మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

84 వేల మంది మునులున్న నైమిశారణ్యం ఎక్కడుంది ? విశిష్టత ఏమిటి !?

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) November 24, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

మనకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ నైమిశారణ్యములో సూత మహర్షి శౌనకాది మునులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం చెప్పినట్లుగా చెబుతారు. ఈ విషయం మనం విన్నదే ! మనకు తెలిసిందే ! ఈ నైమిశారణ్యం ఎక్కడుంది ? నైమిశారణ్యం విశిష్టత ఏమిటి ? ఈ వ్యాసంలో తెలుసుకుందాం !!

నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.

నైమిశారణ్యం వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం.

నైమిశారణ్యం చరిత్ర

ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో “నైమిశ” మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగిప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాం చింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది.’నిమి’ అంటే చక్రకైవారం, అరణ్యం – అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురు లను ఈ ప్రాంతంలో సం హరిస్తాడు. నిమి (లిప్త) అంటే సెకండులో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొన బడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి ‘లలితా పంచకాన్ని’ రచించినట్టు చెబుతారు.

వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.

గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది.

నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.

శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.

చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ,శంక మందిరాలు,వ్యాసగద్దె, సూతగద్దె, గోమతి నది, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, దధీచి, సీతారామ మొదలైనవి ఉన్నాయి.రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉంది.
నైమిశారణ్యం,విశేషాలు, విశిష్టతలు
నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు. సరళ,తెల్ల తెగడ, కొండగోగు,ఉమ్మెత్త, దేవదారు, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, నకుల (పొగడ),ఏడాకుల పొన్న సప్తవర్ణ , పునాగ, సురపొన్న, నాగకేసర నాగకింజల్కము నాగకేసర , శాల,తాటి, తమాలము (చీకటిమాను), మద్ది, చంపక సంపెంగ.

నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం,సైంధవారణ్యం, జంబుకారణ్యం,
పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడక మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యడు.

శ్రీరాముడు….

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ. లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి ‘సీతాపురం’ అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. అరణ్యములో దాదాపు 84 వేల మంది ముళ్ళతో షాపు నక్క మహర్షి సమావేశమై తొలిసారి భాగవత పారాయణం చేసింది ఇక్కడే. ఏదైనా చూడు మహాభారత కథలు మొదట తన కుమారుడు శుభ మహర్షికి ఇక్కడే చెప్పాడు శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వర్షం పాయనుడు చెప్పిన కథను చూతుడు మరోసారి శ్రవణ కాదు మురళి అందరికీ ఇక్కడే చెప్పాడు. ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న అరణ్యం ఇది ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం ఉన్నది.

అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే !

ఇది ఋషులు నివసించిన ధ్యానం చేసిన మరియు వారి సాధన చేసిన అరణ్యం ఇది తపో భూమి లేదా ధ్యానం చేసిన భూమి. ఈ ప్రాంతంలో వారు కేంద్రీకరించిన సామూహిక శక్తి నైమిశారణాయను భారతీయ ప్రదేశాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నైమిశారణ, నైమిష్, అని కూడా పిలుస్తారు. నాలుగు యుగాలలో నాలుగో ప్రాథమిక తీర్థాలు లేదా తీర్థయాత్రలు ఉండేవని చెబుతారు మొదటి యుగంలో అంటే సతయోగంలో నైమిశారణ్యం త్రేతా యుగములో పుష్కరం, ద్వాపరలో కురుక్షేత్రం, కలియుగంలో గంగానది ఉన్నాయి. ఆడవి ఇప్పుడు లేదు. చక్కగా చదును చేయబడిన రోడ్లు. యాత్ర స్థలంగా మార్చారు.

November 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ద్వేష ఖననం

by Dr. Thanda Harish November 24, 2025
written by Dr. Thanda Harish

అసూయ ఆమడదూరంలో కూర్చుంటుంది
ద్వేషం అతడి దేహంలో బతకలేక
ఖాళీ చేసి వెళ్ళిపోతుంది
శేషాల లెక్కల్లో
శత్రువుల సంఖ్య సున్నా

కవికో కవితావాక్యాన్నిచ్చే మంచితనం
అతడిలో ప్రసరిస్తున్నందుకేమో
చంద్రుడు తలపాగా మీద వెలుగుతుంటాడు
ప్రియమైన పాటలన్నీ చెవులను ముద్దాడుతుంటాయి
మసకచీకట్లే టార్చ్ లైట్లయి ఎదురొస్తాయి
చిరు చిరు జల్లులు
పూలలా మీద కురుస్తాయి
చురకలు పెట్టిన చేతులే
లేపనాన్ని పూస్తాయి

అహం కొలతలు తగ్గించబడి
దూరాలు దగ్గరగా నిలుచున్నప్పుడే
నిజమైన ప్రేమ..గుండెలను చీల్చుతూ
బయటికొస్తుంది

సన్నని గీతలను చెరిపేసినందుకో
అంతరాలను ఖననం చేసినందుకో
పగ, ప్రతీకారాలను కనబడకుండా ఊడ్చేసినందుకో
జీవన లయాన్విత చందమామకు
గోరుముద్దలు తినిపిస్తూ
ఆ కాంతుల్లో మెరిసిపోతున్న
ఆనందకర దృశ్యాల్లోనే
అతనిప్పుడు తడిసిపోతున్నాడు

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కోట చరిత్ర

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) November 24, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

ఎలిగందుల గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతుంది.ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉంది.

గ్రామం చరిత్ర
కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది.
1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.
1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉంది.1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది.

ఈ గ్రామం పూర్వం కాకతీయుల పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు, ఎలగందల్లోని చారిత్రక ప్రదేశాల్లో శ్రీరామాలయం, నీలకంఠస్వామి ఆలయం, ఆలంగీరు మసీదు, నిజాముద్దేలా అసఫ్ జాహీ కూతురు మెహరున్నీసా ఖానుమ్ సమాధి మందిరం, అనేక ముల్లాలు, మౌల్వీల సమాధులు ముఖ్యమైనవి.

ఎలగందల్ కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ గ్రామంలో ఉంది. కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల జిల్లా రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో అడివి మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశము, మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్-దౌలా చేత నిర్మించబడింది.
ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

కరీంనగర్-వేములవాడ రహదారిలో ఎలగందల్ కోట నుండి మానకొండూరు వరకు 9 కిలోమీటర్లు మేర రహస్య సొరంగం ఉందని నమ్ముతారు.

చరిత్ర
ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ లు దీనిని దృఢంగా చేశారు. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకొని, క్యుయినముల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు. తదనంతరం, మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్లింది. హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ నిజాం అసఫ్లాహ్ (1724-1748), ముగర్రాబ్ ఖాన్ హయాంలలో, అమిన్ ఖాన్ ఎలగందల్ కు ఖిలేదార్ గా నియమించబడ్డాడు. నవాబ్ సలాబత్ జంగ్ హయాంలో మిర్జా ఇబ్రహీం దంసా ఖిలేదార్ అయ్యాడు. సికందర్ ఝా (1803-1823) హయాంలో 1754 లో దంసా ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్ ఖాన్, కరీముద్దీన్ లు తరువాతికాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. కరీముద్దీన్ పేరుమీద కరీంనగర్ గా మారింది. 1905 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా, ఆరవ నిజాం మహాబుబ్ అలీ ఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందల్ నుండి కరీంనగర్ కి మార్చారు.

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు వెడల్పు, 4 మీటర్లు లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారు. ఈద్ ప్రార్ధనల కొరకు ప్రత్యేక మసీదును కూడా ఈ కోటలో నిర్మించారు.
కొండమీది కోటను ఎలగందల్ కోట అంటారు ఇది ఒక చారిత్రక ప్రదేశం. దోమినార్ దోమినర్ను ముస్లిం మతం రాజులు అంటే నిజాం రాజులచే నిర్మించారు ఇది చార్మినార్ స్తంభాల ఎత్తున 2 పొడవైన స్తంభాలతో ఉంటుంది.

ఎలగందల్ కోట చరిత్ర
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట అంటే కిల్లా ఉంది ఈ మధ్యనే తెలంగాణ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు ఎత్తైన కోట గోడలు అగర్తలు బలమైన చెక్క తలుపులు , వంకర దారులు రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతుంది టర్కీ ఫంచి ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలివుంది ఈ గిరి దుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు 1195లో ప్రసిద్ధ యాదవ వంశపు రాజు జైతుగి ఎలగందుల కోటను పశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహుమనీ సుల్తాన్ లో పాలనలో ఉంది. మొఘల్లులో ప్రత్యక్షంగా 39 సంవత్సరాలపాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందుల్ కోటకు ఖిలాదారుగా పనిచేశారు., 1905 వరకు జిల్లా యొక్క పాలన యంత్రాంగమంతా ఎలాగందలు కోట నుండి కేంద్రీకృతమై ఉండేది.
మానేరు నది తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఎలగందలు కోట నిర్మించబడి. కోటకు ఒకవైపు మానేరు నది,మరొకవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడనుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకోడూరు గ్రామానికి సురంగ మార్గం ఉన్నదని ప్రతీతి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరిదుర్గం ఆ తర్వాత బహుమనీల,కుతుబ్షాహీలు, ఇమాత్ షాలు, అసఫ్ జహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండ శిఖరాల ఉన్న కోట తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దవుల చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్ దూల షాహ్ సాహెబ్, సయ్యద్ మారుస్ సాహెబ్, షాహ్ తాలిబ్, వలి హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఈ మినార్లు ఎక్కడానికి లోపలికి నుండి మెట్లు ఉన్నాయి. ఈ గ్రామంలోనే ఇంకో చివర దోమినార్ అనే కట్టడం ఉంది ఇది ముస్లింలు పండుగ రోజుల్లో ప్రార్థన చేసి ఈద్గా దీనిని బహుమనీ సుల్తానులు నిర్మించారు దీని పైకి వెళ్లడానికి కూడా లోపల నుండి మెట్లు ఉన్నాయి. ఇది ఒక పర్యాటక చారిత్రక ప్రదేశం.

November 24, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పండువెన్నెల పలుకు

by రూపాదేవి November 24, 2025
written by రూపాదేవి

సినీ వినీలాకాశ వీధిలో
అందాల కోకిలమ్మ
మా సుశీలమ్మ కు
పుట్టిన రోజు శుభాకాంక్షలు.

గాత్ర శుద్ధతకు, వాక్ స్పష్టతకు
మా సుశీలమ్మ నిలువెత్తు రూపం!
అమ్మ స్వరం తేనె
అమ్మ అక్షరం వెన్నె
అమ్మ ఉచ్చారణ చెక్కిన శిల్పం
బ్లర్ ఉండని high filter కంఠం
అమ్మ పాట వింటే
అలసట పోతుంది
అమ్మ పాట పాడుకుంటే
ఉత్సాహం నిండుతుంది
అందాల మోము
పసిపాప నవ్వు
పండువెన్నెల పలుకు
కనులకు చెవులకు ఇంపు

November 24, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

దళిత సాహిత్య కేతనం

by Vemula Ellaiah November 24, 2025
written by Vemula Ellaiah

“బేగరి కథలు, దగ్ధం కథలు, మా పల్లె కథలు, బుగాడ కథలూ వంటి కథలను, మాలచువమ్మ , ఇగురం వంటి నవలలను, కులాత్కమ్ నాటకాన్ని , మారవారి చరిత్ర నూ రచించి అస్తిత్వానికి చిహ్నమైన రచయితగా ప్రసిద్ది పొందిన కవి, రచయిత భూతం ముత్యాలు సాహిత్య ప్రస్తానాన్ని మయూఖ పత్రిక ముఖాముఖి లో తెలుసుకుందాం….

01. కవి రచయిత ఏమిచెప్పిండు అనేది వస్తువు, ఎట్లచెప్పిండు అనేది శిల్నమౌతుంది. ఎందుకు చెప్పిండుధృక్పధంఅయితది. అందరికి తెలిసిందేగదా మీ రచన మూల సూత్రం చెప్పండి ?

జ:కథా, కథన, శిల్ప, ధృక్పదం గూర్చి మీ ప్రశ్నలోనే సమాధానముందు. ఇక నా రచనలకు మూల సూత్రం అంటారా? అది ఊరిలోని దళిత వాడ జీవితం, వాడ జీవితాలను దగ్గరగా చూసి, స్వీయనుభవంతో, రచనలు చేస్తున్న నారచనలకు మూలాలు వాడ బతుకు చిత్రమే. మట్టి మనుషుల వెతలు, ఆకలి, అంటరానితనం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, నిరుద్యోగంతో కునారిల్లుతున్న దళితులే నా (ఇన్స్పిరేషన్ప్రేరకులు), అందునా నేను ఒక దళితుడను కావడం, నా బాల్యం నుంచి పైన చెప్పిన అంశాలు నన్ను ఏదో ఒక సందర్భంలో పీడనకు గురిచేశాయి. నా మూలాల్లోకి నేను తొంగి చూసి నిజాల్ని నిర్భయంగా నికార్సుగా చెప్పే ప్రయత్నం చేశా…., చేస్తూనే వుంటా….

02. తెలుగు సాహితీ లోకంలో దళిత సాహిత్యం ఆగిపోయింది, ఆరిపోయింది అనిబుకాయిస్తు, మనువాదులకు సవాల్ వినురుతూనల్లగొండ కేంద్రంగా దళిత సాహిత్య సదస్సు 2002న మీరు ” బర్రె ” అనే కవిత చదివిండ్రూ, ఆ ప్రవేశం మీకు ఎటువంటి అనుభూతి నిచ్చింది. చెప్పండి?

జ:మీరన్న దాంట్లో కొంత నిజముంది. నేను 2000సంవత్సరం లో తెలుగు సాహిత్యంలోకి అడిగిడే నాటికి దళిత సాహిత్యంలో కొంత స్తబ్దత ఏర్పడింది కాని పూర్తిగా ఆగిపోలే, ఆరిపోలే… దళిత సాహిత్యం ” నివురుగప్పిన నిప్పులా “.చాపకిందనీరులాప్రవహిస్తు ” నాలాంటి వారి మస్తిష్కాలలో నిక్షితమైంది. 2002లో నల్గొండలో దళిత సాహిత్య సదస్సు జరిగింది. ఆ వేదిక నాతోటివర్తమాన కవులకు దిశానిర్దేశం చేసింది. అలా నా అస్తిత్వ ములాల్లోకి వెళ్ళాను. గోవును పవిత్రంగా భావించి పూజించే సంస్కృతి అగ్రవర్ణాలది. దాని కంటే ఎక్కువ శ్రమజేసి ఎక్కువ పాలు ఇచ్చె బర్రె, తన సలుపు రంగు వర్ణం కారణంగా వివక్షకు గురైంది. అందుకే దానిని నా జాతికి చిహ్నంగా భావించి” బర్రె కవిత రాశా. వివక్ష మనుషులోనే కాదు జంతువులలో ఉంది. అనేది నిజం… ఆ కోణంలో వచ్చిందే ” బర్రె” కవిత….

03. దళిత కవిత్వ ప్రస్థానంల మీరూ “ దుగిలి దీపం వెలిగించిండ్రూ, అది ఎట్ల సాధ్యమైంది చెప్పండి? కవిత్వం తెచ్చిండ్రు సాహిత్యమనే దుగిట్ల

జ:స్థబ్దత కాలంలో దళిత సాహిత్య సదస్సు నాకు దిశానిర్దేశం చేయగా, అంతకు ముందు నేను భావవాద, అభ్యుదయవాదం, ప్రణయ కవితల ఊహాల్లోతేలియడే నాకు వేముల ఎల్లయ్య (కక్క నవలాకారుడి) సూచనలు నన్ను ప్రభావితం చేసిదళితవాదంవైపు మళ్లించాయి. ” పాయిదా” (గుడిపాటి వ్యాసాలు) కూడ నాలో నూతన జవసత్యాలు నింపాయి. నేను చేయాల్సింది, రాయాల్సింది నా మూలాల్లోకి వెళ్లి శోధన చేశా.. అందుకు ” ఏడుతరాలు ” నవల, బోయ జంగయ్య రచనలు అందుకు దోహదం చేశాయి. వాటికున్న శక్తి అటువంటిది. అలా మొదటదుగిలి ” దళిత కవిత్వం వెలువడింది.

04. నాగరికత అంటే ఆదివాసులు, దళితులది. కాని సంస్కృతి తెల్వని అగ్రవర్ణాలు సాహిత్యంలో బలవంతులెటైండ్రూ?

జ:నాగరికత చలనశీలమైంది. నిత్యం నూతన మార్పులు చోటుచేసుకుంటాయి. అది ఒకనాడు దళితుల, ఆదివాసలు, అయిన ఈ దేశ మూల వాసుల సోత్తు.అసలు ” సంస్కృతిని శ్రామికులు, కళాకారులు, శాస్త్రవేత్తలు నిర్మిస్తారని గోర్కి తన వ్యాసాలలో పేర్కొన్నారు”. అలా దళిత, ఆదివాసుల శ్రమతో నిర్మితమైన సంస్కృతి నేడు అగ్రవర్ణాల చెప్పుచేతుల్లోకి వెళ్లింది. ఒకనాడు శూద్రులు అయిన ఆధిపత్య కులాలు నేడు శాసనకర్తలైరి, సంస్కృతి పేరకల్చర్ని దళితులపై రుద్ది అదే దేశ సంస్కృతి అనిచలామనిచేస్తుండ్రు అగ్రవర్ణాలు, కాని ప్రతి జాతికి తమదైన చరిత్ర సంస్కృతి ఉందన్న విషయం మరవరాదు.

05. ప్రజా కవి రచయిత కడు బీదల వైపు ఉంటడు. మరి మీరు దళిత రచయిత ఎటువైపు ఉ ంటరు. మీ అభిప్రాయం చెప్పండి?

జ: నేను దళిత కవిని, ముందుగా దళిత పక్షం. పీడుతులు, అణచబడిన, అణగారిన, అట్టుడుగు వర్గాలు, అస్పృశ్యల జీవన సంవేదనలు. వారి ఇతిభాదలకు అక్షర రూపాలే నా రచనలు. నేను కథ రాసినా, నవల రాసినా అందులో వారే నా కథవస్తువులు, ప్రపంచంలోని ఏ కవి అయినా పీడిత జన పక్షంవైపు నిలవాలి. అలా నిలబడకుండా వారి జీవతాలను సృజించకుండా ఉండేకవి, రచయిత, రచయితగా మనలేదు. నేడు ప్రసిద్ధ కవులుగాపేరెన్నికగన్న కవులు  రచయితలు దళితుల జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని దళిత స్పృహతో రచనలు చేసారుపేరుగడించారు శ్రీపాద పుల్లంరాజు కథ,లేదా ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల, కారా మాస్టారు యజ్ఞం కథ, పాలగుమ్మి పద్మరాజు గాలిగాన కథ ఆ కోవలోనివి.

06. మీలో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసే పని సాహిత్యమైతే నీ బతుకు ఆధారంగా రచయితగా ఎట్లఫీలైతున్నవూ నీ ఫిలాసఫిఏంది?

జ:నేను బాల్యం నుంచే పీడనకు, విపక్షకు, ఆకలి, కడుదారిద్య్రం, మూఢనమ్మకాల కు, గురైన బాధితున్ని, అందుకు ప్రధాన కారణం కులం. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు వివక్ష ఉంటంది. అంబేద్కర్ఆశయమైన కుల నిర్మూలన ” జరగాలి. నేను ఎంచుకున్న పాత్రలతో రచయితగా సంతృప్తి ఉంది. కులాలు లేని -సమసమాజాన్ని కాంక్షించడమే నా ఫిలాసఫీ…

07. ఉత్పత్తి కులాల జీవితం కళాత్మకమైంది గదా! బేగరి కులం ధారువాతి దారుణమైన అవమానాన్ని ఎదురుకుంది దీనికి కారకులెవరంటురూ….?

జ: ఉత్పత్తి కులాలలో కళాత్మక సౌందర్యం ఉన్నప్పటికి అది శ్రమ నుంచి ఆవిర్భవించింది. ఇక బెగరికులాందైయనీయమైన జీవితం. మిగతా ఉత్పత్తి కులలకురోజువారి పని లభిస్తుంది. వారికి జీవనౌపాధి ఉ ంది. కుల వృత్తి ఉంది. కాని మాల బేగరికిఊరిలో ఎవరో ఒకరు చనిపోతేనే పని ఇది దుర్భరమైంది. ఇంతటి దర్భురమైన స్థితి ఏకులానికి లేదు. దీనికి ప్రధాన కారణం అగ్రవర్ణ ఆధిపత్య కుల వ్యవస్థ.

08. తొల్త మాల ఉపకులంబేగరి, మీరు బేగరి కథలు తెచ్చిండ్రు గా… నేపథ్యం చెప్పండ్రి?

జ:నామొదటి కథల సంపుటి “బేగరికథలు” (2007) ఇది తీసుకురావాడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ కథలకు ఆపేరు పెట్టడానికి నేను మాలబేగరి కావడమే. కులం కూడుపెట్టక పోవడంతో నిరక్షరాస్యులు అయినా నా తల్లిదండ్రులు హైదరాబాదుకు వలస వచ్చారు. అది 70వ దశకం, నాబాల్యంలో కొంత పట్నంలో గడిపిన. చిన్ననాటి నుండి నాకుంటుంబం పడిన కష్టాలు వర్ణణాతీతం. అవి పగవానికి కూడ రావద్దని కోరుతా. చదువులేని మూఢ నమ్మకాలు హెచ్చు. దానితో వారి కష్టం అంతా (సంపద) మంత్రతంత్రాలు చేసే భూత వైద్యుల పాలు అయ్యింది. ఆ సంఘటన తల్చుకుంటే దుఃఖం వస్తది. అ.. కులాన్ని, అ… వృత్తిని ఈసడించుకొని అందులో నుంచి బైటపడి కూలీ జీవనం సాగించడం కొంత మెరుగునిపించె అందుకే అస్తిత్వాన్ని తెల్పుతుబేగరి కథలు …

09. జీవిత అనుభవాన్ని అక్షరాలుగా వొంపిన మీరూ వర్ణనకు కారణం చెప్పండి?

జ:ఏదైనా కథ, నవల, కవిత చదివినప్పుడు అవి చదివే పాఠకున్ని, ఆకట్టుకోవాలంటే వర్ణనలు అవసరం. మన ప్రబంధకవులు, 18 రకాల వర్ణనలు పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఎవరు ఏ రచన చేసినా (కథ, కవిత, నవల, నాటకం) కాసింత సింబలైజ్ చేసి చెబితే పాటకునిదరి చేరుతుంది. అందుకే చెప్పాలనుకున్నది సూటిగానే చెబుతూ దానికి అవసరం మేరకు కొంత వర్ణనాత్మకం జోడిస్తే పాఠకుల మతిలో నిల్సిపోతుంది. అందుకే నేనేకాదు అందరూ, అలా రచనలు చేస్తురు. కాని నేను వర్ణనకు పూనుకుంటే మట్టి పరిమాలలేవిరబూస్తాయి.

10. మీకు కొంత, చరిత్ర తెలుసు, స్థానిక దళిత యోధులను రాక్షసులుగా పురాణాలలో, ఇతిహసాల్లో చిత్రించిన చరిత్ర చెప్పండి?

జ:మనుషుల ప్రస్థావన రాక పూర్వం పురాణాల్లో దేవతలు రాక్షసులు, దాయాదులు(అన్నదమ్ములు), పక్షులు, జంతువులు ఈ నాలుగు సృష్టించినాక దాయాదుల పోరులో దేవత కుట్రలు కుయుక్తులతో ఆధిపత్యం దేవతల వశం అవుతుంది.తర్వాత మనిషి పుట్టక మానవకళ్యాణం లోకహితం జరగాలంటెముందుగాశివపార్వతులు కళ్యాణం జరగాలి, అటుతరువాత దేవతలు తమ కృత్యాలతోటి మోసాలు చేస్తేశపించబడిన దేవతలు భూమిపై రాక్షసులుగా పంచమలుగా పుట్టారని పురాణగాథల ద్వారా తెలుస్తుంది. ఇదంతా అదివాసులను, దళితులను ఒక్కవైపుఅణగదోక్కుతూ, పీడినకు గురి చేస్తునే శాపం నేపంతో దళితులను అక్కున చేర్చుకొనే ప్రయత్నం హిందు వర్ణ వ్యవస్థది. అందులో భాగమే దళితులు…

11. పాఠకులు వర్తమాన గమనంలో దళిత సాహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, మీరు చెప్పదలచుకున్నదిఏంది?

జ:నాడైనా, నేడైనా పాలకులు, కవులు, పాఠకులు పట్టం గట్టేది దళిత జీవితాల నేపథ్యం ఉన్న సాహిత్యానికే అని మరవరాదు. చాసో ” ఎంపు”, “కుంకుడాకు “, రావిశాస్త్రి “రత్తాలు రాంబాబు”, పాలగుమ్మి పద్మరాజు”గాలివాన. “, కాళీపట్నం రామారావు” యజ్ఞం ” కథా శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు “నన్నుగుర్చి రాయవు, చివరకుమిగిలేది “, గోపిచంద్ ” అసమర్ధని జీవయాత్ర”, త్రిపురనేణి రామస్వామి, చెరబండరాజు, వట్టికోట ” ప్రజల మనిషి “, బి.ఎస్. రాములు ” బతుకు పోరు, పాలు, సదువు”, బోయ జంగయ్య ” ఎచ్చరిక. చీమలు . గొర్రెలు, నా పేరు రాయోద్దు. కుండబద్దలుకొడతా, దొరసాని, తొడపాము, జాతర, జగడం ” వేముల ఎల్లయ్య “కక్క సిద్ధి” చిలుకూరి దేవపుత్ర” సోము, శిఖామణి, మువ్వలచేతికర్ర, ఎండ్లూరి సుధాకర్ “గోసంగి, కుసుమ ధర్మన్న” హరిజన శతకం, మాకు కొద్దునల్లదొరతం” మొదలగు దళిత, దళితేతర కవులు, రచయితల రచనలు దళిత నేపధ్యం ఉన్న సాహిత్యమే ననిగుర్తెరగాలి.

12. మీరు నవలా రచయితగా ఐదు నవలలు రాసిండ్రూ. పోలికలు, సామెతలు, జాతీయాలు, వాటి తాత్విక నేపథ్యం ఏమిటి?

జ:నేను ఇంతకు మందే చెప్పినట్టు కథాంశం ఏది అయినప్పటికి కథ సూటిగా చెబుతూనే కొంత సింబలైజ్ చేసి చెబుతాం. ఇక పోలికలు, సామెతలు, నుడికారాలు అంటారా ప్రపంచసాహిత్యంలో తెలుగుకు ఒక విశిష్టత ఉంది. అది తెలుగు భాషలో ఉన్నన్ని జాతీయాలు, సామెతలు మరెప్రపంచభాషలో లేవు. అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం మన ఊరి జనం, వాడ జనం, మన పూర్వికులు, ప్రతి సందర్భంలో ఏదో ఒక్క సంఘటనకు ఒక సామెతకాని, జాతీయ పదాని కాని, విసరడం చూస్తాం. చేసే పనులలో పోల్చుతూ, మూఢత్వాన్ని దెప్పిపొడుస్తు బుద్ధిని ఉపదేశిస్తూ, నీతిని భోదచేస్తూ వీటిని వాడారు. అలా నా నవలలో నేను సందర్భానుసారంగా పై పదాలను వాడుకొవడం జరిగింది.

13. సూర ” నవలలో సూరని పాత్ర ద్వారా మీరు అందించిన సందేశమేమిటి?

జ: “సూర ” నవల “గ్యోబాక్ టు విలేజ్” సూత్రాని అమలు చేసే ప్రయత్నం, చదువుకున్న యువత ఉ న్నఊరిని వదిలి పట్టణాలకు వలస వెళ్లితే గ్రామాలు అలాగే నిర్జీవంగా (ఎలాంటి అభివృద్ధికి నోచుకొక, అంధ విశ్వాసాలతో) ఉంటున్నాయి, మార్పు పల్లెల్లో జరగాలి, వాడలలో జరగాలి. అందుకే సూర నవలలో చదువుకున్న సూరడు తన ఊరు చేరి, ఊరిని ఉద్దరించాలని సంఘసంస్కరణకునడుంబిగాస్తాడు. అందులో భాగంగా వాడలో “ఫూలే అంబేడ్కర్ పాఠశాల పెట్టి పల్లె, వాడజనానికిఅక్షరజ్యోతిలు వెలిగించి నిరక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాలనను పారదోలాలనే ఆశయంతో ముందుకుసాగుతాడు.

14. భూతం ముత్యాలు అనగానేసాహితీలోకంలోబుగులు పట్టుకుంది, మీరు ఎట్లాఫీలవుతుండ్రు?

జ:నవ్వుతూ…… ఈ తెలుగునేలపై ఎందరో ప్రజాకవులు, ప్రజా వాగ్గేయకారులు ఉండ్రు. వారిని చూసి నేను గర్వపడుతా.. నావంతుగా పీడిత జాతి జనం గొంతుకనైయి సాహితీ సేద్యం చేస్తున్నా. సాహిత్యంలో కొనసాగే కవులు తన రచనలలో ” నిక్కమైన నీలమొకటి చాలు” అన్నట్టు ఒక రచన వారిని కవిగా సాహితీ క్షేత్రంలో చిరస్థాయిగా నిలుపుతాయి. నా రచనలలో అలాంటిది ఒక్కటి ఉన్న చాలు. తాలు గింజల రచన కాలంతో కొట్టుకపోతాయి. నేనన్నా. నా రచనలన్నామింగుడుపడని వారికి అది బుగులు రేపితే దానికి నేనేంచేయను. వారు స్వతహాగా తమ రచనలతో పైకి రావాలి, అంతేగాని ఒక్కరిపై ఒక్కరు ఈర్షపడితే, లేదా పొగిడితే ఒచ్చెదేంలేదు.వారి రాతలు  వారు సృజించిన సాహిత్యమే వారిని నిలబెడుతుంది. ఎవ్వరైనా ఎదుటివారి ప్రతిభ గుర్తించాలి.

15. ఒక వ్యాసకర్త, తాత్వికుడు మొదట గ్రామాలు ధ్వంసం కావాలన్నడు. గ్రామ పునాదుల మీద కవిత్వం రాశారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి?

జ:నిజానికి గ్రామాలు ధ్వంసం కావాలని నేను ఆకాంక్షిస్త… ఎందుకంటే గ్రామాలలోనే మితిమీరిన అందవిశ్వాసాలు, కులకట్టడలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు, అంటరానితనం, నిరక్షరాస్యత అధిక్యం, నన్నేతీసుకొండి…. నేను నిమ్నవర్గం…. నా బ్యాలం నుండి నా ఊరిని వదిలి చదువు నిమిత్తం పట్టణానికి వలస వచ్చా. ఇక్కడనే వసతి గృహాలలో చదువుకొని ఇక్కడ నుంచే ఉపాధ్యాయునిగా స్థిరపడ్డా. నా ప్రవృత్తి రచన, వ్యాసంగం. ఇపుడు ఊరి వైపు చూస్తే నాకే జాలి కలిగింది. నా తరువాత తరం నుంచి నేటికి ఒక్క  ఉద్యోగి నా వాడ నుంచి రాలేదు… అది మారని ఊరికి నిదర్శనం…. అందుకే నేను గ్రామాలు ధ్వంసం కావాలని కోరుకుంటునే, గ్రామాలను ఉద్దరించాలన్న తపనతో ” సూర” నవల రాయడం జరిగింది…

16. ఊరి దళిత కవులకు పల్లె మట్టి మీద ప్రేమ ఎందుకు? ఈ ప్రేరణకు కారణమేమిటి?

జ:ఉన్న ఊరు కన్న తల్లిలాంటిది అంటారు. అందుకే ఊరిపై మమకారంతో చాలామంది కవులు తమ కవితలలో, పాటలలో ఊరును ఊరు మట్టి వాసనలను వెదజల్లుతుఊరినికీర్తిస్తు రచనలు చేశారు. కన్న తల్లి, తండ్రి, ఒక రైతు కూలి, ఒక పాలేరుగా ఊరిజన జీవితాలు మట్టితో మమేకమైతాయ్.” అమ్మయాది “, ” నాయనమనాది ” కవితలలో (దుగిలిసంకలనంలోవి) మట్టివాసనలు పుష్కలంగా కనిపిస్తాయి. అసలు మనిషి మట్టిలో నుంచి వచ్చి చివరకు మట్టిలో కలవాల్సిందే. పల్లె మట్టివాసనల పరిమళసుగంధాలు ఆస్వాదించాలంటే పల్లె వాడ జీవితాలను తడిమి చూస్తె గాని అది భోదపడదు.

17. అగ్రవర్ణకవులు కలిసి ఉన్నట్టే ఉండి దళిత కవులను  రచయితలను విడగొట్టడమేమిటి?

 జ:మీరన్నది నిజమే…. వారిది కడుపునిండిన కవిత్వం, వారికి శ్రమైకజీవనసౌందర్యం అంటే ఎట్ల తెలుస్తుంది. ఆకలి కేకలు, అప్పుల బాధలు బాంచెను బతుకులు, బతుకుఎతలు, అస్పృశ్యత, పీడన, దళిత కవుల సొంతం. దళిత కవుల బలహీనతలైన ఆకలి, పేదరికం, నిరుద్యోగం వీటి ఆసరాతో వారు దళితుల మధ్య చీలికలు తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకుంటుండ్రు. దళితులను ఉద్దరిస్తున్నమని చెప్పుకునే పాలకులు, అగ్రవర్ణకవులు వారికి అనుంగులుగా మారిన ఒకరిద్దరు దళిత కవులకు బిక్షవేసినట్టు పదవులో, పురస్కారాలో ఇచ్చి దళిత కవులు ఉద్దరిస్తునమనిఉపన్యాసాలిస్తరు. భీమన్న, జాషువా, జంగయ్య, కుసుమ ధర్మన్న, జయంతులు, వర్ధంతులు జరిపి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారి గుర్చి ఎక్కడ కూడ సరిగా గుర్తు చేయకపోవడం అందరికీ తెలిసిందే. దీనిని దళిత కవులు గమనించి అంబేద్కర్ ఆశయంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా……

18. ఒక ప్రాంతాని మననం చేసుకొవాలంటే చారిత్రక స్పృహ ఉండాలి. ఈ ప్రాంతంలో అలజడికిలంగాణ సాయుధ పోరాటం గడ్డ నల్లగొండలోఅంబేద్కరిస్టుదృక్పధం కావడానికి కారణం చెప్పండి?

జ:స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు, దొరలు, దేశముఖ్ లు, నాడు కులమతాలకు అతీతంగా దురాగతాలు సాగించారు. నాటి ప్రపంచ విప్లవాల ప్రభావం మనపైపడడటంతో ఇక్కడి ప్రజలు నల్లగొండ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించిండ్రు. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఘట్టం కాని స్వాతంత్య్రనంతర పరిస్థితుల వేరు అధికార మార్పిడి జరిగింది కాని ఈ ప్రాంత దళితుల జీవితాలు మారలే, అదే సమయంలో అంబేద్కర్ భావజాలం దేశ నలుమూలల విస్తరించింది. ఈ నేలపై మెదరిభాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కరణకు పూనుకున్నాడు. అక్షరం అంటరాని వాడకు నడిచివచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ” అంబేద్కరిస్టుదృక్పధంతో ముందుకు సాగిండ్రు “. ” అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్ధాంతానికి ” పీడిత ప్రజలు జేజేలు పలికారు…. వాస్తవిక దృక్పధం నాటి ఆధిపత్య కవులు దళిత సానుభూతి రచనలు చేశారు. అలా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలం పురుడుపోసుకుంది.

19. తెలంగాణ సాయుధ పోరాటం గడ్డ నల్లగొండలోఅంబేద్కరిస్టుదృక్పధం కావడానికి కారణం చెప్పండి?

స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు, దొరలు, దేశముఖ్లు, నాడు కులమతాలకు అతీతంగా దురాగతాలు సాగించారు. నాటి ప్రపంచ విప్లవాల ప్రభావం మనపైపడడటంతో ఇక్కడి ప్రజలు నల్లగొండ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించిండ్రు. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఘట్టం కాని స్వాతంత్య్రనంతర పరిస్థితుల వేరు అధికార మార్పిడి జరిగింది కాని ఈ ప్రాంత దళితుల జీవితాలు మారలే, అదే సమయంలో అంబేద్కర్ భావజాలం దేశ నలుమూలల విస్తరించింది. ఈ నేలపై మెదరిభాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కరణకు పూనుకున్నాడు. అక్షరం అంటరాని వాడకు నడిచివచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ” అంబేద్కరిస్టుదృక్పధంతో ముందుకు సాగిండ్రు “. ” అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్ధాంతానికి ” పీడిత ప్రజలు జేజేలు పలికారు…. వాస్తవిక దృక్పధం నాటి ఆధిపత్య కవులు దళిత సానుభూతి రచనలు చేశారు. అలా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలం పురుడుపోసుకుంది.

20. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం కథ నిర్మాణ పద్దతులు చెప్పండి?

జ: ప్రత్యేక తెలంగాణ నినాదంతో సాయుధ పోరాటం 1969లోజరిగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ సాహిత్యంలో తమ గొంతుకను వినిపించారు. మరి ముఖ్యంగా గత రెండు దశాబ్దల నుండి ప్రాంతీయ అస్తిత్వ వాదం పుంజుకుంది. ఈ ప్రాంతపు రచయితలు బి.ఎస్. రాములు, అల్లం రాజయ్య, బోయ జంగయ్య, వేముల ఎల్లయ్య. తుమ్మెటిరఘోత్తమ రెడ్డి, ముదిగంటి సుజాత రెడ్డి, జాతశ్రీ, భూతం ముత్యాలు, పెద్దింటి అశోక్ కుమార్, దేవరాజు మహారాజు, కాలువ మల్లయ్య తదితరలు తెలంగాణ అస్తిత్వ వాదనతో కథ రచనలు చేశారు. వీరు ఈ ప్రాంత జనజీవితాలను కుంగదీసిన గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు దోపిడి, పీడన నేపథ్యంలో కథలు కొత్త పుంతలు తొక్కాయి. యదార్థ, వ్యధాభరిత దృశ్యాల్ని సంఘటనలను కథలుగా మలిచి తెలంగాణ అస్తిత్వవాదం పేరిట కథలు, కథసంకలనాలు తీసుకొని వచ్చారు. ఉద్యమకాలంలో హోరు, బద్లలా తదనంతరం అనేక కథలు వచ్చాయి.

21. సామాజిక ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఆవిర్భావ అనంతరం దళిత సాహిత్య పరిస్థితులు చెప్పండి?

జ:తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో దళిత కవులు పాలుపంచుకున్నారు. బోయ జంగయ్య, గూడ అంజయ్య, జాతశ్రీ, వేమల ఎల్లయ్య, భూతం ముత్యాలు, పసునూరి రవీందర్, గాదె వెంకట్, మన్నెఏలియా, జిలకర శ్రీనివాస్, కొమ్ము సుధాకర్, పిట్టల శ్రీనివాస్, జూపాకసుబధ్ర, జాజుల గౌరి, గోగు శ్యామల, మద్దెలశాంతయ్య, బన్నఅయిలయ్య, గౌరటి వెంకన్న, జయరాజ్, పైల్లం సంతోష్, వరకుమార్, సిద్దెంకి యాదగిరి, ఇక్కడి పరిస్థితలుకు అద్దం పట్టేలా రచనలు చేస్తునేవుండ్రు. ఐతే ఇందులో కొందరు కవులు పాలకులకు అమ్ముడుపోయినట్టు వారి తీరు వారి రచనలలో కనపడది. కాని ప్రలోభాలకు లొంగని కవులు ప్రజాపక్షంవైపు ఉండి జనహితమే… తమ హితంగా రచనలు చేస్తుడండ్రు. దళితులలో చీలికలు తీసుకవచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నారు అధిపత్య కవులు. అయితే అది తాత్కలికమని మరవరాదు.

22. తెలంగాణ సాహిత్యం తరువాత మరో ఉద్యమ సాహిత్యం రాబోతుందా? అలా వొచ్చేదుందా?

జ: ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ దొరల తెలంగాణగా అవతరించింది. తెలంగాణకై పొరాటాలు చేసి అసువులుబాసి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల కొరుకున్న తెలంగాణ ఏర్పడలేదు. తాత్కాలిక అవసరాలు తీర్చే నేతలు మాటలు నేతి మీర చందం అయినయ్. కాని యువత ఆకాంక్ష అయిన విద్య, ఉద్యోగ, ఉపాధి, కలగానే మిగిలింది. నీళ్లు, నిధులు మాటలకే పరిమితమ్యైంది. కవులు పాలకుల వైఫల్యాన్ని ఎండగుతుఆదిశగా రచనలు మరిన్ని రావాల్సివుంది. వస్తయని ఆశిస్తున్న ఏ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్ష మేరకే మనగలదు. విఫలమైతే పలాయనం తప్పదు.

23. సంస్కరణోద్యమ కర్త గురుజాడ, విప్లవకవిచెరబండ, ” మంచియన్నదిమాలయైతేమాలనేనగుదున్ “, ఉందరామాలపేట ఊరి కష్టాలున్న కాడ ” అగ్రవర్ణులు కదా! గీల్లనుఎట్లా అర్థం చేసుకుంటరు చెప్పండి?

పై వారిలో ఒక్కరు ” ముత్యాల సరాలు రాసిన కవి “గురజాడ ” కవితా పాదంలో పేరున్న వాక్యం అది, అతని సంస్కర్త హృదయాన్ని సూచిస్తుంది. అది సానుభూతి రచనగానే చూడాలి అని భావిస్తున్న. ఇక చెరబండరాజు విప్లవ కవి విప్లవంలో కులముంది. శ్రమ జీవుల పక్షం వహించి చెరబండరాజు రచనలు చేసినారు. కాని దళిత పక్షాన రచనలు చేసివుంటే మేము అతన్ని అక్కున చేర్చుకునేవాళ్లం. అలా జరగలేదు. అయినను చెరబండరాజును ప్రజాకవిగా గుర్తింస్తాం.

24. దళిత సాహిత్య ఉద్యమం, దళితోద్యమం, అస్తిత్వ పరిధిలో బంధించడానికి కారణమేమిటి చెప్పండి?

జ:అది అగ్రవర్ణ కవుల కుట్ర, ఎందుకంటే ఒక ఆధిపత్య కవి ఎలా రచన చేసినా అతను కులం, ప్రాంతం, ఎల్లలు దాటి విశ్వకవిగాచలామనిఅయితడు. “పుల్లంరాజు ” కథ రాసిన శ్రీపాద ” మాలపల్లి ” నవల రాసిన ఉన్నవ, ” ముత్యాల సరాలు రాసిన గురజాడ, చాసో “ఏంపు, కుంకుడాకు” కార మాష్టారు “యజ్ఞం ” కథ, పాలగుమ్మి పద్మరాజు ” గాలివాన ” కథలు తెలుగు సాహితీ ఎల్లలు దాటి విశ్వవిపణిలో పేర్లుగడిచాయి. అదే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని కరువు పెడుతు రచన చేస్తే ప్రాంతీయ వాది అని ముద్ర వేస్తారు. అలాగే దళిత నేపథ్యంలో వాడ బతుకులను చిత్రించి తమ కులం, జాతి ఇతి బాధలను అక్షరబద్ధం చేసి రచనలు చేస్తే దళిత కవులని, దళిత అస్తిత్వవాదులని పేరు పెట్టి పిలవడంను పరిపాటి అయ్యింది ఆగ్రవర్ణ కవులకు. నిజానికి దళిత జీవితాలను కథలుగా మలచినవారువిశ్వకవులు అయ్యారు. తమ్మని తాము ఆర్తితో గోడు వినిపిస్తే దళిత కవులు అని ముద్రవేస్తారు. ఇది కుట్ర కాక మరి ఏమిటి?

25. కళాత్మక వ్యక్తీకరణకు మీ రచన ఎలా తోడ్పాటునందించింది?

జ:బురద నీటిలో కమలం వికసించిన తీరుగా మట్టి మనిషుల జీవితాలను వారిదైన యాస భాషలోనే కళాత్మకత దాగి ఉంది. వాడ బతుకులను రంగరించి రచనలు చేశా…. వారి బతుకు చిత్రాలు నా కథ వస్తువులు కావడం ఒక ఎత్తు అయితే  నేను అవాడ నుంచి వచ్చిన మట్టి మనిషి బిడ్డను కావడం నా అదృష్టం. కళాతృష్ణ అనేది చూసే చూపును బట్టి ఉంటుంది. చూపులో తేడా వుంటే కళా ఖండం కూడ అందవిహీనంగానే కనిపిస్తుంది. నా రచనలు అలా వాడ సోబగులతో బట్టిపురుడుసోపుకున్నాయి. అందుకే అవి సజీవాలై అందరి మన్ననలు పొందుతున్నాయి.

26. యూనివర్సిటీలోసూర, పురడు నవలలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి గదా ! ఎలా అనిపిస్తుంది?

జ:నాకు చాలా సంతోషమనిస్తది. నేను సజీవంగా ఉండగానే నా రచనలు యూనివర్సిటీలలో పాఠ్యాశాంలుగా ఉండడం నా అదృష్టం. అందుకు కారణం ఆ నవలలోని పాత్రలు, పాత్రచిత్రణ, వాడజనుల, పల్లె జనుల, యాస భాష రచన నేను చేసిన ఆ గొప్పదనం దళిత వాడ జీవితానిదే. మా ఊరిలో ఇప్పటికీ మాది పురిగుడిసె. నాయన (ఇపుడు లేడు ) కూలి, ఓ రిక్షావాలా, అమ్మ కూలి నాలి, వారు కష్టపడి నన్నింతవాన్ని చేశారు. వారు పడిన కష్టాలు, వెదనలు, బతుకు సంవేదనలు నా జీవితంపై చెరగని ముద్రవేశాయి, నాలో సాహిత్యానికి మూలధారం వారే. వారే లేకుంటే నేను లేను. నా రచనలు లేవు. అది వారి చలవ…

27. దళిత రచయితలు ఎవ్వరు చెయ్యలేని దళిత వృతి పదకోశం ( మాండలికం) రాశారు. స్వీయ జీవిత చరిత్రల విశిష్టతలకు గుర్తింపు ఏమైనా వొచ్చిందా?

జ:నాకు అవార్డులు రివార్డులు అయితే రాష్ట్రస్థాయిలోపొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం 2017 సంవత్సరానికి నేను రాసిన మొగలి దళిత నవల ఉత్తమ నవల గ్రంథంగా పురస్కారం ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావ దినమైన జూన్ 02 , 2017 సంవత్సరానికి నల్లగొండ జిల్లా స్థాయి ఉత్తమ కవి పురస్కారంతో జిల్లా కలెక్టర్ మరియు అధికారులు సన్మానించారు.కాని నా రెండు నవలలు సూర దళిత నవల కాకతీయ విశ్వవిద్యాలయంలో 2013 సంవత్సరం నుండి ఎంఏ తెలుగు విద్యార్థులకు సిలబస్ గా ఉంది. అలాగే పురుడు నవల శాతవాహన విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. అదే సమయంలో బెంగళూరు విశ్వవిద్యాలయంలో సూర దళిత నవల తెలంగాణ నవలగా ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా అంశంగా చేర్చినారు అది గొప్ప అనుభూతి ఆనందం సంతోషం.అయితే నా రెండు నవలలు (సూర, పురుడు ) యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉండటమే నాకు లభించిన పెద్ద గుర్తింపు. నేను ఇప్పటి వరకు రాసిన కథలు , నవలలు, కవిత్వం, తెలంగాణ నిఘంటువు పాఠకుల దరి చేరాయి. విమర్శకుల మన్ననలు పొందాయి. నేను రాసిన ” మాలవారి చరిత్ర” ఒకసంవత్సరంలో అయిదు ముద్రణలు పొందింది. రెండు దశాబ్దాల సాహితీ ప్రస్థానంలో పాఠకుల ఆదరాభిమానాలు రచనలు చూరగొన్నయి. ఓపిక ఉన్నంతవరకు రచనలు కొనసాగిస్తా….. నా సాహిత్యానికి పాఠకులు ఉన్నారు. అది చాలు….. అదే పదివేలు….

November 24, 2025 4 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం యొక్క విశిష్టత, మరియు ప్రయోజనము

by Nellutla Madhava Srinivas November 24, 2025
written by Nellutla Madhava Srinivas

కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే ముందు ప్రమిద మీద కాస్త పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి దీపంలోనికి ఆ భగవంతున్ని ఆవాహన చేయాలి. ఆవాహన చేసేటప్పుడు చదవవలసిన మంత్రం త్రయంబక మావాహయామి అని గాని దామోదర మావాహయామి అని గాని చెప్పి ఆ దీపాన్ని పరమేశ్వరుడిగా గాని, దామోదరుడిగా గాని భావించి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి.
ఆ దీపస్వరూపమే దామోదరుడు లేదా పరమేశ్వరుడు.

ఆ *దీపమే పరబ్రహ్మము *అటువంటి దీపాన్ని వెలిగించుట వలన కలుగు ప్రయోజనములు
ఈ లోకంలో కొన్ని లక్షల, కోట్ల ప్రాణులు ఉన్నాయి కానీ …..అవి తమను తాము కానీ, ఇతరములను గాని ఉద్ధరించు శక్తి కానీ, భగవాన్నామస్మరణ చేయగల శక్తి గాని కలిగి లేవు. కానీ మానవుడు ఎంతో ఉత్కృష్టమైన మనిషి జన్మను పొంది ఉండటం వలన ఇతర ప్రాణులను ఉద్ధరించుటకు కావలసిన విభూతిని పొంది ఉన్నాడు. కనుక ఇతర ప్రాణులను ఉద్ధరించడానికి ,చెట్లు, జంతువులు, పశువులు, పక్షులు, కీటకాలు, మొదలగు ఎన్నో చరాచర జీవరాసులకు అనుగ్రహం చేయగలిగే అనువైన తిథి ఈ కార్తీక పౌర్ణమి. (మనం ఈ భూమి మీద ఎన్నో ప్రాణులను మన అవసరాలకు వాడుకుంటున్నాం అందులో మొట్టమొదట చెప్ప తగినవి చెట్లు) ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే దీపాన్ని మన చుట్టూ ఉన్న ప్రాణులు చూసిన కారణం చేత అవి మరల జన్మను పొందవు అని ఋషి వాక్యం.🙏🏻🙏🏻 అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించకుండా ఉండటం వలన ఇతర ప్రాణుల వలన మనం ప్రయోజనం పొంది వాటికి విముక్తి కలిగించకపోవడం వలన కృతఘ్నతా దోషం కూడా పొందుతారు మానవులు. తద్వారా మనిషి జన్మకు అర్థం కాని సార్ధకత గాని కలగవు .కనుక ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించి మన చుట్టూ ఉన్న జీవకోటికి విముక్తిని కలిగిస్తారో… వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోగలరు . కాలాతీతులు కాగలరు . ఫలితంగా పుణ్యాన్ని సంపాదించుకోగలరు. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగించి ఈ మానవ జన్మకు సార్ధకత పొందుదాం.

లోకా సమస్త సుఖినోభవంతు

November 24, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

రంగరాజు పద్మజ అందించిన జయలక్ష్మి సాహితి భక్తి భండారి

by Sammeta Vijaya November 24, 2025
written by Sammeta Vijaya

డేంకణి కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మిగారి భక్తి భండారి- సాహిత్య సంభారి అనే పుస్తక రచయిత్రి రంగరాజు పద్మజ గారు. రంగరాజు పద్మజ గారు 1953లో మహబూబాబాద్ ఇనగుర్తి లో జన్మించి ప్రస్తుతం జనగామ వాసిగా ఉన్నారు. వీరు  గృహిణి.  హరిదాసి, మనసే కోవెల ,గుండె లోతుల్లోంచి, వ్యాస వితతి ,చిత్ర కవితలు, నాటి నుంచి నేటి వరకు, ఖడ్గ తిక్కన పద్య కావ్య పరిష్కృతం , కవిత విరిమాల వంటి అనేక రచనలు చేసిన విదుషీమణి.

   వ్యాఖ్యాన సామ్రాజ్ఞి,  సహస్ర పద్య  కంఠీరవ,  ఆర్ష  ధర్మ ప్రదీపిక బిరుదులు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాతృ వందనం ,  తెలంగాణ సారస్వత  పరిషత్తు నుండి వరిష్ఠ పురస్కారం,  సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం , అక్షరయాన్ అభిజ్ఞ నుంచి వెంగమాంబ పురస్కారం అందుకున్నారు. ఒద్దిరాజు సోదరులలో ఒకరైన రాఘవ రంగారావు గారి పుత్రికగా తెలంగాణ వేగుచుక్కలైన తండ్రి బాటలో నడిచి సాహిత్యాన్ని పండించారు.

   పరిశోధనాత్మకంగా చేసిన వీరి రచన డేంకణి  కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించిన రచన.  భక్తి భంఢారి  సాహిత్య సంభారి శీర్షికలోనే జయలక్ష్మి గారు ఒక భక్తి   భండారమని సూచించారు . శ్రీ జిఎస్ స్వామి మంగళాశీర్వచనంతో  ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి నిర్మల చరితం పేరుతో చక్కని సమీక్షతో ప్రారంభమైంది వీరి రచన.  ఆచార్య వెలుదండ  నిత్యానంద రావు గారు అన్నట్లు రంగరాజు పద్మజ గారు ఎంతో ప్రతిభ పూర్వకంగా ఔచిత్యం, ఆంతర్యం, సారం  ఏమాత్రం చెడకుండా సుదీర్ఘ వర్ణనలను కుదిస్తూ సరళా కృత వ్యవహారికానువర్తనం చేసి విద్వజ్జనుల ఆమోదం పొందారని చెప్పిన వాక్యాలు అక్షర సత్యాలు.

    డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు ఏ యే ప్రకరణాన్ని  రంగరాజు పద్మజ గారు ఎలా పరిచయం చేశారో వివరిస్తూ పాఠకులకు వడ్డించిన విస్తరిలా రచించారని ప్రశంసించారు. చక్కని శైలి అవసరానికి మించని వ్యక్తికరణలతో జీవిత సాహిత్య గ్రంథ రచనలకు మార్గదర్శకంగా సాగిన గ్రంథమని ఆదర్శవంతమైన అనుశీలన అని  అభివర్ణించారు.

    ఆచార్య ఇ సత్యనారాయణ గారు ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు  రచించిన ముందు మాటలు డేంకణి కోట తాముండే కుప్పం దగ్గరలోని అని చెబుతూ ఈ రచన ద్వారా బడిలో పెద్దగా చదవని జయలక్ష్మి గారు చేసిన వేలాది రచనలు మనకు తెలిసేలా రంగరాజు పద్మజ గారు చేశారని ఆనాటి సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళా సాధికారికత  సాధించిన మహిళ జయలక్ష్మి అన్న విషయం తెలిసిందని అన్నారు.

    అయినంపూడి శ్రీలక్ష్మి గారు అక్షరయాన్  వ్యవస్థాపక అధ్యక్షురాలు రచించిన ముందుమాటలో అసలు ఎవరు ఈ జయలక్ష్మి అంటూ ఒక పరిశోధక విద్యార్థిలా  జయలక్ష్మి గారి గురించి వివరాలు సేకరించి రచించారని ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైన కథని అనేక విషయాలు తెలుసుకొని కష్టపడి రచించిన రచన అని ఆ సామర్థ్యం రంగరాజు పద్మజ గారిలో పరిపూర్ణంగా ఉండడం వల్లనే అక్షరయాన్  మాతృ వందనం పురస్కారంతో సత్కరించామని అన్నారు.

జయలక్ష్మి గారి సంతానం కూడా తల్లిని గురించిన మనోభావాలను ముందుమాటలో పంచుకుంటూ హైదరాబాద్ నుంచి హోసూర్ కు వచ్చి మా తల్లి గారి గురించి వివరాలు సేకరించి క్రోడీకరించి రాయడం పట్ల ముగ్గులై రంగరాజు పద్మరాజు గారి శైలికి ధారణా శక్తికి  ఆశ్చర్య పడుతూ పుస్తకం తీసుకురావడంలో తోడ్పడిన అయినంపూడి  శ్రీలక్ష్మి గారికి సహకారం అందించిన శ్రీ అరుణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.  రంగరాజు పద్మజ గారు ప్రచురించిన అక్షరాలు జయ లక్ష్మమ్మకు స్వర్గ కానుకలు గా భావించారు.

డా కొండపల్లి నిహారిణి  తన ముందు మాటలో  పుస్తకం శ్రద్ధగా చదివి ఆనందిస్తూ తరిగొండ వెంగమాంబ మంజరి ద్విపద లో రాసిన ఆ లక్షణాలను వీరి రచనలో చూడవచ్చు అన్నారు  భక్తి దారుల్లో పయనించిన రంగరాజు పద్మజ గారు  భక్తి బండారి 300 పైగా పేజీలతో జీవిత చరిత్ర నా నవలనా  అని ఆసాంతం  చదివింపజేసే రచనగా రచించారని అదే రంగరాజ పద్మజ గారి గొప్పతనం అని అన్నారు.70 వ దశకం లో వీరి ఈ  రచన తప్పక చదవాలని సూచించారు

    ఆప్త వాక్యం పలుకుతూ రంగరాజు పద్మజ గారు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక రచయిత్రి ఆత్మకథ దీనిని ఆ భగవంతుడే నా చేత రాయించాడని అన్నారు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

    పుస్తకం లోపలికి ప్రవేశిస్తే ఇది మొత్తం ఆరు ప్రకరణాలుగా రూపొందించబడింది మొదటి ప్రకరణంలో జయలక్ష్మి గారి జీవితం గృహిణి ధర్మం జీవితంలో ఒడిదుడుకులు సాహిత్య రచనపై ప్రవేశం కలిగించిన అంశాలున్నాయి రెండవ ప్రకరణంలో ద్వాదశి మణిమాలలను గురించి రాశారు అప్పటికి తెలుగు రాక తమిళ లిపిలో రాసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. మూడవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన ఖండకావ్యాలు శ్రీరామ కథామృతం శ్రీమద్ భాగవత ఆణిముత్యాలు పరిచయం ఉంది నాలుగవ ప్రకరణములు రంగరాజు పద్మజ గారు జయలక్ష్మి గారు రచించిన అనుభవాలు వారి కుమారులు చెప్పిన అనుభవాలను వివరించారు ఐదవ ప్రకరణంలో ఆ అనుభవాలు కొనసాగిస్తూ వీరి కుమారులు చెప్పిన అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు ఆరవ ప్రకరణంలో శ్రీమతి జయలక్ష్మి గారి సాహిత్య జీవనం సమీక్షాత్మకంగా రచించారు.

    డేంకణి కోట  కోట జయలక్ష్మి గారు 1923 లో జన్మించారు సరిగా 102 సంవత్సరాల అయింది 27 లో స్వర్గస్తులయ్యారు 94

    సంవత్సరాల నిండు జీవితం బాల్యంలో పదేళ్ల నుంచి గో సేవ పాలు కాయడం పెరుగుచిలకడం వెన్న తీయడం పిడకలు చేయడం ఇల్లు అలకడం వాకిలి చిమ్మి ముగ్గులు వేయడం వంటివి ఆ కాలంలో అందరి స్త్రీల వలి చేశారు కానీ ఇదే నా జీవితం ఇంకా ఏదో ఉందని అనుకున్నారు అలా అనుకోవడమే ఈరోజు మనం ఆమె గురించి ముచ్చటించుకునే దశకు చేరుకుంది.

      ఆ కాలంలో ఉన్న మహిళలలో అరుదుగా కనిపించే విదుషీమణి జయలక్ష్మి గారు.  ఈ పుస్తక రచన రంగరాజు పద్మజ గారు రాయడానికి ఎందుకు పూనుకున్నారంటే  మనలో కొందరు కవిత్వం రాస్తారు కొందరు నవలలు కొందరు పద్యాలు కొందరు నాటికలు కానీ అన్ని ప్రక్రియలను సృజించిన కవయిత్రి  జయలక్ష్మి  గారు.

ఆమె జీవిత చరిత్ర ద్వారా రచయిత్రి రచనా కాలంలో సామాజిక గమనం పరిణామాలు స్త్రీలు వంటగదికే పరిమితమయ్యే కాలంలో అనేక రచనలు చేసిన మహిళా మణి గురించి రాయడం వల్ల ఈ రచన ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావంతో రంగరాజు పద్మజ గారు ఈ రచన చేశారు .

     జయలక్ష్మి గారి తల్లిదండ్రులు వెంకటరమణ అయ్యగారు లక్ష్మీ గారు జయలక్ష్మి గారి కుమారులు శ్రీరామమూర్తి గారు శ్రీ శ్రీనివాసన్ గారు వీరి కుమార్తె రమామని గారు జయలక్ష్మి గారు సింగమనే గ్రామంలో తిరువన్నామలైకు దగ్గరలో ఉన్న గ్రామంలో అమ్మమ్మ గారింట జన్మించారు. జయలక్ష్మి గారు ఉన్నది తమిళనాడులో . అక్కడ గ్రామ పాఠశాలలో మూడవ తరగతి అవగానే బడి మాన్పించారు అంతకుమించి వయసుగల వారిని బడికి పంపరాదు అని నియమం.

 అప్పటి కాలంలో చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. తనలో ఒక భావన వెంకటేశ్వర స్వామి తన భర్తని దానికి తగినట్లు ఆమెకి చూసిన సంబంధం వరుడు వెంకట రామయ్య గారు వారు చదివింది ఎస్.ఎస్.ఎల్.సి చివరికి తన భర్తని వెంకటేశ్వర స్వామి అనుకున్నారు జయలక్ష్మి గారికి నలుగురు సోదరీమణులు. అక్కడ పేదరికంతో పెరిగి మెట్టినింట కూడా అదే కొనసాగి అత్తింటి ఆరళ్లతో అనారోగ్యం పాలయ్యింది. జయ లక్ష్మీ గారి భర్త ఇంట వారి దూరపు బంధువు అమ్మాళమ్మ గారు భర్త మరణించి వీరింట చేరారు.  మరో బంధువు సుందరయ్య కూడా వారింట ఉండేవారు. భర్త వెంకటరామయ్య గారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు రామక్కమ్మ వెంకటసుబ్బయ్య గార్లు.. వారికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అందులో పెద్ద కొడుకు  వెంకట రామయ్య గారు వారి భార్య జయలక్ష్మి గారు. వెంకటసుబ్బయ్య గారి పెద్ద కూతురు లక్ష్మికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు .ఐదవ సంతానం 15 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు లక్ష్మీ గారు మరణించారు వారంతా వెంకటసుబ్బయ్య గారి ఇంట్లో చేరారు.  రెండవ కూతురు అన్నపూర్ణమ్మ ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు . ఆమె కూడా కూతురు జన్మించాక మరణించారు.  ఆ పిల్లల పోషణ కూడా వీరిదే సరిగ్గా జయలక్ష్మి గారి వివాహమై కోడలుగా వచ్చాక ఆ ఇంట్లో ఐదుగురు మేనల్లుళ్లు ,ముగ్గురు మేనకోడళ్ళు ,తన వయసున్న ఆడపడుచు తనకన్నా పెద్దవారైనా ఇద్దరు మరుదులు అత్తగారు మామగారు ఇంతకు పూర్వం మనం చెప్పుకున్న అమ్మాళమ్మ, సుందరయ్య వెరసి 17 మంది. మీరు కాకుండా వచ్చే పోయే బంధువులు. అన్ని పనుల భారం తన మీద పడేది. చెప్పుడు మాటలు విని భర్త కూడా ఆమె మనసును గాయపరిచేవారు . ఎవరికోసం బతకాలి అనే ఆలోచన మారేగానపల్లెలో అనుకొని గడిపారు జీవితం.

 భర్త అక్కడ నుంచి బెంగళూరులో ఉపాధ్యాయులుగా చేరారు. భర్త అక్కడ భార్య ఇక్కడ చాకిరీ చేస్తూ వారి ఇంట్లో ఉన్న అమ్మాళమ్మ గారు జయలక్ష్మి గారిని చెంగం  గ్రామానికి వెళ్లి సాకమ్మ రామాయణం రాసుకోమన్నారు అమ్మాళమ్మ ,  సుబ్బాలమ్మ ఇద్దరి వద్ద సాకమ్మ రామాయణం నేర్చుకున్నారు జయలక్ష్మి గారు. అక్కడ భార్య శ్రమను గుర్తించి వెంకట రామయ్య గారు జయలక్ష్మి గారిని బెంగళూరుకి తీసుకొచ్చారు.  అది చిన్న ఇల్లు దేవుడి గదిలేక వంటగది గోడకి బొట్టు పెట్టి అదే దేవుడిగా భావించే ఆమె అది చూసి వారి బంధువు ఒకతను రాముల వారి పటం తెచ్చి ఇచ్చాడు. అదే ఈనాటికీ వారి కుటుంబం పూజిస్తున్నారు. ఒక స్నేహితుడు వచ్చి భర్త మనసు మార్చి జయలక్ష్మి గారిని బాధింప చేయగా తాను ఆత్మహత్యకు కూడా పూనుకొనే  ప్రయత్నం చేశారు అని తెలిపారు రంగరాజు పద్మజ గారు.

   సాకమ్మ జయలక్ష్మి గారి బంధువే ఈ కథనాలు లో సాకమ్మ  వృత్తాంతం ఉంది తనకు నిద్రలో సరస్వతి దేవి నాలుక మీద రాసిందని సాకమ్మ చెప్పగా అందరూ సాకమ్మని గొప్ప దానివవుతామని భావించారు వీరి యక్షగానంలో ద్విపదలు పాటలు కీర్తనలు, పద్యాలు, భజనలు ఉంటాయి మచ్చుకి ఒక ఘట్టం హనుమంతుడు ఉంగరం అందుకుంటున్న ఘట్టాన్ని మనం గమనించినట్లయితే..

ఉంగరమా ఉంగరమా ముద్దుటుంగరమా !
ఓ తరుణీ నిన్నెడబాయనని పలుమారు బాసచేసెనే
ఉంగరమా ముద్దుటుంగరమా!
ఏక పత్నీవ్రతుడ నేను
ఏలా వగపు నీకు అనెనే
ఉంగరమా ముద్దుటుంగరమా అంటూ గమ్మత్తుగా సాగుతుందీ యక్షగానం.

   ఈ పుస్తకంలో జయలక్ష్మి గారి అందమైన చూచి రాతతో తాను స్వయంగా రాసిన పేజీలను జోడించడం పుస్తకానికొక వన్నె తెచ్చింది . సాకమ్మ యక్షగానం రామాయణం అంకితం వివరాలను కూడా పొందు పరిచారు.

    జయలక్ష్మిగారు భరించిన కష్టాలలో కొన్ని ఇంట్లో ఉన్న అమ్మాళమ్మగారు తన కూతురు మనవరాళ్ళు మరణిస్తే జయలక్ష్మి గారి రాక వల్లే ఇలా జరిగిందని ఆడిపోసుకున్నారు. ఆమె మానసికంగా చాలా కృంగి పోయారు . తన మూడవ కూతురు జన్మించి కొన్ని నెలలకే చనిపోవడంతో ఆ బాధలు మరింత పెరిగాయి. అయినా ఇంటిల్లిపాదికీ సేవలు చేసారు. 95 ఏళ్ల వరకు చైతన్య వంతంగా గాన మాధుర్యంలో తేలిపోతూ జీవించారు తళి అనే గ్రామంలో ఈ సమీపంలో వేణుగోపాల స్వామి శ్రీరాముని గుడులు ఉండేవి అక్కడకు వెళ్లి పద్యాలు కీర్తనలు పాడితే విజయలక్ష్మి గారికి పిచ్చి పట్టిందని అనుకున్నారంతా భూతవైద్యాన్ని పిలిపించి వైద్యం చేయించారు కూడా ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండగా పక్కన ఉన్న డేంకణి కోటకు బదిలీపై వచ్చారు. అక్కడ ఆమె భర్త ఇద్దరు కూతుర్లతో జీవనం గడపగా క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగైంది .1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఆమె బాధలకు విముక్తి కలిగిందని రచయిత్రి చెప్పడం ఔషధంగా అనిపించింది.

   తన దైనందిక దినచర్యను రంగరాజు పద్మజ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు పనివారు లేకుండా సమస్తము చేసుకుంటూ మధ్య మధ్య యక్షగానాలు ఆలపించే వారిని అందరికీ తన పాటలతో మేలుకొలుపులు పాడేవారని సూర్యుడికి , వీరుడికి  మేలుకొలుపులు తులసికి మేలుకొలుపులు కూడా పాడేవారు.

కరిమిప్ప బృందావనం ఎవరింట్లో ఉన్నాను
లేచి మొక్కిన వారి పాపములు పోవును
తులసమ్మ మేలుకొనవే తులసమ్మ మేలుకొనవే
కృష్ణ తులసి మేలుకొనవే
రామ తులసి మేలుకొనవే
లక్ష్మీ తులసి మేలుకొనవే
మేలుకొనవమ్మా తులసమ్మ మేలుకొనవే !

   ఉదయం లేవగానే తన పక్కన ఉన్న నోట్ బుక్కులో ఆల్వారులు,  రుక్మిణమ్మ,  అయ్యంగార్లు కొందరినీ స్మరించుకునేవారు. ఆఖేట వెంకటేశ్వరుని పూజించేవారు పండుగలు పూజలు వ్రతాలు చేసేవారు పది రోజులలో పూర్తి రామాయణం పారాయణం చేసేవారు.  త్యాగయ్య పురందరదాసులు రచించిన కీర్తనల మాదిరిగా తాను ఆఖేట  వెంకటేశ్వరునిపై  కీర్తనలు రాయడానికి పూనుకున్నారు.  అలా రాసిన ఓ భాగం…

రవితేజడు నీవని రామానుజల పలుకు
ఆదినారాయణడని హనుమంతుని పలుకు
వాసు దేవుడవు నీవని వైద్యుని పలుకు
డేంకణీ  ధరుడవు  నీవని జయ విజయులు పలుకు
మేలుకో శ్రీ బేటనాథా  మేలుకో!

     ఒక ప్రవాహంలా  ఉండేది జయలక్ష్మి గారి రచనలు భర్త సహకారం జయలక్ష్మి గారికి ఉండేది ఆమె తమిళంలో రాసిన వాటిని వెంకట్రామయ్య గారు తెలుగులో చేతితో రాసేవారు తన చేత్తో ఆ బేటనాథుని సుప్రభాతాన్ని రాసి అందరికీ పంపి సమీక్షించమని వారు ఒక కుమ్మరి పిల్లవాడు కూడా తెలుగులో ఆమె రచనలు రాసేవాడు జయలక్ష్మి కుమారులు కూడా కొంత భాగాన్ని తెలుగు లిపిలో రాశారు రకరకాల ఛందస్సు ఉపయోగించి పద్యాలను రచించారు తల్లిని అనుసరించి కూతురు రమామణి గారు ప్రహేళికలు ద్విపద పద్యాలు రచించారు.  ఆమె సోదరులు తల్లి రచనలను విశ్లేషించి ఎన్నో పుస్తకాలు ముద్రించారు జయలక్ష్మి గారు రచించిన కీర్తనలను బంధువుల ఇంట్లో ఇళ్లలో మహిళలు నేర్చుకొని పాడేవారు ఇంత గొప్ప సమాచారం అంతా మొదటి ప్రకరణలో అమర్చారు. రంగరాజు పద్మ గారు ఆమె జీవితం తెలుసుకుంటే ఆ తర్వాత ఆమె కృషి మనకు మరింత సునాయాసంగా అర్థమవుతుందని వారి ఆశాభావం

రెండవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన వివిధ కీర్తనలతో పాటు ఛందస్సు తెలుసుకొని 108 కి పైగా పద్యాలు రచించారు ఎక్కువ భాగం కందపద్యాలే. కందం రాయడం కష్టమైన పని అంటారు కానీ జయలక్ష్మి గారు సులువుగా రచించారు.

   పద్యాలను 108 కూర్చి 12 శతమని మాలలను ద్వాదశ శతకమని పేరుతో గ్రంథం గా తయారు చేశారు అరవిందమనే ప్రథమ శత మణి మాల కల్యాణోత్సవ ఉయ్యాల పాట గమనించినట్లయితే

  కుందనంపు కాళ్ళ చప్పరమందు
  పొందినటి నీలముల గొలుసుతోను
  అందమగు వజ్ర వేదిక మీద
  ఆఖేట నాథా నీవు ఉయ్యాలలూగు
అని  రచించారు .ఈ విధంగా ఒక్కొక్క శతమణి మాలకు ఒక్కొక్క పేరు అరవింద ,కదంబ ,నీలోత్పల ,కుండము ,చందూరము, వకుళ మాలిక,  మాలతీ మాల, మాధవి మాల, చంపకమాల సేమంతీక మాల ,పారిజాతమాల, తులసిమాల అనే ద్వాదశ శతమణి మాలలను ద్వితీయ ప్రకరణములో  పొందుపరిచారు.

    హృదయ ప్రకరణంలో ఖండకావ్యమని కొమ్మలు భాగవత ఫలాలు , అంతర్యామి అలసితి సొలసితి, సృష్టి సాకే నటరా మధురైన అంశాలను వివరించారు ఈ ప్రకరణంలో అంతర్యామి అలసితి సొలసితిలో   14 – 8 డా- 2017 న చివరి దశలో ఆమె పక్కన శ్రీనివాసన్ ,నరసింహన్ కుమారులు ఉన్నారని తెలియజేశారు.

     చతుర్ధ ప్రకరణములు అనుభవాలు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరలు

వరుసగా వివిధ సందర్భాలలో జయలక్ష్మి గారి అనుభవాలను వేంకటేశ్వరుని సాక్షాత్కారమును వెలుగు రేఖ కనిపించడం వంటి వాటితో విషాద పరిచారులలో రమామని రామమూర్తి శ్రీమతి ఉషా రామమూర్తి జానకి నరసింహ వీరంతా కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు ఏ విధంగా నడుస్తున్న చరిత్రలో వ్యాసం ప్రచురింపజేసారో వివరించారు.

    ఐదవ ప్రకరణంలో పట్టి కలలో వచ్చిన పుస్తక ఆవిష్కరణల వార్తలు జయలక్ష్మి గారిని ప్రశంసిస్తూ వచ్చిన కథనాలు పద్య పుష్పాంజలి శతజయంతి సంచిక శ్రీరామ కథామృతం జయలక్ష్మి గారి ఇంటర్వ్యూలు అన్ని పత్రికలలో వచ్చిన వాటి వివరాలను పొందుపరిచారు చేతిరాతతో రాయించి పుస్తకాలు ముద్రించి వేయ ప్రయాసలతో పుస్తకావిష్కరణలు చేయించారు ద్వాదశ శతమణి మాల సిడిలను ఆవిష్కరించారు.

    అస్వస్థులై 25 -1 – 2006న వేంకట రామయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు తర్వాత ఈ పుస్తకంలో ఇదే ప్రకరణలో జయలక్ష్మి గారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు.

     షష్ఠమ ప్రకరణంలో ఆసక్తి కలిగించే అంశం ఆ కాలంలో అది తమిళనాడు తెలుగులో డిటిపి అందుబాటులో లేదు తమిళ మాధ్యమంలో చదివిన సంతానానికి రెండవ కుమార్తె రమామని పెద్ద కుమారుడు రామమూర్తిలకు మాత్రమే తెలుగు చదివారు 1988లో శ్రీ పెరంబదూర్ ఆది కేశవ పెరుమాళ్ దేవాలయ జీయర్ గారు దేనికని కోట ప్రవచనాలు చేయడానికి ఆకీట వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి కొడుకు నరసింహాని చూపించిన జయలక్ష్మి గారి రాతప్రతి  చదివి పుస్తకం ప్రచురించినప్పుడు స్వయంగా ముందుమాట రచించడం ఇది గొప్ప ఆశీర్వచనం.

     నడుస్తున్న చరిత్ర పత్రికలో  తిరువళ్లిన్నేణి  మహత్మ్యం  అని వ్యాసం ప్రచురించబడింది. డేంకణి  కోట వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తమిళం తెలుగు సంస్కృత భాషలలో టీకా తాత్పర్య సహితంగా ముద్రించబడింది.2007 లో ఆఖేట వేంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అది దేవాలయంలో ఆవిష్కరణ జరిగింది సుప్రభాతం సిడి సౌమ్య అనే గాయని చేత పాడించి సిడి రూపంలో విడుదల చేశారు 2018లో నిహాల్ స్వరంలో అష్టోత్తర శతనామావళి ఆడియో విడుదల  చేశారు ఆంధ్రజ్యోతిలో వీరి గురించి ముఖాముఖి వచ్చింది.

     జయలక్ష్మి గారి రచనలు మొదటి గ్రంథం ద్వాదశ శతమణి మాలలు 12 శతకమణులు  సంపుటి దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రథమ తృతీయ దశమ ఏకాదశ ద్వాదశ శతమణులు కీర్తనలు . ద్వితీయ పంచమ, షష్ఠమ,  సప్తమ ,నవమ శతమణులు తెలుగు పద్యాలు శతమణి మాల పాశురము అనే తమిళ భాష రూపంలో ఉంది.

    మరొక ప్రత్యేక రచన శ్రీరామ కథామృతం 2019లో వెలువడింది మధ్య పుష్పాంజలి అనే పుస్తకం వందలాది కవీశ్వరులు జయలక్ష్మి గారి రచనలను అభినందించి వ్రాసిన పద్యాలు.

         ఈ విధంగా 39 సంవత్సరం నుండి రచనలు చేయడం ప్రారంభించిన జయలక్ష్మి గారు  12 శతకాలు ఐదు కావ్యాలు శ్రీరామ కథామృతం 30 ప్రబంధాలు కథనాలు 600 వరకు కీర్తనలు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి , మంగళ శాసనం కరావలంబ స్తోత్రం మొదలైనవి రచించారు.  స్థల చరిత్ర సంక్షిప్తంగా పద్యాల రూపంలో సమగ్రంగా వచనంలో రచించారు.

    మరొక విశేషం తెలుగు భాషలోనే కాదు సంస్కృతం తమిళ కన్నడ భాషలలో కొన్ని కీర్తనలు పద్యాలు సెయ్యుళ్ళు  రాసారు. విశేషమైన వీరి కృషిని ఈ రకంగా దేనికని కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించి భక్తి బండారి సాహిత్య సంబారి అనే శీర్షికతో ఒక పరిశోధనాత్మక గ్రంథానికి ఏ మాత్రం తీసుకోకుండా తమిళనాడు ఉన్న తెలుగు దేశాన్ని ఆమె సాహితీ సంపత్తిని మన ముందుకు తీసుకువచ్చారు రంగరాజు పద్మజ గారు .

   ఆమె శైలి సులభంగా అలతి అలతి పదాలతో అలవోకగా ఆద్యంతం చదివింపజేసింది.  తీసుకున్న ఇతివృత్తం ఎవరికి తెలియని ఒక విజ్ఞాన ఖనిని  అక్షరార్చనతో మన ముందు నిలబెట్టింది జయలక్ష్మి గారి రచనల  జాబితా లెక్కలేనంత ప్రింట్ లో ఆరు పేజీల వరకు ఉంది.

    ఆమె చేసిన సాహితీ కృషి అనన్యం అద్వితీయం అటువంటి మహత్తర మనిషి జీవితాన్ని రచనలను వెలుగులోకి తెచ్చిన రంగరాజు పద్మజ గారు అనే అనేక అనేక అభినందనలకు పాత్రులు ఈ పుస్తకం వెలికి తెచ్చిన కుమారులు పుస్తకం ఆవిష్కరణ అధ్యక్షత బాధ్యతలను చేపట్టి రంగరాజు పద్మజ గారిని గౌరవించిన అక్షర అధినేత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ గారికి మన పూర్వక అభినందనలు. వారి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు. ఆశీస్సులు.

   మనం నిత్యం అనే కానేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం సమస్యలు లేనిది ఎవరికి ? కొందరికి కొంచెం. మరికొందరికి పుట్టెడు. ఎన్ని ఉన్నా మన సంకల్పంతో తాను దైవాన్ని నమ్మి 95 సంవత్సరాలు యక్షగానాలతో కీర్తనలతో పద్యాలతో సుప్రభాతాలతో,  అష్టోత్తరాలతో , రామ గానామృతంతో అనేక రూపాలుగా తన హృదయం తన అక్షరం పరిపూర్ణం చేసుకొని మనందరికీ ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన డేంకణి  కోట కీ.శే. శ్రీమతి జయలక్ష్మి గారికి  స్మృత్యంజలి  ఘటిద్దాం.

   .

November 24, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వందేమాతరం

by రూపాదేవి November 24, 2025
written by రూపాదేవి

వందేమాతర గీతం… అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. దేశాన్ని మాతగా వర్ణిస్తూ ప్రేమ, భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం, ఉద్యమకారులు ‘పోరాట స్ఫూర్తి కేంద్రం’, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సమస్త జాతినీ ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు!

భారత దేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసిన బంకిం చంద్ర చాటోపాధ్యాయ 1875, నవంబరు 7న క్రింది పాదాలు రాశాడు.

వందేమాతరం
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం..
సస్యశ్యామలాం మాతరం.

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
పుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం

1905 అక్టోబర్ 16 న బ్రిటీషు వారి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఐక్య భారతాన్ని స్మరించుకునేలా తొలి సారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు ఠాగూర్

బిపిన్ చంద్రపాల్ వందేమాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశాడు.
వందేమాతరం నినాదాన్నీ వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలూ నడిపారు. సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్ ఘోష్ మొదటగా వందేమాతర గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ ప్రతి దక్షిణాది భాషలలోకీ కూడా తర్జుమా అయ్యింది. 1906లో పాథేఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది.

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్య కాలాన్ని ‘వందేమాతర యుగం’ అనవచ్చు. వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. గ్రామాల్లోనూ ‘వందేమాతరం సంఘాలు’ వెలిశాయి కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థిలోకమంతా ఉత్సాహంగా దూకింది.

తెలంగాణలోనూ 1938 నవంబర్ 28న బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గేయాన్ని గళమెత్తి పాడారు. వందేమాతరం విద్యార్థి ఉద్యమంగా రాజుకునీ హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది.

1947 ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్య్ర్యం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్ ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రాన్ని వినిపించారు.
అదే పర్వదినాన వందేమాతరాన్నే తొలి విజయ గీతంగా ఆల్ ఇండియా రేడియో లో ప్రసారం చేశారు!

1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ‘వందేమాతరం గేయాన్ని… రవీంద్రుడి జనగణమన జాతీయగీత సమానంగా గౌరవించాలి… అదే స్థాయి హోదాని కల్పించాలి’ అంటూ తీర్మానించింది.

రెండింటికీ సమాన హోదాయే ఉన్నా ‘జనగణమన’ పాడటానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఆ బాణీని ఎవరూ మార్చకూడదు, పాడే సమయమూ (52 సెకన్లు) మారకూడదు.

వందేమాతరానికి ఆ పరిమితులు లేవు. కాబట్టే వేలాది వెర్షన్లు వచ్చాయి.

దూరదర్శన్లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో … ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. సంక్షిప్తం

November 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సిద్ధార్థుని పూర్వచరిత్ర

by Dr. Aruna Parandhamulu November 24, 2025
written by Dr. Aruna Parandhamulu

ఉత్తర భారతదేమంతా ఒకే పాలనలో లేదుక్రీస్తు పూర్వం  ఆరవ శతాబ్దoలో. అనేక రాజ్యాలుగా విడిపోయి ఉంది. వాటిలో కొన్ని పెద్దరాజ్యాలైతే మరికొన్ని చిన్న రాజ్యాలుగా వుండేవి. ఈ రాజ్యాలలో కొన్ని రాజుల పాలనలో వుండేవి.

శాక్యులరాజ్యమైన కపిలవస్తు పూర్తిగా ప్రజాస్వామికమైనదా! కొన్ని కుటుంబాలచే పాలించాబడినదా!అనిఖచ్చింతంగానిర్ధారించి చెప్పేందుకు ఆధారాలు లేవు.అయితే కొన్ని పాలక కుటుంబాలుండేవనీ అవి ఒకటి తరువాత ఒకటి పరిపాలన చేసినట్లుగా చెప్పేందుకు మాత్రం కచ్చితమైనఆధారాలున్నాయి. వరుసక్రమం ప్రకారం పరిపాలన చేసేన పెద్దను “రాజు” అనేవారు. రాజులచే పాలింపబడిన రాజ్యాలను జనపదములనీ, రాజరికంలేని రాజ్యాలను సంఘాలనీ,గణాలనీ పిలిచేవారు.కపిలవస్తుశాక్యుల రాజధాని.

సిద్దార్థ గౌతముడు జన్మించేనాటికి తండ్రి శుద్ధోధనుడుకపిలవస్తుకు రాజు.ఇది ఒకప్పుడు స్వతంత్రంగా ఉండినప్పటికిని ఆ తర్వాత ఈ కోసుల రాజుల అధికారం కిందికి వచ్చింది. కోసలరాజుల ఆమోదం లేనిదే శాక్యులు రాజ్యాంగపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదు. ఆ కాలంలో రాజ్యాలఅన్నింటిలోకోసల రాజ్యం చాలా శక్తివంతమైనదిగా ఉండేది. ఆ తర్వాత చెప్పుకోదగ్గరాజ్యంమగధరాజ్యం. కోసల రాజు అయిన ప్రసేనుడు. మగధ రాజైన బింబిసారుడు సిద్ధార్థ గౌతమునికి సమకాలికులే

సిద్ధార్థుని పూర్వీకులు

గొప్ప హేతువాది అయిన కపిలుని పేరుపైనే ఈ నగరం వెలసియుండవచ్చుఅనిచారిత్రకారులుబావిస్తున్నారు.కపిలవస్తు పరిపాలించిన శాక్యులరాజుసినహుడు.జయసేనుని కుమారుడు.కాంచనసినహుడిభార్య. వీరి సంతానం ఏడుగురు సంతానం ఐదుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు1.శుద్ధోధనుడు, 2.దాతోధనుడు,3.శాక్యోధనుడు, 4.సుఖోధనుడు, 5.అమితోదనుడు. అయిదుగురు కుమారులుఇద్దరూకుమార్తెలు1.అమిత.2.పమితసిద్ధార్థ గౌతమునికి తాతసినహుడునాన్నమ్మకాంచన. సిద్ధార్థ గౌతముని తండ్రి శుద్ధోధనుడు, నలుగురు చిన్నాన్నలు ఇద్దరూ అత్తలు.

శుద్ధోధనుడు యుద్ధ విద్యలో ఆరితేరిన వీరుడు. యుద్ద పరీక్షలో అగ్రగణ్యుడుఅందుకుకారణంగా రెండవ భార్యని చేసుకోవడానికి అర్హుతకలవాడు కాబట్టిశుద్ధోధనుడుమహా ప్రజాపతిని కూడా పెళ్లి చేసుకున్నాడు.శుద్ధోధనుడికీ ఇద్దరు భార్యలు మొదటిభార్యమహామాయ రెండోభార్య మహాప్రజాపతి.మహామాయ తోబుట్టువు.మహాప్రజాపతి అక్క

శుద్ధోధనుడు గొప్ప ఆస్తిపరుడు విస్తారమైన వ్యవసాయభూములున్న కారణంగా పనివాళ్లు కూడ ఎక్కవ మంది వుండేవారు.వారి వ్యవసాయభూమిలోవేయిననాగళ్ళుపనిచేసేవట.సిద్ధార్థ గౌతముని అమ్మమ్మా సులక్షణ, తాత అంజనుడుమహామయతల్లిదండ్రులు.కొలియవంశీయుడైన యీఅంజనుడుదేవదాహ అనే గ్రామంలో నివసించేవారు.

సిద్ధార్థునిజన్మకథ

క్రీస్తుపూర్వం 563 వ సంవత్సరము వైశాఖ పౌర్ణమి రోజున మహామాయ సిద్ధార్థునికిజన్మనిచ్చింది.శుద్ధోధనుడు మహామాయలకు వివాహమైన చాలా ఏళ వరకు వారికి సంతానంకలుగలేదు.లేకలేక గలిగిన సంతానం కావడంతో వారి ఆనందానికీవధులేవుఅత్యంత వైభవంగా జన్మదిన మహోత్సవాన్ని జరుపుకొన్నారు. వారితో పాటు శాక్య కుటుంబాలన్నీ ఆ దినాన్ని పర్వదినంగ జరుపుకున్నారు.సిద్ధార్థగౌతమునికిజన్మించేనాటికి శాక్యరాజ్యానికి శుద్దోధనుడే పాలకుడు, ఆ కారణంగా రాజలాంఛనాలతో ఆ శిశువు జన్మదిన వేడుకలు జరిగాయి. తనతండ్రిఅపుడురాజుగనుక పుట్టిన కుమారుడు కూడరాకుమారుడైనాడు.పదవ రోజున బాలునికి నామకరణం జరిపారు ఆ బాలునికిసిద్ధార్థుడని పేరు పెట్టారు. గౌతమ వంశము కారణంగా సిద్ధార్థ గౌతమినిగా పిలువబడ్డాడు.

ఒకవైపునామకరణోత్సవం జరుగుతుండగా మహామాయ ఉన్నట్టుండి అస్వస్థతకులోనైంది.తనకు అంతమ ఘడియలు ఆసమైనట్టుబావించి మహామాయ తనసోదరిమహాప్రజాపతికీసిద్ధార్థున్నిపెంచిపెద్దజేసేబాధ్యతనుఅప్పజెప్పితుదిశ్వాసవిడిచింది.శుద్ధోధనుడుమహాప్రజాపతికన్నీరుమున్నీరై విలపించారు.

సిద్దార్థునికిఅప్పుడు ఏడు రోజులు వయస్సుమాత్రమే. మహాప్రజాపతి కుమారుడు నందుడు సిద్ధార్థ కంటే చిన్నవాడు. ఇద్దరిని పెంచి పెద్దచేసిందిమహాప్రజాపతి.

సిద్ధార్థునకు ఎనిమిదవ ఏటావిద్యబ్యాసం మొదలైంది.శుద్ధోధనుడుసర్వమిత్రుడను సకల శాస్త్ర పారంగతున్ని గురువుగా నియమించాడు. “సర్వమిత్రుడు” భాషాశాస్త్రం,వ్యాకరణశాస్త్రం, వేద వేదంగాది,ఉపనిషత్ శాస్త్రం లో పరిజ్ఞానం కలవాడు.సిద్ధార్థుడు గురు వద్ద ఆనాటి తత్వశాస్త్రాన్నింటినిక్షుణంగా నేర్చుకున్నాడు.ఉద్దిక్షుడుసిద్ధార్థునికి రెండవ గురువు. ఆ తర్వాత కపిలవస్తు ఆశ్రమ వాసి అయిన అలారకాలాముని శిష్యుడు భరద్వజుని వద్ద ఏకాగ్రత ధ్యాననిష్టలను కూడా నేర్చుకున్నాడు.

సిద్ధార్థుడొకనాడు తన సహచరులతో పాటు వ్యవసాయ క్షేత్రమునకు పోయి అక్కడ మండుటెండలో కొందరు వ్యవసాయ కూలీలు ఒంటికిబట్టలేకుండా కొందరు పొలాలను దున్నుతున్నారు. మరికొందరు గట్లు వేస్తున్నారు మరి కొందరు చెట్టు నరుకుతున్నారు వారందరినీ చూశాడు ఆ దృశ్యం సిద్ధార్థుని మనస్సును ఎంతో కలతపరిచింది.. ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఆ విధంగా దోచుకోవటం న్యాయం కాదని సిద్ధార్థుడు తన మిత్రులతో చెప్పాడు. శ్రామికుని శ్రమ ఫలితాలను అనుభవించడం న్యాయమెలా అవుతుందని వారిని ప్రశ్నించాడు.అయితే ఆ ప్రశ్నకు ఏలా సమాధానమివ్వాలో తన మిత్రులకు తెలియలేదు. ఎందుకంటే శ్రామికుడు తన యజమాని కొరకై శ్రమించడమే తమ ధర్మమని సనాతన సిద్ధాంతమే వారికి తెలుసు.

మృగాలను వేటాడే కార్యక్రమంలో సిద్ధార్థుడు పాల్గొనే వారు కాదు. అప్పుడు మిత్రులు అడిగేవారు? నీకు పులులుఅంటే భయమా! అని. అప్పుడు తన మిత్రులతో మీరు పులులను ఎందుకు చంపుతున్నారు? అవి మీకు ఇలాంటి హాని చేయడం లేదు కదా! అలాంటప్పుడు చంపడం ఎందుకని ప్రశ్నించాడుసిద్ధార్థుడు. తన మిత్రులనుండి ఎలాంటి సమాధానం రాలేదు.

నువ్వు వేటాడకపోయినప్పటికిని గురి పెట్టి బాణం ప్రయోగించడంలో మా నేర్పును చూసేందుకైనా మన వెంట రావచ్చు కదా!అని మిత్రులు అడిగేవారు. అందుకు సమాధానంగా సిద్ధార్థుడు మీరు అమాయక జీవులని చంపడం చూసి నేను భరించలేను అందుకు మీ వెంట రావటం నాకు ఇష్టం లేదు అని సమాధానం ఇచ్చేవారు.

సిద్ధార్థుని ప్రవర్తన పట్ల పెద్దమ్మ ఎంతో బాధపడేది.నువ్వు క్షత్రియుడవు యుద్ధం చేయటం నీ విద్యుక్త ధర్మం అని నీకు తెలుసు కదా? యుద్ధ విద్యలలోప్రావీణ్యం కోసం నువ్వు వేటకు వెళ్లాలి అనిచెప్పేది. సిద్ధార్థుని ప్రవర్తన తీరు పట్ల పెద్దమ్మ ఎంతో బాధపడుతుండేది.

అది సరేనమ్మా! అసలు క్షత్రియుడు ఎందుకు యుద్ధం చేయాలి?అనిసిద్ధార్థుడుప్రశ్నించాడు. అందుకు యుద్ధం నీ ధర్మం నాయనాఅని తన పెద్దమ్మ జవాబుచ్చేది.ఆ సమాధానానికి సిద్ధార్థునిమనసు అంగీకరించలేదు. ఒక మనిషిని మరో మనిషి చంపడం ధర్మము ఎలా అవుతుందని ఆమెను ప్రశ్నించాడుసిద్ధార్థుడు.

యుద్ధం చేయకపోవడం సన్యాసులకై చెల్లుతుంది కానీ నీవు క్షత్రియుడవు కదా! నీవు యుద్ధం చేయకపోతే

నీ రాజ్యాన్ని ఎవరు కాపాడతారు? అని ఆమె ప్రశ్నించింది.

అది సరేనమ్మా! ఈ క్షత్రియులు ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే ఒకరినొకరు చంపకోనక్కరలేకుండా వారి రాజ్యాలను వారు కాపాడుకోవచ్చు కదా అని ఎదురు ప్రశ్న వేసేవాడు సిద్ధార్థుడు.

ఆ ప్రశ్నలకు సమాధానం లేక వదిలేసింది పెద్దమ్మ.

సిద్ధార్థుడికి పదహారేళ్లు నిండియుడడంతో వివాహం కోసం ఆరాట పడుతున్నారు అమ్మానాన్నలు.శాక్యవంశీయుడైన“దండపాణి” పుత్రిక యశోధర. ఆమె సౌందర్యవతి శీలవతి కూడదండపాణి తన పరిసర ప్రాంతాల రాకుమారులందరిని తన కుమార్తెస్వయంవరంలోపాల్గొనవలసిందిగ ఆహ్వానాలు పంపాడు.యశోధరకు ఏర్పాటైన స్వయంవరంలో తప్పక పాల్గొనవలసిందిగసిద్ధార్థుణ్ణి తన తల్లిదండ్రులు కోరగఅతనందుకుఅంగీకరించాడు.యువరాజులందరిలోను సిద్ధార్థగౌతమునే యశోధర ఎన్నిక చేసికొన్నది.

అయితే దండపాణిసంతోషించలేకపోయాడు, అసలు వీరి వైవాహిక జీవనం కలకాలం కొనసాగుతుందాఅంటూఅనుమానించాడు.సిద్ధార్థుడుసాధువుల సాన్నిహిత్యాన్ని కోరుతుంటాడుగదా! ఎప్పుడూ ఒంటరిగావుండెందుకు ఇష్టపడుతాడుగదా! అలాంటివాడు సరియైన సంసారిలా కాగలడని దండపాణి ఆలోచించసాగాడు.అయితే యశోధరమాత్రంసిద్ధార్థునితప్ప వేరొకరినిపెళ్లిచేసుకోటానికి ఒప్పుకోలేదు. సాధువుల సాంగత్యం. సన్యాసులతో సమాగమం నేరమెలా అవుతుందో తెల్పమంటు తన తండ్రిని ప్రశ్నించేది. ఆమెతల్లి అమితశుద్ధోధనుడిచెల్లెలుపెళ్లిఖాయపరచవలసిందిగ దండపాణిని కోరింది. దండపాణి అందుకంగీకరించాడు.

అయితే స్వయంవరంలో పాల్గొన యువ రాజులు నిరాశ చెందడమేగాకతామని అవమానించినట్లు భావించి.ఏదో ఒక పోటీ నిర్వహించ వలసిందిగదా! అలా ఎందుకుజేయలేదని వారు ప్రశ్నించారు.ఆరాకుమారులంతా ఏకమై విలువిద్యలో ఎవరునెగ్గితే వారినే ఆమె పరిణయమాడవలసిందిగ దండపాణిపై ఒత్తిడితెచ్చారు. దండపాణి అందుకంగీకరించకతప్పలేదుమొదట సిద్ధార్థుడలాంటి పరీక్షలో పాల్గొన దలచలేదు. కాని తన రథసారధియైన చెన్నుడుసిద్ధార్థుడు బాణ ప్రయోగపరీక్షలోపాల్గొనవలసిందిగాను,అలాచేయనట్లయితే తన తండ్రియైనశుద్దోదనుని కుటుంబానికే కాక తనను వరించిన యశోధరకు సైతం అవమానంకాగలదని చెప్పాడు.తన రథసారధి యొక్క మాటలకు ముగ్ధుడైన సిద్ధార్థుడుబాణప్రయోగ పరీక్షకు సమాయత్తమయ్యాడు.పోటీ మొదలైంది. ప్రతి ఒక్కరు తమ విలువిద్యా నైపుణ్యాన్ని చూపెట్టారు.చిట్టచివరిగ గౌతముడు విల్లుబూనిబాణప్రయోగంజేశాడు. గురిజూసి సరిగ్గా గుర్తుపైనే బాణం గృచ్చుకొనేలా కొట్టడంలో సిద్ధార్థుడేసిద్ధహస్తుడనినిరూపించుకొన్నాడు.పరీక్ష ముగిసింది.శుద్ధోదనుడుదండపాణి ఎంతో సంతోషించారు. ఇక యశోధర, మహాప్రజాపతియిత్యాదులఆనందానికవధులులేవు.

యశోదతో వివాహం జరిపించారు. సంసార జీవనము ఆనందంగా గడుపుతున్నాడు. కొడుకు కోసం శుద్ధోధనుడు మూడు గొప్ప విలాస మందిరాలు ఏర్పాటు చేయించాడు. వేసవి కాలంలో ఒక భవనము. చలికాలంలో ఒక భవనము. వర్షాకాలలోఒక భవనము. సమస్త సదుపాయాలు ఆ భవనాల్లో ఏర్పాటు చేశాడు.

శుద్దోధనుడు సిద్ధార్థుని చుట్టూ శృంగార విద్యలలో చేరిన ఆరితేరిన ఆలలను ఎల్లప్పుడూ చుట్టూ ముట్టి ఉండేటట్లు చేశాడు. సిద్ధార్థుని దృష్టి ఎల్లప్పుడూ విలాసాల పైనేఉండేటట్లు చూశాడు.అయినప్పటికీ అజ్ఞానపురితమైనమత్తుగొలిపే ప్రోత్సాహంతో తమ కామ కలాపాలలు యువరాజును ఏమి చేయలేమని వారు భావించారు.రాజకుమారుడు ఆవనిత పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.

ఇరవై ఏళ్ల వయసు పైబడ్డ వారందరూ శాక్యసంఘంలో సభ్యత్వం స్వీకరించాలని నియమం ఉండేది.సిద్ధార్థునికీ ఇరవై ఏళ్ల వయసు వచ్చింది. సిద్ధార్థునికిశాక్య సంఘంలో సభ్యత్వమివ్వబడింది.శాక్యసంఘపురోహితుడు నీ బాధ్యత లేమిటోచెప్తాను విను అన్నాడు.

1 నీ శరీరాన్ని మనసును నీ ధనాన్ని అర్పించిన సరే నీవు శాక్యుల ప్రయోజనాలను కాపాడాలి.

2.శాక్యు సంఘ సమావేశపు తప్పకుండా హాజరు కావాలి.

3.ఏ శాక్యుని లో ఏలాంటి లోపాలు కనిపించిన. నిష్పక్షపతంగా నిర్భయంగా సంఘం దృష్టికి తీసుకురావాలి.

4నీపైనేరారోపణలు చేసినప్పుడు నీవు కోపించరాదు నీవు తప్పు చేసినట్టు ఉంటే ఒప్పుకోవాలి నీలో ఏ దోషము లేదని నిరూపించాలి.

ఇక ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు సంఘ సభ్యత్వాన్ని కోల్పోతావో వివరిస్తాను అంటూ పురోహితుడు వివరించసాగాడు.

1 మానభంగానికి పాల్పడినట్లు రుజువైతే

2 నీ ఎవరినైనా హత్య గావించినట్లు రుజువైతే

3 నువ్వు దొంగిలించినట్లు రుజువైతే ఈ సంఘంలో ఉండడానికి నువ్వు అనర్హుడవుఅని పురోహితుడు వివరించాడు.

శాక్య సంఘ నియమాలను బాధ్యతలను క్షుణంగావిరించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనిసిద్ధార్థుడు తెలిపాడు. ఎనిమిదేళ్లు గడిచాయి.శాక్య సంఘముతో సిద్ధార్థుడు ఎంతో అంకితభావంతో పని చేసేవాడు. సంఘ సభ్యునిగా ఉంటున్న ఎనిమిదవ వేట ఏర్పడిన ఓ సంఘటన శుద్ధోదనునికి భరించలేని బాధ అయింది.సిద్ధార్థుతుని జీవితంలో గొప్ప మార్పుకు దారితీసింది. శాక్యుల రాజ్యానికి పక్కనే కొలియుల రాజ్యం ఉండేది. ఈ రెండు రాజ్యాలను రోహిణి నది విడదీస్తుంది. ఆ రెండు రాజ్యాల వారు వ్యవసాయానికి ఈ రోహిణి నది జనాలనే  వాడుకునేవారు.వ్యవసాయ కాలములు ఈ నది జలాలు ఎవరు ముందుగా వాడుకోవాలి ఎవరు ఎంత నీరు వాడుకోవాలి అనే విషయంపై ఈ రెండు రాజ్యాలు ప్రతి ఏటా వివాదం ఏర్పడేది. ఈ వివాదం అప్పుడప్పుడు ఘర్షణ సైతం దారితీసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అది తీవ్ర స్థాయికి చేరుకుంది. సిద్ధార్థుతుని28వ ఏట ఏర్పడిన నది జలాల వివాదం చివరకు ఈ రెండు రాజ్యాల మధ్య పోరాటంగా మారి ఇరుపక్షాలకు చెందిన వ్యవసాయ కూలీలకు కొట్టుకోవడం వరకి వెళ్ళాయి.

ఈ వివాదం యుద్ధం ద్వారానే శాశ్వతంగా పరిష్కారం కావాలంటూ అటు శాక్యులు ఇటు కొలియులు అనుకున్నారు.కొలియుల పై యుద్ధాన్ని ప్రకటించేందుకు నిర్ణయం తీసుకునేందుకు సేనాపతి శాక్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

సేనాపతి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన వారిపై కొలియులు. దాడి  చేసిన కారణంగా మనవారు వెనుకకు మళ్ళీ రావడం జరిగింది. మన వారిపై కొలియులు ఈ విధంగా దాడి చేయడం ఇది మొదటిసారి కాదు అయినప్పటికీ ఇన్నాళ్లుగా వాళ్ళ ఆగడాలు సహించాము. ఇక పై సహించవద్దు. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడాలంటే యుద్ధ ప్రకటన చేయాల్సిందిఅని కోరుతున్నాను అన్నాడు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నట్లయితే మాట్లాడవచ్చు అన్నాడు.

సిద్ధార్థ గౌతముడు తన స్థానం నుండి లేచి ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను. యుద్ధం చేసినంత మాత్రాన వివాదం పరిష్కారం కాదు కదా! ఈ యుద్ధం మరో యుద్ధానికి కారణంఅవుతుంది. చంపిన వాడిని చంపేందుకు మరొకరు తయారవుతారు.జయించినవాడు జయించేందుకు ప్రయత్నం చేస్తాడు. దోచినవాడు తిరిగి దోచుకోబడతాడు.తొందరపాటుగా మన సంఘం కొలియుల పై యుద్ధం ప్రకటించడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను.

అసలు వివాదములు తప్పు ఎవ్వరిదో చాలా స్పృశితంగా పరిశీలన చేయాలి మన వారు సేతంకొలియుల పై దాడి చేసి గాయపరచరనివిన్నాను. అది వాస్తవం అయితే ఇద్దరూదోషులే కదా!.ఇద్దరు మధ్యవర్తులను ఎన్నుకోమని అడుగుదాం ఈ నలుగురు కలిపి మరో మధ్యవర్తి ఎన్నుకుంటారు. వారు సమావేశమై వివాదాన్ని  చర్చించి సమస్యను శాశ్వత పరిష్కారం మార్గాన్ని కోరుదాంఅనిసిద్ధార్థుడు తను ఉపన్యాసంలో అన్నాడు. ఈ ప్రతిపాదను మరో సభ్యుడు బరపరిచాడు.

సేనాపతి లేచి కొలియులుమనపై సాధించే దాడులు వారిని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే అరికట్టబడగలవుఅని తెలిపారు.సేనాపతి ప్రతిపాదనకు సిద్ధార్థుడు సవరణను ప్రవేశపట్టగా అది అధిక సంఖ్యలో వ్యతిరేకించడంతో వీగిపోయింది. సిద్ధార్థుడు ఈ ప్రతిపాదనను బలపరుచ వద్దని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శాక్యులు కోలియులు ఇద్దరూ బంధువులే అలాంటప్పుడు ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం ఎందుకు అన్నాడు.వెంటనే సేనాపతి సిద్ధార్థున్ని వ్యతిరేకిస్తూ యుద్ధం అంటూ ఏర్పడితే  క్షత్రియులు బంధువులాపరాయివారా అన్న తేడా లేదని రాజ్య రక్షణకై కడకుతోబుట్టును సైతం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు.

యజ్ఞయగాదులు చేయటం బ్రాహ్మణుల కర్తవ్యం అలాగే యుద్ధం చేయటం క్షత్రియుల  కర్తవ్యం. వ్యాపారం చేయటం వైశ్యుల కర్తవ్యం. పై కులాల వారందరికీ సేవ చేయటం శూద్రుల  కర్తవ్యం మన శాస్త్రాలను ఘోషిస్తున్నాయిసేనాపతి చెప్పాడు.

వెంటనే సిద్ధార్థుడు సమాధానం ఇచ్చాడు. ధర్మ శాస్త్రాన్ని నేను అర్థం చేసుకోగలను శత్రుత్వాన్ని శత్రుత్వంతో శాంతింప చేయలేమని నేను భావిస్తున్నాను అనిఅన్నాడు. సహనం కోల్పోయిన సేనాపతి ఈ సమస్యను సంఘ సభ్యులతో మాట్లాడి తేల్చుకోమన్నాడు. అందరూ సేనాపతి  బలపరిచారు.సిద్ధార్థుడు నిరాశ చెందాడు. యుద్ధం వద్దు అంటే అందరూ యుద్ధం చేయాలి అని కంకణం కట్టుకున్నారు అని అన్నాడు.

తరువాయి భాగం వచ్చేనెల

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

కాటుక కంటి నీరు

by Vijaya Kandala November 24, 2025
written by Vijaya Kandala

 ఈరోజు  ముచ్చటలన్నీ  మన తెలుగు భాషాభిమానం గురించే  .  చెప్పుకోడానికి అనేక సంగతులు ఉన్నాయి  .ఎందరో మాతృభాష గొప్పదనం గురించి ఎప్పుడో  ,ఎందరో మరెన్నో సార్లు చెప్పారు   .మన మూ వింటున్నాం  కానీ పాటించడంలో  ఇష్టం , ఓపిక ,ఆసక్తి  అనే విలేక అనే సంగతి  తెలిసినా  , చెప్పడం అలవాటైన వారు ఊరుకోరుగా . నేను ఆ బాపతే అనుకోండి .

ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి  ?అనేది చిక్కు ప్రశ్న . అయినా చీకట్లో బాణం వేస్తున్న .ఏ కొందరికైనా తగలకపోతుందా అనే అత్యాశతో మొదలెట్టా  . ఇందులో స్పృశించిన అంశాలలో ఒక క్రమం గురించి వెతకకండి  . కోతి కొమ్మచ్చి అనుకోండి తప్పులేదు  .బహుశా అదే సరైన మాటేమో కూడా .

భాష  అనేది అతి చిన్న మాట . రెండు అక్షరాల మాట కానీ  ,ఆ రెండక్షరాలలో మర్రి విత్తనంలా  విశ్వమం తా  దాగింది  .నేల నాలుగు చెరుగు ల పా కిం ది  .ఆకాశపుటంచులను  తాకింది ఎందుకంటే భావవ్యక్తీకరణకు పునాది భాష కదా .

ప్రతి మనిషికి తల్లి ఎలా అత్యంత సన్నిహితమో  ఆమె ఒడి అనే బడిలో నేర్చిన పలుకూ అంత సన్నిహితం . అయితే ఆధునిక కాలంలో అమ్మను , అమ్మ భాషను ఒద్దు  అనుకుంటున్నాం  .అసలు గలగల మాట్లాడమంటే ఒక సు హృద్భావ వాతావరణ అని సృష్టించడమే .  ఆ వాతావరణంలో అవసరానికి మించి , ఆడంబరాన్ని జోడించి  ,ఇతర భాషా పదాలను వాడడం నల్లేరుపై బండి నడకంత సులభం  .ఆ వ్యామోహం నుంచి బయటికి రావడానికి మనకు సుతరామూ  ఇష్టం లేదు .

 ఎప్పటిది తెలుగు అంటే  ,మన ఊహకందనంత పాతది  .క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనం జయుడు తొలి తెలుగు శాసనం వేయించాడు  .

ఎంత చక్కని భాష అండి మన తెలుగు  .గుండ్రంగా ముత్యాల లాంటి అక్షరాలతో ముచ్చటైనది మన లిపి  . కొన్ని సరదా  సంగతులు గుర్తు చేస్తాను  .విసుక్కోక చదవండి  .చదివించండి . ఆపై ఆలోచించండి .

ఆ అనే ఏకాక్షర పదం లేదా వాక్యం ఉంది . దీన్ని ఆశ్చర్యంగా  ,ప్రశ్నగా  ,జవాబుగా  ,నీరసంగా , అనుమానంగా  ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు .

మొన్ననే ఓ మంచి వాక్యం చదివాను  .మీరూ  చదవండి మరి .  సులువైనది . బరువైనది . గుర్తుపెట్టుకో తగ్గది కూడా. సముద్రమంత లోతైన అర్థమున్న వాక్యం ఇది. భూమ్మీదికి అరువు పై వచ్చాము  , కొంత కాలానికి భూమికి బరువై వెళ్ళిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతకాలి  .

చూడండి . అరువు -బరువు- పరువు ఒక అక్షరం తేడాతో ఎంత సొగసైన వాక్యం సిద్ధమైంది .

 మరో చిన్న మాట   .

రెండెడ్ల  బండ్లు అంటే  ,రెండు అర్థాలు

రెండు ఎడ్లు గల బండ్లు

 ఎడ్ల బండ్లు రెండు  .

ఎంత అందం ఉంది ఈ భాషలో  .ఇంకోటి ఇది రెండు పదాల ప్రశ్నా ర్ధక  వాక్యం  .

వాడొచ్చాడా ? నేను వివరించక్కర్లేదు .

మీరు పలికే విధాన్ని బట్టి అర్థం మారుతుంది ప్రయత్నించి , చూడండి.

ఇంకో సరదా వాక్యం .

నీ నూనె నా నూనె ని  నేనన్నానా, నీ నూనె నీ నూనె  .నా నూనె నా నూనె  .

నిదానంగా చదవండి ఒకే అక్షరంతో మూడు వాక్యాలు వచ్చాయి  .

ఒకే పదాన్ని సందర్భం బట్టి రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు . బొక్కలో వేస్తాను  .నాకు లక్ష బొక్క వచ్చింది వ్యాపారంలో. బొక్కలు కొట్టే మిషన్ ఉందా ?మొదటి బొక్కకు జైలు , రెండవ బొక్క నష్టం  ,మూడో మొక్కకు పంచింగ్ మిషన్ అని అర్ధాలు వచ్చాయి  .

పులిహోర మనకు ఇష్టమైన వంటకం  .ఇందులో పులి ఎక్కడుంది అని గాబరా పడకండి . ఇక్కడ  పులి అంటే పుల్లని పులిసినఓ గిరం అంటే ఆహారం  .పులిబొంగరాలు అనే మాట గుర్తుకు తెచ్చుకోండి .

వల్ల కాడు పూర్వరూపం ఒ ల్ల కాటు పనికిరాని అడవి . అదే పొల్లకాడై వల్లకాడుగా స్థిరపడింది  .భీమా అనే పదం తీసుకోండి ఇందులోని బీమా అనేది పారసీ పదం .ఆ భాషలోభీమా  అంటే భయం  .జీవితంలో భయాన్ని పోగొట్టే సంస్థ భీమా సంస్థ .

తద్దినంకు చావుకు  సంబంధం లేదు  .దాన్ని విడదీస్తే త త్ + దినం ఆ రోజు అని అసలు అర్థం .

మనం పాకీ  పనిని అసహ్యించుకుంటాం . పవిత్రత  ,శుభ్రత  అని అర్ధం దా నికి  .పాకిస్తాన్ అంటే పవిత్రమైన దేశం అని అర్థం  .

 ఒకే పదం రకరకాలుగా వాడుతూ విభిన్నమైన అర్థాలను సాధిస్తాం  .నమ్మట్లేదా ? కింది ఉదాహరణ చూడండి

 ఆకు _లోలాకు -విస్తరాకు_ విడాకులు . ఇతర భాషా  పదాలతోను  వేరు వేరు అర్థాలను సాధిస్తున్నాం .

 ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకం  .తీరా సమయానికి వాడు హ్యాండ్ ఇచ్చాడు . రెండు హ్యాండ్లూ వేర్వేరు సుమా

తెలుగు జీవద్భాష వాడుకలో ఉంది  .సరిగా వాడకుంటే  నాచుపట్టే స్థితికి దగ్గరగా జరుగుతుంది. వాడక మనం చెడుతున్నాం . ప్రతి భాషలోనూ మార్పులు చేర్పులు సహజం  .పాత అర్థాలు పక్కకు జరిగి  ,కొత్త అర్ధాలను సంతరించుకుంటాయి మనకు తెలుగు వచ్చుఅంటే  సరిపోదు  .మన తర్వాతి  తరాల సంగతి ?

మళ్ళీ తెలుగు మనదే అన్న నిజం అప్పుడప్పుడు గుర్తుకొచ్చి    ,చమత్కారాలతో కూడా జవాబిస్తాం  .

ఏమండీ సుబ్బారావు గారిల్లెక్కడా ?

ఆయనకేం పని ఇల్లెక్కడానికి   .

అర్థం ఉన్నా  లేకున్నా , కొన్ని పదాలు జంటగా వాడితేనే మనకు అర్థమవుతాయి   .ఉదాహరణ

పిల్లా జెల్ల _ఇల్లుగి ల్లు_ నగానట్రా

ధ్వని అనుకరణ శబ్దాలున్నాయి  .అది మరో ముచ్చట .

డ్డా  మ్మని పడ్డాడు .పూలు జలజలా రాలే  .  పకపక నవ్వాడు  .

పద బంధాలు _నానుడులు_ సామెతలు _పొడుపు కథలు -జాతీయాలు -కథలు -కవితలు- నవలలు _కావ్యాలు ఇంత కాలం నుండి అని చెప్పడానికి వీలుకాని రోజు నుంచి కాచిన పాలపై తేరి న మీగడ ఇదంతా . ఆస్వాదించండి . ఆనందించండి మరోమాట

అడుగు 

 దేని గురించి అని  అడగండి  .అదే అడుగు గురించి . అంటే ప్రశ్నించు అని అర్థం  .ఈ పదాన్ని ఎన్నో రకాలుగా వాడతాం. ప్రతి అడుగుకి అర్థం మారుతుంది .

అడుగు అంటే పాదం మూడు అడుగుల నే ల కావాలని వామనుడు బలిని అడిగాడుగా .

 అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం వచ్చారు

 ప్రయాణం అడుగు ఆమడగా సాగుతుందంటే చాలా కష్టంగా ఉంది అని అర్థం .

 బాల్చీలో నీళ్లు అడుగంటాయి  .

రేపు పొద్దున ఆయన అడిగితే ఏం చెప్పను ?

 ఇవాళ వాడిని అడిగేయాలి  .

నలుగురిని అడిగి చేయి .

 ఒక్కొక్క పదం ఎన్నెన్ని వన్నెలతో మీ జీవితంలో చేరిపోయిందో మీ మనసునే అడగండి .

ఇవన్నీ మాకు తెలిసినవే  . కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడే గా అంటున్నారా  .నిజమే  .నాకూ  తొలు త అలానే అనిపించింది  .అయినా పాత చింతకాయ పచ్చడి  పధ్యా నికి  పనికొస్తుంది . కొత్త చింతకాయ జలుబు చేస్తుంది .సమస్యలకు  పరిష్కారాలు తెలియక కాదు  .పాటించడం ఇష్టం లేక  , ఓపిక లేక. ఆలా వదిలేస్తే  పీట ముడి  పడిపోతాయి  .

ఈమధ్య సురవరం ప్రతాపరెడ్డి గారి తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం చదివాను . అందులో తెలుగు భాషా సేవ అని ఆలోచనాత్మక వ్యాసం  ఉంది  .అది చదివాక ఇది రాయాలనిపించింది .

“దేశాభివృద్ధికి భాషాభివృద్ది ఒక గొప్ప సాధనమని అందరికీ తెలిసిన విషయమే . బెంగాలీ భాషతో సమానముగా మనదేశములో అభివృద్ధి చెందుచున్న రెండవ భాష మహారాష్ట్రము  .మీకే దేశ చరిత్ర కావలసిన ను ఈ భాష యందు దొరకగలదు .ప్రకృతి శాస్త్రవుల అనేకములు వ్రాయించబడినవి ఇట్లు మన ఇరుగుపొరుగు వారు తమ తమ దేశ భాషలను అభివృద్ధి చేసుకొని  ,అవిశ్రాంతముగా స్వార్ధమునందును దృష్టి ఉంచక , పాటుపడుచున్న మన తెలుగు సీమ వారు మాత్రము ఇతర అన్ని విషయములందువలె భాషాభివృద్ది విషయమునను గాఢ నిద్రపోవుచున్నారు .ఇది మిక్కిలి శోచనీయము .”

“విద్య రాని  వాడు తోక కొమ్ములు లేని పసరమని మన పెద్దలన్నారు . మాతృభాషనేరుగ ని వాడు  తెలివి లేని పసరమని చెప్పవలెను  .మనకు ఇంగ్లీషు , హిందీ భాషలపై కలవ్యామూహము మన మాతృభాష పై లేదు . పరభాషలన్ని నేర్చిన కులవిద్యకు సాటి లేదు గువ్వలచెన్న అని ఆ మహానుభావుడు ఆనాడే ఉర్దూ హిందీ ఇంగ్లీష్ వెలువలు మనలను ముంచుకొని పోకముందే బోధించి ఉండెను.”

“మన ప్రాచీనాంధ్ర వీరుల గాధలను తెలుపు గ్రంథాలు మనము వ్రాయకున్నా , తందాన (జంగం) కథలు చెప్పు పిచ్చిగుంట వారిలో ఆ చరిత్ర లింక నిలిచి ఉన్నవి  .అవి అంతరించక ముందే వాటిని సమకూర్చి  ,ముద్రించ వలెను . సోమనాద్రి  ,రామేశ్వరరావు  ,సదాశివరెడ్డి , తిమ్మరాజు , కుంభం పుల్లారెడ్డి , మెదక్ శంకరమ్మ , కుంభం చెన్నయ్య , సర్వాయి పాపడు మొదలగు  వారి కథలు కొల్లలుగా అనాధృతమై , ఆముద్రిత మై  ,విస్తృత పధ మందు లీనమై పోవుచున్నవి  .మనము మన జంగం కథలను సవరించి  ,సంస్కరించి  ,చారిత్రక పీఠికలతో ముద్రించి  ,ప్రచారం చేయుట అవసరము .”

“మనకు ఏ విషయమైనా తెలుసుకొనే  అవసరము కలిగితే  , ఇంగ్లీషు వాంగ్మయాన్ని ఆశ్రయిస్తున్నాము . మన భాషలో వివిధ పరిశోధనలకును , విజ్ఞానానికి పనికి వచ్చు ఉద్ గ్రంథాలను వ్రాయించి ప్రచురింపవలెను .

“ఇంగ్లీషు వారికి తమ భాషపై కల అభిమానములో సహస్రాంశము కూడా మనకు లేదు . ప్రతి జాతికిని తన మాతృభాషపై అభిమానం ఉన్నట్లు సర్వత్ర వ్యక్తమైనది  .అరబ్ తన భాష అమృతం అనియు తక్కిన భాషలంతా తన ఒంటె కాలి క్రింది దుమ్ముతో సమానమనియు అంటాడు . ఆర్యులు తమ భాష దేవ భాష అనేది తక్కినవి  భాషలనా గ రికము లు  ,తమదే నాగరిక భాష అన్నారు . ప్రాకృతము విజృంభించిన వాడు సంస్కృతాన్ని  గురించి కూడా  ఈ మాటలే అంటాడు .

మీ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉన్నాయ ని నాకు తెలుసు . నేను అలాగే అనుకున్నాను  .ఇంకా ఇంకా చాలా అనుకున్నాను . ఎందుకంటే ఈ మాటలు 80 సంవత్సరాల క్రితం చెప్పినవి  .

ఈ మాటలు శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఓరుగల్లు లో చేసిన అధ్యక్షపన్యాసం లోనివి .

                                                                                    ( 28 -12-1944)

ఎలా ఈ సమస్యను పరిష్కరించడం   ?

నాకు తోచిన కొన్ని సూచనలు   .మీ స్వబుద్ధితో మరికొన్నింటిని జోడించి , ప్రయత్నించండి  .మొదటగా మంచి పుస్తకాలు చదవండి  .ప్రముఖుల ప్రవచనాలను వినండి . చాలామంది ప్రవచన కారులు ఆంగ్ల పదాలు వాడకుండా , గంటల తరబడి  ,సులువైన సరళమైన భాషలో విషయాన్ని అందిస్తున్నారు . ఈనాడు పేపర్ చదవండి . అందులో నేను మొదట చదివేది సంపాదకీయాలు  ,హెడ్డింగులు .

 రోజు ఓ పది నిమిషాలు ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయించండి పిల్లలతో  .పాత సినిమాలు చూడకున్నా పర్వాలేదు డైలాగులు వినండి  .కొత్త పదాలు -పదబంధాలు- సామెతలు-నానుడులు -జాతీయాలు తెలుస్తాయి  .మీ పనులను చేసుకుంటూనే ఈ పని చేయవచ్చు .

వివిధ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడి కట్టు  సరదాగా    ప్రయత్నించండీ .  చివరగా ప్రస్తుతం వస్తున్న యాంకర్ల (వ్యాఖ్యాతల) మాటలు వినండి  .అయితే ఓ మాట . పై పనులన్నీ కొంతకాలం చేశాక , చివరిది ఆచరించండి  .చూడకండి  .మళ్లీ చెప్తున్నాను . వీళ్ళు గురువులే  .ఎలా పలకవచ్చో , ఎక్కడ ఒత్తులు అవసరమో ,ఎక్కడ అనవసరమో  ,తెలుసుకునే ప్రయత్నాలు చేయండి . .

కాటుక కంటినీరు చనుకట్టు పయిం బడనేల ….   త్రి శుద్ధి గ నమ్ము భారతీ  .తెలుగు సాహిత్యంలో

ఇది పోత నా మాత్యు ని ప్రసిద్ధ చాటువు .తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న  ఆణిముత్యం . ఇందులో శారదా దే వి   కవి కళ్ళముందర దీన వదనంతో ప్రత్యక్షమైంది . చలించి పోయాడు  పోతన . తన జీవితా వసరాలకోసం  అమ్మనమ్మనని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేశాడు .

మన కీనాడున్న   సమస్యలు అలాంటివి కావు . ఆకలి వే ళలు  లేవు . రాజ్యస్థానాల  అదలింపులు , బెదరింపులు కనుచూపు మెరలో లేవు . రావు . ఐనా తెలుగు భాషకు ఈ దుస్థితి ఏల ?

ప్రభుత్వాన్ని నిందించి మన భాధ్యతను వదిలించుకుందామా ?

మనవైపు నుంచి నిశ్శబ్దం సబబేన ?

మన నరనరాల్లో ,అణువు అణువున జీర్ణించిన జాతి సంపదను చేతు లా రా జా రవిడుచుకుందామ  ?

కొంతకాలానికి తరు వాతి తరా లు  తెలుగు గొప్పదనాన్ని ఇ తర దేశీయుల ద్వారణో  ,పర భాశీయుల ద్వారానో  తెలుసుకుని  మనల్ని క్ష మి స్తారా

మనమేం చేద్దాం

ఆలోచించండి .

తెలుగు భాష గొప్పదని మనం కొత్తగా చెప్పనక్కరలేదు  .వెనకటి వారెందరో ఎప్పుడో చెప్పేశారు .ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోండి  .తర్వాత తరాలకు దాని మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి . ఇప్పటి తల్లిదండ్రులు మీకు ఆసక్తి కలిగితే  ,తప్పనిసరిగా అది మీ పిల్లలలో ప్రతిఫలిస్తుంది . చదవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది . వేగంగా చదవడం అలవాటు అవుతుంది  .మన ఆలోచన పరిధి విస్తరిస్తుంది .

మన మనసులోని భావాలను ఇతరులకు అందించడానికి ఇతరులు చెప్పిందాన్ని గ్రహించడమే భాషకు పరమావధి . అది చేతగానప్పుడు తెలుగువారు అని చెప్పుకోవడం సమంజసమేనా ?నాకు జవాబు అవసరం లేదు మీ మనసును మీరే ప్రశ్నించండి  .సమాధానం మీకే తెలుస్తుంది .

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us