పాఠకుడిని కవికి దగ్గర చేయడం ప్రధానం. ప్రశ్న జవాబుల పద్దతిలో రెండూ నేనే అయి చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పడం.
గోపీచంద్ గారు నడుపుతుండే ‘యువ’ పత్రికకు పద్యాలు రాయమని వీరిని అడిగారట. ఏం రాయాలని ఆలోచించి తాను పుట్టిన ఊరు ‘పొదిలె’ను తలచుకొని ఆ ఊరి జ్ఞాపకాలను, ఆ ఊళ్ళో ఉండే గుడి గోపురాలకు సంబంధించిన పూర్వ కథలు తెలుసుకొని 1200 పద్యాలతో కూడిన “జన్మభూమి” అనే కావ్యంగా రాశారు…. “ఇతర జనపదముల నేను ప్రవాసినై/ మరచి యైన మేను మరచి యైన/ కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు /లుంచి యెపుడు పవ్వళించ లేదు” అంటారాయన. ఊరిమీద ఆయనకున్న అపారభక్తికి తార్కాణమిది. ఇందులో 5 ఖండాలుంటాయి. 1. ప్రకృతి ఖండం 2. తటాక ఖండం 3. ధరణిధర ఖండం 4. శివ ఖండం 5. శక్తి ఖండం. ఊళ్ళో ఉన్న ఆలయాల్లో కొన్నింటికి పూర్వగాథలు సేకరించి రాశారు. ధరణి ధర ఖండంలో కొండపై వెలసిన నరసింహ స్వామి, శక్తి, శివ ఖండాల్లో అమ్మవారి, శివునికి గల కథలను ప్రత్యేకంగా చెప్పడం ద్వారా వైష్ణవ, శాక్తేయ, శైవ సంప్రదాయాలను ఆయన వివరించినట్టు తెలుస్తుంది. కవిత్వంలో తప్పిపోయి కూడా విదేశీయత ఉండదు. ఆయన వర్ణనలన్నీ ప్రకృతికి, భారతీయతకు, సనాతన వైదిక ధర్మాలను కలుపుతూ ఉంటాయి..
ఉదా.. మర్రిచెట్టు మధ్యలో తాటి చెట్లను వర్ణిస్తూ “ఈ మర్రిచెట్టు కొమ్మలు శివుడు తాండవం చేస్తుండగా ఊగిన జడలు” అంటారు. తాటిచెట్టును త్రిశూలంగా వర్ణిస్తారు. అంతటి గొప్ప భావుకత ఆయనది. నాయని గారి రచనలన్నింటినీ ఇందులో వివరించినా జన్మభూమి గురించే 60 పేజీలు రాశాను.

7. ” తెలంగాణా భావ విపంచిక” గా మీరు రాసిన “గోలకొండ కవుల సంచిక ” కు ప్రేరణ ఏమిటి?
జ. సురవరం ప్రతాపరెడ్డి గారు నడిపిన పత్రిక ‘గోలకొండ’ మన ప్రాంతాన్ని నిజాం స్టేట్ అనేవారు. అప్పుడు తెలంగాణా జిల్లాలతో పాటు గుల్బర్గా, రాయలసీమ, పక్కన కన్నడ దేశంలో ఉండే 2, 3 జిల్లాలు, మహారాష్ట్రలో కలిసిన దౌలతాబాద్, ఇంకో రెండు, మూడు జిల్లాలు మొత్తం 10 జిల్లాలు కలిపి గోలకొండ అనేవాళ్ళు. 1934 వ సంవత్సరంలో ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ప్రతాపరెడ్డి గారికి ఒక వ్యాసం పంపుతూ ప్రాసంగికంగా “నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యం” అని రాసినాడు. రాయడం తప్పే అయినప్పటికీ అందరూ అనుకుంటున్న విషయం అదే కదా! అధికార భాష ఉర్దూ. తెలుగు పాఠశాలలు లేవు. అలాంటప్పుడు కవులు ఎలా ఉంటారు? అని వాళ్లకున్న దురభిప్రాయం. ఆంధ్ర కూడా ఇందులో కలిసి లేదు. ఆ మాటలు సురవరం ప్రతాపరెడ్డి గారిని బాగా కదిలించాయి. దీన్ని సవాలుగా తీసుకొని పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు. “వచ్చే దీపావళి ప్రత్యేక సంచిక. కవుల గురించి వేస్తున్నాము. ఇందులో ఎవరైనా ఆధునిక కవులు పద్యాలైతే 5, కథాత్మకంగా పద్యాలు రాస్తే 5 పేజీలు మించకుండా పంపండి” అని, 1900 సంవత్సరం పిదప పుట్టిన వాళ్ళందరినీ నేను ఆధునికులు అనుకుంటున్నాను. దాని ప్రకారంగా పుట్టిన వాళ్ళంతా పద్యాలు పంపండి. దాంతో పాటు, ఊరు, బిరుదులు, రాసిన పుస్తకాలు, ఏ జిల్లా, ఏ కులం…ఇవన్నీ రాయమన్నారు. వాటికొక లిస్టు కూడా ఇచ్చారు. దానికి వచ్చిన స్పందన అమోఘం. వచ్చిన వాటన్నింటినీ జిల్లాలు, కులాల వారీగా చేరుస్తూ 354 మంది కవులతో “గోలకొండ కవుల సంచిక” తయారు చేశారు ప్రతాపరెడ్డి గారు. ఇందులో పదిమంది కవయిత్రులు కూడా ఉన్నారు. నాటి తెలంగాణా స్థితి గతులకు దర్పణం ఈ పుస్తకం.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ వారు సురవరం
ప్రతాపరెడ్డి గారి మీద ఒక సెమినార్ తలపెట్టారు. అప్పుడు నేను వరంగల్ లో ఉన్నాను. ఆయన రచించిన అనేక విషయాల పైన మాట్లాడడానికి ఒక్కొక్కరు సిద్ధం చేసుకున్నారు. గోలకొండ కవుల సంచిక జనాలకు పరిచయమే లేదు. ఆ సెమినార్ ను నిర్వహించింది ఎల్లూరి శివారెడ్డి. ఆయన కూడా మహబూబ్ నగర్ వాడే అవడం వల్ల అభిమానంతో సెమినార్ నిర్వహించారు. “గోలకొండ కవుల సంచిక”
పైన 10, 12 పేజీల వ్యాసాన్ని సెమినార్ లో చదివాను. ఈ వ్యాసం రాసిన తర్వాత అది నన్ను వెన్నాడి పుస్తకం రాసేదాకా వదిలి పెట్టలేదు. అలా గోలకొండ కవుల సంచిక కూడా నాదైన విమర్శశైలిలో రూపు దిద్దుకుంది. ప్రతాపరెడ్డి గారి కవితా సంకలనం గురించి నేను రాసినదే మొదటి విమర్శ గ్రంథం.

8. ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ‘వేయిపడగలు’ నవలను ఇతిహాసంగా చిత్రించారు. దానిలోని ఐతిహాసిక లక్షణాలు ఏవి?
జ: నేను ‘వేయిపడగలు’ పుస్తకాన్ని బీఎస్సీలో చదివాను. అది మనసులో ఉంది. అది చెబుతున్నప్పుడు అధ్యాపకులు దాన్ని ‘Epic’
అన్నారు. అసలు ఇది ఒక నవల. మహాభారతం ఒక ఎపిక్. మరి నవలలో అలాంటి లక్షణాలు ఏమున్నాయి? ఇంగ్లీషులో ఉన్న పది, పదిహేను ప్రక్రియల్లో ఒక్కో దానికి ఒక్కో చిన్న పుస్తకం ఉంది. ఎపిక్ అనే ప్రక్రియ మీద అదృష్టవశాత్తు ఒక చిన్న పుస్తకం లైబ్రరీలో దొరికింది. అందులో ప్రాచీన కాలం నుండి వస్తున్న మహాకావ్యాలే కాకుండా ఆధునికమైన నాటకం, నవల కూడా ఇతిహాసమే అని ఉంది. అక్కడ దొరికింది వస్తువు నాకు. ఇతిహాస లక్షణాలలో ప్రధానమైన వాటిని ఈ నవలకు సమన్వయం చేస్తూ “ఆధునిక ఇతిహాసంగా వేయిపడగలు” నవలను అభివర్ణించాను. అందులో ప్రధానమైనది వస్త్వెక్యత. వేయి పేజీల నవలలో అనేక కథలున్నప్పటికీ కథా సూత్రాన్ని పట్టుకొని అందులోని ఏకరూపతను
చూపించాను. అలాగే కథానాయకత్వం. ఇందులో ధర్మారావును నాయకుడుగా అందరూ అంగీకరించిన విషయం. మహాభారతంలో శ్రీకృష్ణుని వంటివాడు ధర్మారావు. శ్రీకృష్ణుడు ఎంతటి వాడైనా మహాభారత కథానాయకుడు కాదు కదా! కథను మొత్తం లోతుగా అధ్యయనం చేసి రంగారావే కథానాయకుడని చెప్పాను. వరంగల్లులో లక్ష్మణ యతీంద్రులు అని మా గురువు గారు.
ఆయనకు విశ్వనాథ సత్యనారాయణ అంటే వీరాభిమానం. నేను చెప్పిన వస్త్వైక్యం విని “నేను ఒక 70 సార్లు ‘వేయిపడగలు’ నవలను చదివాను. కానీ ఈ ఆలోచన నాకెప్పుడూ రాలేదు” అని ప్రశంసించారు. ఇక ఇతిహాస లక్షణమైన ఉపాఖ్యానాలు కూడా ఇందులో ఉన్నాయి. మూలకథకు అనుగుణంగా ఎన్నో కథలు చేర్చారు విశ్వనాథ వారు. మరో లక్షణం కర్మ ఫలానుభవం. ఇందులో కొన్ని పాత్రలు వారి వారి కర్మఫలాలను అనుభవించిన విషయాన్ని చూపించాను. అలాగే ప్రతీకాత్మకత…ఒక భౌతిక స్థితి నుండి తాత్త్విక స్థితికి మారడం..దాన్ని దర్శించగలగడం. వీటన్నింటినీ సమన్వయిస్తూ “వేయిపడగలు” నవలను “ఆధునిక ఇతిహాసం” గా నిరూపించాను. 1984 లో ఇది అచ్చు అయింది. ఏ పుస్తకం చదివినా దానిమీద విమర్శ వ్యాసం కాకుండా పుస్తకమే రాశాను.

9. ‘మాలపల్లి’ నవలను కేవలం దాంట్లోని రెండు గీతాల ఆధారంగా “అభ్యుదయ మహా కావ్యం”గా నిరూపించానని చెప్పారు…అందులో ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి అభ్యుదయభావాలు ఎటువంటివి?
జ: ‘మాలపల్లి’ నవల నేను ఎంఫిల్ చేస్తున్నప్పుడు చదివాను. వేయిపడగలు రాస్తున్నప్పుడే దీన్ని కూడా రాయాలనే సంకల్పం కలిగింది. 1992 లో నేను రాస్తున్నప్పుడు అంతకుముందు నేను దీని గూర్చి రాసిన పేజీలు దొరకలేదు. దొరకక పోవడం మంచిదయింది… (నవ్వుతూ). ఈ మధ్యకాలంలో నా ఆలోచనలు మారాయి. నా విమర్శకు బలం వినూత్నంగా ఆలోచించడమే. ఇందులో ఆయన రెండు గీతాలు రాశారు. ఒకటి భారతదేశ కులవ్యవస్థకు సంబంధించినదైతే మరొకటి దేశ ఆర్థిక దుస్థితి గురించి. ఇందులో అగ్రవర్ణాలకు, బడుగు వర్గాలకు మధ్య ఉండే ఇబ్బందుల్ని చిత్రించడం ఒకటైతే…రష్యాలో వచ్చిన బోల్ష్ విక్ ఉద్యమం (1917) రెండవది. ఉన్నవాళ్లను దోచి లేనివాళ్లకు పెట్టి ఆర్థిక సమానత్వాన్ని సాధించడం ఇందులో ప్రధానం. సమానత్వం కోసం విప్లవం జరిగి అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ‘ఇజం’ ప్రపంచ దేశాలను ఆకర్షించింది. అప్పుడంతా రాజరికమే కాబట్టి ప్రజల తిరుగుబాటు వలన రాజరికం నశించి ఇలాంటి ప్రభుత్వం ఏర్పడడం అందరినీ ఆకట్టుకుంది. ఉద్యమాలు రావడం వేరు. దానివల్ల రాజరికం నశించడం విశేషం కదా! ఆ ఉద్యమాన్నే ఒక పాత్ర ద్వారా ఇందులో ప్రవేశ పెట్టారు లక్ష్మీ నారాయణ గారు.
భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యల ఆధారంగా అంత పెద్ద నవలను రాశారు. కులవ్యవస్థకు సంబంధించిన గీతానికి ‘చరమగీతం’ అని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గీతానికి ‘సమతాధర్మం’ అని పేర్లు పెట్టారు. 1917 లో రష్యాలో విప్లవం వస్తే మాలపల్లి నవల 1922లో వచ్చింది. అంత తొందరగా ఆయన ఆ ఉద్యమం చేత ఆకర్షించబడ్డారు. ఒక దళితుడిని కథా నాయకునిగా పెట్టి నవల రాయడం అంతకు మునుపు ఎవరూ చేయనటువంటి సాహసోపేతమైన చర్య. ఈరెండు గీతాల వ్యాఖ్యానమే ఈ నవల. అభ్యుదయం అంటే ఉన్నతమైన భావాలతో సమాజం అభివృద్ధి చెందడమే కదా! అందుకే దీన్ని నేను “అభ్యుదయ మహాకావ్యం” అన్నాను. ఈ అభ్యుదయ కవిత్వాన్ని మార్క్సిజం భావాలతో మొదట రాసింది శ్రీ శ్రీ అని చెబుతున్నారు. అట్లా కాదని ఉన్నవ గారి గీతాన్ని ఉదాహరణగా చూపుతూ ఒక వ్యాసం రాశాను. ఆ గీతంలో ఒకచోట ఉన్నవ లక్ష్మీ నారాయణ రావు గారు “తిరుగుబాటు చేయండి” అని అంటారు. 1922 లోనే ఆయన ఈ మాట అనగలిగారు. శ్రీశ్రీ మహాప్రస్థానం 1934 నుండి వచ్చిన కవితలు. కాబట్టి మాలపల్లి నవలను “అభ్యుదయ మహాకావ్యం” అన్నాను. నా పుస్తకంలో రెండు వ్యాసాలుంటాయి. ఆయన గీతాలకు సంబంధించినది ఒకటి. ఆయనే మొదటి అభ్యుదయ కవి అని చెప్పేది మరొకటి. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక మహానుభావుడు నా పుస్తకాన్ని చదివి ఇది అభ్యుదయ మహాకావ్యం అని కాకుండా “తొలి అభ్యుదయ మహాకావ్యం” అనవలసింది అన్నారు.

10.కట్టమంచి వారి “ముసలమ్మ మరణం” కావ్యాన్ని తొలి ఆధునిక కావ్యంగా ఎలా నిరూపించారు? అంతకు ముందున్న కావ్యాలకు, దీనికి గల భేదం ఏ అంశాలకు సంబంధించినది?
జ: “ముసలమ్మ మరణం” గురించి రాయడానికి మొదటి ప్రేరణ ఏంటంటే వరంగల్ రేడియో స్టేషన్ వాళ్ళు ఈ కావ్యం మీద ప్రసంగం చేయమన్నారు? ప్రసంగం చేసిన సమయం 11 నిమిషాలే. కానీ అది నన్ను వెన్నాడింది. దాని మీద ఇంకా రాయాలనిపించింది. దీనిమీద నాలుగు వ్యాసాలు రాసి ఆంధ్రభూమి పత్రికకు పంపించాను. వాళ్ళు వరుసగా ప్రచురించారు. అయితే పుస్తకం రాయడానికి ఇంకో కారణం ఉంది. సినారె గారి సిద్ధాంత గ్రంథం “ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు, ప్రయోగములు” ఆధునిక విమర్శ చేసేవాళ్ళు తప్పనిసరిగా చదవవలసిన గ్రంథం. దీంట్లో ఆయన ముసలమ్మ మరణాన్ని మొదటి కావ్యం అని చెప్పలేదు. అరుణోదయం అని, వేగుచుక్క అని ప్రశంసించారు. కానీ ఆధునిక కావ్యమని రాజముద్ర వేసింది రాయప్రోలు వారి తృణకంకణానికే.. సినారె గారు భావ కవిత్వానికి లక్షణాలు చెబుతూ వస్తువు,భావం,రచన…ఈ మూడింటిలో నవ్యత ఉన్నప్పుడే అది ఆధునిక కావ్యం అన్నారు. ఇదే విషయాన్ని అంతకు ముందు చెప్పినవారు కురుగంటి సీతారామ భట్టాచార్యులు గారు. ఆయన తన “నవ్యాంధ్ర సాహిత్య వీధులు” పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వీరికంటే ముందు చెప్పినవారు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు”నాచన సోముని నవీన గుణములు” అనే వ్యాసంలో ప్రాస్తావికంగా కవిత్వానికి మూడు అంగాలు ఉంటాయని అన్నారు. రచన వస్తువుకు, వస్తువు భావానికి ఒదిగి ఉన్న కవిత్వమే రస ప్రధాన కావ్యంగా ఉంటుందని రాళ్లపల్లి వారు సిద్ధాంతీకరించారు. ఈ మూడింటిని ఆధునిక కవిత్వానికి ఆపాదించుకుంటూ రచనా నవ్యతకు ఆద్యుడు గురజాడ అని, భావ నవ్యతకు రాయప్రోలు అని అన్నారు. అక్కడే పడింది నా కన్ను. ఇది కాక రాయప్రోలు సుబ్బారావు గారికి కట్టమంచి రామలింగారెడ్డి గారు అనుయాయులు అన్నారు. అక్కడ నాకు మరో ఆలోచన తట్టింది. కట్టమంచి వారు తాను 1899 లో బీఏలో ఉండగా పోటీ కోసం రాసిన కావ్యం “ముసలమ్మ మరణం” కావ్యం. ఇది 1900 సంవత్సరంలో అచ్చు అయింది. రాయప్రోలు సుబ్బారావుగారు ‘తృణకంకణం’ రాసి కట్టమంచి వారి దగ్గరకు వెళ్లి చదివి వినిపించాడన్నది అందరికీ తెలిసిందే. అదీకాక ముత్యాల సరాలు వచ్చింది 1909లో. తృణ కంకణం వచ్చింది 1913లో. కట్టమంచివారి కావ్యం వస్తు నవ్యతతో కూడుకొన్నది. అంతకుముందు విషాదాంత కావ్యాలు లేవు మనకు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం అనే గ్రామంలో జరిగిన కథ అది. లార్డ్ మెకంజీ సేకరించిన కైఫీయత్ లో ఉన్న కథ. గ్రామ క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన బసిరెడ్డి చిన్న కోడలు ముసలమ్మ కథ. ఆధునిక కవిత్వంలో కథా నాయిక మరణాన్ని నవ్యతగా నిరూపించాను. ఎందుకంటే అంతకు మునుపు లేనివిధంగా ఇదే క్రమంలో గురజాడ వారి పూర్ణమ్మ, దువ్వూరి వారి నలజారమ్మ, రాయప్రోలు వారి స్నేహలత విషాదాంత కావ్యాలు ముసలమ్మ మరణాన్ని అనుసరిస్తూ వచ్చినవే.
ఆద్యుడు అని ఎందుకు పెట్టానంటే ఆయన కవిత్వానికే కాదు విమర్శకు కూడా ఆద్యుడే. నేను రాసిన పుస్తకంలో మొదటి వ్యాసం ముసలమ్మ మరణం అయితే రెండవ వ్యాసం కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారానికి సంబంధించినది. “ఆద్యుడు కట్టమంచి” పుస్తకానికి మా గురువు గారు సి.నారాయణరెడ్డి గారితో ముందుమాట రాయించాను. మొత్తం చదివి ఒక పేజీ రాశారు. “భూమయ్య తన వాదాన్ని ఎదుటి వారిని నొప్పించకుండా, అతి జాగ్రత్తగా తనదైనటువంటి భావాన్ని సుతారంగా ప్రవేశపెడతాడు” అని రాశారు. రేడియోలో పనిచేసే నాగసూరి వేణుగోపాల్ అనే ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఒక వ్యాసం ‘మెత్తని పులి’ అనే పేరుతో రాశాడు (నవ్వేస్తూ).

11. మధునాపంతుల సత్యనారాయణ గారి ఆంధ్రపురాణాన్ని “భారతీయ సంసృతీ వైభవం” గా రాయడానికి ప్రేరణ ఏమిటి?
జ: మధునాపంతుల సత్యనారాయణ గారు ఆంధ్రుల చరిత్రను శాతవాహనులు మొదలుకొని దక్షిణాంధ్ర దేశాన్ని పరిపాలించిన నాయక రాజుల వరకు మొత్తం 9 విభాగాలుగా చేసి వాటికి పర్వాలు అని పేరు పెట్టారాయన. మొదటి భాగానికి ‘ఉదయపర్వం’ అన్నారు. ఆంధ్రుడికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు ఏ పురాణంలో కనిపిస్తున్నాయో అన్నీ వెలికితీసి ఉదయపర్వంలో రాశారు. ఏడు, ఎనిమిది వందల సంవత్సరాల్లో పరిపాలించిన తెలుగు రాజవంశాల చరిత్ర ఇది. చరిత్రను కావ్యంగా మలిచారు. ఒక్కో రాజవంశంలో ఎంతోమంది పరిపాలిస్తారు. అందులో ఎవరు గొప్పవారనే విషయాన్ని గ్రహించి రాయడంలోనే ఆయన ప్రతిభ వ్యక్తమవుతోంది. ఉదా.. కాకతీయ వంశం తీసుకుంటే గణపతిదేవ చక్రవర్తి, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి..ఇలా ప్రముఖులు కనిపిస్తారు…లోతుగా పరిశీలిస్తే వైదిక ధర్మానికి సంబంధించిన యజ్ఞ యాగాదులు, ఆలయాలు ఇట్లా ధార్మిక పద్ధతిలో పాలన చేసినవారిని ఆయన తీసుకున్నారని అవగతమవుతుంది. పురాణ లక్షణాలైన సర్గ, ప్రతిసర్గలు ఇందులో లేవు కానీ ‘వంశానుచరిత’ లక్షణ ప్రధానంగా రాశారు.
నాకొక ఆలోచన వస్తే తప్ప పుస్తకం రాయను. పాయింట్ దొరికితే తప్ప వ్యాసం రాయాలనుకోను. అలాగే దీని గురించి రాయడానికి కూడా నేపథ్యం ఉంది. శాస్త్రిగారు మరణించాక వారి కుటుంబీకులు ప్రతీ ఏటా ఆయన జయంతికి ఒక పండితుని పిలిపించి శాస్త్రిగారి గురించి ఉపన్యాసం ఇప్పించి సత్కారం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో పదవ సంవత్సరంలో నన్ను పిలిచారు. అది రాజమండ్రిలో జరిగే సభ. శాస్త్రిగారు రాజమండ్రి వాస్తవ్యులు. వారి జీవితమంతా అక్కడే గడిచింది. ఆయనకు ఎంతోమంది శిష్యులు కూడా ఉన్నారక్కడ. నేను ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఆ సభాధ్యక్షుడు, శాస్త్రిగారి తమ్ముడు సూరయ్య శాస్త్రిగారు ” ఈ కావ్య రచనలో మా అన్న ఇన్ని రహస్యాలు పెట్టినాడా? మళ్లీ ఒక్కసారి దీన్ని నేను చదవాలి” అన్నారు ఆశ్చర్యపోతూ. ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెబుతుండగా ‘ఆంధ్రపురాణం’ రాసింది ఈయనే. అలాగే ధూళిపాళ మహాదేవమణి అనే పండితుడు రాజమండ్రిలో ఉన్నాడు.”చాలా బాగా మాట్లాడారని” నన్ను ప్రశంసించారు. నాకు కవిత్వం ద్వారా పరిచయమున్న సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ సభలో. ఆయన “బాగా మాట్లాడినారని” మెచ్చుకున్నారు. వీరు ముగ్గురి మాటలు విన్న తరువాత, ఆంధ్రపురాణంలో వీళ్లకు కూడా తెలియని ఏదో ప్రత్యేకత ఉందని నాకర్థమైంది. దాంతో మొత్తం మళ్లీ చదివి పుస్తకం రాశాను.
దీన్ని నేను భారతీయ సంస్కృతీ కోణంలో చూశాను. అందుకే “భారతీయ సంస్కృతీ వైభవం” అని పేరు పెట్టాను. శాస్త్రిగారు శాతవాహనులతో కాకుండా ‘ఉదయపర్వం’తో ప్రారంభించారు. పురాణంలో పుట్టిన ‘ఆంధ్ర’ శబ్దమాధారంగా కథ ఉంటుంది. సంతానం లేని రాజుకు వరుణదేవుని అనుగ్రహం వల్ల ఒక కుమారుడు జన్మిస్తాడు. అంటే దీని అర్ధం భగవంతుని అనుగ్రహం వల్ల జన్మ కలుగుతుందనే కదా! చిట్టచివరి నాయక రాజులను వివరిస్తూ…ఆ రాజుకు అన్నదానం చేయడం ఎంతో ఇష్టమైన సత్కార్యం. ఇలాంటి ధార్మికమైన పనులు రాజ్యాన్ని సంక్షోభం లోంచి బయటపడేస్తాయి. గ్రంథం చివరి భాగానికి “ముక్తామణి దర్శనం” అనే ఉప శీర్షిక ఉంటుంది. కావ్యం మొత్తంలో మధ్యలో ఒకచోట అమ్మవారి ముక్కుపుడక మాయమయిందని చెప్పి, “ముక్తామణి దర్శనం”లో అది దొరికిందని కవి అందమైన పద్యాల్లో రాశారు. రాజవంశాలన్నీ వేరు వేరుగా ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. అందువల్ల నాకు, ఈ కావ్యానికి కథా సూత్రం ఎట్లా తయారు చేయాలని ఆలోచిస్తే ‘ఆంధ్రుడు’ అన్న దగ్గర సమాధానం దొరికింది. ఈ రాజవంశాలన్నింటికీ ‘ఆంధ్రుడు’ అనేదే సంకేతం. ఉదయపర్వం అంటే ఆంధ్రుడు ఉదయించాడు అన్నదే. అక్కడ ఏ రాజవంశాలతో పని లేదు. పాలనంతా చేసింది ఆంధ్రులే అయినప్పుడు ఆంధ్రుని యొక్క పురాణమనే కదా అర్థం. ఆంధ్రరాజుల పురాణం కాదు. చివర్లో ముక్తామణి దర్శనం కలగడం అంటే నాకు అది ‘ఆత్మదర్శనం’ అని స్ఫురించింది. ఉపనిషత్తులు చదవడం వల్ల కలిగిన జ్ఞానం యొక్క ప్రభావమది. ఆత్మదర్శనం తోనే కావ్యాన్ని ముగించారాయన. జీవితానికి కావలసింది అదే కదా! ఈ ఆంధ్రుడు ఆత్మ దర్శనం పొందడానికి కారణాలు ఏంటంటే వైదిక మార్గంలో సాగడం. అంటే వ్యక్తి వైదిక మార్గంలో సాగితే ఆత్మదర్శనం పొందుతాడన్న పాయింట్ నాకు దొరికింది. మధ్యలో వైదిక ధర్మాలకు సంబంధించి, యజ్ఞ యాగాదులు చేసిన వారిని గురించి ఉంటుంది. దీన్నిబట్టి మొదటగా భగవంతుని అనుగ్రహం వల్ల పుట్టిన మనిషి వైదిక ధర్మమార్గంలో సాగితే ఆత్మదర్శనం పొందుతాడన్నది సారాంశం.

ఆచార్య భూమయ్య రచించిన పుస్తకాలు

12. పల్లా దుర్గయ్య గారి “గంగిరెద్దు” కావ్యం మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏమిటి?
జ: తెలంగాణ జీవితాన్ని చిత్రించే కావ్యం ‘గంగిరెద్దు’. మనకు సంక్రాంతి పర్వదిన సమయంలో కనిపిస్తుంది. ఎద్దే కానీ గంగిరెద్దు ఎలా అయ్యిందన్నది ఇందులోని ఒక పాయింట్. గంగి అంటే పూజ్యమైన అని అర్థం కదా! దున్నుతున్న ఎద్దు పూజనీయం కాదు. గంగిరెద్దు పూజింపబడేది. ఆయన టీచరు కాబట్టి తెలివి తక్కువ పిల్లలకు చదువు చెప్పడం ఎంత కష్టమో తెలుసు. అలాంటిది ఒక పశువును గంగిరెద్దుల వాడు ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దాడన్న విషయాన్ని ఆయన రాసిన తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. 400 పై చిలుకు పద్యాల అద్భుత కావ్యమిది. ఇందులో కవి పేదవారైన కాపువాడు, గంగిరెద్దుల వాడు ఎలాంటి స్థితిని అనుభవిస్తుంటారో తెలుపుతూ కోడెదూడ గంగిరెద్దు కావడానికి నేర్చిన విద్య, గంగిరెద్దు యొక్క పూర్వపు రెండు జన్మలు, ఒక జంతువు, మనిషి వల్ల పడ్డ కష్టాలను ఎంతో హృద్యంగా వివరిస్తారు.
పల్లా దుర్గయ్య గారు ఈ కావ్యం ద్వారా ఒక గంగిరెద్దు ఆవేదనను, దాని జీవితాన్ని, అందులోని మూడు దశలను అద్భుతంగా వర్ణించారు. ఇది ఆయన కవితాత్మకతకు నిదర్శనం. మూగ ప్రాణిలోని ఆవేదనను పరోక్షంగా దర్శించి, దాన్ని మనకు అనుభూతి చేయించడం నన్ను బాగా ఆకట్టుకుంది.
ఒక వికృతమైన ఆకారంతో పుట్టి, వ్యవసాయానికి పనికి రాని ఎద్దు అందరిచేత పరిహసింపబడి తిరిగి వాళ్ళచేత పూజలందుకున్నట్లు ఉదాత్తంగా చిత్రించారు దుర్గయ్య గారు. అలా వికృతంగా పుట్టడానికి ముందు రెండు జన్మలు కారణమయ్యాయి. మొదటి జన్మ ఆవుగా పుట్టడం, రెండో జన్మలో ఎద్దులా పుట్టడం.. కానీ ఈ రెండు జన్మలో అది అనేక కష్టాలను అనుభవించింది. ఇక మూడవ జన్మలో రెండు తోకలు, మూపురంపైన ఒక కాలుతో వికృతంగా కోడెదూడగా పుట్టింది. దాన్ని చూసి వ్యవసాయానికి పనికిరాదని కాపు వేదన చెందుతాడు. దూడ తల్లి కూడా ఆవేదనతో మరణించింది. ఒకవైపు అనాథగా మారడం, మరోవైపు అందరి అవహేళనలకు గురికావడం, తన యజమానికి తను ఏ రకంగానూ ఉపయోగ పడకపోవడం..వీటితో నిరాశకు గురి అయిన దూడ ఇంటినుంచి పారిపోతుంది. గమ్యం లేకుండా తిరుగుతూ ఒక మర్రిచెట్టు నీడలో నిద్రిస్తూ ఉంటే గంగిరెద్దుల వాడు దాని ప్రత్యేక ఆకారాన్ని చూసి తీసుకుపోతాడు. తన తెలివితో దానికి మరో ఆవు చేత శిక్షణ నిప్పించి గంగిరెద్దుగా మారుస్తాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న గంగిరెద్దును ఊళ్ళు తిప్పుతూ దాని స్వంత ఊరుకు తీసుకొస్తాడు. కాపు దాన్ని చూసి గుర్తుపట్టినా తాను చీదరించుకున్న దూడను గంగిరెద్దుల వాడు తీర్చిదిద్దిన వైనానికి ఆశ్చర్య పోతాడు.. చివరకు కాపుతో పాటుగా ఊరంతా దానికి పూజలు చేస్తారు..
ఇందులో ఆయన దాన్ని కవిత్వీకరించిన తీరు అనన్య సామాన్యం. ” ముందు చన గోయి, వెనుకకు బోవ నూయి/ మోట పని యెద్దులకు చాల మోసమమ్మ”… “ముక్కునకు త్రాడు బిగియించె, ముందు వెనుక/ కాళ్ళు బంధించి, నాల్గు డెక్కలకు నినుప/ నాడె ములు గొట్టె”…..” మొద్దు చుట్టుగ దిరిగెడు ప్రొద్దులందు/ కాశికిం జేరుదుము చక్కగా నడిచిన”…..” ఆ యెండ దెబ్బ కోర్వక/ కాయం బుడుకెత్త, కాళ్ళు కంపింపగా”…..ఇలాంటి పాదాలు ఎద్దు ఆవేదనకు అద్దం పడతాయి. చివరగా ” కావున,నాట్య కళా పుం/ భావ గిరాందేవియైన పశువు బసవడై/ ఏ వృషమును, నర
పశువును/ భావింపగ రాని గౌరవం బంది కొనెన్”…అంటూ ఎంత పూజనీయంగా మారిందో చెప్తారు. ఒక ఉపాధ్యాయునిగా.. ఒక్కొక్కప్పుడు తెలివితక్కువ పిల్లలు ఇంట్లో తిడుతుంటే ఇంట్లో నుండి పారిపోవడాన్ని దూడ పారిపోయినదానికి అన్వయిస్తారు. సరియైన గురువు ఉంటే విద్యార్థులు రాణిస్తారని, గంగిరెద్దులవాడు దేనికీ పనికిరాని జంతువును పూజనీయంగా మార్చిన పద్ధతిని అన్యాపదేశంగా చెప్తారు.

13. ” భాగవత భక్త పాలన కళ” అని రాయడానికి ప్రేరణ ఏమిటి?
జ: “భక్త పాలన కళ” అన్నది నా మాట కాదు. పోతన భాగవతంలో “శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర/
క్షైకారంభకు/ భక్తపాలన కళా సంరంభకున్”…. అన్న పద్యం ఉంటుంది కదా..దీంట్లో భక్తపాలన కళ అన్నాడు పోతన. అది నా మనస్సును పట్టుకున్నది. అంటే భక్తులను పాలించడం ఒక కళ. ఆయన రక్షించిన భక్తులలో ఒక ఐదుగురిని నేను తీసుకున్నాను. అందులో కుచేలోపాఖ్యానం, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, వామన చరితం.. వామన చరితంలో అదితి అపారమైన భక్తికి కటాక్షించి ఆమె గర్భమున వామనుడిగా జన్మించాడు ఆ భక్త పరాధీనుడు. మిగిలిన నాల్గు కథలు తెలిసినవే కదా! ఇవి పెద్ద కథలు. ఇందులో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా అనుగ్రహించాడు విష్ణువు. ఆ తర్వాత కృష్ణుని బాల్యచేష్టల గురించి చిన్న కథలు తీసుకొని ఇందులో భక్తపాలన కళ కాకుండా బాల్యక్రీడలు వివరించాను. కృష్ణుని జననానికి రేపల్లె వాసులు పొంగిపోవడం, పూతనను చంపడం, తన నోట్లో విశ్వదర్శనం చేయించడం, వృక్షములను కూల్చి శాప విమోచనం చేయడం, గోవర్ధన గిరినెత్తడం..ఈ అయిదు కథలతో బాల్య చేష్టలు రాశాను. నారదుడు వ్యాసునికి, వ్యాసుడు, శుకునికి, శుకుడు పరీక్షితుకు భాగవతాన్ని చెప్పడం, దాన్ని పోతన అనువదించడం నుండి మొదలుకొని కొండను అద్దంలో చూపినట్లు సంక్షిప్తంగా చెప్పాను. ఒక విశేషం ఏంటంటే ఈ పదికథలకు నేను రాసిన పద్యాల్లోని పాదాలనే శీర్షికలుగా మలిచాను. ఉదా: “మొఱ విని గజేంద్రు బ్రోచె మకరిని ద్రుంచి”, “అదితి నోమగా వామనుడై జనించె”, కొండ నొక కేలనే ఎత్తె గొడుగు వలెనె” ఇలా…. దీనివల్ల పాఠకునికి పద్యంతో పాటు కథ కూడా తెలుస్తుంది. ఒక ప్రసంగం లాగా కూడా చెప్పే విధంగా ఉంటుంది…

14. భక్తి రస ప్రవాహాలైన సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాల గురించి కూడా మీ మార్గంలో ఎలా రాయగలిగారు?
జ: సంస్కృతం అంటే నాకు ఎంతో అభిమానం. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు రాసిన సౌందర్యలహరి, శివానందలహరి శ్లోకాలకు పలువురు పండితులు టీకా తాత్పర్యాలు రాసినారు. సౌందర్యలహరిలోని తాత్త్వికతతో పాటు కవితా విశేషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది సామాన్య జనులు అందుకోవాలంటే సరళమైన వచనంలో రాయాలి. దానికి మళ్లీ నా మార్గాన్నే ఎన్నుకున్నాను. ఒక విద్యార్థిని ఊహించుకొని , ప్రతిరోజూ ఆ విద్యార్థికి పది శ్లోకాలు చెప్పినట్టు, ఒకటవరోజు, రెండవరోజు అని చెబుతూ పదిరోజుల్లో వంద శ్లోకాలు చెప్పినట్టు రాశాను. కేవలం తత్త్వం మాత్రమే చెప్తే కుదరదని ఇందులో భక్తి అంశంతో పాటు కవిత్వ సొబగులను వివరించాను. “సౌందర్య లహరి – భావ మకరందం” అనే పుస్తకం రాశాను. 2013లో ముద్రితమైంది.
శివానందలహరిని కూడా ఇలాగే రాయాలనుకున్నాను. 100 శ్లోకాలు పూర్తి చేశాను. 2018లో పూర్తి అయింది. రెండూ వేరు వేరు అయినా ఆ రెంటినీ కలిపి “శివ సౌందర్యలహరి” పేరుతో 2019లో ఒక సంపుటంగా వేశాను.

15. మీ మొదటి కావ్యం “వేయినదుల వెలుగు” దేన్ని చిత్రిస్తుంది?
జ: ఆ కావ్యం పేరు అందులో రాసినటువంటి పద్యాల్లోని ఒక పాదం. ‘దేవి’ అని పెట్టాలనుకున్నాను. ప్రతీ పద్యంలో దేవి అని వస్తుంది. శతక మకుటంలా కాదు. పద్యం మొత్తంలో ఒకచోట వస్తుంది. ఇదంతా భక్తి రస ప్రాధాన్యమే. పురాణ గాథే. కానీ “కనికరింతువే నాకొక్క పనిని చెప్పి” అన్నాను. అంటే ఆమె అనుగ్రహం కావాలనే కదా!”వరములిమ్మని వారలెవ్వరి అడుగున పడనె లేదు నేనింతవరకు…నీ అభయవర పదమ్ముల నమ్మి” అంటూ విన్న విషయమే అయినా దాన్ని నాదిగా చేసుకొని నేను ఆ భావంలో మమేకమై రాశాను. ” దేవి! నీ పాద నఖ దీధితి నిశిత శర జాలము కురిసి రాక్షసి చచ్చి చెడును” అంటే అమ్మవారిని నమ్ముకోవడం వల్ల ఇలాంటి కృపకు పాత్రులవుతామని చెప్పడం..ఇలా ఇందులో భక్తి భావమే గోచరిస్తుంది. “దేవి ! ఈ జలపాతపు తీవ్రమైన ధాటి ఇది ఎక్కడిది? నేను తట్టుకొనకపోయితిని గదే.. ఇందుండి పుట్టి వచ్చి నన్ను తాకినది ఒక వేయి నదుల వెలుగు” అని ఒకచోట రాశాను. జలము నుండి విద్యుత్తు పుట్టినట్టు అది ఒక కిరణ రేఖ కాదు. ఒక నది అంత వెలుగు కాదు. వేయినదులు ఒక్కసారి వెలుగుగా ప్రసరిస్తే ఎట్లా ఉంటుంది? అమ్మవారిని గురించి వర్ణించేటప్పుడు శతకోటి సూర్య తేజముల వెలుగు అంటారు. ఇలా కవితాత్మకమైన పాదం రావడం వల్ల దీనినే కావ్యానికి పేరుగా పెట్టడం జరిగింది. దీన్నే మొదటి పద్యంగా పెట్టుకున్నాను. 1992లో నా విమర్శ కావ్యాలు అచ్చు కాగానే 1993లో ఈ పద్య కావ్యం రాయడం జరిగింది. ఇది 1994 లో అచ్చు అయ్యింది. దీనికి ముందు మాట రాస్తూ గుంటూరు శేషేంద్ర శర్మ గారు ” మాతృ శిశు సంబంధం లాగా ఉన్నాయ” ని ప్రశంసించారు. అమ్మవారిని భయంతోనో, భక్తితోనో కొలవలేదు. సాక్షాత్తు నా తల్లిలా,వాత్సల్య మూర్తిగా కొలిచాను. “దేవి! నీ పాదరజమింత తీసి నా నుదుట తిలకము దిద్దగా తోచె, కవిత యను మరాళమొకటి నీ వదన విశాల గగనమందున తెల్ల రెక్కలను విప్పి” కవిత్వం నీ వల్ల వచ్చిందని చెప్పుకోవడం. దీంట్లో కొన్ని సౌందర్యలహరి భావజాలంతో వచ్చిన అనువాదాల్లాగా ఉంటాయి. చివరలో అమ్మవారి నామ స్మరణతో చేసిన పద్యాలు కూర్చాను. ఇట్లా నామాలు, శ్లోకాల భావాలు నాకు పద్యాలైనాయి..

16. “వెలుగు నగల హంస” కూడా ఇదే క్రమంలో వచ్చిన కావ్యమేనా?
జ: అవును. దానికి వెనువెంటనే ఆరు మాసాల వ్యవధిలో 1995 లో “వెలుగు నగల హంస” వచ్చింది. ” మౌనముద్ర దాల్చి మానస సరసులో నున్న తనకు నీవె కన్నులందు మెరసినావు…దేవి!
మురిసి తానై ముందుకు ఎగిరివచ్చె వెలుగు నగల హంస”… అంటూ మొదటి పద్యంగా రాశాను. ఇందులో 5 ఖండికలు ఉంటాయి. ప్రతీ ఖండికకు అమ్మవారి నామాలలోని పూల పేర్లను పెట్టాను. కదంబ కుసుమం, చాంపేయ కుసుమం, పాటలీ కుసుమం, మందార కుసుమం, చైతన్య కుసుమం.
“వేయినదుల వెలుగు” లో సౌందర్యలహరికి, లలితా సహస్రనామాలకు సంబంధించిన భావానుగుణంగా పద్యాలున్నాయి. “వెలుగు నగల హంస” లో నావి ఎక్కువ ఉంటాయి. “త్రాగు నీటికై ఒక బావి త్రవ్వుచుండ.. దేవి! ఈ భూమి గుణమేమొ కానీ, దీనిలోన బాధలే ఊరుచున్నవి..బ్రతుకిదెల్ల బాధలనె తోడుకొని త్రాగవలెనె?” ఇలాంటి పద్యాలెన్నో.. “వేదముల తోడ దేవి! నివేదన లొనర్ప గల యంత కాదు..స్వర్ణముఖి జలములట్లు నోటితో తెచ్చెడునంత కాదు. మధ్యతరగతి నా భక్తి మనసు పడుదె” నా భక్తి మరీ అంత గొప్పది కాదు, మరీ అంత లేనిది కాదు( నవ్వుతూ )మధ్యస్థం… అలాగే వ్యవసాయానికి సంబంధించిన పద్యమొకటి..
“పెట్టుబడి అప్పు.. చల్లెడు విత్తనాలు నాగు. భూమి కౌలుకు కొని, నన్ను దున్నుకున్నట్లె దీనిని దున్నినాను..నేనె పంటనై అమ్ముకున్నాను నన్ను..” ఇలా భక్తి భావంతో సాగుతూ ఉంటాయి ఈ రెండు కావ్యాలు కూడా…

17. “లోకం దృష్టి ఒకవైపు అయితే భూమయ్య గారిది లోచూపు” అన్నట్లు జ్వలిత కౌసల్య, మకరహృదయం లాంటి ప్రత్యేక రచనలతో
మనసులను ఆకట్టుకున్నారు… ఆ విభిన్న దృక్కోణాన్ని వివరిస్తారా?
జ: నిజమే! ఇంతకు ముందు చెప్పాను కదా! కొత్త విషయం లేకుండా రాయనని. దేన్ని చదివినా దాంట్లో నూతన అంశం ఏదైనా ఉందా అని ఆ దిశగా ఆలోచిస్తాను. అట్లా రూపుదిద్దుకున్నవే మీరడిగిన కావ్యాలు. వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు కౌసల్య దుఃఖం నన్ను కంట తడి పెట్టించింది. కైకేయి ఆజ్ఞ ప్రకారం వనవాసాలకు వెళ్ళడానికి శ్రీరాముడు తల్లి అనుమతికై కౌసల్య మందిరానికి వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది వాల్మీకి రామాయణంలో, తెలుగు రామాయణాల్లో ఎక్కడా ఏకపత్నీవ్రతుడన్న మాట కనిపించదు. లోక వ్యవహారంలో ఉన్నది మాత్రమే. కౌసల్యాదేవి రాముని చూసి “భర్తతో ఎలాంటి సుఖం పొందలేదని, సపత్నుల వల్ల పొందిన పరాభవాలు తనను తీవ్ర దుఃఖంలో ముంచాయని, గొడ్రాలుగా మిగిలిపోయినా ఈ బాధ ఉండేది కాదని” తీవ్రంగా దుఃఖిస్తుంది. అప్పుడు రాముడు తల్లి దుఃఖానికి బహుభార్యాత్వం కారణం కాబట్టి తల్లి ముందు ప్రతిజ్ఞ చేశాడన్న ఊహ వచ్చి “ఏ పరిస్థితులెట్లు రానిమ్ము నాకు/ ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య” అని మాటిచ్చి ఊరడించాడు అన్నట్టుగా వెలువడింది ‘జ్వలిత కౌసల్య’…
త్రిజట స్వప్న వృత్తాంతం తీసుకుంటే ఆమె ఒక రాక్షసిగా పక్కకు పెట్టడం తప్ప వేరే రాక్షస గుణాలు కనిపించవు. ఆమె పరమ సాధ్వి. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో ఆమె రాముని స్వప్నంలో దర్శించింది. ఆ ఊహతో రాసిందే త్రిజట. ఆమె తన స్వప్నంలో భవిష్యత్తును దర్శించింది. తన స్వప్నాన్ని రాక్షస స్త్రీలకు చెప్పి సీతతో పరుష వాక్యాలు మాట్లాడరాదని, రావణుని మాట వినరాదని చెబుతుంది. రాముని గాంచిన కలను చెప్పి రాముడు రానున్నాడని సీతకు ధైర్యాన్నిస్తుంది. రాముని దర్శించిన ఆమె ఎంతటి అదృష్టవంతురాలో కదా! అందుకే ఆ దృష్టితో ఆలోచించాను.
“ప్రవర నిర్వేదం”లో హిమాలయాల్లో పాదలేపనం కరిగిపోయి అగ్నిదేవుని ద్వారా ఇంటికి చేరిన ప్రవరుడు జరిగిన ఉదంతాన్ని విచారిస్తూ భార్యకు వివరించినట్లుగా చెప్పి, అతడు కర్మ యోగం నుండి, జ్ఞానయోగాన్ని పొందడానికి అగ్నియే గురువుగా జ్ఞానబోధ చేశాడని చెప్పడం జరిగింది. ‘కబంధమోక్షం’ లో కబంధుడు శాపవశాత్తు వికృత రూపం కలవాడైనా రామునికి సుగ్రీవ మైత్రి లభించే దిశగా మార్గ నిర్దేశం చేసిన వానిగా తద్వారా సీతాన్వేషణ సులభతరం కావడం.. అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని కబంధుణ్ణి ఒక ఉదాత్త పాత్రగా చిత్రించాను. కథలో మార్పులేదు. చెప్పిన విషయమే వైవిధ్యం..
గజేంద్రమోక్షం అందరికీ తెలిసిందే. కానీ మకరి చేసిన పాపం ఏమిటి? అని కొత్త ఊహ వచ్చింది (గట్టిగా నవ్వేస్తూ). అందుకే
“నా నివాస గృహమునకు తాను వచ్చి/ అల్లకల్లోల మొనరింప నడ్డుపడగ/ వలదొ? ఇదియు నేరమగునొ? వచ్చినట్టి/వాడు వనరాజు
వాని గర్వమ్ము గనవొ!” అంటూ మకరి ఆవేదన చెంది విష్ణువును ప్రశ్నించినట్టుగా రాశాను. ఇక “పారిజాతావతరణము” అన్నది నంది తిమ్మన “పారిజాతపహరణము” కావ్య ప్రేరణ. ఇక్కడ దీన్ని అపహరించినట్టుగా కాక పారిజాత వృక్షము యొక్క మాహాత్మ్యం తెలిసిన సత్యభామ భూలోకంలోని ప్రజల సంక్షేమార్థం కృష్ణుని పారిజాత వృక్షాన్ని తెమ్మని కోరినట్లుగా చిత్రించాను. సత్యభామ పాత్రను కొత్త కోణంలో ఉదాత్తంగా ఆవిష్కరించాను..

18. సంపాదకత్వంలో సాధారణ సంపాదకుల నుండి మిమ్మల్ని వేరు చేసే ప్రత్యేక లక్షణంగా వచ్చిన పుస్తకాలను గురించి తెలపండి.
జ: నా సంపాదకత్వంలో వెలువడిన రచనలు మొత్తం 18. ఇందులో శాఖాధిపతిగా ఉన్నప్పుడు చేసినవి కూడా ఉన్నాయి. కాకతీయ తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఏటా ‘విమర్శిని’ అనే పుస్తకం వచ్చేది. శాఖాధిపతిగా ఉన్నవారే సంపాదకులుగా ఉంటారు. నేను ఒకసారి ప్రత్యేకంగా పాల్కురికి సోమనాథుని గురించి రాయించాను. అంతకుముందే 1993-94 లోనే నేను రీడర్ గా ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం వారు “ముసలమ్మ మరణం” కావ్యాన్ని సంపాదకత్వం కోసం నాకిచ్చారు. దానికి నేను దాదాపు 30 పేజీల పీఠిక రాశాను. రెండుసార్లు శాఖాధిపతిగా ఉన్నాను. అప్పుడొక చిన్న తమాషా చేశాను. వివిధ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఉన్న టీచర్లను పిలిపించి వాళ్లకు ఒకే సబ్జెక్టు పైన వేరువేరు టాపిక్స్ ఇచ్చి సెమినార్లు నిర్వహించి వాటికి సంపాదకత్వం చేశాను. ప్రతీ సెమినార్ లో అధ్యాపకులు ఎవరైనా స్టూడెంటును రెకమండ్ చేస్తే వారికి అవకాశం ఇచ్చాము. స్టూడెంట్ పత్ర సమర్పణ చేయడం ఆ స్టూడెంటుకు క్రెడిట్. ఒకసారి మొత్తం ఎమ్.ఏ విద్యార్థులందరినీ కలిపి అంతకు ముందు ఎవరూ చేయని విధంగా కాకతీయ యూనివర్సిటీ కింద ఉన్న
మూడు కాలేజీల స్టూడెంట్స్ ను తీసుకున్నాం. ఎంపిక ఆయా కాలేజీల వాళ్ళదే. ఒకే రోజు ఇలా నిర్వహించడంపద్ధతిలో భాగం కాదు. నా ఇష్టపూర్వకంగా చేసింది. సెమినార్ పత్రాలన్నీ యూనివర్సిటీ ద్వారా అచ్చు వేయించా. ఇదొక రకమైన సంపాదకత్వం. దీనివల్ల వాళ్ళ రచనను అచ్చులో చూసుకోవడం కాక పి.హెచ్.డి అడ్మిషన్ కోసం చూయించాల్సిన రెండు ముద్రిత వ్యాసాలకు వీటిని చూపించే విధంగా ఉంటుంది కదా! ఆ సెమినార్ పేరు “తెలుగు నందనం” పుస్తకానికి కూడా అదే పేరు పెట్టాను. దీంట్లో నేనొక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాను. విద్యార్థులను ఇందులో పాల్గొనేలాగా చేయడం నా అభిమతం.
ఇంకొకటి తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత “తెలంగాణా సంస్కృతి తొలి ఆవిష్కర్త” గా పాల్కురికి సోమనాథుని గురించి రాశాను. ఇంకొక సారి సోమనాథుని గురించి ఎవరికీ ఎలాంటి టాపిక్ ఇవ్వకుండా పాల్కురికి సోమనాథునికి సంబంధించి వాళ్లకు తెలిసిన విషయాలు వ్యాసాలుగా రాయమని అందరికీ చెప్పాను. కొంతమంది మేము రాయలేము పద్యాలు రాస్తామన్నారు. సరేనన్నాను. ఒక 16మంది పద్యాలు, వచన కవిత్వం కూడా రాశారు. ప్రశంస కదా! దీనివల్ల కవి స్తుతి అవుతుంది. అయితే ప్రధానం వ్యాసాలే. మొత్తం 74 వ్యాసాలు. ఇలా పాల్కురికి సోమనాథుని కవితా వైశిష్ట్యాన్ని తెలియజేసాను. ఇవి నా ఆలోచనతో వచ్చినటువంటి సంపాదకత్వాలు..తెలంగాణ వచ్చిన తర్వాత పాల్కురికి సోమనను మొదటి కవిగా గుర్తించారు. నేనిలా చేయడం వల్ల మళ్లీ ఒకసారి పాల్కురికి సోమనాథుని అందరికీ గుర్తు చేసినట్లయింది. ఈ మధ్య ‘బసవకృప’ అని వీరశైవులు నడుపుతున్న మాస పత్రిక ఒకటి వస్తున్నది. నా అనుమతిని తీసుకొని వాళ్ళు ఈ పుస్తకం తీసుకొని వ్యాసాలను ఎంపిక చేసుకొని వాళ్ళ పత్రికలో తిరిగి అచ్చు వేసుకుంటున్నారు. అట్లా ఉపయోగ పడడం సంతృప్తికరంగా ఉంది.

19. “మా ఊరు చెరువు బడి గుడి” కూడా విద్యార్థుల రచనలతో వచ్చిందేనా? ఆ వివరాలు చెప్పండి.
జ: అవును…”ప్రతిభా త్రయి” లో విద్యార్థుల రచనను బట్టి వాళ్లలో రచనాశక్తి ఉందని గ్రహించాను. ఇంకో పుస్తకం వాళ్ళతో రాయించాలనిపించింది. టీచింగ్ గురించి రాయగలిగారు. ఇంకోటి దేని మీద రాయించాలి అని ఆలోచించినపుడు కావ్యం గురించి ఇస్తే వాళ్ళు రాయలేకపోయారు. దీన్నిబట్టి కావ్య విమర్శ చేసి రాసేంత శక్తి వాళ్ళల్లో లేదు అని అర్థమయింది. అయినా వాళ్ళతో ఏదైనా రాయించాలని మీ ఊరి గురించి రాయండి అన్నాను. “మా ఊరు చెరువు బడి గుడి” అని టాపిక్ ఇచ్చాను ప్రతి ఊళ్ళో చెరువు ఉంటుంది. దానికి సంబంధించి ఈతకొట్టిన అనుభవాలో ఏవో ఉంటాయి. ఆడపిల్లలైతే బతుకమ్మ మొదలైన ఆటలు ఇలా ఏదైనా వుంటుంది కదా! ఇక బడి విషయాలు… వాళ్ళ స్కూలును జ్ఞాపకం తెచ్చుకొని చదువుకున్న చదువు, వాళ్ళ టీచర్లు, స్నేహితులు ఇలాంటివి రాస్తారు. గుడి అయితే గుళ్ళో జరిగే పండుగలు, జాతరల అనుభవాలు, అనుభూతులు రాయమన్నాను. నా దృష్టిలో ఊరును ఒక మనిషి అనుకుంటే ఆ ఊరుకు శరీరం వంటిది చెరువు. అది పంటలకు ఆధారం. పంటలు సరిగా పండితే ఆహారపోషణతో వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. బడి అన్నప్పుడు చదువుకోవడం కాబట్టి బుద్ధికి ప్రతీకగా పెట్టుకున్నా. గుడి అనేది హృదయ సంబంధం. భక్తి అనేది మనసుకు సంబంధించినది. మనిషికి భౌతిక శరీరం, బుద్ధి వీటితో పాటు హృదయ పవిత్రత ముఖ్యం. అందుకే ఈ మూడింటి గురించి రాయమనడం నా ఉద్దేశ్యం. 24 మంది వరకు స్పందించి చక్కగా రాశారు. అప్పుడు కాకతీయ యూనివర్సిటీ కింద నాల్గు జిల్లాలు ఉండేవి. విద్యార్థులను వాళ్ళ మాండలికాల్లో రాయమని చెప్పాను. ఇందులో రెండు ప్రయోజనాలు. ఒకటి వాళ్ళల్లో రచనా శక్తిని పెంపొందించడం. రెండు…ఆయా ప్రాంతాల్లో మాండలికాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం. ఒక 25 సంవత్సరాల క్రితం ఆయా జిల్లాల సామాజిక పరిస్థితులు వీటివల్ల తెలిశాయి. ఇదీ నా దృక్పథం.

అరుణధూళిపాళకు పుస్తకాల బహూకరణ

20. చాలా బాగుంది సార్..ఇంకో ప్రశ్న. పోతన భాగవతం అందరికీ తెలుసు..మరి “పోతన రామాయణము” అని మీ సంపాదకత్వంలో వచ్చింది కదా! దాని గురించి చెప్పండి.
జ: పోతన భాగవతంలో రామాయణానికి సంబంధించిన పద్యాలు ఉన్నాయి. భాగవతం పురాణం కదా! పురాణ లక్షణాల్లో ఒకటైన “వంశానుచరిత” అనే లక్షణంతో రఘు వంశాన్ని గురించి రాస్తూ రాముని గురించి చెప్పే సందర్భంలో ఆయన ఈ పద్యాలను రాశారు. వీటిని ఎవరూ అంతగా పట్టించుకొనరు. వంద పద్యాలు ఉంటాయి అవి. ఆ వంద పద్యాలకు 15 పేజీల పీఠిక రాసి “పోతన రామాయణము” ( 2019 ) అనే పేరుతో అచ్చు వేయించాను. రామాయణంలో నారదుడు వంద శ్లోకాల్లో వాల్మీకికి సంక్షిప్త రామాయణాన్ని వివరించినట్టు ( దానికి ఇది అనువాదం కాదు ) పోతన వంద పద్యాల్లో రాముని చరితను రాశారు. నా సంపాదకత్వంలో చిట్ట చివర వచ్చిన పుస్తకం ఇది.

21. “పద్యాలయం” పేరుతో వెలువడిన నాలుగు సంపుటాలలోని విభాగాలకు అమ్మవారి నామాలు వచ్చేటట్లుగా పేర్లు పెట్టడంలో అంతరార్థమేమిటి?
జ: ‘పద్యాలయం’ అనేది నా ఆలోచనకు తగిన పద్దతిలో నా సంపాదకత్వంలో వచ్చిన నాల్గు సంపుటాలు. పద్యాలయం అని నేనొక వాట్సాప్ గ్రూపు పెట్టాను. దాని నుండి పుట్టిందే ఇది. అంటే దానికి కొనసాగింపుగా పుస్తకంగా వచ్చినటువంటింది. దానిని నేను మూడు విభాగాలుగా చేశాను. ఒకటి ప్రాచీన కవుల పద్యాలు ఒక భాగం, రెండవ భాగం ఇప్పటి కవులు ఏదైనా రాయొచ్చు. అంటే వాళ్ళు రాసిన పద్యాలు. మూడవది పద్య కావ్యాలకు సంబంధించిన విమర్శ వ్యాసాలు. “పద్యం చదవండి, పద్యం రాయండి, పద్యం గురించి రాయండి”. పద్యం చదవండి అన్నప్పుడు పూర్వ కవులను చదవాలి. అంటే అవి చదవకుండా మీరు పద్యం రాయొద్దని అన్యాపదేశంగా చెప్పడం. దీనికి నన్నయ్య, తిక్కన మొదలైన కవుల దాదాపు 20 పద్యాలను మోడల్ గా చూపించిన. అంటే ఒకరకంగా సిలబస్ లో చదివే పద్దతిలో ఇచ్చిన. రెండవది పద్యాలు రాయడం. పద్యాలయం ముఖ్యోద్దేశ్యమే అది. కానీ దీన్నుండి పుట్టిన ఆలోచన దీన్ని పుస్తకంగా తేవాలన్నది. పద్యం చదవడం, పద్యం రాయడం కాకుండా పద్యం గురించి విమర్శ కూడా రాయాలి కదా! అందువల్ల పద్యం గురించి రాయడం అని పెట్టుకున్న. వీటికి పేర్లు ప్రాచీన, ఆధునిక పద్యాలలో ఏవైనా పెట్టొచ్చు. కానీ అలా కాకుండా లలితా అమ్మవారి మీద ఉన్న ప్రేమ పూర్వక భక్తి వల్ల వెతికాను.
ప్రాచీన కవిత్వానికి సహస్ర నామాల్లోని “సంప్రదాయేశ్వరీ” అని అన్నాను. రెండవది రాజకీయ అంశాలు తప్ప ఏ అంశాలైనా, ఏ భావమైనా రాయమని వాళ్లకు నియమం పెట్టాను. దీనికి అమ్మవారి నామాల్లో “వివిధ వర్ణోప శోభితా” అనేది సరిగ్గా ఒప్పింది. మూడవది విమర్శ కదా! దానికి “విమర్శ రూపిణీ” అనే నామం సరిపోయింది. ఇక సంపాదకత్వం రాయాలి. ఈ మూడు విభాగాలు వచ్చే విధంగా “వదన త్రయ సంయుతా” అనే నామాన్ని పెట్టుకున్నాను. ఇలా సరిగ్గా భావానికి తగినట్లు నామాలు దొరకడం అదృష్టం కదా! రెండేళ్లలో (2018-19) ఈ నాలుగు సంపుటాలు పుస్తక రూపంలో వచ్చాయి.
పద్యాలయం వాట్సాప్ కు, ఈ సంపుటాలకు సంబంధం లేదు. అంటే అందులో వచ్చినవైనా నేను అడిగినప్పుడు నియమాలను అనుసరించి రాసినవే తీసుకుంటాను. దాన్నుండి పుట్టిన ఆలోచనే అయినా అందులో నుండి తీసుకున్నప్పుడు “అచ్చు కాని పద్యాలు” అని కండిషన్ పెట్టాను. అందువల్ల “పద్యాలయం” నాకిష్టమైన పద్ధతిలో నా సంపాదకత్వంలో వెలువడిన సంపుటాలు.

22. అపార భక్తి తత్పరత కలిగిన మీరు రచించిన ఆధ్యాత్మిక రచనలేవి?
జ: నేను మొత్తం పది ఆధ్యాత్మిక కావ్యాలను రచించాను. అందులో వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస గురించి మీకు చెప్పాను. అలాగే అష్టావక్ర గీత, గురు దత్త శతకములు అనువాదాలుగా చేసానని ఇంతకుముందే చెప్పాను. ఇవి కాక “అగ్ని వృక్షం”..ఒక ఆత్మగాథా ద్విశతి. ఒక మార్మికమైన నివేదనా సమాహారమిది. “చలువపందిరి”..దీంట్లో 5 ఖండికలకు కేనోపనిషత్తు లోని పేర్లు పెట్టాను. ఆత్మసాక్షాత్కారం కొరకు సాధన చేయాలని చెప్పేది. “అమృతసేతువు”…ముండకోపనిషత్ సారంగా సంసారం అనే ఈ దరి నుండి, అమృతత్వసిద్ధి అనే ఆ దరికి చేరడానికి నిర్మించిన సేతువు అని సాధన గురించి చెప్పినది. “అరుణాచల రమణీయం” రమణ మహర్షుల వారి “మృత్యుదర్శనం”, “గిరిదర్శనం”, “ఆత్మ దర్శనం” అనే మూడు విభాగాలలో వారి బోధనలను పద్యాలుగా శతకరూపంలో 108 పద్యాల్లో ” అరుణ గిరి రమణ పదముల నాశ్రయింతు” అనే మకుటంతో రాశాను.
“వేదనామృతము” ఆధ్యాత్మిక తాత్త్విక విచారంగా రాసినది. ‘కైవల్య’ శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం కోసం రాసిన పద్యాలు…సప్తగిరులకు ఒక్కొక్కదానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ 7 ఖండికలుగా రాశాను. వాటికి ఆ సప్తగిరుల పేర్లు పెట్టాను.

23. విమర్శ, పద్య, గేయ కావ్యాలే కాకుండా అనువాదాలు ఏమైనా చేశారా?
జ: చేశాను. సంసృతం నుండి తెలుగులోకి నాలుగు పుస్తకాలను అనువాదం చేశాను. అందులో రెండు యధాతథానువాదాలు, రెండు స్వేచ్ఛానువాదాలు. “అష్టావక్రగీత” ఇది అద్వైత గ్రంథం. దీంట్లో 298 శ్లోకాలు ఉన్నాయి. వీటిని తేటగీతి ఛందస్సులో యధాతథంగా అనువదించాను. అలాగే శంకరాచార్యుల వారి “అపరోక్షానుభూతి” ని మాత్రా ఛందస్సులో గేయాలుగా రాశాను. ఇదీ యధాతథానువాదమే.
ఇక సౌందర్య లహరిలోని అన్ని శ్లోకాలకు కాకుండా 54 శ్లోకాలను గేయాలుగా స్వేచ్ఛానువాదం చేశాను. గణపతి సచ్చిదానంద స్వామి వారి “నీతిమాల సూక్తి మంజరి” లోని శ్లోక రూపంలో ఉన్న సూక్తులను తేటగీతి ఛందస్సులో శతకంగా స్వేచ్ఛానువాదం చేశాను. దీనికి మకుటంగా “దత్త గురుదత్త జయగురు దత్త దత్త” అని పెట్టాను.

24. అపార భక్తి తత్పరత కలిగిన మీరు రచించిన ఆధ్యాత్మిక రచనలేవి?
జ: నేను మొత్తం పది ఆధ్యాత్మిక కావ్యాలను రచించాను. అందులో వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస గురించి మీకు చెప్పాను. అలాగే అష్టావక్ర గీత, గురు దత్త శతకములు అనువాదాలుగా చేసానని ఇంతకుముందే చెప్పాను. ఇవి కాక “అగ్ని వృక్షం”..ఒక ఆత్మగాథా ద్విశతి. ఒక మార్మికమైన నివేదనా సమాహారమిది. “చలువపందిరి”..దీంట్లో 5 ఖండికలకు కేనోపనిషత్తు లోని పేర్లు పెట్టాను. ఆత్మసాక్షాత్కారం కొరకు సాధన చేయాలని చెప్పేది. “అమృతసేతువు”…ముండకోపనిషత్ సారంగా సంసారం అనే ఈ దరి నుండి, అమృతత్వసిద్ధి అనే ఆ దరికి చేరడానికి నిర్మించిన సేతువు అని సాధన గురించి చెప్పినది. “అరుణాచల రమణీయం” రమణ మహర్షుల వారి “మృత్యుదర్శనం”, “గిరిదర్శనం”, “ఆత్మ దర్శనం” అనే మూడు విభాగాలలో వారి బోధనలను పద్యాలుగా శతకరూపంలో 108 పద్యాల్లో ” అరుణ గిరి రమణ పదముల నాశ్రయింతు” అనే మకుటంతో రాశాను.
“వేదనామృతము” ఆధ్యాత్మిక తాత్త్విక విచారంగా రాసినది. ‘కైవల్య’ శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం కోసం రాసిన పద్యాలు…సప్తగిరులకు ఒక్కొక్కదానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ 7 ఖండికలుగా రాశాను. వాటికి ఆ సప్తగిరుల పేర్లు పెట్టాను.

25. తెలంగాణా కవుల సాహిత్యం గురించి ప్రత్యేకమైన రచనలు ఏమైనా చేశారా?
జ: తెలంగాణా కవి కొరవి గోపరాజు గారు రచించిన “సింహాసన ద్వాత్రింశిక” మీద ఎమ్ ఫిల్ చేశాను. నా తొలి రచన అదే. ఆ గ్రంథం మీద వచ్చినటువంటి తొలి విమర్శ గ్రంథం కూడా అదే. గోలకొండ కవుల సంచిక గురించి, పోతన భాగవతం గురించి రాశాను. శేషప్ప కవి గారి’నృసింహ శతకం’, కాళోజీ నారాయణరావు గారి ‘నా గొడవ’, దాశరథి కృష్ణమాచార్య గారి ‘అగ్నిధార’, సినారె గారి ‘కర్పూర వసంతరాయలు’, ఋతు చక్రం, పాల్కురికి సోమనాథుని మీద ప్రత్యేక వ్యాసాలు రాయించి ప్రచురించడం, తెలంగాణా వచ్చిన తర్వాత సోమనను “తెలంగాణా సంస్కృతి తొలి ఆవిష్కర్త”గా చూపించాను. వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన ‘ప్రజల మనిషి’ లో “కంఠీరవం” నాయకుడని అందరూ అన్న విషయం. నేను లోతుగా పరిశీలించి గొట్టం కొమురయ్య తాను కష్టపడి తన సమస్యపై తాను పోరాడి పరిష్కరించుకున్నాడు కాబట్టి అతనే నాయకుడని చెబుతూ తెలంగాణ చైతన్య స్ఫూర్తిగా ఆ నవలను చూపించాను. పొట్లపల్లి రామారావు గారి ‘అక్షరదీప్తి’ కవితోక్తులను గురించి వివరించాను. పాటకు గజ్జె కట్టిన గద్దర్ గారి గురించీ రాశాను. నందిని సిధారెడ్డి ఏడు వచన కవితా సంపుటాలను గురించి “తెలంగాణ నాగేటి చాళ్ళు” పేరుతోనే పుస్తకం రాశాను. తెలంగాణా కవులంటే ఎంతో మక్కువ నాకు. అందుకే ప్రాచీన, ఆధునిక కవులందరి గూర్చి రాశాను. ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, నవలలు, గేయం, వచన కవిత్వం ఇలా అన్ని ప్రక్రియల్లో రాసిన మన కవులందరినీ వివరించాను.

26. మీ గురించి వెలువడిన ఇతర గ్రంథాలేవి? వాటిని వివరించండి.
జ: నా “వేయినదుల వెలుగు” మొదలైన అయిదు పద్య కావ్యాలను గురించి ప్రముఖ కవి పండితులు రాసిన 50 వ్యాసాల సంపుటి “అంతర్వీక్షణ సార్వభౌమం” అనే పేరుతో వెలువడింది. దీనికి ఆచార్య చేకూరి రామారావు గారు, బేతవోలు రామబ్రహ్మం గారు సంపాదకత్వం వహించారు.
నా విమర్శ గ్రంథాలను గురించి ప్రముఖ కవి పండితులు రాసిన 76 వ్యాసాల సంపుటి “విమర్శ విద్యా సార్వభౌమం” ఆచార్య నాయని కృష్ణకుమారి గారి సంపాదకత్వంలో వెలువడింది.
“ఆలాపన” సంస్థవారు 2012 లో నాకు సన్మానం చేసి “అభినందన సంచిక” ను అచ్చు వేశారు. ఇందులో నా సాహిత్యం, వ్యక్తిత్వం గురించి 108 మంది ప్రముఖులు రాసిన అభిప్రాయాలున్నాయి.
“ఆచార్య అనుమాండ్ల భూమయ్య సప్తతి ప్రత్యేక సంచిక” వెల్చాల కొండలరావు గారి సంపాదకత్వంలో వెలువడింది. దీంట్లో నా సాహిత్యం గురించి కవి పండితులు రాసిన పలు వ్యాసాలు, అభినందనలు 76 ఉన్నాయి. కొండలరావు గారు “విశ్వనాథ జయంతి” అనే “విద్య, సాహిత్య- సాంస్కృతిక త్రైమాసిక పత్రిక ప్రత్యేక సంచికగా దీన్ని వెలువరించారు.
“అజో, విభొ,కందాళం” సంస్థ అధినేత ఆచార్య అప్పా జోస్యుల సత్యనారాయణ రావు గారు ప్రతీ సంవత్సరం ఇచ్చే “విశిష్ట సాహితీ మూర్తి” జీవన సాఫల్య పురస్కారాన్ని 2021 వ సంవత్సరానికి గాను నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో “సమ్మానోత్సవ విశేష సంచిక” ను వెలువరించారు. ఇందులో నా సాహిత్యం గురించి ప్రముఖులు రాసిన వ్యాసాలున్నాయి.
నాలో ఉన్న ముఖ్యమైన ముఖాలు మూడు. ఒకటి బోధన, రెండవది
కవిత్వం, మూడవది విమర్శ. ఇక నా పాఠ్య బోధనను గురించి 54 మంది విద్యార్థులు రాసిన అభిప్రాయాల సంపుటి “ప్రతిభా త్రయి”గా
వెలువడింది. ఇందులో నా కవిత్వం, విమర్శ గురించి కవి, పండితులు రాసిన వ్యాసాల సంక్షిప్త రూపాలున్నాయి. దీనికి సంపాదకులు నా పర్యవేక్షణలో పి హెచ్ డి చేసిన ముగ్గురు విద్యార్థినులు. వారు డా. కె. ప్రియదర్శిని, నల్ల ప్రభావతి, డా.ఎస్.రాధిక.
నేను రాసిన “శాంతి గర్భ” అనే గేయ కావ్యం గురించి నా డా.కె. జ్యోత్స్న “శాంతి ధృత” అనే విమర్శ గ్రంథం రాశారు.

27. మీ రచనల్లో పద్యం నడక సాగే విధానంతో పాటు మీ కావ్య గానం రస హృదయాలను ఆకట్టుకుంటుంది. మీకు సంగీత కళలో ప్రవేశం ఏమైనా ఉందా?
జ: ప్రవేశం ఏమీ లేదు. నేర్చుకోవాలని అనుకోనూ లేదు. ఈ విషయంగా చెప్పాలంటే ఇద్దరి పేర్లు చెప్పాలి. పద్యం మీద ప్రేమ హైస్కూలులో భూమారెడ్డి సార్ పద్యం చదివే పద్ధతిని బట్టి కలిగింది. అలా చదవాలి అనుకునేవాడిని. ఎమ్ ఏ లో ఉన్నప్పుడు దివాకర్ల వేంకటావధాని గారు రాగయుక్తంగా పద్యం చదివే వారు. పద్యం పాడడానికి వీళ్లిద్దరూ ప్రేరణ. నేను క్లాసులో ఉన్నప్పుడు తన్మయత్వం చెందుతూ రకరకాలుగా పాడుతుండడం వల్ల తెలియకుండానే నాదొక
పద్ధతి ఏర్పడింది అంతే..

28. మీ సాహితీ ప్రస్థానంలో మిమ్ములను ప్రభావితులను చేసిన మీ గురువులను గురించి చెప్పండి.
జ: నన్ను ప్రభావితం చేసిన వాళ్ళల్లో మొదటి గురువు కోవెల సంపత్కుమారాచార్య గారు. బీఎస్సీలో పాఠాలు చెప్పిన తర్వాత తెలుగు పట్ల ఆసక్తి కలిగితే నిలబెట్టిన వారాయన. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంలో క్లాసులు సరిగా నడవక పోయేవి. అప్పుడు మా గురువు గారి ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాను. అక్కడ ఆయన చదవమని పుస్తకాలు ఇచ్చేవారు. ఏ పుస్తకాలు చదవాలో చెప్పేవారు. ఏదైనా పద్యమో, గేయమో రాసేవాడిని. ఎలా రాయాలో వివరించేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనకు అభిమాన కవి. అందుకే విశ్వనాథ వారి “వేయిపడగలు” నవల గూర్చి నేను రాసిన “వేయి పడగలు- ఆధునిక ఇతిహాసం” పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చాను. హైస్కూలులో పద్యం పాడడం మీద ఆసక్తి కలిగించిన భూమారెడ్డి సారుకు ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా “వ్యాసభూమి” వ్యాస సంకలనాన్ని అంకితం ఇచ్చాను. దివాకర్ల వేంకటావధాని గారికి మకరహృదయం అంకితమిచ్చాను. డా. సి. నారాయణరెడ్డి గారికి “అగ్ని వృక్షం”, ఆయన జన్మదిన సందర్భంగా “కర్పూరవసంతరాయలు కళా ఝంకృతులు” అంకితం ఇచ్చాను. డా.పాటిబండ మాధవశర్మ గారి ఇంటికి కూడా ఎమ్ ఏ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. నేను పి హెచ్ డి చేస్తున్నప్పుడే ఆయన మరణించారు. ఆయన పేరిట అవార్డు ఇచ్చాను. కోవెల సుప్రసన్నాచార్యులు గారు నాకు గైడుగా ఉన్నారు. చాలా సన్నిహితంగా ఉండేవారు. “అమృతసేతువు” పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చాను.

29. చివరగా.. ప్రసిద్ధ విమర్శకులైన మీరు విమర్శకులకు ఇచ్చే సూచనలు ఏవి?
జ: ముఖ్యంగా చెప్పాలంటే ప్రాచీన కావ్యాలను విమర్శించాలంటే అలంకార శాస్త్రాలను చదవాలి. వాటిని తాము విమర్శించే పుస్తకానికి అన్వయించాలి. ప్రాచీన కావ్యాలను ఇంకొక విధంగా విమర్శించవచ్చు అనే విషయాన్ని రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు చెప్పారు. దానికి మూడు విధాలు చెప్పారాయన. రచన, వస్తువు, భావం అన్నారు. రచన అంటే శైలి మొదలగునవి, వస్తువంటే కథాంశం. ఇక రసానికి ప్రాతిపదిక స్థాయీ భావమే కదా! రసానికి దారి తీసేదే భావం. ఈ మూడింటిని నాచన సోమనాథుని కావ్యానికి అన్వయం చేస్తూ రాశారాయన. రచన వస్తువుకు లోబడి ఉండాలి. ఈ రెండూ భావానికి లోబడి ఉండాలి. అప్పుడే అది రసాత్మక కావ్యం అవుతుందంటారు ఆయన. ఈయన తర్వాత కురుగంటి సీతారామ భట్టాచార్యులు గారు , సి. నారాయణ రెడ్డి గారు వీటినే అనుసరించారు. అలంకార శాస్త్రం చదవడం వల్ల కావ్యం ఎలా నడవాలో తెలుస్తుంది.
ఆధునిక కవిత్వాన్ని విమర్శించడానికి అలంకారశాస్త్రంతో పాటు తొలి ఆధునిక విమర్శకులు కట్టమంచివారి, ప్రసిద్ధ విమర్శకుల గ్రంథాలు చదవాలి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ లో విదేశీయులు రాసిన విమర్శలు చదవాలి.
మరీ ముఖ్య విషయం ఏమిటంటే ఏ రచనను విమర్శ చేయాలనుకుంటున్నావో దాన్ని పూర్తి లోతుల్లోకి అధ్యయనం చేయాలి. దానివల్ల కవిత్వం యొక్క అందచందాలు అవగతమవుతాయి. చదువుతున్న ప్రతీసారి కొత్త కొత్త విషయాలు స్ఫురిస్తాయి. ఇతిహాసాలు చదవకుండా దేన్ని చదివినా అందులో అందాన్ని పట్టుకోలేము. కాబట్టి ఇతిహాసాలు, ప్రాచీన కావ్యాలు, చదివే పుస్తకంపై శ్రద్ధ, కొత్త విషయాలు తెలియడానికి మోడ్రన్ భాష ఇంగ్లీషులోని రచనలు చదవడం వల్ల మంచి విమర్శకులుగా రాణిస్తారు.

ధన్యవాదాలు సార్..సుదీర్ఘమైన మీ సాహితీ ప్రస్థానం, మీ సాహితీసేవ గురించి నేను అడిగిన అన్ని ప్రశ్నలకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, ఇంత విపులంగా, ఓపికగా సమాధానాలు చెప్పినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారాలు ….

ఇటీవలే భూమయ్య గారు రచించిన సమగ్ర సాహిత్యమంతా కలిపి పద్య కావ్య సంపుటి, గేయ కావ్య సంపుటి, భౌమమార్గ విమర్శ సంపుటి వెలువడ్డాయి. సాహితీ విమర్శ మరొక సంపుటి అచ్చులో ఉంది. మహా పండితులైన గరికపాటి నరసింహారావు గారిచే ” ఇది అమ్మవారి మార్గం. అదే అనుమాండ్ల భూమయ్య మార్గం. ఈ మార్గంలో ఆయన చతుశ్శ్రుతి శిఖరారోహణం చేశారు. ఆ క్రమంలో ఋగ్వేద దిగ్వీణా గానమే “వేయి నదుల వెలుగు”. యజుర్వేద యజ్ఞ నిర్వహణమే “వెలుగు నగల హంస” సామవేద సోమపానమే “అగ్నివృక్షం”. అధర్వణ రూపమైన అవభృథ స్నానమే “చలువ పందిరి” అని ప్రశంసించబడ్డారు. అంతటి అసామాన్యులు వీరు… సెలవు.

November 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కుక్కతో మొదలై కుక్కతో ముగిసిన మహాభారత గ్రంథం!!

by N. Uma November 25, 2023
written by N. Uma

ఔనా!!?? అలా ఎలా? అనుకుంటారు సోదరీమణులు కొందరు.

ఔను. అలానే మేము ఇదివరకే చదివాము అంటారు. మరికొందరు తెలియని వారి కోసమే ఈ సేకరణ.

మహాభారతం

ప్రపంచం గుర్తించిన మహాకావ్యం. కులమతాలకు కాలమానాలకు అతీతమైన ఆదర్శ గ్రంథం. వేదవ్యాసుడు 18 పర్వాలలో రాసిన ఈ మహాగ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, కవులు మహా కావ్యమని, ఐతిహాసికులు ‘ఇతిహాసం’ అనీ, పౌరాణికులు ‘పురాణం’ అని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని కొనియాడుతారు. ఈ గ్రంథం వ్యాసమహర్షి చెప్పగా వినాయకుడు తాళపత్రాలపై ‘లక్ష’ శ్లోకాలుగా రచించాడు. దేవతలూ, దేవర్షులూ రాసిన ఈ మహాగ్రంథం (కావ్యం) కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. ఔను ఇది నిజం !! నమ్మశక్యం కాని నిజం.

మహాభారత కథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలయి కుక్కకు జరిగిన సన్మానంతో ముగుస్తుంది. వ్యాసుడు ఎందుకు కుక్కకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? అందులోని దేవరహస్యం ఏమిటి? అందులోని అర్థాన్ని పరమార్థాన్ని నిక్షిప్తంగా దాగి వున్న నిజాన్ని నేను విని మీకు అందిస్తున్నాను.

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు కొంతకాలం హస్తినాపురాన్ని పరిపాలించిన తర్వాత అర్జునుని మనవడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయుడు చక్రవర్తి అవుతాడు. జనమేజయుడు ఒక ‘మహాయజ్ఞం’ చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోనికి దేవతల కుక్క ఐన ‘సరమ’ బిడ్డ ‘సారమేయ’ ప్రవేశిస్తుంది.

సారమేయను చితకబాది జనమేజయుని కుమారులు, బావమరుదులు వెళ్ళగొడతారు. సారమేయ తన తల్లి సరమ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగిన సంగతి చెపుతుంది.

వెంటనే సరమ బిడ్డను తీసుకుని యజ్ఞ ప్రాంగణంలోనికి వచ్చి జనమేజయునితో రాజా నీ కుమారులు నా బిడ్డను అకారణంగా హింసించారు. నా బిడ్డ అంత అన్యాయమేం చేసిందని జరిగింది. జనమేజయుడు తన కొడుకులను పిలిచి విచారించగా యజ్ఞం జరిగే ప్రాంగణంలో కుక్క వస్తే కొట్టక సన్మానిస్తామా? అని పొగరుగా జవాబు చెప్పారు. దానికి తల్లికుక్క సరమ తీవ్రంగా వ్యతిరేకించి రాజా మేము కుక్కలం ఆహారాన్ని ఆశించడం, తిండి ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెదకడం మా స్వభావం. అదిలిస్తే వెళ్ళిపోతాం. ఇంతగా కొట్టడం తప్పుకాదా అని నిలదీసింది. రాజా తప్పు నువ్వు చేసినా నీ బంధువులు చేసినా నువ్వు చేసినట్టే. నువ్వు ఈ దేశానికి చక్రవర్తివి. ప్రజలనే కాదు, సమస్త జీవరాసుల బాగోగులు నువ్వే చూడాలి. ధర్మజ్ఞుడైన ధర్మరాజు మనవడివి. నీ వాళ్ళు అహంకారంతో విచక్షణ కోల్పోయి మూగజీవిని హింసించారు. నా మనసు శోకించింది. నువ్వు అకారణంగా బాధల పాలైతావని సరమ తన బిడ్డ సారమేయను తీసుకుని వెళ్ళిపోయింది.

ఆది పర్వం ప్రథమాశ్వాసంలోని ఘట్టం ఇది.

వ్యాసుడు – రాజులు ఎలా పరిపాలన చేయించాలో కుక్కతో చెప్పించాడు.

ఇక వ్యాసుడు కుక్కకు జరిగిన సన్మానంతో ఎలా ముగించాడో చూద్దాం.

ఈ భూమండలంతో మీ ఋణానుబంధం తీరిపోయింది. మహాప్రస్థానానికి సిద్ధం కండి అని వ్యాసుడు పంచ పాండవులకు ద్రౌపదికి ఆదేశించాడు. నార చీరలు, జింక చర్మాలు ధరించి అంతఃపురాన్ని దాటి పురవీధుల వెంట నడుస్తున్నారు. ఒక ‘కుక్క’ వారిని అనుసరిస్తోంది. ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాజ్యాధికారంలో వున్న పరీక్షిత్తు మిగతా మంత్రులు నగర పొలిమేరల వరకు వచ్చి సాగనంపారు. భారతదేశ ఉత్తరం దిక్కుగా వారి మహాప్రస్థానం సాగుతోంది. హిమాలయాలు దాటి మేరుపర్వతం చేరుకున్నారు. వారిని కుక్క అనుసరిస్తున్నది. మొదట ద్రౌపది తర్వాత వరుసగా నలుగురు తమ్ములూ తనువు చాలించారు. చివరగా ధర్మరాజు అతనితో కుక్క మేరు పర్వతం చేరుకున్నారు. దేవేంద్రుడు రథంతో వచ్చి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానించాడు.

ధర్మరాజు మొదట కుక్కను రథం ఎక్కించమన్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గం చేరాలంటే ఎంతో పుణ్యం చేసివుండాలి. కుక్కలకు స్వర్గలోక ప్రవేశం లేదంటాడు. అప్పుడు ధర్మరాజు మేము హస్తినలో బయలుదేరినప్పుడు ప్రజలు, రాజులు, మంత్రులు, చివరకు నా భార్య తమ్ములు ఒక్కొక్కరుగా నన్ను వదిలేసినా ఈ కుక్క నాతోనే ఇంతవరకూ వచ్చింది. ఏమీ ఆశించకుండా రేయింబవళ్లు నాతోనే వున్నది. ఇంత విశ్వాసం వున్న కుక్క స్వర్గ ప్రవేవానికి అర్హురాలే కదా! నమ్మిన వారిని ద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో, నన్ను నమ్మి ఇంతదూరం వచ్చిన ఈ కుక్కను వదిలి నేను స్వర్గానికి వస్తే అదే పాపం నాకు వస్తుంది కదా ఇంద్రా, అందుకే నేను రాను అంటాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు ధర్మనిరతికి సంతోషించాడు. కుక్క యమధర్మరాజుగా మారినాడు.

ధర్మరాజా ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న వేదోక్తిని కాపాడిన నువ్వు రక్షించినావు. అదే ధర్మం క్కు రూపంలో వచ్చి నిన్ను ఇంతదూరం వచ్చి రక్షించింది అని దేవేంద్రుడు ధర్మరాజును ఇంద్రలోకానికి తీసుకెళ్ళాడు. ధర్మరక్షకుడైన యమధర్మరాజు శునకంగా మారి ధర్మరాజును కాపాడుతూ చివరివరకూ అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాడు. మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు కథ ప్రారంభంలో కుక్కకు అవమానం జరిగినప్పుడు కుక్కతో ధర్మరక్షణ ధర్మనిరతిని చెప్పించాడు.

కథ ముగింపులో కుక్కకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించి కుక్కను శరీరంతో స్వర్గానికి ధర్మరాజు తీసుకెళ్తానన్నాడని ముగించాడు.

November 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఏనుగు మరియు దర్జీ

by ఒద్దిరాజు మురళీధరంరావు November 25, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక చిన్న గ్రామంలో ఒక దర్జీ ఉండెను. అతనికి దేవాలయం దగ్గర చిన్న దుకాణం ఉన్నది. ఒక ఏనుగు ప్రతిరోజు ఇతని దుకాణం ముందునుండి నదిలో స్నానానికి పోతుంటుంది. ఆ దయగల దర్జీ దానికి అరటిపండ్లో లేక కొబ్బరికాయనో లేక బెల్లమో ఇస్తుండేవాడు. ఆ ఏనుగు ఆ వస్తువులను అతని చేతినుండి తీసుకుని తొండముతో దీవించేది. ఆ ఏనుగుకు ఆ దుకాణం ముందు ఆగి ఎదురు చూడడం అలవాటయ్యింది.

ఒకనాడు దర్జీ ఏదో చిరాకులో ఉన్నాడు. యథాప్రకారం ఆ ఏనుగు అతని దుకాణం ముందుకు వచ్చి నిలబడింది. ఆ దర్జీ దానికి ఏమీ ఇవ్వలేదు. ఏనుగు చాలా ఓపికగా నిలబడింది కానీ దర్జీ కనీసం దానివైపు కూడా చూడలేదు. ఏనుగు ఏదో ఒకటి తినేందుకు దర్జీ ఇవ్వాలని లాశిగా ఘీంకరించింది . ఇది దర్జీకి బాగా కోపం తెప్పించింది. అతను ఒక సూది తీసుకుని దాని తొండాన్ని గట్టిగా కుచ్చాడు. పాపం ఆ ఏనుగు చాలా బాధపడి వెళ్ళిపోయింది. దానికి దర్జీ ఎందుకు ఇలా చేసాడో అర్థం కాలేదు. కానీ అతనికి తగిన పాఠం చెప్పాలని నిశ్చయించుకుంది.

మరునాడు ఆ ఏనుగు స్నానానికి నదికి వెళ్ళింది. తిరిగి వస్తున్నపుడు దాని తొండం నిండా బురద నీరు నింపుకుంది. ఆ దర్జీ దుకాణం ముందు ఆగి బురద నీరంతా దుకాణంలోని కొత్త బట్టలపై కుమ్మరించింది. ఈ చర్యతో దర్జీ తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అతను మరల ఏనుగుతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఏనుగు దర్జీ దుకాణం వైపు వెళ్ళడం మానేసింది.

నీతి : మనం జంతువులను హింసించకూడదు.

November 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us