మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

డియర్ ఫ్రెండ్

by Nandiraju padmalata January 1, 2023
written by Nandiraju padmalata


“హాయ్ అప్పూ…!”
“ఏంటే దివ్యా? గుర్తున్నానా అసలు? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? పదిసార్లు ఫోన్లు, వాట్సాప్ మెస్సేజీలు. ఊహూ…! ఒక్కదానికీ జవాబివ్వలేదు. రెండేళ్లయింది! ఏమయ్యావే నువ్వూ ?”
“తీరిగ్గా మాట్లాడదామని ఊరుకున్నా…! ఇన్నాళ్ళకి దొరికింది తీరిక. గుర్గావ్ లో ఉన్నానే! నువ్వు?”
“నీకేమ్మా? ఎం టెక్ పూర్తి కాకుండానే క్యాంపస్ లో వచ్చింది, ఆ తర్వాత మంచి ఎమ్మెన్సీలోనూ కొట్టావు జాబ్. మేమేముందీ…? ఉన్న ఊళ్ళోనే చిన్న ఉద్యోగం. చెప్పు. చెప్పు…! కొత్త వార్తలేంటే?”
“అప్పూ…అది చెబుదామని ఫోన్ చేసానే! జాబ్ చాలా బావుంది. డేటా సైన్స్ మీద. మంచి హైక్ కూడా ఇచ్చారు. నేనో విషయం చెప్తానే అప్పూ….ఎవరికీ చెప్పకు! గుర్గావ్ లో నేను లివిన్ రిలేషన్లో … అదేనే, సహజీవనం. నా డేట్ సంజయ్ అని, జార్ఖండ్ అబ్బాయి. మంచోడు. పడి చస్తాడు నేనంటే…!”
“అమ్మో….! మీ ఇంట్లో తెలుసా దివ్యా?”
“నీ మొహం! ‘నీ ఒక్కదానికే చెప్తున్నా’ అన్నాను కదే…! మా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో తేలనీ….అప్పుడు చెప్తా ఇంట్లో…! అయినా మా అమ్మా నాన్న ఒట్టి పాతకాలపు మనుషులు. ఒప్పుకోరు.. అఫ్ కోర్స్ ! నేను నా ఇష్టప్రకారమే చేసుకుంటాననుకో!”
“అయ్యో…! ఇదేంటే బాబూ..? ఖర్మ కాలి, కొంప మునుగుతే?”
“.నువ్వెక్కడ దొరికావే అప్పూ? ఏ కాలంలో ఉన్నావ్? జాగ్రత్త పడుతున్నాలే ..! ఊ…..నీ సంగతేంటి? “
“నాకేముంటాయ్ విషయాలు? పెళ్ళికొడుకు హంట్ లో ఉన్నారు అమ్మానాన్నా..”
“ఏంటి? ఇంకా ఎవరూ ప్రొపోజ్ చేయలేదా అప్పూ….? నిజం చెప్పు!”
“అంత సీన్ లేదులే ఈ జన్మకి . ‘ఏమంత అందాలు కలవనీ? వస్తాడు నిన్ను వలచీ? ఏమంత సిరి ఉంది నీకనీ వచ్చేను నిన్ను తలచీ? చదువా! పదవా! ఏముంది నీకు? సడి చేయకే వెర్రి మనసా?’ వేటూరి సుందర్రామ్మూర్తి గారు నా గురించే రాసుంటారనుకుంటా! చెప్పు..చెప్పు…! నువ్వే చెప్పవే సంజయ్ గురించి!“
“హి ఈజ్ ఏ గుడ్ గై…పాపం! ఈ కరోనా గోలతో, తన జాబ్ పోయింది. ఏడాది నుంచీ, నా జీతంతోనే బ్రతుకుతున్నాం. . వాడు ఆర్కిటెక్ట్ లే! జీతాలు బాగానే వస్తాయి కానీ, పోస్ట్స్ తక్కువగా ఉంటాయి. చాలా ట్రై చేస్తున్నాడు జాబ్ కోసం.”
‘మరి! వాళ్ళ వాళ్లకి తెలుసా దివ్యా? వాళ్ళొప్పుకుంటారా మీ పెళ్ళికి?”
“ఛస్తే ఒప్పుకోరు. ఇంకా, పాత కాలంలాగా మాట్లాడతావేంటి అప్పూ…వి ఆర్ మేజర్స్. చదువుకుని, ఇండిపెండెంట్ గా ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ కూడా, అమ్మకి నాన్నకీ, తాతలకీ, అవ్వలకీ భయపడుతూ కూర్చోవడమేంటే…? రబ్బిష్. మా ఇద్దరికీ ఆ భయమేం లేదులే! అందుకే, ముందు మేం ఒకళ్ళకి ఒకళ్ళం సెట్ అయితే, అప్పుడు, పెళ్లి చేసుకుని చెప్పేస్తాం ఇద్దరి వైపు పెద్దవాళ్ళకి.”
“సెట్ అవకపోతే?”
“కోయీ ధిక్కత్ నై ! బ్రేకప్ …! అంతే….! లోకం చాలా పెద్దది…వీడు కాకపొతే మరోడు….!”
“అలా ఎన్నాళ్ళు?”
” తగిన వాడు దొరికేదాకా…..! నాకేం తక్కువే? అందం, చదువు, ఉద్యోగం, ఎట్రాక్టివ్ ఫిజిక్…తోక ఊపుకుంటూ వస్తాడెవడైనా…. హ…హ…హా…!”
“దివ్యా….! అలా నవ్వకే బాబూ…! నాకు భయమేస్తోంది. జీవితంలో ఎన్నిసార్లని ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తావు? మగాడికేం? దులిపేసుకుని వెళ్ళిపోతాడు. మనం అలా కాదు కదే సిరీ…..! మన శరీరమేమైనా డబుల్ కాట్ బెడ్డో, సోఫా సెట్టో కాదు కదా, పాతది మార్చి కొత్తది కొనడానికి? అసలు పెళ్ళీ వద్దు, పిల్లలూ వద్దు అనుకుంటే సరే గానీ, కావాలి అనుకుంటే అప్పుడెలా? నీలాగే లివిన్లు, బ్రేకప్స్ అయినవాడే దొరికి, తీరా పెళ్లి చేసుకున్నాక వాడు నిన్నొదిలేసి వెళ్ళిపోతే? నీకు పిల్లల్ని కనే వయసు దాటిపోతే?”
“పోనీ….!”
” అప్పటికే పిల్లలు పుట్టి ఉంటే?”
“పుట్టరు.”
“ఒకవేళ పుడితే? అదే……. పొరపాటో, గ్రహపాటో కావచ్చు…అప్పుడెలాగే?”
“ఏ పాటు పడో వదుల్చుకుంటాను. అయినా, అలా జరగదు!”
“ఏమో…? నీకే…అమ్మనవాలని ఆశ పుట్టిందనుకో! నువ్వే అనేదానివి కదా, ‘ఒపీనియన్స్ వుడ్ ఆల్వేస్ ఛేoజ్’ అని. అలా జరిగితేనో?”
“అబ్బా….! అప్పూ డార్లింగ్….! నా పిల్లలు కదా వాళ్ళు…! నా లాగే లిబరేటెడ్ సోల్స్ లాగా బ్రతుకుతారు. సరేనా…సతీ సావిత్రీ ?”
” కానీ….వాళ్ళు బ్రతకబోయే ప్రపంచం లిబరేట్ అవలేదు దివ్యా! నీ అంత ఇంటెలిజెంట్ని కాదు గానీ, పెళ్లి అనేది మన ఆడవాళ్ళకి పెద్ద భద్రత. చాలా బాధ్యతలని మనం భర్త మీద పెట్టేయొచ్చు. పెళ్లయిన ఆడవాళ్ళ మీద సొసైటీ కి గౌరవం, నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు. వాళ్ళు ఏ ఒత్తిడి లేకుండా పెరుగుతారు. నువ్వు అనొచ్చు, ‘పెళ్లి ఒక కాంట్రాక్టు, సర్దుకుపోయి బ్రతకాలి’ అని. కానీ, ఆలోచించవే! ఈ సంజయ్ గానీ, మరోడు కానీ నీకు సంపాదన లేని రోజున, నీ ఆరోగ్యం పాడైన రోజున నీకు తోడుంటాడని చెప్పగలవా? ఇప్పుడున్న అందం, వయసు పెరిగాక ఉండదు కదే…? మరో విషయం కూడా కూల్ గా ఆలోచించవే! ఈ సంజయ్ తో బ్రేక్ అప్ అయిపోయాక మరో అజయో, విజయో దొరక్కపోడు నీకు. కానీ, అతగాడికి నీలాంటి దివ్యలతో అప్పటికే బ్రేకప్ అయిపోయి, ఒకటో, రెండో ఇష్యూస్ ఉండి వుంటే, అది మరో తలనొప్పి కదే! కట్టుకోక పోయినా, తన బిడ్డల తల్లి పట్ల అతనికి బాధ్యత ఉంటుంది కదా! అప్పుడెలా? అప్పుడెలాగే దివ్యా? నీ స్టేటస్ ఎప్పటికీ మిస్ట్రెసే! చూడు…! పెళ్లి అనేది ఒక బంధం. నువ్వు బంధనం అన్నా నాకేం బాధ లేదనుకో. నూరు శాతం సుఖం ఉంటుందనను, కానీ, ఎక్కడో తప్ప, అభద్రత ఉండదు. మనకి మన తల్లిదండ్రులు, అత్తమామలు తోడుగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. అసలు, పెళ్లి అంటూ ఒకటయిపోతే, ‘అమ్మయ్య ఓ పనయిపోయింది బాబూ’ అనుకోవచ్చు.!……. ఏయ్ దివ్యా? ఏంటి మాట్లాడట్లేదు…?ఉన్నావా!.సుత్తి కొడుతున్నానని ఫోను పెట్టేశావా? .”
“నో…వింటున్నా….! ఆలోచిస్తున్నానే అపూర్వా!”
” సారీ దివ్యా …! బాధపెట్టినట్లున్నా….!”
“కాదు…! ఆలోచనలోకి నెట్టావు. నిజానికి నేను నీకు ఫోన్ చేసింది, ‘నేను హైదరాబాద్ కి రిలొకేట్ అవుతున్నాను, ఒక ఫ్లాట్ చూసి పెట్టు’ అని అడుగుదామని. నీ మాటల వలన నన్ను నేను రివైవ్ చేసుకోవాలేమో అనిపిస్తోంది. భయపడడం లేదులే గానీ, జాగ్రత్త పడాలేమో! ఏమోనే! అయామ్ కన్ఫ్యూజ్డ్ నౌ .”
” నిన్ను అలజడికి గురి చేసినందుకు ‘సారీ’ మరో సారి! నీ కోసం తప్పకుండా మా కమ్యూనిటీ లోనే ఫ్లాట్ చూస్తానే! నిన్ను బాధ పెట్టానేమో!”
” కాదులే….! నేనంటే ఏంటో, నాకేం కావాలో నిర్ణయించుకోవాలని, త్వరగా సంజయ్ తో కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలని అనిపిస్తోందిప్పుడు. థాంక్ యు అప్పూ …! మళ్ళీ చేస్తా నీకు ఫోన్.”
***

” హల్లో…!అమ్మా….!అపూర్వా…! మా దివ్య..మాట్లాడిందామ్మా? నీ మీద చాలా పెద్ద భారం పెట్టానమ్మా!”

“అంకుల్…ఒక ఫాదర్ గా మీ భయం తెలుసు నాకు. దాని టెన్త్ క్లాస్ నుంచీ అమ్మా, నాన్నా మీరే అయి దివ్యని ఎంత గారాబంగా పెంచారో కూడా నాకు తెలియనిది కాదు. కానీ మీ నుంచి తాను దాచిన ఇంత ముఖ్యమైన విషయాన్ని, అదే …. తన ఎఫైర్ గురించి మీకు తెలిసినా , తనతో నేరుగా మాట్లాడకుండా, నాతో డిస్కస్ చేసిన కారణం అర్థమయింది. తన మనసు బాధ పడడం మీరు భరించలేరు. తొందరపడి తప్పటడుగు వేయకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో మీ అమ్మాయి సుఖంగా వైవాహిక జీవితం గడపాలన్న మీ ఆరాటమూ తెలిసింది. నా ప్రయత్నం నేను చేశాను అంకుల్. దివ్య చాలా తెలివైనది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే నా నమ్మకం. “
” నా ఆశ అదే…! దివ్యమ్మ బావుండాలి. సంతోషంగా ఉండాలి. యోగ్యుడైన వాడిని తనే ఎంచుకుని ‘నాన్నా! నేనితన్ని ప్రేమించాన’ని అంటే నిరభ్యంతరంగా పెళ్లి చేస్తాను. కల్లబొల్లి మాటలకు లొంగిపోయే అమ్మాయిల్ని సర్వ నాశనం చేస్తున్న కిరాతకుల్ని, చూస్తున్నాం కదా మీడియా లో..! అందుకే…!భయమేస్తోంది. థాంక్యూ తల్లీ…!గాడ్ బ్లెస్ యు!”
“ థాంక్యూ అంకుల్ . నేను దివ్యతో టచ్ లోనే ఉంటాను. మీరు దిగులు పడొద్దు. బై అంకుల్…”

సరిగ్గా పదిహేను రోజుల తర్వాత, అపూర్వ కి దివ్య నుంచీ వచ్చిన ఫోన్ కాల్,
“ అప్పూ…!డియర్ ఫ్రెండ్….!శుభవార్త. సంజయ్ కి కూడా హైదరాబాద్ లో ప్లేస్ మెంట్ వచ్చింది. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మేం చర్చించుకున్నాం. తర్వాత ఇద్దరం జంషెడ్ పూర్ వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాం. ఇంక మా నాన్నతో మాట్లాడాలి. విష్ మీ ఆల్ ద బెస్ట్.”
“ అంతా మంచే జరుగుతుంది…అప్పూ…! మరో వసతి అవసరమేమిటి నీకు? మీ నాన్నగారు నీకోసం బుక్ చేసిన అపార్ట్ మెంట్ సిద్ధంగా ఉండగా….? తొరగా వచ్చెయ్యి….ఆల్ ది వెరీ వెరీ బెస్ట్!”

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

రంగు వెలసిన చిలుక

by Arutla Sridevi October 10, 2022
written by Arutla Sridevi

ఒక చిలుక అల్లనేరేడు చెట్టుపై పండ్లు తింటూ ఓ కొమ్మపై కూర్చుంది. ఇంతలో ఒక సాధువు ఆ చెట్టు కిందికి వచ్చి తన శిష్యులతో తీర్థ యాత్ర స్థల విశేషాల గూరి చర్చిస్తున్నాడు. ఆ సాధువు శిష్యులతో పాటు కొమ్మమీద చిలుక కూడా ఆ యాత్ర విశేషాలను వింటున్నరు. ఆ చర్చలో మానస సరోవరం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ చర్చంతా విన్న చిలుక తెల్లవారు ఝామున్నే లేచి భగవంతుడికి దండం పెట్టుకొని మానస సరోవర యాత్రకు బయలుదేరింది.

చిలుక ఎగురుతూ ఎగురుతూ అలిసిపోయినప్పుడల్లా కొంత విశ్రాంతి తీసుకుంటూ మొత్తానికి మానస సరోవరం చేరింది. ఆ సరోవరంలోని నీళ్లు తళతళ మెరుస్తున్నాయి. అంత స్వచ్ఛమైన నీళ్లను అది ఇదివరకటి కెన్నడు చూడలేదు. అది ఆశ్చర్యంలో నుండి తేరుకోకమునుపే, మరింత ఆశ్చర్యాన్ని గొలిపే హంసలు దానికి కనిపించాయి. అవి తెల్లటి ముత్యాల రాసుల లాగ ఉ న్నాయి. చిలుక వాటి దగ్గరగా చేరి మీరెవరని ప్రశ్నించింది. మేము హంసలమని చెప్పాయనిం మిరెప్పట్నుంచి ఇక్కడుంటున్నారని అడిగింది చిలుక మేము పుట్టినప్పటి నుండి ఇక్కడ ంటున్నామని చెప్పాయవి. చిలుకకు హంసల లాగ తానూ తెల్లగా మారాలని అనిపించింది. అందుకు చిలుక బాగా ఆలోచించి ఈ శరీరాన్ని ఈ సరోవరంలో బాగా నానబెడితే నేను తెల్లగా అవుతానని సరోవరంలో మునిగింది. కానీ కొంత సేపటికే ఊపిరాడక కొన ఊపిరితో మునిగిపోసాగింది. ప్రమాదాన్ని గమనించిన హంసలు ఎట్లనో అట్ల దాన్ని రక్షించాయి. హంసలు చిలుకతో హితవు పలికాయి. “ఒసే చిలుకా ప్రకృతిలో ఎవరి రంగువారిదే దేని అందం దాని ఇప్పుడు నీ రంగుకేమయిందని ఈ ఉబలాటం” అన్నాయి హంసలు. జలుబుతో పడిసు పట్టి దగ్గుతున్న చిలుకకు ఒక హంస కరక్కాయ తెచ్చిచ్చింది. అది తిన్న చిలుక ఒక రెండి మూడు రోజుల్లో బాగా కోలుకుని తన ఇంటికి తిరుగు ప్రయాణమయింది.

తన నివాసమైన అల్లనేరేడు చెట్టుపై కూర్చున్న చిలుకకు మనసులో మనసులేదు. ఎక్స్ సరే తాను తెల్లగా మారాలన్న కోరికను అది అణచివేసుకోలేకపోతుంది. అక్కడికి ఒక మీటరు దూరంలో చిత్రావనంలో ఉన్న చింత చెట్టుపై కొంగాదేవి ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తు చిలుకకు ఈ విషయం తెలిసింది. అది వెంటనే కొంగదేవి దగ్గరకు వెళ్లి తెల్లరంగులోకి మా

లతను తెలిపింది. అసలే గిరాకీ తక తరంగాలను ఉత్సాహంగా చిలుకను రంగులోకి మార్చే ప్రక్రియకు అనుకుంది. అక్కడి బ్యూటివారలకు అలంకరించి తెల్లగా, చక్కగా పాలుగా ఉన్న బాతుల, కొంగల చిత్రపటాలు చూసిన చిలుకకు కాంగాదేవి తనను తప్పక అందంగా తీరి దిద్దుతామన్న నమ్మకం కుదిరింది.

కొంగాదేవి ప్రక్కనే ఉన్న పసుపుతోట నరనే ఆరబోసిన పసుపు కొమ్ము తెచ్చి ముత్యం పొడిచి, పొడిచి దానిలో నుండి రసం తీసి చిలుకకు బాగా పూసింది. అయితే ఆ వనువు తోట

వసువులు బడ పట్టకుండా ఒక విషపూరితమైన మందు చల్లుడు. ఈ విషయం కొంగాదేవికి అయడు. అంత సపటి తర్వాత పక్కనే ఉన్న చెలువులో స్నానం చేసిరమ్మని చిలుకకు కొంగాదేవి చెప్పింది. అలాగే స్నానం చేసి వచ్చింది చిలుక, పక్కనే బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని భయపడిపోయింది చిలుక. ఎందుకంటే చిలుక తెల్లరంగుకు మారకపోగా ఉన్న ఈకలు కూడా ఉండిపోయాయి. చిలుక లబోదిబో మొత్తుకుంటూ డా॥ “గద్ద” గారి దగ్గరకు వెళ్లింది. డా॥ ఉంది” గారు చిలుకను బాగా పరిశీలించి నీకు స్కిన్ థెరఫీ చేయాలి అందుకు బాగా ఖర్చవుతుంది. ఎంతలేదన్నా నువ్వు నెలకు సరిపడా తినే పండ్లు మొత్తం నాకు తెచ్చివ్పాలి అన్నది. చిలుక శరీరపు మంటకు ఓర్చుకోలేక “గద్ద” తో “సరే” అని ఒప్పుకున్నది. డా|| “గద్ద” ట్రీట్మెంట్

మొదలు పెట్టింది. గద్ద దగ్గరలో గల పట్టణానికి వెళ్లింది. అక్కడ ఒక భవనానికి రంగులు వేస్తుంటే దానికి ఆకుపచ్చరంగు కనిపించింది. వెంటనే ఆ ఆకుపచ్చరంగు తెట్టి చిలుకకు బాగా పూసింది. చిలుక మళ్లీ బావి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది తిరిగి తన నివాసమైన అల్లనేరేడు చెట్టు దగ్గరకు వచ్చింది.

పక్క చెట్టుపైన ఏదో కోలాహలం అదేమిటని తెలుసుకుంది. చిలుక, కోకిలమ్మ గానసభ అట. అన్ని పక్షులతో పాటు చిలుక కూడా గాన సభకు పోయి కూర్చుంది. కోకిల గానం

మొదలయింది. అందరు మైమరిచి గానం వింటున్నారు. అందరు కోకిలను బుగా మెచ్చుకున్నాడు కానీ చిలుకకు మాత్రం కోకిలపై ఈర్ష్య కలిగింది. పు. గొంతు బాగుంటే చాలునా నాలాగా నీతో

అందమా, చందమా ! నల్లగా ఎట్లున్నావు నువ్వు అబ్బ బీ.. ఛీ.. నాకసలు నీ దగ్గరే ఉండబుట్టి కావడం లేదు అంటూ కోకిలను అవమానపరిచింది. పాపం కోకిల చిన్నబోయింది ఇంతలో కాలివానలతో కూడిన వర్షం పడింది. ఆ వర్షంలో చిలుకకు పూసిన రంగు రాస్తపోయిం! “టు సచ్చగా కాక, ఇటు నల్లగా కాక అసహ్యంగా ఈ కలూడిపోయిన దాని చర్మ సొందరా చూసి పక్షులన్ని పకపక నవ్వాయి. తానెప్పుడూ అలా ఇతరులను అవమానించకూడు రయించుకున్న చిలుక శివుని ధ్యానించడానికి హిమాలయాలు కొన్ని రోజులు వెళ్ళింది.

October 10, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

జీవితం ఒక నిట్టూర్పు

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు October 6, 2022
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

నీలాకాశం…. చుక్కల కలలు

ఎగిసిపడే సెలయేటి తరగలు

అద్దంలో చందమామ

జోలపాటలతో విరుస్తున్న

మొలకనవ్వుల నిదుర

జీవితం ఎంత సుందరం?

ఎదలో ఏవో తెలియని తుమ్మెదలు

ఆకుపచ్చని పాటల విందులు

స్వప్నాలు… పరిష్వంగాలు

ఒక్కసారి మోగుతున్న కోటి వీణలు

జీవితం ఎంత సుందరం?

వెలుగును చీకటిగా చీకటిని

వెలుగుగా చిత్రించే పెదాలు

అధరాలకు వేలాడే ప్రభాతాలు

నగరీకరించబడే పసిపల్లెలు

జీవితం ఎంత వంచన?

రెండు గాళ్లకు మరొకటి…

వదలివేసిన స్టేయిరిక్ దీపాలు

చుట్టుముడుతున్న అజ్ఞాత బీభత్సం

అశాంతి అవమానాలతో

నిస్సహాయ సహగమనం

జీవితం ఎంత విషాదం?

చివరికి ఏమయింది?….

విప్లవ శంఖం మూగవోయింది.

అక్షర తపస్సు కొట్టుకొనిపోయింది

అధికారపు అహంకారం పెనవేసుకున్న బతుకు

కందెన లేని గీరె అయింది

ఇక జీవితమే ఒక నిట్టూర్పు

  • డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు, 9676096614

Life Is a Sigh!

Blue sky, stars dreams
Soaring ripples of rill
Moon in the mirror
Slumber of sprouting smiles 
being blown by lullabies.
How charming is life!
Some unknown bumblebees in heart
Feasts of verdant songs
Dreams, embraces
Lakhs of lutes 
ringing simultaneously.
How beautiful is life!
Lips depicting light as darkness; 
darkness drawing the picture of light.
Dawns dangling from lips; 
small villages turning into towns.
How deceitful is life!
Walking stick joined two legs; 
steric lights are abandoned.
Unknown terror all around!
Walking helplessly 
along with disquiet, disrespect.
 How tragic is life!
What is the end result?
The conch of revolution 
has fallen silent.
The penance of syllables 
got swept away.
The life entwined with 
hauteur of authority became
a cartwheel sans grease.
Now, life is but a sigh!

Origin (Telugu): Dr. Kanchanapalli Govardhan Raju
Translation: Elenaaga

a

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ప్రమీల ధైర్యం

by ఆచార్య మస‌న‌ October 6, 2022
written by ఆచార్య మస‌న‌

ప్రమీల కథావాహిని యధార్థమైన కథ

అర్థరాత్రి దాటుతున్న సమయం.

డోరుమీద లాఠీ దెబ్బలు…. నేను అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాను. నా అర్థాంగి ప్రమీల అకస్మాత్తుగా లేచి డోరు తీసిఁది. కళ్ళముందు ఎర్రటోపీలు. ఎందుకొచ్చారని ప్రశ్నించింది ధైర్యంగా. అందుకు వారి సమాధానం భయం కలిగించేదిగా కాక వినయపూర్వకంగా వెలువడడం విశేషం. బహుశా ప్రమీల ఆకారాన్ని చూసి నమ్రతను ప్రదర్శించారని చెప్పవచ్చును.

“ఓయూలో రైడింగ్ జరుగుతోంది. హాస్టళ్ళలో నాన్ బోర్డర్లు ఎక్కువయ్యారు. మా నుంచి తప్పించుకుని ఒక బోర్డరు మీ ఇంట్లోకి ప్రవేశించినట్టు అనుమానం. అతడు ఒకవేళ ఇంట్లో ప్రవేశిస్తే మాకు అప్పజెప్పండి.”

“అబ్బే… ఏ విద్యార్థీ మా ఇంట్లోకి రాలేదు. మీరు వెళ్ళొచ్చు!” తలుపులు మూసి గదిలోకి వచ్చి నా పక్కన చేరింది. ఏదో అలికిడి అయి నేను నిద్రలేచాను. తన నోటి నుంచి “ఏమండి! మీకు తెలుసా?” అని ఏదో చెప్పబోయింది. భయంతో లేచి కూర్చున్నాను. ఆమె పాఠం బట్టీ పట్టిన పిల్లవాడిలా విషయాన్ని అప్పజెప్పింది.

మీరు ఈటూ (E2) హాస్టల్ కు వార్డెన్ గా ఉన్నారు కదా…. దానిమీద ఈ రోజు రైడింగ్ జరిగింది. నాన్ బోర్డర్లు తప్పించుకుని చెల్లా చెదురయ్యారు. పోలీసులు మాత్రం వెంటాడి కొందరిని పట్టుకున్నారు. అందులో విష్ణు అనే అబ్బాయి వాళ్ళ నుండి తప్పించుకున్నాడు.”

“అవును… నల్లగా, పొట్టిగా, అమ్మవారి మాన్చలతో చూడడానికి వికారంగా ఉండే విద్యార్థి విష్ణమూర్తి. అతడు ఏదో ప్రయివేటు కాలేజీలో ఎంబీఏ చేస్తున్నాడు. నగరంలో ఎక్కడా వసతి లేకపోవడంవల్లా, పేదరికంవలా్ల చాలామంది విద్యార్థుల్లాగే ఈటూ హాస్టల్ లోని ఒక గదిలో నాన్ బోర్డర్ గా ఉన్న విషయం నాకప్పటికి గుర్తుకు వచ్చింది.

“ఆ విష్ణమూర్తి ఇక్కడికి వచ్చాడా?”

“అవును…! అతడిప్పుడు మిద్దెమీద పడుకున్నాడు. అసలేం జరిగిందో వినండి. పోలీసులు రావడానికి ఒక అరగంట ముందు ఒక అబ్బాయి తలుపు తట్టాడు. మీ పేరు చెప్పాడు. పోలీసులు తరుముతున్నారని, ఇంట్లోకి రానివ్వండని కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే నేను తలుపు తీసి గడియ వేశాను. “ఏమైనా తిన్నావా” అని అడిగాను. తిన్లేదన్నాడు. కొద్దిగా అన్నం ఉంటే పెట్టాను. చల్లతో భోజనం ముగించాడు. వెళ్ళిపోతావా అని అడిగాను. అమ్మా… చాప ఇస్తే మిద్దెమీద పడుకుంటానన్నాడు. ఇది నేను పోలీసులు రావడానికి ముందు చేసిన పని అని వివరించింది.

నా అర్థాంగి ధైర్యానికి నేనెంతో మురిసిపోయాను.

ఫలశ్రుతి: ఇప్పుడా విష్ణమూర్తి సెంట్రల్ గవర్నమెంటులో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఇది జరిగి ఇరవయ్యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ విష్ణమూర్తి ప్రతీ పండగకీ ఫోన్ చేస్తాడు. “అమ్మ బాగుందా” అని అడుగుతాడు.  ఇరవయ్యేళ్ళుగా నా ఆరోగ్యాన్ని, ప్రమీల ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. మొన్న మే లో కూడా అతడు ఫోన్ చేసి అమ్మ బాగుందా అని అడిగాడు. అతని ఫోన్ కాల్ కు ముందే ప్రమీల పరలోకానికి చేరింది. విష్ణమూర్తి మరొక మాట మాట్లాడలేదు. మర్నాడు నా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడో పంజాబ్ లో పనిచేస్తున్నవాడు ప్రమీల మరణవార్తను విని జీర్ణించుకోలేకపోయాడు. ఉన్నపాటున రైలెక్కి, మా ఇంటికి వచ్చాడు. అతనికి ఇంట్లో గోడమీద వేలాడుతున్న ప్రమీల ఫోటో నవ్వుతూ కనిపించింది. కానీ అతడు మాత్రం దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు.

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అవును ఆమె అమ్మ 

by Ramadevi Kulkarni October 6, 2022
written by Ramadevi Kulkarni

గుడిసెబయటవాడు 

గుక్కపెట్టిఏడుస్తుంటే  

గుడిసెలోపలఆమె 

పాలకోసంపాపంచేస్తుంది  

బిడ్డకోసంఏదైనాచేసేస్తది

అవునుఆమెఅమ్మ…..!

గడపలోపలకనబడనిహింసని 

కొంగులోదోపుకుని  

ఇల్లాలిసంతకంచేసేసి

పిల్లలకోసంభరించేస్తది 

అవునుఆమెఅమ్మ ….!

బాసురంకెలేసి  

బేజారుచేస్తుంటే 

లంచ్బాక్సుబ్యాగులో 

మూలుగుతుంటే

ఆరైందనిఉరికిఉరికి 

ఇల్లుచేరివంటింట్లోదూరి  

పిల్లలకువండివార్చి  

తానొకమెతుకైనాగతకలేదని   

యాదిమరిచిపోతది 

అవునుఆమెఅమ్మ …!

మాటవిననిబిడ్డకు 

బుద్దిచెప్పమని  

నాన్నకుఫిర్యాదుచేసి 

తీరాఅయ్యకొడితే 

ఓర్వలేకవెక్కిఏడుస్తది  

అవునుఆమెఅమ్మ ….!

గిన్నెఖాళీఅయి 

చికెనంతఅయిపోతే  

కడుపుమంచిగలేదని  

సల్లపోసుకునిసర్దుకుతింటది

అవునుఆమెఅమ్మ…..!

తాగితందనాలాడి  

తల్లిదండ్రులనుతరిమికొట్టినా  

నానాబాధలుపెట్టినా

నాకొడుకుబంగారం 

ఎవరోచెడగొట్టిన్రుఅని 

మందినిఆడిపోసుకుంటది  

అవునుఆమెఅమ్మ ……

కట్టుకున్నోడుకనికరంమరిచినా

దేశాలుపట్టుకుపోయినా 

వాడిదారివాడుచూసుకున్నా  

కూడుగుడ్డలేకఅల్లాడితే  

సాకలేకదిగాలైపోతే  

పిల్లలనుబాయిలోవేసి 

తానుకూడాదూకుతది  

పిల్లలనుఆడకూడాఇడవది

అవునుఆమెఅమ్మ …….!

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సాహిర్ లూథియాన్వి అనువాద కవితలు

by Geethanjali October 6, 2022
written by Geethanjali

ఆ అరుణోదయం..తప్పక వస్తుంది..! (ఓ శుభహ్ కభీ తో ఆయేగి !- ) –సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం–గీతాంజలి.
–––––—————————–
ఇన్ని చీకటి యుగాల నిరీక్షణ తరువాత…రాత్రి పరదాలు కూడా తొలిగాక..
దుఃఖపు మేఘాలు సాంతం కరిగిపోయాక.. అప్పుడు సంతోషపు సముద్రాలు పొంగిపొర్లుతాయి.
ఆకాశం నృత్యం చేస్తుంది.. ఈ భూమి పాటలు పాడుతుంది…
ఇక చూడు..ఆ ఉదయం తప్పక వస్తుంది.

ఏ రోజు కోసమైతే మనం క్షణం క్షణం మరణిస్తూ బతికామో.. ఏ రోజు కోసం..అమృతం లాంటి కాలాల్లో కూడా విషాన్ని గుక్కలు గుక్కలుగా గుటకలు వేశామో..
ఆ రోజు..
ఆకలి..దాహం గొన్న మన ముంగిళ్లలో మనం కోరుకున్న ఉదయం మెరిసిపోతూ నిలుస్తుంది !

నిరాశ పడకు మిత్రమా..
ఇప్పుడు కనీసం భూమికున్న విలువైనా రక్తమాంసాలున్న మనిషికి లేకపోవచ్చు గాక !
మన ఆకాంక్షలకూ కనీస గుర్తింపు లేకపోవచ్చు.
కానీ ఏదో ఒకనాడు ఈ భూమ్మీద..మనిషి గౌరవాన్ని అబద్ధపు ధనంతో కొలవని రోజు మాత్రం తప్పక వస్తుంది.

ఎప్పుడైతే… పాపపు డబ్బు కోసం ఆడదాని శరీరం అమ్మ బడదో..
ఎన్నడైతే ఆమె ఆకాంక్షలు నలిచి వేయ బడవో…
ఆరోజు వచ్చినప్పుడు.. ఈ నిస్సిగ్గు సమాజం సిగ్గుతో చితికిపోతుంది.
ఆ ఉదయం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది.

అయితే వినండి .,
ఆ ఉదయాల్ని మేమే తెస్తాం !
తెచ్చి తీరుతాం..
అది మా వల్లే సాధ్యం అవుతుంది !

ఏ రోజైతే భూమి తిరగ బడి ప్రతిజ్ఞ చేస్తుందో..నిరపరాధులు జైళ్ల నుంచి విముక్తమవుతారో..
పాపపు గృహాలు బద్దలు అవుతాయో.. అన్యాయపు శృంఖలాలు తెగిపోతాయో..
ఆ ఉదయాల్ని మేమే తెస్తాము!
ఏ సమాజంలో అయితే నేరస్థులు పోషింపబడరో…
ఎక్కడైతే పిడికిలి బిగించి నినదించే
చేతులు ఖండించబడవో.. ఎక్కడ ఆత్మ గౌరవంతో నిటారున నిలబడ్డ శిరస్సులు అణిచివేయబడవో..
ఎప్పుడైతే ..జైళ్లు..బందీలు లేని ప్రజా స్వామిక పరిపాలనలో ఉంటామో..
ఆ ఉదయాన్ని మేమే తెస్తాం.

ఏ రోజైతే …. పొలాల్లోంచి రైతుల.. మిల్లుల నుంచి కార్మికుల శ్రమకు సమాజంలో సరైన విలువ కట్టబడుతుందో ..
నిస్సహాయులైన..గూడు లేని బీద జనం అంతా ఉపిరాడని బిలాల్లాంటి ఇరుకు ఇళ్ళల్లోంచి బయట పడతారో ..
అప్పుడు… నిజంగానే ఆ క్షణాల్లో.. లోకం అంతా శాంతీ..సంతోషాలనే పుష్పాలతో అలంకరించుకుని హర్షాతిరేకలతో మునిగిపోతుంది.. ఆ అరుణోదయాల్ని మేమే తెస్తాం!
ఖచ్చితంగా
తెచ్చి తీరుతాం.!
ఇది రేపటి లోకానికి మా వాదా!

స్వేచ్చానువాదం-గీతాంజలి

———-స్వేచ్చానువాదం- – గీతాంజలి


ఇలాంటి లోకం దొరక్కపోయినా నష్టం లేదు !(ఏ దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?)- సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం- గీతాంజలి.
–—————————
————
ఒక్క రాజ ప్రసాదాలు..సింహాసనాలు… వజ్రాల కిరీటాలు మాత్రమే కనిపించే లోకం., హృదయం ఉన్న మనుషులే కనిపించని లోకం ..
దొరికితేనేం.. దొరక్కపోతే నేఁ?

మనిషికే శత్రువుగా మారిన ఈ సమాజం..
ఈ డబ్బు పిచ్చి ఉన్న మనుషులు మాత్రమే నిండిన ఈ లోకం..దొరికితేనేం..
దొరక్కపోతేనేఁ?

వాళ్ళ మొఖాల్లోకి చూడండి ఒకసారి..
ఇక్కడ ప్రతి ఒక్కరూ గాయపడి ఉన్నారు.. దాహం గొని ఉన్నారు.
కళ్ళలో అయోమయం..గుండెల్లో విషాదం నిండిపోయి ఉన్నారు.
ఓహ్హ్..ఇది మనుషులు ఉంటున్న స్థలమేనా ..? లేక
దుఃఖం ఒక్కటే పొంగి పోరాలుతున్న శోక మందిరమా ?
అసలు.. దయేలేని ఈ లోకం..
దొరికితేనేం… దొరక్క పోతేనేం?
మనిషి అస్థిత్వమే ఇక్కడ ఒక ఆటబొమ్మ అయి పోయి..
ఈ దునియా అంతా… ఈ రోజు శవాలు తిరగాడే బస్తీగా మారిపోయింది.
మీకు తెలుసా…ఇప్పుడు ఇక్కడ మనిషి జీవితం కంటే మరణమే చవకగా దొరుకుతుంది.
ఈ లోకం..ఇలాంటి కరడు గట్టిన లోకం..కారుణ్యమే లేని లోకం ..
దొరక్క పోతేనేం?
దొరక్క పోతేనేం?
మనిషికి విలువే ఇవ్వని
లోకం దొరికితేనేం.. అసలు దొరక్కపోతేనేఁ?


స్త్రీ పురుషుడికి జన్మ నిస్తుంది కానీ-(ఔరత్ నే జనమ్ దియా మర్ధో కో…)సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత.
స్వేచ్చానువాదం-గీతాంజలి

ఈ పురుషులు ఎలాంటి వాళ్ళో చూడండి…
స్త్రీలు వాళ్ళకి జన్మ నిస్తే..వాళ్ళు మాత్రం
ఆ మాతృమూర్తులను
కృతజ్ఞతే లేకుండా ఎప్పుడంటే అప్పుడు
ఇష్టం వచ్చినట్లు
నలిచి .. నాశనం చేసి., బాజారులో డబ్బుల కోసం తూకం వేసి మరీ అమ్మకానికి కూర్చోబెడతారు.

హృదయంలో పెట్టుకొని పూజించాల్సిన ఆమెతో..విలాసవంతుల దర్బారుల్లో నగ్నంగా నాట్యం చేయిస్తారు.
చెప్పు కోవడానికి కూడా.. ఎంత సిగ్గుచేటంటే., ఆమె మర్యాదస్తులనబడే వాళ్ళకే పంచ బడుతుంది.
ఎంత వివక్షో చూడండి..
పురుషులేమో ఎంత నేరాలనైనా బాహాటంగా చేయచ్చు కానీ ..స్త్రీకి ఏడవడం కూడా నిషిద్ధమే !
మగవాడికి పడుకోవడానికి లక్ష పరుపులు… స్త్రీకి మాత్రం ఒకటే చితి !
మగవాడికి ఉల్లాసంగా ఉండడమే హక్కు అయితే స్త్రీకి జీవించడమే ఒక శిక్ష..
మగవాడి విలాసాలకు ఆకాంక్షలనే పేరైతే .,
స్త్రీలు సజీవంగా అగ్నికీలల్లో దహించుకుపోవడాన్ని ఆమె త్యాగం అన్నారు !

ఆమె ఏ పెదవులతో అయితే ప్రేమించిందో..ఆ పెదవులతోనే పురుషుడు వ్యాపారం చేస్తున్నాడు !
ఆమె ప్రేమను పొందే అర్హతే లేని వాడు !
వాడికి..
ఏ స్త్రీ గర్భం అయితే ప్రాణం పోసిందో ..ఆ గర్భాన్నే సరుకుగా మార్చాడు కృతజ్ఞతా హీనుడు!
ఏ దేహం నుంచి చిగురై మొలిచాడో…ఆ దేహాన్నే అగౌరవ పరిచాడు !
ఆఖరికి…
ఆమె మొఖాన్నో రొట్టె ముక్క విసిరేసి..దానికే కృతజ్ఞత చూపమన్నాడు.
అసలు ఈ లోకంలోని ప్రతి నిస్సిగ్గు మగవాడు..ఆ దేవత ఒడిలోనే పెరుగుతాడు..
అది అర్థం కాని పురుషుడు
వికృతమైన మైదానాల గుండా నడిచి..ఎడారి దారుల్లోకి నడుస్తాడు.
తప్పులు చేస్తూనే పోతాడు.
చివరాఖరికి వాడి ధూర్తపు కోరికలన్నీ ఆడవాళ్లు చేసే పాపాలుగా మారిపోతుంటాయి.
ఎంత వైచిత్రి అంటే… స్త్రీని లోకంలో కారణజన్మురాలిగా భావిస్తారు..
వెలుగులు చిమ్మే
దేవతగా కొలుస్తారు
అయినా ఆమె పాపాత్మురాలిగానే చూడ బడుతుంది.!
ఆమె ఎంతటి దూరదృష్టవంతురాలైన తల్లి అంటే… ఓపిక నశించి ఓడిపోయి., కొడుకుల దయా భిక్ష అనే శయ్య మీద ఒరిగిపోతుంది…
ఎంత కఠినాత్ముడు ఈ మగవాడు?
జన్మనిచ్చిన స్త్రీని .. బాజారులో నిలబెట్టాడు
ఇష్టమొచ్చినట్లు కాలితో నలిచి..నాశనం చేసి., చివరికి తృణీకరిస్తాడు
నీచ పరుస్తాడు !
జీవితంలో.. స్త్రీ ప్రేమకి ఎన్నటికీ పాత్రుడు కాలేని వాడు కదా ఈ మగవాడు?

పద ప్రియా.. అపరిచితులం అయిపోదాం !-

(— *చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ఞబీ బంజాయే హం దోనో *…సాహిర్ లూథియాన్వి ఉర్దూ కవిత) తెలుగు స్వేచ్చానువాదం – గీతాంజలి.
::::::::::::::::::::::::::::::::::::::
ప్రియా..పద ..ఒక్కసారిగా నువ్వూ., నేనూ అపరిచితులం అయిపోదాం.!
మళ్ళీ గుర్తు పట్టుకోలేనంతగా పరాయి వాళ్ళమైపోదాం!

ఇక అప్పుడు.. నీ నుంచి నేను హృదయ సంబంధమైన ..
ఒక్క ఆశ కూడా పెట్టుకోబోను.
నువ్వు కూడా నా వైపు ఇష్టం గా చూడకు మరి!
ఇద్దరం అపరిచితులం అయిపోయామనుకో…. నా మాటల్లో పొరబాటున కూడా నా మనసులో నీ మీద ఎంత మోహబ్బాత్ ఉందో., దొర్లకుండా జాగ్రత్త పడతాను.
నా కళ్లల్లో.. పొరబాటున కూడా నా హృదయంలో గౌరవంగా..ఎంతో ప్రియంగా దాచుకున్న మన ప్రణయ రహస్యాన్ని బయటపడనీయను.
పద.. ప్రియా అందుకే
ఒక్కసారిగా …అపరిచితులం అయిపోదాం !

నాకు తెలుసులే… నాతో కలిసి ముందడుగు వేయడానికి బహుశా..నిన్ను కూడా ఏదో చిక్కుముడి ఆపుతూ ఉండి ఉంటుంది.
కులమో.,మతమో., ఏదో ఒకటి. బాధ పడకు! నాతో కూడా ఈ పాడు లోకం
నువ్వు నాకు పరాయి దానివనే చెప్తున్నది.
నీ నుంచి దూరంగా తరిమి కొడుతున్నది.
ఇక ..నాకు నీతో గడిపిన దివారాత్రుళ్ల జ్ఞాపకాల తోడు తప్ప ఏం మిగిలిందని చెప్పు?
అందుకే ప్రియా .,పద ఒక్కసారిగా అపరిచితులం అయిపోదాం!

ఎందుకంటే ..మన పరిచయమే
ఒక మనోవ్యాధిలా మారినప్పుడు.. దాన్ని మరిచిపోవడమే ఉత్తమం కదా.,?
బంధం భారంగా మిగిలినప్పుడు .. దాన్ని తెంచుకోవడమే మంచిదేమో ?
అసలు..ఇన్ని యుగాలు గడిచిపోయినా .. మన ప్రేమ కథను కలయిక అనే ముగింపు దాకా కూడా తీసుకెళ్లలేక పోతే…
పద ప్రియా.. కనీసం ఒక అందమైన మలుపైనా ఇచ్చి… ఇద్దరం కలిసి దాన్ని సాగనంపుదాం !
అందుకే నా ప్రియురాలా…
పద ఇద్దరం ఒక్కసారిగా అపరిచితులం అయిపోదాం !
మళ్లీ .. ఎప్పుడైనా ..ఎక్కడైనా ఎదురుపడినా గుర్తు పట్టలేనంత పరాయి వాళ్ల మైపోదాం !!

ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూథియాన్వి అసలు పేరు అబ్దుల్ హయీ. 1921 మార్చ్ 8 న జన్మించి అక్టోబర్ 25 1980 లో మరణించారు.
పంజాబ్ లోని లూథియానా లో ముస్లిం గుజ్జర్ భూస్వామి కుటుంబంలో జన్మించారు.
లూథియానా ప్రభుత్వ కళాశాల లో చదువుకున్నారు. సాహిర్ ఉర్దూలో గజల్స్,నజమ్స్ అంటే ఉర్దూలో కవిత్వం రాయసాగారు.1943లో సాహిర్ లాహోర్ లో స్థిరపడ్డాక 1945 లో ఉర్దూ భాషలో తన తొలి గ్రంధం “తల్కియా ” ముద్రించారు. సాహిర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ , ప్రగతిశీల ఉద్యార్థి సంఘాల్లో సభ్యుడు గా ఉంటూ ప్రగతిశీల కవిత్వం రాసారు. ఆదాబ్-ఎ-లతీఫ్,సాకార్,ప్రితలరి,సవేరా లాంటి పత్రికల కు సంపాదకులుగా పనిచేశారు.
కమ్యూనిజం మీద తన ఖచ్చితమైన అభిప్రాయాలను వెల్లడించినందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన మీద అరెస్ట్ వాఁరెంట్ పంపింది.
1949లో దేశవిభజన తరువాత సాహిర్ లాహోర్ నుంచి ఢిల్లీ కి వలస వచ్చేసి., తరువాత బొంబాయి కి మారిపోయి అంధేరి లో ఉంటూ అక్కడే సినిమాల్లో పాటలు ..బయట ప్రగతిశీల కవిత్వం రాయసాగారు. గుల్జార్,కృషన్ చందర్ లాంటి ప్రముఖ ఉర్దూ కవులు పరిచయం అయ్యారు.ప్యాసా,అజాది కి జిందగి, బాజి, నౌజవాన్,ఇజాత్,మన్ కి ఆంకే, దాస్థాన్, దాగ్, ఫిర్ శుభహ్ హోగి,ఇన్సాఫ్ కా తరాజు, లాంటి సినిమాల్లో గొప్ప పాటలు రాశారు సాహిర్. ఆయన పుస్తకాలు — పర్చాయియా, కలాం -నేను సాహిర్ లూథియాన్వి, గాతా జాయే బంజారా,తలకియా.
మెహముద్.కె.టీ, అబ్బాస్ కె.ఏ, హసన్,లాంటి రచయితలు సాహిర్ కవిత్వం,షాయరీలు,గజల్స్ మీద .,ఆయన వ్యక్తిత్వం జీవితం, ప్రేమ వ్యవహారాల మీద (ప్రముఖ పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతం సాహిర్ల సఫలం కానీ ప్రేమ జీవితము )చాలా పుస్తకాలు రాసారు .అమృతా ప్రీతంతో విఫలం అయిన ప్రేమ సాహిర్ తో గొప్ప ప్రేమ,వియోగ కవితల్ని రాయించింది.
సాహిర్..జాతీయ ఉద్యమం మీద..పాకిస్థాన్ లో ఆటంకావాదులు చెందిన దాడులు,హత్యాకాండలను ఖండిస్తూ .,దేశవిభజన ముందు..తరువాత రెండుదేశాల్లో చెలరేగిన హింసాకాండల మీదా.. స్త్రీల మీద జరిగిన అత్యాచారాల మీద..యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం,రక్తపాతం చూసి చలించిపోతు అనేక కవితలు రాసారు.రక్తం నాడైతేనేమి,పరాయి వారిదైతేనేమి?యుద్ధం వద్దు, పర్చాయియా అనే కవితలు యుద్ధ వ్యతిరేక కవితలు రాసారు . తల్లిని వదిలేసి ఒంటరీదాన్ని చేసిన తండ్రి మీద ద్వేషం ఆయన్ని భారత దేశంలో స్త్రీల దుర్భర స్థితులు అర్థం చేసుకునేలా చేసింది.అందుకే..పితృస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ.. దుర్భరమైన వేశ్యల జీవితాలకు చలించి పోతూ చాలా కవితలు (ప్యాసా సినిమాలో) రాసారు. కమ్యూనిజం కు అనుకూల ప్రకటనలు.. కవిత్వం కూడా రాసి వివాదాస్పద సందర్భాల్లోకి వెళ్లారు. ఆకలిమీద..పీడితవర్గ పక్షాన నిలబడి అనేక కవితలు రాసారు.(తాజ్ మహల్) 1980 అక్టోబర్ 25 సాహిర్ హార్ట్ ఎటాక్ తో మరణించారు.

October 6, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మున్నుడి

by రంగరాజు పద్మజ October 6, 2022
written by రంగరాజు పద్మజ

తెలుగు సాహిత్యంలో శతకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని మన పెద్దలు చెప్పి ఎన్నో శతకాలు వెలువరించారు కూడా…భక్తిని తెలిపేందుకు, భక్తి మార్గంలో నడిచేందుకు అంటే భక్తి ప్రచోదనంగా శతక సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది.
శతకము అంటే వంద. ఒకటి పక్కన రెండు సున్నాలు.ఈ వంద సంఖ్య ఆధ్యాత్మిక ప్రపంచంలో ( భక్తి సామ్రాజ్యంలో) ఎంతో వందనీయం. ఎలా అంటే….
ఒకటి సంఖ్య స్థానంలో శ్రీమన్నారాయణుడున్నాడనుకుంటే ఒక సున్న (0) జీవతత్త్వం మరొక సున్న (0) ప్రకృతి తత్త్వం ….ఈమూడు కలిసిన తత్త్వం…
1= శ్రీమన్నారాయణుడు
0= జీవ తత్త్వం
0 = ప్రకృతి తత్త్వం
100 = జీవ తత్త్వం…ఈ తత్త్వం గురువుల దైతే…
ప్రకృతి తత్త్వం అంటే పంచభూతాత్మకమైన శరీరం.
సర్వలోకేశ్వరుడు = ఒకటి (1)అనే అంకెను రెండు సున్నాల (00)ముందు ఒకటి చేరిస్తేనే (1+00) ఆ రెండు సున్నాలకు విలువ ఉంటుంది.
ఇంకా వివరంగా చెప్పాలంటే…
1= దివ్యశక్తి సాకారం. ( ఈ దివ్య శక్తే కదా! జగత్తును నడిపే శక్తి…)
అందుకే వందసార్లు వేడుకుంటూ రచయిత గాదె వేంకటరామారావు గారి “యాదగిరి లక్ష్మీనారసింహ” శతక రచనసాగింది.
మంచి సంప్రదాయ పరులు కావడం వల్ల శరణాగతి చేసారు.
శరణాగతినే ప్రపత్తి అనీ, భరన్యాసమనీ అంటారు. భగవంతుడే రక్షకుడు, మోక్షం కావాలన్నా ఆయనే ఉపాయమనీ ( శరణం) పూర్తి నమ్మకంతో భగవంతుని మనసులో నిలుపుకోవడమే శరణాగతి. మన భారాన్ని భగవంతుని పైన ఉంచడం న్యాసం లేదా శరణాగతి చేయడం…

అలా కాకుండా నన్ను నేను రక్షించుకుంటాననడం వ్యతిరేకమవుతుంది. ఎందుకంటే భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ రక్షించాలనే ఎదురుచూస్తుంటాడు. అది ఆయన స్వభావం. అందుకు వ్యతిరేకంగా: నన్ను నేను రక్షించుకోగలను ” అనే స్వతంత్ర భావన ఉండకూడదు. స్వప్రవృత్తి నివృత్తి అంటే ఇదే! ఇలా ఏ పరిస్థితులలో నైనా భగవంతుని మీద విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండడమే శరణాగతి లేదా ప్రపత్తి.
శరణాగతి చేయడానికి రెండు ప్రధాన లక్షణాలుండాలి. 1. ఆకించన్యము, 2. అనన్యగతి.

  1. ఆకించన్యము – “స్వామీ! నేను ఎలాటి యోగ్యత, శక్తి లేనివాడిని, దీనుణ్ణి” అని ప్రార్థించడం.
  2. అనన్యగతి – “స్వామీ! నువ్వు తప్ప నాకు ఎవ్వరూ రక్షకులు లేరు, నువ్వే నాకు దిక్కూ, దీపమూ” అని మహావిశ్వాసాన్ని ప్రకటించి, ఆచరణలో పెట్టడం.

సకృదేవ ప్రపన్నాయ అని శ్రీరాముడూ,
సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్రీకృష్ణుడూ శరణాగతే సులభమైన, సుకరమైన మోక్షోపాయమని చెప్పారు.

శరణాగతి ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలు, సదాచార్యుల సమాశ్రయణం శరణాగతి మంత్రాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీరామాయణాన్ని శరణాగతి వేదం అనీ,
విభీషణ శరణాగతిని పరిపూర్ణ ప్రపత్తి విధానం అనీ పెద్దలు నిరూపించారు.

రచయిత చెప్పిన భక్తి మార్గంలో నడిస్తే సులువుగా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని ఏకీభవిస్తూ…

రంగరాజు పద్మజ

శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకము :–

1.శార్దూలము

శ్రీ లక్ష్మీశ, నృసింహ, భక్తజన, సు శ్రేయోభిలాషా,హరీ
నీ లాలిత్యము సూసి నా కవిత సాన్నిధ్యాల సంసేవకై
అలాపంబున బల్కుచున్నది ప్రభూ ఆనందసంధాయివై మేలాసించుము దేవ! యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ !

ప్రతి పదార్థము:–
శ్రీ లక్ష్మీశ= లక్ష్మీదేవి భర్తైన; నృసింహ= నర శ్రేష్ఠుడు,
భక్తజన= భక్తులైన వారి; సు= మంచి; శ్రేయోభిలాషి= హితుడు; హరీ=విష్ణువు; లాలిత్యము = లలితము; సూసి= చూసి; నా= నాయొక్క;
కవిత =కవిత్వం ( శతకరచన) సాన్నిధ్యము=సన్నిధిలో
సంసేవ=పూజ, అర్చన ;
ఆలాపన= పలవరింత ;
పల్కు= మాట్లాడు;
ప్రభూ= ప్రభువా!
ఆనంద=సంతోషము;
సంధానము=సమకూర్చుట;
మేలు= శుభము, (ఉపకారం) ;
ఆసించు= కోరుకొను
దేవ= ఓ దేవుడా! ఇచ్చేవాడా!
యాదగిరి లక్ష్మీ నారసింహ = యాదగిరి గుట్టపై వెలసిన నరసింహా !!!

తాత్పర్యం:– యాదగిరి గుట్టపై వెలసిన ఓ నరసింహా! లక్ష్మీదేవి భర్తగా, నరశ్రేష్ఠుడిగా భక్త జనుల హితము కోరి,అందరికీ సుఖసంతోషాలనిచ్చేదేవుడా! నేను నీ అందమైన రూపం చూసి,నిన్నే పలవరిస్తూ , నీ దగ్గర పూజార్చన వలె నా శతకాన్ని నీకు సమర్పిస్తున్నాను.. స్వీకరించి ఆనందాన్ని కలిగించువయ్యా!

  1. మత్తేభము

కవినై వచ్చితి జన్మ కర్మ ఫల సత్కారార్హ సౌభాగ్య సం
స్థవ నీయంబగుఁ గీర్తి చంద్రికలమందానంద సందోహలై
అవదానంబున భక్తిభావనల నత్యంతంబు లాలింపగన్
శివ దేవా కరుణించు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥

అర్థము:–

కవి= కవిత్వం చెప్పేవాడు,
జన్మ కర్మ ఫలం= పుట్టుకలచే ప్రారబ్దంతో కలిగిన ఫలితం;
సత్కారార్హ = మంచి పనులు చేయుటకు అర్హత;
సౌభాగ్య= యోగము;
సంస్తవ = చక్కని స్తోత్రం;
కీర్తి చంద్రికలు= వెన్నెల వంటి యశము
అమందానంద = అధికమైన సంతోషం;
సందోహము = సమూహం( మొత్తము)
అవదానంబున= తుంచి వేసి
భక్తి = శ్రద్ధ
భావన= తలంపు
అత్యంత= మిక్కిలి,
లాలింపగ = బుజ్జగించ,
శివ దేవా= శుభాలనిచ్చే వాడా!
తాత్పర్యం:– శుభాలనిచ్చే ! ఓ యాదగిరి లక్ష్మీ నరసింహ!! నాపై దయచూపుము. నేను
ఎన్నో జన్మల నుండి చేస్తున్న కర్మలతో కలిగిన ప్రారబ్ధాన్ని తొలగించుకోవడానికి, మంచి పనులను చేసే అర్హత యోగ్యతను ఇవ్వమంటూ చక్కని స్తోత్రాలతో వెన్నెల వంటి నీ ప్రతాపాన్ని ఎంతో సంతోషంతో, శ్రద్ధాసక్తులతో లలితంగా చెప్పడానికి కవినై వచ్చాను. నన్ను లాలించవయ్యా!

అలంకారం :-రూపకాలంకారం

  1. మత్తేభము

కలలో గాంచితి నీదు రూపమును, సాక్షాత్కార సంపత్తియున్
కలగా వచ్చిన నీకు నా హృదయ సంకల్పంబు సిద్దించగన్
కల నాదంబున పద్య సద్రచన సత్కారంబు గావించెదన్
సెలవా! శ్రీనగవాస యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ॥

అర్థాలు :–
కల = స్వప్నం;
కాంచి= చూసి;
నీదు= నీ యొక్క;
రూపము= ఆకారం;
సాక్షాత్కారము= ప్రత్యక్షం
సంపత్తి= ఐశ్వర్యం
హృదయము= మనసు;
సంకల్పము= మనసులో పని తలపెట్టుట
సిద్ధించుట= లభించు
కల= కలిగిన;
నాదం= ధ్వని ( మోత)
పద్యము= యతి ప్రాసలతో కూడిన రచన
సత్= మంచి;
రచన= కవిత్వం చెప్పడం;
సత్కారము= సమ్మానం;
గావించుట= చేయుట.
శ్రీ= శ్రేష్టమైన;
నగము= కొండ.

తాత్పర్యం:–
పవిత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన యాదగిరి లక్ష్మీ నరసింహా! నా ఎదుట కనిపించగానే, నీ యొక్క సామర్థ్యాన్ని, ఐశ్వర్యాన్ని చూసిన నా మనసు నిన్ను సమ్మానించాలనే తలపుతో నా ఆత్మ మనసును, మనసు వహ్నిని, వహ్ని వాయువును ప్రేరేపించగా వాయువు బ్రహ్మ గ్రంథి యైన మూలాధారం నుండి ఊర్ధ్వ ముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం నుండి మంచి పద్యాలను రచించి నిన్ను సన్మానించాలని తలచాను.

4.మత్తేభము
జననంబందినదాది సచ్చరిత సంస్కారంబులం జెందకన్
దినముల్బుచ్చుచు,దీనమానసుడనై దివ్య
ప్రభావంబులన్
గనలేనైతిని మూఢ జన్మునకు సంకల్పాల రాగంబు జే
సిన దేవా శృతినిమ్ము యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥
అర్థాలు:–
జననంబు= పుట్టుక ;
అందినదాది= పుట్టినది మొదలు;
సచ్చరిత= మంచి నడవడి;
సంస్కారంబులు= పంచ సంస్కారములు [ తాప సంస్కారం, పుండ్ర సంస్కారం, నామ సంస్కారం, మంత్ర సంస్కారం, వైష్ణవేష్టి]
చెందక= పొందక;
దినము=రోజులు;
పుచ్చుచు= గడుపుచు;
దీన= భయంతో;
మానసుడు= మనసుకలవాడు;
దివ్య=ప్రకాశించు;
ప్రభావంబులు=మహాత్మ్యము;
కనలేనైతి= చూడలేకపోతిని;
మూఢ= తెలివిలేని;
సంకల్పాలు= బాగా ఆలోచించుట;
రాగంబు= రాగద్వేషాలు
శృతి=వేదాధ్యయనం.

తాత్పర్యం:—
యాదగిరి లక్ష్మీ నరసింహా! పుట్టినది మొదలు మంచి నడవడి లేక , గురువులతో సమాశ్రయణం పొందకుండా, కాలం వృధాగా గడిపుతూ… నా తెలివి తక్కువ తనంతో, నా మనసు రాగద్వేషాలతో నిండిపోయి, ఆలోచించే జ్ఞానంలేక నీ యొక్క మహాత్మ్యం చూడలేక పోతిని! నా వంటి తెలివి లేని వానికి వేదాధ్యయనము చేసే జ్ఞానమునిమ్ము!

5 శార్దూలము

నేముక్తుండనుగాన, నవ్వు ముఖమున్, నిర్దోష భద్రా కృతిన్
ధీమంతోజ్వల విశ్వదర్శన కళాధ్యేయంబు పూర్ణత్వమున్
సామీప్యంబును గాంచినాడగద శ్రీశా భక్త కల్పధ్రుమా
శ్రీ మంతా జయదేవ యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥

అర్థాలు:–

నే= నేను
ముక్తుండ = మోక్షం పొందిన వాడను
నిర్దోష = తప్పు చేయని వాడు
భద్రాకృతి = శుభా కారుడు( శ్రేష్ఠుడు)
ధీమంతము = బుద్ధి గల
ఉజ్వలము = వెలుగునది
విశ్వదర్శన = ప్రపంచాన్ని పారమార్థికంగా చూడడం
కళ = విద్య( శోభ)
ధ్యేయంబు = లక్ష్యము( గురి)
పూర్ణ త్వము = నిండుగా( సంపూర్ణ)
సామీప్యంబు = దగ్గర ( దాపు)
శ్రీశా = లక్ష్మిభర్త ( విష్ణువు)
కల్ప ధ్రుమ = కోరినవి ప్రసాదించే దేవతా వృక్షం
శ్రీమంత = భాగ్యవంతుడు
జయదేవ = గెలుపు( జయము)

తాత్పర్యం:–
యాదగిరి లక్ష్మీ నరసింహ! నీ యొక్క ఎలాంటి దోషాలు లేని నవ్వు ముఖాన్ని, శ్రేష్టమైననీ రూపాన్ని, శోభతో వెలిగి పోయే నీ రూపును పారమార్థిక దృష్టితో చూడాలని లక్ష్యంతో దగ్గరనుండి చూసాను కదా!
లక్ష్మీ వల్లభా కోరిన కోరికలు తీర్చే భాగ్యవంతుడా! నేను మోక్షం పొందడానికి అర్హుడను కానా? నీకు జయం కలుగుగాక!

6.శార్దూలము
చేమంతుల్ విరజాజి కేతకులు సచ్ఛీలాల మందారముల్
మీ మేలుందలబోయ, యక్షతలు సామీప్యాల సంధింపగన్
నోమున్నోమెద గంధహారతుల నెన్నో గూర్చి సర్వాత్మకా
శ్రీమంతా సెలవిమ్ము యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ॥

అర్థములు:–

చేమంతులు = చామంతి పువ్వులు
విరజాజి = నవ మాలిక పువ్వులు( జాజిపూలు)
కేతకులు = మొగిలి పువ్వులు.
సచ్ఛీలాల = సువాసన గలిగిన
మందారాలు = మందార పువ్వు
మేలు = ఉపకారం
అక్షతలు = ఆశీర్వదించేందుకు పసుపు కలిపిన విరగని బియ్యం( అక్షంతలు)
సామీప్యము = దగ్గరలే
సంధింప = కూర్చు (కలుపు)
నోము = వ్రతము
గంధ హారతులు = చందనము, కర్పూర ఆరతి
ఎన్నో కూర్చి = ఎన్నో చేర్చి
సర్వాత్మకా = అంతటా వ్యాపించిన
శ్రీమంతా = భాగ్యవంతుడా
సెలవిమ్ము = ఆజ్ఞ ఇవ్వు

తాత్పర్యం:–
ఓ!యాదగిరి నరసింహా! మాకు నువ్వు చేసిన ఉపకారాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతగా, నీ దగ్గరే ఉంటూ, చేమంతులు, విరజాజులు, మొగిలి పువ్వులు, మందారాలు, అక్షంతలు, మంచి వాసన కలిగిన చందనం, కర్పూర హారతులతో నీ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాము… ఓ భాగ్యవంతుడా
ఆజ్ఞ ఇవ్వు!

7.మత్తేభము

సురధీప్తిన్ లిఖితారక్షరంబుల వలెన్ సూచించు సాహిత్య సం
బర లేఖాకృతి గ్రంథజాతములు, దుష్ప్రాప్తానబోర్లాడు చున్
దరిజేర్పుండని మ్రొక్కుచున్నవి కరద్వంద్వాల బైకెత్తి రా
సిరి నాకుంగలిగించు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ!

అర్థములు :—

సురధీప్తిన్ = అధిక కాంతితో
లిఖిత = రాయబడిన;
అక్షరంబులు = (క్షరముకానివి) ఓనమాలు
సూచించు = తెలియజేయు
సాహిత్య = హితముతో కూడిన
సంబర = ఉత్సవము( పండుగ)
లేఖాకృతి = ఉత్తరంవలె
గ్రంథ జాతములు = కావ్యా సమూహం
దుష్ప్రాప్త = పరితపించేలా చేయునవి
బోర్లాడు = ముఖం నేలకు ఆనేలా పడిపోవు
దరిచేర్పుండని = తీరం చేర్చమని
ద్వంద్వము = రెండు
కరము = చేతులతో
పైకెత్తి = తల మీదకు చేర్చి
మొక్కుచు = నమస్కరించుచు
సిరి = శోభ
నాకు కలిగించు = నాకు ఇవ్వు

తాత్పర్యం:—

ఓ లక్ష్మీ నరసింహా! ముత్యాలవలె రాసిన అక్షరాలతో రాసిన లేఖలు మంచి హితవు కోరే కావ్యాలను పరితపింపచేస్తాయి. మంచి హితవు కోరిన కావ్యాలు అడుగున పడిపోతాయి అలా కాకుండా నాకు మంచి విద్యనిమ్మనిరెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను !!

8.శార్దూలము:-
వింటిన్ వేద పురాణ భారత కథావిర్భూత భావంబులన్
గంటిన్ భాగవత ప్రబంధ చయ సత్కావ్యార్థ ఛందంబులన్
కుంటైపోతిని నీదు మాయ గన లేకుంటిన్ వృషీకేశవా
యింటింటన్ గలవాడ యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ!

అర్ధములు:–

వేద పురాణ భారత కథావిర్భూత= వేదాల, పురాణాల ,భారత కథల నుండి
భావంబుల = అభిప్రాయాల
వింటిని = విన్నాను
కంటిన్ = తెలుసుకున్నాను
ప్రబంధ = ప్రబంధాల యొక్క
చయ = సంగ్రహాలు
సత్కావ్య = ఉత్తమమైన కావ్యాలు
అర్ధ = అర్థాలు
ఛందంబులన్ = అభిప్రాయాలను
కుంటినై = అవిటి వాడినై
నీదు = నీ యొక్క
మాయగన = గారడీని తెలుసుకో
లేకుంటి = లేకపోతి
వృషీకేశవా = విష్ణువు
యింటింట = ప్రతీ యింటిలో

తాత్పర్యం :–
ఓ యాదగిరి లక్ష్మీ నరసింహప్రభూ!
వేదాలలోని ,పురాణాలలోని మరియు భారత కథలలోని భావాలను విన్నాను. ప్రబంధాలలోని మంచి విషయాలను చూశాను.ప్రతి ఇంట్లో ఉన్న వృషీకేశవా ! నీ మాయను వైకల్యంతో తెలుసుకోలేక పోయాను!

9.శార్దూలము:

మెట్లెక్కాలని యెక్కుచుంటి నలకల్మీదారిలోనున్నదా
కట్లం జూసెగ బోతబోసుకుని, దీక్షంబూర్తిగావించి రా
కట్లం దాటితి నేను నీవు దయతో గైవల్య లోకానికిం
కెట్లో నం దరిజేర్చు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ ॥

అర్ధాలు :–

మెట్లు = తంతెలు ( సోపానములు)
ఎక్కడం = అధిరోహించడం
కల్మి = కలిమి( సంపద)
దారి = తోవ ( బాట )
ఉన్న = వాస్తవం
తాకట్లు = చాడీలు ( కొట్లాట)
పోతపోసుకొని = అచ్చు పోసినట్టు( ఉన్నది ఉన్నట్టు)
దీక్ష = పట్టుదల
కట్లు = తాడుతో కట్టడం
కైవల్యము = మోక్షం
లోకము = ప్రపంచం
దరిచేర్చు = గట్టు చేర్చు.

తాత్పర్యం :—
ఓ యాదగిరి లక్ష్మీ నారసింహ ప్రభూ !
నేను మెట్లు ఎక్కాలని ఎక్కుతున్నాను.. కానీ అవి వంకరటింకరగా ఉండి, అచ్చంగా తగవుపెట్టి అడ్డుపడేలా ఉన్నాయి. ఎలాగో పట్టుదలగా ఆ మెలికలను దాటాను. నువ్వు దయతో స్వర్గ లోకానికి చేర్చు!

విశేషార్థం:– సాధకుడు మోక్షగామియై దీక్షబూని, యజ్ఞం, యాగం, తపస్సు, దానం మంచి నడవడితో ధర్మబద్ధంగా జీవించడం మొదలైన ఎన్నో సాధనలు చేస్తున్నాడు. కానీ ఆసాధనకు ఎన్నో అంతరాయాలు ఏర్పడినా, పట్టుదలతో సక్రమంగా నెరవేర్చి స్వర్గ సోపానాలన్నీఎక్కే ప్రయత్నంలో ఓ!యాదగిరీశా!!
దయతో నన్ను ఆ మోక్షలోకానికి తీసుకుని వెళ్ళు
అని మోక్ష గామిగా కవి హృదయం ఆవిష్కరించారు.

10 శార్దూలము

స్వామీ! నీకు నమస్కృతుల్సలిపి యీషా! భావమున్ గల్గి ఢ
క్కామొక్కీలను లెక్కసేయకను ,సంకల్పంబు సిద్ధింప గన్
ప్రేమానంద మరంద కందళిత, సంప్రీతిన్
యశః కామినై
మీముందాగితినయ్య! యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ

అర్ధాలు :–

స్వామి = యజమాని
నమస్కృతులు = నమస్కారాలు
సల్పి = చేసి
ఈషా = ప్రభువా!
భావము కలిగి = అభిమానంతో
ఢక్కాముక్కీలు = ఇబ్బందులు( కష్టనష్టాలు)
లెక్కచేయక = లక్ష్యపెట్టక
సంకల్పంబు = ఒక పని చేయాలనే ఆలోచన
సిద్ధింపగా = నెరవేరగా( సమకూరగా)
ప్రేమానంద మరంద కందళిత= మొగ్గ తొడిగిన తేనె వంటి తీయనైన పరవళ్ళు తొక్కే ఆనందంతో కూడిన ప్రేమ
సంప్రీతి = ప్రేమ
యశఃకామిని = కీర్తి కాంత
మీ ముందు = నీ ఎదుట
ఆగితిని = నిలిచాను

భావము:– యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభూ!! నువ్వే నాకు ప్రభువని తలచి,నీకు నమస్కారాలు చేసి, కష్టనష్టాలను లెక్కచేయకుండా నన్ను కీర్తికాంత వరించాలనే కోరికతో హుషారుగా పరవళ్ళు తొక్కే సంతోషంతో నీపై ప్రేమతో మీ ముందు నిలిచానయ్యా!

వ్యాకరణ విశేషం
అలంకారం :-రూపకాలంకారం

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథాపంచకం

by Dr. Lakshmanacharyulu M October 5, 2022
written by Dr. Lakshmanacharyulu M
  1. ఆవు చేను మేస్తుంటే మరి దూడ…?

నేనెన్నోసార్లు వద్దని చెప్పా, వెయ్యి సార్లు వివరించా, కాని ‘వాడి’ బుర్రలో ఏదో త్వరగా పక్కనే ఎక్కదు. అసలు ఇలాంటి పనులు చేసే వయసా ఇది?

విశ్వనాథంగారు నాకు సెంటర్లో కలిసారు “క్రొత్త బజారు”లోని ఈ సెంటరు దానికి చాలా పేరు పొందింది. ఇక్కడ సెలూన్, స్వీటుషాపు, పూల దుకాణం, ఇలా అన్ని రకాల దుకాణాలున్నాయక్కడ. జనం ఏదో సరుకులు కావాల్సినవి కొనుక్కోవడానికి వచ్చి పరస్పరం ఏవో ముచ్చట్లు చెప్పుకొంటూ, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.

విశ్వనాథంగారు ఒక దీర్ఘనిశ్వాస విడిచి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. “ఇలాంటి కొడుకుని ఆ దేవుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు. వయసా, కేవలం పదిహేడు సంవత్సరాలు కాని చేపలా ‘మందు’ అలా త్రాగుతూనే ఉంటాడు. ఎంత చెప్పినా వినిపించుకోడు. మందు త్రాగొద్దని నేనేమీ చెప్పను కాని మరీ ఇంతలా త్రాగడం, త్రాగి రోడ్డుమీద పడడం… ఇదేం తెలివి?

చివరి వాక్యం వినగానే నాకేదో అనుమానం వచ్చింది. విశ్వనాథంగారి వంక ఎందుకో కన్నార్పకుండా చూసా, కొంచెం వాసన గట్టిగా పీల్చా. విశ్వనాథంగారు మత్తు ప్రభావంలో అటూ ఇటూ తూలుతూ కనిపించారు.

  • ఇలా కూడా జరుగుతుంది

కారు చాలా వేగంగా వెళ్తోంది. డాక్టర్  సర్వేశ్వరరావు చాలా తొందరలో ఉన్నాడు. నిజమేమంటే, అసలు ఆయనెప్పుడూ హడావిడిగానే ఉంటాడు. రోగులెప్పుడూ పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూతా ఉంటారు. రోజుకి ఇరవై నాలుగు గంటలకి బదులు ఇరవై అయిదెందుకు లేవా అని ఆయన ఎప్పుడూ చింతిస్తూ ఉంటాడు.

శ్యామల, ఆయన భార్య – “ఏమండోయ్! ఏదో ఒక రోజు, నేనో, మన పిల్లవాడు సురేశ్ జబ్బు పడతాం. అప్పుడైనా మీరు మా దగ్గర కూర్చుంటారో, కూర్చోరో నాకైతే సందేహమే” అని ఎప్పుడూ అంటూ ఉండేది.

నిజానికి డాక్టర్ సర్వేశ్వర్రావుకి తన కుటుంబం అంటే చాలా చాలా ప్రేమ. అయినప్పటికీ తన భార్యతో, తన ఏకైక కుమారరత్నం సురేశ్ తో కలిసి కొంచెం టైమైనా గడిపేందుకు ఆయనకు అస్సలు వీలైయే్యది కాదు.

‘అంబ’ సినిమా థియేటరం మలుపు దగ్గర కారు కొంచెం ‘స్లో’ అయింది. డాక్టర్ సర్వేశ్వరరావు ఆలోచనల దారం పుటుక్కున తెగింది.

‘ఏమైంది?’ అని అడిగాడాయన డ్రైవర్ని.

“సార్, ముందైతే చాలా పెద్ద గుంపు ఉంది. అక్కడ ఏదో  ‘యాక్సిడెంట్’ అయినట్టుగా ఉంది. “ఎవరో బాగా గాయపడినట్టున్నారు” అన్నాడు డ్రైవర్.

‘అరే! నువ్వైతే బండి ఆపొద్దు. ఈ రోజుల్లో కుర్రాళ్లు వాళ్ళూ పై తెలీకుండా బండ్లు తోలుతారు, రోడ్డుపై కూడా అలాగే నడుస్తారు’ ఇలాంటివేవో చేస్తూనే ఉంటారు.

“కాని… సార్! మీరే డాక్టర్ కద. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడగలరు.”

“అయితే ఏంటట? నేను డాక్టరైతే ఇలా ప్రతి చచ్చేవాణ్ణి కాపాడుకుంటూ పోవడం నా వల్ల కాదు. నా పనులు నాకుంటాయ్”

డ్రైవర్ మౌనంగా ఓ నిట్టూర్పు విడచి బండిని ఆపకుండా, అలాగే పరుగులు తీయిస్తూ వెళ్ళాడు. డాక్టర్ గారితో వాదించడం వృధా అని అతనికి తెలుసు.

కారు హాస్పిటల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అంబులెన్సుతో ఢీ కొట్టబోయి క్షణంలో తప్పించుకున్నది. అంబులెన్సు డ్రైవర్ ని చెడామడా తిట్టేందుకై డాక్టర్ సర్వేశ్వరరావు కారు దిగాడు. ఇలా దిగాడో లేదో “సార్! ఆలస్యం చెయ్యకుండా కారెక్కండి. మీ అబ్బయి సురేశ్ కి ‘అంబ’ థియేటర్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంటైందట. ఎవరో ఫోన్ చేశారు. బహుశా ఈ పాటికి చినబాబు….

  • డ్యూటీ

అతనో గొప్ప సర్జన్ అవ్వాలని అనుకునేవాడు. హోలీ పండుగ. ఆ రోజు కూడా ఇంట్లో ఉండకుండా డ్యూటీ చెయ్యాల్సి వచ్చిందని అతనికి డాక్టరు వృత్తిమీద బోళ్ళంత విసుగు, కోపం వచ్చాయి. మరి అవాళ అమ్మ కూడా కోపంతో ఏమేమో అన్నది. అలాంటి ఆలోచన వచ్చినందుకు. అయితే మరి ఒకటి కావాలంటే, ఒకటి పోగొట్టుకోవాలి కదా!

సరే… ఎలాగో అలా డ్యూటీకి వచ్చి అన్య మనస్కకంగానే కూర్చున్నాడు. ఇంతలో… ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో చెప్పగానే ఒక్కో ఉదుటున లేచి వార్డుకొచ్చాడు. తీరా చూస్తే, అక్కడో బెడ్ మీద తన తమ్ముడే స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఓ రెండు నిముషాలు కాగానే అతను హఠాతు్తగా లేచి రక్తపు వాంతి చేసుకున్నాడు. దాంతో తమ్ముడితో బాటుగా అతని దుస్తులపైనా రక్తం పడి ఎర్రగా అయింది. రోగినైతే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి వెంటనే సర్జరీ చేయడం జరిగింది.

రెండు గంటలపాటు కష్టపడి అతను బయటికి వచ్చాడు. అక్కడ వాళ్ళమ్మ ఎదురుగా నిలబడి ఉంది. చూపులెక్కడో ఉన్నాయి.

“అమ్మా! నువ్వేం బాధపడకు. తమ్ముడి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది” అనగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు గిరగిర తిరిగాయి.

వెంటనే ముందుకొచ్చి తన పెద్ద బాబైన అతన్ని గట్టిగా కౌగలించుకుని – “బాబూ ప్రొద్దున్న నేనన్న మాటల్ని పట్టించుకోమాకు. మనసులో ఏమీ పెట్టుకోకు. ఇక నేను డ్యూటీ సంగతి ప్రస్తావించి నిన్నేమీ అనను సరేనా? డాక్టర్లకి హోలీ ఏమిటి? దీపావళేమిటి?” ఏదైనా ఒకటేకద!”

అతనో చిరునవ్వు నవ్వి – “మాకు హోలీ పండగ ఉండదని ఎవరంటారమ్మా? ఇదిగో, నా బట్టల్ని చూడు మనిషి రక్తం రంగు తాలూకు చుక్కల మరకలివి. ఇలాంటి హోలీ మరింకెవరన్నా ఆడతాడా అసలు?”

  • ఫ్యాషన్

దేవుని తీర్పు కూడా కొంచెం విచిత్రంగానే ఉంటుంది మరి. ఆయన తన భక్తుల్లోనే కొందరికి విశేషంగా సిరిసంపదలిస్తే, కొందరి కసలేమీ ఇవ్వలేను. అసలు లోకంలో సరిసమానం అనేది ఎక్కడుంది అంటే, అది చాలా అరుదే అని చెప్పాల్సి ఉంటుంది. తేడాలనేవి మనకి తేలికగానే కనిపిస్తాయి.

నగరంలోని ఒక సందు మలుపులో ఉంది శివదయాళ్ గారి దుకాణం. శివదయాళ్ ఓ టైలర్. మంచి పేరున్నవాడు సంపాదించుకున్నదాంతో ఇల్లు గడుపుకుంటూ వస్తున్నాడు.

ఆ రోజున ఒక పెద్ద కారు వచ్చి ఆయన దుకాణం ముందు ఆగింది. దాంట్లోంచి ఒక ఫ్యాషనబుల్ అమ్మాయి – వన్నెల విసనక్రర దిగింది. దుకాణంలో లోపలకొచ్చి ‘మీరు నాకో ప్రత్యేకమైన డ్రెస్ తయారుచేసి ఇవ్వగలరా?’ అని అడిగింది.

ఆ అమ్మాయి తన కెలాంటి డ్రస్ కావాలో వివరించి చెప్పేసరికి శివదయాళ్ నోట మాట రాలేదు. ఆ డ్రస్లో వళ్ళు కప్పబడేది చాలా తక్కువ సరే, దాంతో తనకేంటి? తనకు పోయేదేముంది? ఆయన కొలతకు తీసుకున్నాడు.

ఆ రాత్రి శివదయాళ్ కీ నిద్ర అస్సలు పట్టలేదు పక్కనే ఉన్న గదిలో లైట్ వెలుగుతోంది. అద్దం ముందు నిలబడి శివదయాళ్ పదహారేళ్ళ కూతురు తనను తాను చూసుకుంటోంది. ఆమె చేతిలో అదే ప్రొద్దున్న తన దగ్గరికొచ్చిన అమ్మాయి కుట్టించుకున్న డ్రస్సు ఉంది. తండ్రి అక్కడికి రావటం గమనించి ఆమె సిగ్గుపడింది.

శివదయాళ్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పెల్లాయ్ కూతురు తలమీద చెయ్యేసి నిమురుతూ “హూ… దేవుడి తీర్పు ఎలా ఉంటుందో చూడు! పేదోళ్ళకి వళ్ళు కప్పుకునేందుకు చాలినన్ని బట్టలుండవు. ఉన్నోళ్ళకైతే వళ్ళు కప్పుకునేందుకు బట్టలు చాలానే ఉన్నాయి. కాని ఫ్యాషన్స పేర, వళ్ళంతా కనబడేట్టు చూపించడంలో ధనికులు ఎక్కవగా విశ్వసిస్తారు.

October 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

  1. దొంగ  –  బాలుడు

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, October 5, 2022
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

          రహదారిపై ఒక దొంగ ఒక మహిళ చేతిలోని పర్సును దొంగిలించి పరిగెడుతున్నాడు. అది గమనించిన ఒక బాలుడు ఆ దొంగ వెంట పడ్డాడు. ఆ దొంగ పరిగెత్తి పరిగెత్తి చీకట్లో మాయమయ్యాడు. ఆ బాలుడు ఒక చెట్టు చాటు వరకు వెళ్లి ఆగిపోయాడు. ఆ దొంగ కొద్దిసేపు చీకట్లో దాక్కొని దప్పికతో తిరిగి అక్కడ ఉన్న కుళాయిలో నీరు త్రాగుదామని ఆ బాలుడు ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. ఆ బాలుడు చెట్టుచాటునుండి ఆ దొంగను చూశాడు. ఆ దొంగ తాను దొంగిలించిన పర్సును చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్దారించుకొని అక్కడ దానిని నేలపై దూరంగా  పెట్టి నీటిని త్రాగసాగాడు. వెంటనే ఆ బాలుడు ఆ పర్సును  తీసుకొని పరిగెత్తసాగాడు .అప్పుడు అది గమనించిన ఆ దొంగ ఉపాయంతో ఆ బాలుని వెంటపడి ‘ దొంగ దొంగ ‘అని గట్టిగా  అరవసాగాడు .అక్కడ ఉన్న జనం ఆ దొంగ మాటలు నిజమని  నమ్మి ఆ బాలుని పట్టుకున్నారు. ఆ దొంగ సంతోషించి  ఆ బాలుడు తన పర్సును దొంగిలించాడని బాలుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నవారు వారి ఇద్దరినీ పట్టుకుని  గ్రామాధికారి వద్దకు తీసుకుని వెళ్లారు.

            ఆ దొంగ తన పర్సును  ఈ బాలుడు దొంగతనం చేశాడని ఆరోపించాడు. అప్పుడు   గ్రామాధికారి ఆ బాలునితో  “ఏం బాబూ! ఇతరుల పర్సును దొంగిలించడం తప్పు కదా!” అని అన్నాడు. ఆ బాలుడు నవ్వి ” అయ్యా! ఇది అతని పర్సు అయితే ఇందులో ఏమున్నదో చెప్పుకోమనండి” అని అన్నాడు.    ఆ దొంగ నీళ్ళు నమిలాడు. అప్పుడు ఆ గ్రామాధికారి “మరి  నీవైనా చెప్పు” అని ఆ బాలుని అడిగాడు .”మా అమ్మా, నాన్న ఫోటోలండీ. ఇతడు దొంగిలించింది మా అమ్మ పర్సే. కావాలంటే చూడండి “అని  ఆ గ్రామాధికారికి దానిని తీసి  చూపించాడు .వెంటనే అక్కడ నుంచి పారిపోతున్న ఆ దొంగను గ్రామ ప్రజలు వెంటనే పట్టుకున్నారు.

         ఇంతలో అక్కడికి ఆ బాలుని  తల్లి ఏడ్చుకుంటూ ఆ గ్రామాధికారి వద్దకు వచ్చి ఆ బాలునితో  “బాబూ! మన పర్సు  పోతేపోయింది. వెధవ పర్సు. దొంగ వల్ల నీకు ఏమీ ముప్పు అవలేదు కదా “అని అంది .అప్పుడు ఆ గ్రామాధికారి ఆ బాలుని మెచ్చుకొని “నీ కొడుకు ఈ గజదొంగని పట్టించాడమ్మా! మాకు ఈ దొంగ పీడ లేకుండా చేశాడు! మా గ్రామంలో  ఎన్నో రోజులుగా దొంగతనం చేసిన ఈ దొంగను ఈ బాలుడు పట్టుకోవడం నిజంగా చాలా ధైర్యంతో కూడిన పని. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ బాలుని నేను అభినందిస్తున్నాను” అని ఆ బాలునికి మంచి కానుకను ఇచ్చి సత్కరించాడు.వారి మాటలు విని ఆ తల్లి ఎంతో మురిసిపోయింది.

October 5, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నిలబడి చేసే ఆసనాలు

by Bandi Usha October 5, 2022
written by Bandi Usha

వీరభద్రాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి.

కాళ్ళ మధ్య కాస్త దూరం ఉంచి తరువాత రెండు అరచేతులు నేలవైపు చూస్తున్నట్లు చేతులను భుజాలకు సమాంతరంగా చాచి కుడివైపుకు తిరుగుతూ కుడిమోకాలును 90 డిగ్రిలకు మడచి నడుమును ముందుకు ఛాతీని వెనక్కి విరుస్తూ తలను పైకెత్తాలి. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకని మరలా యథాస్థితికి వచ్చి ఇదేవిధంగా ఎడమవైపు చేయాలి.

విపరీత వీరభద్రాసనము

ఉపయోగాలు:

  • కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
  • భుజాలు, వెన్నెముక శక్తివంతం అవుతాయి.
  • పొట్ట తగ్గుతుంది.
  • కాలికండరాలు గట్టి పడతాయి.
  • రక్తప్రసరణ జరుగును.

2. విపరీత వీరభద్రాసనము :

తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు చేతులు పైకెత్తి కుడికాలు ముందుకు ఎడమకాలు వెనక్కి చాచాలి. కుడికాలిని వెనక్కి వంచుతూ కుడిచేతిని కుడి మోకాలిపై వేస్తూ ఎడమకాలిని 90 డిగ్రిలకు మడిచి ఉంచి పైనున్న ఎడమ చేతిని చూస్తూ ఉండాలి. నాలుగైదు శ్వాసల అనంతరం యథాస్థితికి వచ్చి మరోవైపు చేయాలి.

ఉపయోగాలు : కాలికండరాలు, పిక్కలు, భుజాలు శక్తివంతం అవుతాయి.

నమస్కార వీరభద్రాసనము :
  • థైరాయిడ్ అదుపులో ఉంటుంది.
  • పొట్ట తగ్గుతుంది.
  • తొడ కండరాలు గట్టి పడతాయి.

౩. నమస్కార వీరభద్రాసనము

చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచి కుడికాలును బాగా వెనక్కి తీసుకెళ్ళాలి. ఎడమ మోకాలిని 90 డిగ్రిలకు మడిచి నడుమును ముందు ఛాతీని వెనక్కి విరుస్తూ తలపైకెత్తి నమస్కారాన్ని చూడాలి. నాలుగైదు శ్వాసల అనంతరం యధాస్థితికి వచ్చి మరొకవైపు చేయాలి.

ఉపయోగాలు

` కాలికండరాలు, భుజాలతోపాటు వెన్నెముక శక్తివంతం అవుతుంది.

  • పొట్ట, థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
  • శ్వాస క్రియ సక్రమంగా ఉంటుంది.

4. పాదహస్తాసనము

విలోమ పాద హస్తానము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి.

మోకాళ్ళను వంచకుండా నడుము నుండి నెమ్మదిగా ముందుకు వంగి రెండు అరచేతులను రెండు పాదాల పక్కన ఉంచాలి. తలను సాధ్యమైన ముందుకు వంచుతూ మోకాళ్ళపై ఆనుకొనేలా చేయాలి.

ఉపయోగాలు:

  • అలసట, నీరసం తగ్గుతాయి.
  • పొట్ట బాగా తగ్గుతుంది.
  • ఎముకలు, కండరాల శక్తివంతం అవుతాయి.

సూచన: నడుము నొప్పి ఉన్నవారు ముందుకు వంగే ఆసనాలు వేయరాదు.

5. విలోమ పాదహస్తానము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు చేతులను మెడవెనుక కలిపి ఉంచి రెండు కాళ్ళను కత్తెర మాదిరిగా, వ్యతిరేక దిశలో పాదాలు ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ రెండు అరచేతులను పాదాల కిరువైపులా నేలపై ఉంచాలి. 5,6 శ్వాసల అనంతరంపైకి లేవాలి. ఇదే మాదిరిగా పాదాలను మార్చి మరోసారి చేయాలి.

ఉపయోగాలు :

  • కాలి కండరాలు, పొట్ట, మెడ, వెన్నెముక, భుజాలు శక్తివంతం అవుతాయి.
  • అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

6. ఏకపాద హస్తాసనము:

ఏకపాద హస్తాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలిని మడిచి కుడిపాదం ను ఎడమ తొడపై ఉంచి, రెండు చేతుల్ని పైకెత్తాలి. నెమ్మదిగా ముందుకు వంగుతూ రెండు అరచేతులను ఎడమపాదంకు, ఇరువైపులా ఉంచాలి.  5,6 శ్వాసల అనంతరం యధాస్థితికి వచ్చి ఇదే మాదిరిగా ఎడమకాలిని మడిచి కుడిపాదం ప్రక్కగా రెండు అరచేతులు ఉండేటట్లు చేయాలి.

ఉపయోగాలు :

  • తొడలలో ఉన్న కొవ్వు కరుగుతుంది.
  • శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
  • అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
  • శరీరభాగాలు శక్తివంతం అవుతాయి.

7. ఏకపాద అంగుష్టానము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి.  రెండు కాళ్ళను కాస్త దూరం జరిపి రెండు చేతులను నడుముపై ఉంచాలి. కుడికాలును ముందుకు చాచి కుడిచేత్తో కుడి బొటనవేలును పట్టుకొని కాలుని వంపు లేకుండా సాగదీయాలి. నాలుగైదు శ్వాసల అనంతరం సమస్థితికి వచ్చి మరో కాలుతో ఇదేవిధంగా చేయాలి.

ఉపయోగాలు :

  • కాళ్ళు, చేతులు నొప్పులు తగ్గును.
  • ఏకాగ్రత కుదురును.
  • వెన్ను నొప్పికి చక్కటి ఆసనం.
  • శరీరం సమస్థితికి వస్తుంది.
  • చక్కటి నడక అలవడుతుంది.

8. అర్థచంద్రాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు కాళ్ళను వీలయినంత దూరం జరిపి కుడిపాదంను కుడివైపుకు తిప్పి రెండు చేతులు పైకెత్తాలి. నెమ్మదిగా కుడివైపుకు వంగుతూ కుడిచేతిని కుడిపాదం పక్కన ఉంచి ఎడమకాలిని పైకెత్తాలి. నాలుగైదు శ్వాసల తరువాత యధాస్థితికి వచ్చి మరలా ఎడమవైపు ఇదేవిధంగా చేయాలి.

ఉపయోగాలు :

  • వెన్ను నొప్పి తగ్గుతుంది.
  • ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది.
  • కాళ్ళు, వెన్నెముక, భుజాలు శక్తివంతం అవుతాయి.
  • సమతుల్యత మెరుగుపడుతుంది.
  • జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.

9. పవిత్ర అర్థచంద్రాసనము

పవిత్ర అర్థచంద్రాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు కాళ్ళను వీలయినంత దూరం జరిపి కుడిపాదంను కుడివైపుకు తిప్పి రెండు చేతులు పైకెత్తాలి. నెమ్మదిగా కుడివైపుకు వంగుతూ ఎడమచేతిని కుడిపాదం పక్కన ఉంచి ఎడమకాలిని పైకెత్తాలి. నాలుగైదు శ్వాసల తర్వాత యధాస్థితికి వచ్చి మరలా ఎడమవైపు ఇదేవిధంగా చేయాలి.

ఉపయోగాలు :

  • వెన్నునొప్పి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది.
  • జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • గ్యాస్ సమస్య తగ్గుతుంది.
  • కాళ్ళు, వెన్నెముక, భుజాలు శక్తివంతం అవుతాయి.
పార్శ్వకోణాసనము

10. పార్శ్వకోణాసనము

చేయు విధానము: తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి.  కాళ్ళ మధ్య వీలయినంత దూరం ఉంచి కుడిపాదంను కుడివైపుకు తిప్పుతూ మోకాలి వద్ద  90 డిగ్రీల కోణంలో ఉంచాలి. కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని తరువాత శ్వాసను తీసుకుంటూ యధాస్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమవైపు చేయాలి.

ఉపయోగాలు

  • సయాటికా, నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది.
  • శరీరంలోని అన్ని భాగాలు శక్తివంతం అవుతాయి.
పరివృత్త పార్శ్వకోణాసనము

11. పరివృత్త పార్శ్వకోణాసనము

చేయువిధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కాళ్ళ మధ్య వీలయినంత దూరం ఉంచి కుడిపాదంను కుడివైపుకు తిప్పుతూ మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. కుడిచేతిని పైకెత్తి ఎడమ అరచేతిని కుడిపాదం ముందు నేలపై ఆనించాలి. నాలుగైదు శ్వాసల అనంతరం యధాస్థితికి వచ్చి మరోవైపు చేయాలి.

ఉపయోగాలు :

  • సయాటిక, నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గటంతోపాటు కండరాలు, చేతులు గడ్డి పడతాయి.
  • అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

12. పరిఘాసనము

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. శ్వాస విడుస్తూ రెండు కాళ్ళను వీలయినంత దూరం జరిపి, అరచేతులు నేలను చూస్తున్నట్లు భుజాల పక్కకు చేతులను సమాంతరంగా చాచాలి. నెమ్మదిగా ఎడమకాలిని మడిచి కుడికాలును పూర్తిగా చాచాలి.

శ్వాస తీసుకుంటూ రెండు చేతులను నమస్కార ముద్రలో ఉంచి, మరలా నెమ్మదిగా శ్వాస విడుస్తూ రెండు చేతుల మధ్య నుండి తలను మోకాళ్ళకు ఆనించాలి.

ఈ స్థితిలో నాలుగైదు, శ్వాసలు తీసుకున్న తరువాత యధాస్థితికి వచ్చి, తరువాత మరొకవైపు చేయాలి.

ఉపయోగాలు :

  • పక్కటెముకలు, చేతులు శక్తివంతమవుతాయి.
  • జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
  • వెన్నెముక సాగదీయబడును.
  • మెడ కండరాలు బలోపేతం అవుతాయి.
October 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us